అన్వేషించండి

వేల ఏళ్ల క్రితం బానిసలు ఉండే బెడ్ రూమ్ ఇలా ఉండేది, ఓసారి చూడండి

ఇప్పుడు ప్రజలకు స్వేచ్ఛ లభించింది, కానీ ఒకప్పుడు ఎంతోమంది బానిసలుగా జీవించేవారు.

ఒకప్పుడు రాచరికం ఈ ప్రపంచాన్ని ఏలుతున్న సమయంలో బానిసలుగా బతికే వారి జీవితాలు ఎంతో దుర్భరంగా ఉండేది. బానిసలను కుక్కల కంటే హీనంగా చూస్తూ వారి చేత గాడిద చాకిరి చేయించుకునేవారు. ఇది కేవలం కొన్ని రాజ్యాల్లోనే కాదు వేల ఏళ్ల క్రితం ఎన్నో రాజ్యాల్లో అమల్లో ఉండేది. వేల మంది బానిసలుగా బతుకును ఈడ్చేవారు. తాజాగా ఇటలీలోని పాంపీ అనే నగరం సమీపంలో పురాతత్వ శాస్త్రవేత్తలకు బానిసలు వినియోగించిన గది ఆనవాళ్లు లభించాయి. ఈ గదిని 2000 ఏళ్ల క్రితం బానిసల బెడ్ రూమ్ గా పేర్కొన్నారు ఆర్కియాలజిస్టులు. ఇదే గదిలో వారు జీవిస్తూ ఉండేవారని చెప్పారు. అప్పట్లో ఒక అగ్నిపర్వతం విస్ఫోటనం వల్ల ఈ ప్రాంతం నాశనమైందని వారు చెబుతున్నారు. ఆ రాతి ఫలకాల మధ్యలో ఉన్న బానిసల గదులను పురాతత్వ శాస్త్రవేత్తలు వెలికి తీశారు.

బాగా డబ్బున్న ధనవంతులు తమ ఇళ్లల్లోనే బానిసలకు ఒక గదిని కేటాయించేవారు. ఆ గది 2000 ఏళ్ల క్రితం ఎలా ఉందో ఇప్పుడు మనం చూడొచ్చు. ఇది పూర్తిగా మట్టితో కట్టారు. రెండు బెడ్స్ ఉన్నాయి. అయితే ఒకదానిమీద మాత్రమే పరుపు ఉన్నట్టు కనబడుతోంది. అలాగే కొన్ని సిరామిక్ గిన్నెలు, రెండు క్యాబినెట్స్ కూడా ఉన్నాయి. ఈ గదిలో ఎలుకల అవశేషాలు కూడా లభించాయి.

ఇటాలియన్ సమాజంలో బానిసలుగా బతికిన వారి సంఖ్య అధికంగానే ఉండేది. తగిన సౌకర్యాలు లేకుండా అతి చిన్న గదిలోనే పెద్ద కుటుంబాన్ని నెట్టుకొచ్చేవారు బానిసలు. తమ యజమానులు ఇచ్చిన కాస్త డబ్బు, ఆహారంతోనే వారు జీవించేవారు. పురావస్తు శాస్త్రవేత్తలు కనుగొన్న ఈ బెడ్ రూమ్‌ను బానిసలు ఉపయోగించిన బెడ్ రూమ్ అని ఇటాలియన్ సాంస్కృతిక మంత్రిత్వ శాఖ కూడా ప్రకటించింది. ఇప్పటికే ఇటలీలో అనేక తవ్వకాల్లో ఒకప్పుడు బానిసలు ఎలా జీవించేవారో తెలిపే ఆధారాలు బయటపడ్డాయి. చాలా చిన్న గదినే వారికి కేటాయించారని చెబుతున్నారు పరిశోధకులు.

అగ్నిపర్వతం విస్పోటనం వల్ల ఆ ప్రాంతంలో ఎంతో మంది బానిసలు మరణించినట్టు చెబుతున్నారు పురాతత్వ శాస్త్రవేత్తలు. గతేడాది ఈ ప్రాంతంలోనే అగ్నిపర్వతం పేలడం వల్ల మరణించిన ఒక బానిస అస్థిపంజరాన్ని కనుగొన్నారు. అతనికి 40 నుంచి 45 ఏళ్ల మధ్య ఉంటుంది. అతను అగ్నిపర్వతం విస్పోటనం వల్ల మరణించినట్టు నిర్ధారించారు.  పురాతత్వ శాస్త్రవేత్తలు ఎప్పట్నించో అగ్ని పర్వతం పేలిన చోట ఉన్న శిధిలాలను తొలగిస్తూ కొత్త విషయాలను తెలుసుకుంటున్నారు. ప్రతి ఏడాది ఆ ప్రాంతంలో కొత్త అంశాలు బయటికి వస్తూనే ఉన్నాయి. ఆ ప్రాంతంలో వేల ఏళ్ల క్రితం చాలా ధనవంతులు నివసించే వారని, వారు తమ పనుల కోసం బానిసలను తెచ్చి పెట్టుకునేవారని చెబుతున్నారు పరిశోధకులు. 

Also read: ముప్పై అయిదేళ్ల వయసు దాటాక స్త్రీ గర్భం దాలిస్తే ఆరోగ్యకరమైన బిడ్డ పుడుతుందా?

Also read: మధుమేహం ఉన్నవారు మద్యం తాగుతున్నారా? ఇక అంతే సంగతులు

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
Telangana Assembly: శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
Pawan Kalyan: పార్టీ పెట్టడానికి తెలంగాణే స్ఫూర్తి - యువత రాజకీయాల్లోకి రావాలి - కొండగట్టులో పవన్ పిలుపు
పార్టీ పెట్టడానికి తెలంగాణే స్ఫూర్తి - యువత రాజకీయాల్లోకి రావాలి - కొండగట్టులో పవన్ పిలుపు
Constable Kanakam Season 2 : వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...

వీడియోలు

Indian Team Announced for Nz ODI Series | న్యూజిలాండ్ వన్డే సిరీస్ కు భారత జట్టు ప్రకటన | ABP Desam
పక్కటెముక విరగ్గొట్టుకున్నాడు.. షాక్‌లో గుజరాత్ ఫ్యాన్స్
ముస్తాఫిజుర్‌ ఐపీఎల్ ఆడితే మ్యాచ్‌లు జరగనివ్వం: షారూఖ్‌కు హిందూ సంఘాల వర్నింగ్
2026లో భారత్, పాకిస్తాన్ ఎన్నిసార్లు తలపడతాయంటే..
టీ20 వరల్డ్ కప్ ఎవ్వరూ చూడరు: మాజీ ప్లేయర్ అశ్విన్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
Telangana Assembly: శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
Pawan Kalyan: పార్టీ పెట్టడానికి తెలంగాణే స్ఫూర్తి - యువత రాజకీయాల్లోకి రావాలి - కొండగట్టులో పవన్ పిలుపు
పార్టీ పెట్టడానికి తెలంగాణే స్ఫూర్తి - యువత రాజకీయాల్లోకి రావాలి - కొండగట్టులో పవన్ పిలుపు
Constable Kanakam Season 2 : వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
India Squad For NZ ODI Series: న్యూజిలాండ్ వన్డే సిరీస్‌కు జట్టును ప్రకటించిన BCCI, శ్రేయాస్ అయ్యర్ ఎంట్రీ.. వారిద్దరూ ఔట్
న్యూజిలాండ్ వన్డే సిరీస్‌కు జట్టును ప్రకటించిన BCCI, శ్రేయాస్ అయ్యర్ ఎంట్రీ.. వారిద్దరూ ఔట్
Amaravati houses ready: అమరావతిలో అధికారులు, ప్రజాప్రతినిధుల ఇళ్లకు తుది మెరుగులు - ఏప్రిల్‌లో కేటాయిస్తామని మంత్రి నారాయణ ప్రకటన
అమరావతిలో అధికారులు, ప్రజాప్రతినిధుల ఇళ్లకు తుది మెరుగులు - ఏప్రిల్‌లో కేటాయిస్తామని మంత్రి నారాయణ ప్రకటన
JEE Advanced Exam 2026: జేఈఈ అడ్వాన్స్‌డ్ ఎగ్జామ్ డేట్ ఫిక్స్.. రిజిస్ట్రేషన్ చివరి తేదీ, రూల్స్ పూర్తి వివరాలు
జేఈఈ అడ్వాన్స్‌డ్ ఎగ్జామ్ డేట్ ఫిక్స్.. రిజిస్ట్రేషన్ చివరి తేదీ, రూల్స్ పూర్తి వివరాలు
8th Pay Commission: కేంద్ర ఉద్యోగుల జీతం ఎప్పుడు పెరుగుతుంది? 8వ వేతన సంఘం సిఫార్సులపై ఉత్కంఠ
కేంద్ర ఉద్యోగుల జీతం ఎప్పుడు పెరుగుతుంది? 8వ వేతన సంఘం సిఫార్సులపై ఉత్కంఠ
Embed widget