అన్వేషించండి

వేల ఏళ్ల క్రితం బానిసలు ఉండే బెడ్ రూమ్ ఇలా ఉండేది, ఓసారి చూడండి

ఇప్పుడు ప్రజలకు స్వేచ్ఛ లభించింది, కానీ ఒకప్పుడు ఎంతోమంది బానిసలుగా జీవించేవారు.

ఒకప్పుడు రాచరికం ఈ ప్రపంచాన్ని ఏలుతున్న సమయంలో బానిసలుగా బతికే వారి జీవితాలు ఎంతో దుర్భరంగా ఉండేది. బానిసలను కుక్కల కంటే హీనంగా చూస్తూ వారి చేత గాడిద చాకిరి చేయించుకునేవారు. ఇది కేవలం కొన్ని రాజ్యాల్లోనే కాదు వేల ఏళ్ల క్రితం ఎన్నో రాజ్యాల్లో అమల్లో ఉండేది. వేల మంది బానిసలుగా బతుకును ఈడ్చేవారు. తాజాగా ఇటలీలోని పాంపీ అనే నగరం సమీపంలో పురాతత్వ శాస్త్రవేత్తలకు బానిసలు వినియోగించిన గది ఆనవాళ్లు లభించాయి. ఈ గదిని 2000 ఏళ్ల క్రితం బానిసల బెడ్ రూమ్ గా పేర్కొన్నారు ఆర్కియాలజిస్టులు. ఇదే గదిలో వారు జీవిస్తూ ఉండేవారని చెప్పారు. అప్పట్లో ఒక అగ్నిపర్వతం విస్ఫోటనం వల్ల ఈ ప్రాంతం నాశనమైందని వారు చెబుతున్నారు. ఆ రాతి ఫలకాల మధ్యలో ఉన్న బానిసల గదులను పురాతత్వ శాస్త్రవేత్తలు వెలికి తీశారు.

బాగా డబ్బున్న ధనవంతులు తమ ఇళ్లల్లోనే బానిసలకు ఒక గదిని కేటాయించేవారు. ఆ గది 2000 ఏళ్ల క్రితం ఎలా ఉందో ఇప్పుడు మనం చూడొచ్చు. ఇది పూర్తిగా మట్టితో కట్టారు. రెండు బెడ్స్ ఉన్నాయి. అయితే ఒకదానిమీద మాత్రమే పరుపు ఉన్నట్టు కనబడుతోంది. అలాగే కొన్ని సిరామిక్ గిన్నెలు, రెండు క్యాబినెట్స్ కూడా ఉన్నాయి. ఈ గదిలో ఎలుకల అవశేషాలు కూడా లభించాయి.

ఇటాలియన్ సమాజంలో బానిసలుగా బతికిన వారి సంఖ్య అధికంగానే ఉండేది. తగిన సౌకర్యాలు లేకుండా అతి చిన్న గదిలోనే పెద్ద కుటుంబాన్ని నెట్టుకొచ్చేవారు బానిసలు. తమ యజమానులు ఇచ్చిన కాస్త డబ్బు, ఆహారంతోనే వారు జీవించేవారు. పురావస్తు శాస్త్రవేత్తలు కనుగొన్న ఈ బెడ్ రూమ్‌ను బానిసలు ఉపయోగించిన బెడ్ రూమ్ అని ఇటాలియన్ సాంస్కృతిక మంత్రిత్వ శాఖ కూడా ప్రకటించింది. ఇప్పటికే ఇటలీలో అనేక తవ్వకాల్లో ఒకప్పుడు బానిసలు ఎలా జీవించేవారో తెలిపే ఆధారాలు బయటపడ్డాయి. చాలా చిన్న గదినే వారికి కేటాయించారని చెబుతున్నారు పరిశోధకులు.

అగ్నిపర్వతం విస్పోటనం వల్ల ఆ ప్రాంతంలో ఎంతో మంది బానిసలు మరణించినట్టు చెబుతున్నారు పురాతత్వ శాస్త్రవేత్తలు. గతేడాది ఈ ప్రాంతంలోనే అగ్నిపర్వతం పేలడం వల్ల మరణించిన ఒక బానిస అస్థిపంజరాన్ని కనుగొన్నారు. అతనికి 40 నుంచి 45 ఏళ్ల మధ్య ఉంటుంది. అతను అగ్నిపర్వతం విస్పోటనం వల్ల మరణించినట్టు నిర్ధారించారు.  పురాతత్వ శాస్త్రవేత్తలు ఎప్పట్నించో అగ్ని పర్వతం పేలిన చోట ఉన్న శిధిలాలను తొలగిస్తూ కొత్త విషయాలను తెలుసుకుంటున్నారు. ప్రతి ఏడాది ఆ ప్రాంతంలో కొత్త అంశాలు బయటికి వస్తూనే ఉన్నాయి. ఆ ప్రాంతంలో వేల ఏళ్ల క్రితం చాలా ధనవంతులు నివసించే వారని, వారు తమ పనుల కోసం బానిసలను తెచ్చి పెట్టుకునేవారని చెబుతున్నారు పరిశోధకులు. 

Also read: ముప్పై అయిదేళ్ల వయసు దాటాక స్త్రీ గర్భం దాలిస్తే ఆరోగ్యకరమైన బిడ్డ పుడుతుందా?

Also read: మధుమేహం ఉన్నవారు మద్యం తాగుతున్నారా? ఇక అంతే సంగతులు

టాప్ హెడ్ లైన్స్

Andhra Pradesh Rainfall: ఏపీలో 51 శాతం, కృష్ణా డెల్టాలో 49 శాతం లోటు వర్షపాతం.. రైతులకు ఈఎన్సీ కీలక సూచనలు
ఏపీలో 51 శాతం, కృష్ణా డెల్టాలో 49 శాతం లోటు వర్షపాతం.. రైతులకు ఈఎన్సీ కీలక సూచనలు
Raja Singh : తెలంగాణ బీజేపీలోకి రాజాసింగ్‌కు ఇక నో ఎంట్రీ - మహారాష్ట్ర, యూపీలకు వెళ్లిపోతారా?
తెలంగాణ బీజేపీలోకి రాజాసింగ్‌కు ఇక నో ఎంట్రీ - మహారాష్ట్ర, యూపీలకు వెళ్లిపోతారా?
CJP Protests: రంగంలోకి ప్రధాని మోదీ.. పేపర్ లీక్ ఆందోళనల్లో కీలక పరిణామం.. నేడు సీజేపీతో కేంద్రం చర్చలు
రంగంలోకి ప్రధాని మోదీ.. పేపర్ లీక్ ఆందోళనల్లో కీలక పరిణాలు.. నేడు సీజేపీతో కేంద్రం చర్చలు
Viral Video: యువతిని ఒళ్లో కూర్చోబెట్టుకుని ఆటో డ్రైవింగ్.. మైనర్‌కు శిక్ష విధించిన జువైనల్ బోర్డ్
యువతిని ఒళ్లో కూర్చోబెట్టుకుని ఆటో డ్రైవింగ్.. మైనర్‌కు శిక్ష విధించిన జువైనల్ బోర్డ్

వీడియోలు

Ravichandran Ashwin Criticizes Gambhir | గంభీర్‌పై రవిచంద్రన్ అశ్విన్ ఘాటు వ్యాఖ్యలు
Varshini Gowda Biography & Remuneration | వర్షిణి గౌడ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?
Vaibhav Ready For Zimbabwe T20 Series | జింబాబ్వే సిరీస్‌కు ముందు వైభవ్ కామెంట్స్
Sachin Tendulkar’s Advice to Harbhajan Singh | తన సక్సెస్ సీక్రెట్ రివీల్ చేసిన హర్భజన్
Gundenininda Gudigantalu Serial July 23 | మనోజ్ నోట్లో బలవంతంగా పెసరట్టు కుక్కిన బాలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra Pradesh Rainfall: ఏపీలో 51 శాతం, కృష్ణా డెల్టాలో 49 శాతం లోటు వర్షపాతం.. రైతులకు ఈఎన్సీ కీలక సూచనలు
ఏపీలో 51 శాతం, కృష్ణా డెల్టాలో 49 శాతం లోటు వర్షపాతం.. రైతులకు ఈఎన్సీ కీలక సూచనలు
Raja Singh : తెలంగాణ బీజేపీలోకి రాజాసింగ్‌కు ఇక నో ఎంట్రీ - మహారాష్ట్ర, యూపీలకు వెళ్లిపోతారా?
తెలంగాణ బీజేపీలోకి రాజాసింగ్‌కు ఇక నో ఎంట్రీ - మహారాష్ట్ర, యూపీలకు వెళ్లిపోతారా?
CJP Protests: రంగంలోకి ప్రధాని మోదీ.. పేపర్ లీక్ ఆందోళనల్లో కీలక పరిణామం.. నేడు సీజేపీతో కేంద్రం చర్చలు
రంగంలోకి ప్రధాని మోదీ.. పేపర్ లీక్ ఆందోళనల్లో కీలక పరిణాలు.. నేడు సీజేపీతో కేంద్రం చర్చలు
Viral Video: యువతిని ఒళ్లో కూర్చోబెట్టుకుని ఆటో డ్రైవింగ్.. మైనర్‌కు శిక్ష విధించిన జువైనల్ బోర్డ్
యువతిని ఒళ్లో కూర్చోబెట్టుకుని ఆటో డ్రైవింగ్.. మైనర్‌కు శిక్ష విధించిన జువైనల్ బోర్డ్
Kumki Elephants: పలమనేరు క్యాంపు నుంచి పార్వతీపురానికి కుంకీ ఏనుగులు తరలింపు.. పవన్ కళ్యాణ్ కృషి ఫలించేనా !
పలమనేరు క్యాంపు నుంచి పార్వతీపురానికి కుంకీ ఏనుగులు తరలింపు.. పవన్ కళ్యాణ్ కృషి ఫలించేనా !
జీవితంలో మొదటి కారు కొనేవారికి మహీంద్రా XUV 3XO ఎందుకు ఉత్తమ ఎంపిక?, రూ.10 లక్షల్లో వచ్చేస్తుంది
రూ.10 లక్షల బడ్జెట్‌లో ఫస్ట్‌ కార్‌ కొనాలనుకుంటున్నారా? డిజైర్‌, నెక్సాన్‌, పంచ్‌, XUV 3XOలో బెస్ట్ ఛాయిస్ ఇదే!
AP Local Body Direct Elections: ఏపీ స్థానిక సంస్థల్లో డైరెక్ట్ ఎలక్షన్స్? - క్యాంప్ రాజకీయాలకు చెక్ పెట్టేలా సీఎం చంద్రబాబు మాస్టర్ ప్లాన్!
ఏపీ స్థానిక సంస్థల్లో డైరెక్ట్ ఎలక్షన్స్? - క్యాంప్ రాజకీయాలకు చెక్ పెట్టేలా సీఎం చంద్రబాబు మాస్టర్ ప్లాన్!
Chittoor Crime News: రైలు కింద పడి ఎమ్మార్వో ఆత్మహత్య.. చిత్తూరు జిల్లాలో ఘటన- అంత కష్టం ఏమొచ్చిందో!
రైలు కింద పడి ఎమ్మార్వో ఆత్మహత్య.. చిత్తూరు జిల్లాలో ఘటన- అంత కష్టం ఏమొచ్చిందో!
Embed widget