అన్వేషించండి

వేల ఏళ్ల క్రితం బానిసలు ఉండే బెడ్ రూమ్ ఇలా ఉండేది, ఓసారి చూడండి

ఇప్పుడు ప్రజలకు స్వేచ్ఛ లభించింది, కానీ ఒకప్పుడు ఎంతోమంది బానిసలుగా జీవించేవారు.

ఒకప్పుడు రాచరికం ఈ ప్రపంచాన్ని ఏలుతున్న సమయంలో బానిసలుగా బతికే వారి జీవితాలు ఎంతో దుర్భరంగా ఉండేది. బానిసలను కుక్కల కంటే హీనంగా చూస్తూ వారి చేత గాడిద చాకిరి చేయించుకునేవారు. ఇది కేవలం కొన్ని రాజ్యాల్లోనే కాదు వేల ఏళ్ల క్రితం ఎన్నో రాజ్యాల్లో అమల్లో ఉండేది. వేల మంది బానిసలుగా బతుకును ఈడ్చేవారు. తాజాగా ఇటలీలోని పాంపీ అనే నగరం సమీపంలో పురాతత్వ శాస్త్రవేత్తలకు బానిసలు వినియోగించిన గది ఆనవాళ్లు లభించాయి. ఈ గదిని 2000 ఏళ్ల క్రితం బానిసల బెడ్ రూమ్ గా పేర్కొన్నారు ఆర్కియాలజిస్టులు. ఇదే గదిలో వారు జీవిస్తూ ఉండేవారని చెప్పారు. అప్పట్లో ఒక అగ్నిపర్వతం విస్ఫోటనం వల్ల ఈ ప్రాంతం నాశనమైందని వారు చెబుతున్నారు. ఆ రాతి ఫలకాల మధ్యలో ఉన్న బానిసల గదులను పురాతత్వ శాస్త్రవేత్తలు వెలికి తీశారు.

బాగా డబ్బున్న ధనవంతులు తమ ఇళ్లల్లోనే బానిసలకు ఒక గదిని కేటాయించేవారు. ఆ గది 2000 ఏళ్ల క్రితం ఎలా ఉందో ఇప్పుడు మనం చూడొచ్చు. ఇది పూర్తిగా మట్టితో కట్టారు. రెండు బెడ్స్ ఉన్నాయి. అయితే ఒకదానిమీద మాత్రమే పరుపు ఉన్నట్టు కనబడుతోంది. అలాగే కొన్ని సిరామిక్ గిన్నెలు, రెండు క్యాబినెట్స్ కూడా ఉన్నాయి. ఈ గదిలో ఎలుకల అవశేషాలు కూడా లభించాయి.

ఇటాలియన్ సమాజంలో బానిసలుగా బతికిన వారి సంఖ్య అధికంగానే ఉండేది. తగిన సౌకర్యాలు లేకుండా అతి చిన్న గదిలోనే పెద్ద కుటుంబాన్ని నెట్టుకొచ్చేవారు బానిసలు. తమ యజమానులు ఇచ్చిన కాస్త డబ్బు, ఆహారంతోనే వారు జీవించేవారు. పురావస్తు శాస్త్రవేత్తలు కనుగొన్న ఈ బెడ్ రూమ్‌ను బానిసలు ఉపయోగించిన బెడ్ రూమ్ అని ఇటాలియన్ సాంస్కృతిక మంత్రిత్వ శాఖ కూడా ప్రకటించింది. ఇప్పటికే ఇటలీలో అనేక తవ్వకాల్లో ఒకప్పుడు బానిసలు ఎలా జీవించేవారో తెలిపే ఆధారాలు బయటపడ్డాయి. చాలా చిన్న గదినే వారికి కేటాయించారని చెబుతున్నారు పరిశోధకులు.

అగ్నిపర్వతం విస్పోటనం వల్ల ఆ ప్రాంతంలో ఎంతో మంది బానిసలు మరణించినట్టు చెబుతున్నారు పురాతత్వ శాస్త్రవేత్తలు. గతేడాది ఈ ప్రాంతంలోనే అగ్నిపర్వతం పేలడం వల్ల మరణించిన ఒక బానిస అస్థిపంజరాన్ని కనుగొన్నారు. అతనికి 40 నుంచి 45 ఏళ్ల మధ్య ఉంటుంది. అతను అగ్నిపర్వతం విస్పోటనం వల్ల మరణించినట్టు నిర్ధారించారు.  పురాతత్వ శాస్త్రవేత్తలు ఎప్పట్నించో అగ్ని పర్వతం పేలిన చోట ఉన్న శిధిలాలను తొలగిస్తూ కొత్త విషయాలను తెలుసుకుంటున్నారు. ప్రతి ఏడాది ఆ ప్రాంతంలో కొత్త అంశాలు బయటికి వస్తూనే ఉన్నాయి. ఆ ప్రాంతంలో వేల ఏళ్ల క్రితం చాలా ధనవంతులు నివసించే వారని, వారు తమ పనుల కోసం బానిసలను తెచ్చి పెట్టుకునేవారని చెబుతున్నారు పరిశోధకులు. 

Also read: ముప్పై అయిదేళ్ల వయసు దాటాక స్త్రీ గర్భం దాలిస్తే ఆరోగ్యకరమైన బిడ్డ పుడుతుందా?

Also read: మధుమేహం ఉన్నవారు మద్యం తాగుతున్నారా? ఇక అంతే సంగతులు

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Nara Lokesh: ఏపీ ఆర్థిక రాజధాని విశాఖ - స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదు - తేల్చి చెప్పిన నారా లోకేష్
ఏపీ ఆర్థిక రాజధాని విశాఖ - స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదు - తేల్చి చెప్పిన నారా లోకేష్
Phone tapping case: ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం - సీఎం సోదరుడు కొండల్ రెడ్డికి సిట్ నోటీసులు
ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం - సీఎం సోదరుడు కొండల్ రెడ్డికి సిట్ నోటీసులు
AP CM Chandrababu: ఏపీలో హైవేల నిర్మాణంలో 2 గిన్నిస్ రికార్డులు నమోదు: సీఎం చంద్రబాబు హర్షం
ఏపీలో హైవేల నిర్మాణంలో 2 గిన్నిస్ రికార్డులు నమోదు: సీఎం చంద్రబాబు హర్షం
Asteroids: ఆస్టరాయిడ్స్ పై మైనింగ్‌కు పరిశోధనలు షురూ - అవతార్‌ కథను నిజం చేస్తారా?
ఆస్టరాయిడ్స్ పై మైనింగ్‌కు పరిశోధనలు షురూ - అవతార్‌ కథను నిజం చేస్తారా?

వీడియోలు

Harbhajan Singh Warning To BCCI | బీసీసీఐకు హర్భజన్ వార్నింగ్
Shreyas Iyer Vijay Hazare Trophy | శ్రేయాస్ అయ్య‌ర్‌ రీఎంట్రీ సూపర్
Nita Ambani Prize Money to Blind Cricketers | వరల్డ్ కప్ విజేతలకు అంబానీ భారీ గిఫ్ట్
Shubman Gill Vijay Hazare Trophy | దేశవాళీ టోర్నీలో గిల్ వైఫల్యం!
Medaram Jathara History Full Story | సమ్మక్క సారలమ్మ జాతరకు..బయ్యక్కపేటకు సంబంధం ఏంటి.? | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nara Lokesh: ఏపీ ఆర్థిక రాజధాని విశాఖ - స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదు - తేల్చి చెప్పిన నారా లోకేష్
ఏపీ ఆర్థిక రాజధాని విశాఖ - స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదు - తేల్చి చెప్పిన నారా లోకేష్
Phone tapping case: ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం - సీఎం సోదరుడు కొండల్ రెడ్డికి సిట్ నోటీసులు
ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం - సీఎం సోదరుడు కొండల్ రెడ్డికి సిట్ నోటీసులు
AP CM Chandrababu: ఏపీలో హైవేల నిర్మాణంలో 2 గిన్నిస్ రికార్డులు నమోదు: సీఎం చంద్రబాబు హర్షం
ఏపీలో హైవేల నిర్మాణంలో 2 గిన్నిస్ రికార్డులు నమోదు: సీఎం చంద్రబాబు హర్షం
Asteroids: ఆస్టరాయిడ్స్ పై మైనింగ్‌కు పరిశోధనలు షురూ - అవతార్‌ కథను నిజం చేస్తారా?
ఆస్టరాయిడ్స్ పై మైనింగ్‌కు పరిశోధనలు షురూ - అవతార్‌ కథను నిజం చేస్తారా?
Reliance Foundation: రిలయన్స్ ఫౌండేషన్ స్కాలర్‌షిప్‌లలో తెలుగు రాష్ట్రాల విద్యార్థుల సత్తా - ఏపీ నుంచి 1,345, తెలంగాణ నుంచి 538 మంది ఎంపిక
రిలయన్స్ ఫౌండేషన్ స్కాలర్‌షిప్‌లలో తెలుగు రాష్ట్రాల విద్యార్థుల సత్తా - ఏపీ నుంచి 1,345, తెలంగాణ నుంచి 538 మంది ఎంపిక
పోలవరం ఏరియల్‌ రివ్యూ చేస్తున్న సీఎం చంద్రబాబు..
పోలవరం ఏరియల్‌ రివ్యూ చేస్తున్న సీఎం చంద్రబాబు..
Nita Ambani: అంధ మహిళా క్రికెట్ జట్టుకు ఐదు కోట్ల సాయం - నీతా అంబానీ దాతృత్వానికి క్రీడాలోకం ప్రశంసలు
అంధ మహిళా క్రికెట్ జట్టుకు ఐదు కోట్ల సాయం - నీతా అంబానీ దాతృత్వానికి క్రీడాలోకం ప్రశంసలు
Chandrababu on water dispute: నీళ్లపై రాజకీయాలు సరి కాదు - పోటాపోటీగా మాట్లాడొద్దు చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
నీళ్లపై రాజకీయాలు సరి కాదు - పోటాపోటీగా మాట్లాడొద్దు చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
Embed widget