అన్వేషించండి

Pregnancy: ముప్పై అయిదేళ్ల వయసు దాటాక స్త్రీ గర్భం దాలిస్తే ఆరోగ్యకరమైన బిడ్డ పుడుతుందా?

ఆరోగ్యకరమైన బిడ్డ పుట్టాలంటే సరైన వయసులోనే పిల్లల్ని కనాలి.

పెళ్లయిన ప్రతి స్త్రీకి తల్లి కావాలని ఉంటుంది. అయితే కొన్ని సమస్యల వల్ల కుటుంబ బాధ్యతలు, ఉద్యోగ బాధ్యతల వల్ల ఆధునిక స్త్రీ పిల్లల్ని కనడం ఆలస్యం చేస్తోంది. కొంతమంది ముప్పై అయిదేళ్లు దాటిన తర్వాత కూడా పిల్లల్ని కనేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే బిడ్డల్ని కనేందుకు 35 ఏళ్ల వయసు సరైనది కాదని చెబుతున్నారు వైద్యులు. ఇలా 35 ఏళ్ల వయసులో గర్భం ధరించినా కూడా బిడ్డ ఆరోగ్యం, తల్లి ఆరోగ్యం పై చాలా ప్రభావం పడుతుందని వివరిస్తున్నారు.  35 ఏళ్ల వయసు దాటినా కూడా సాధారణ పద్ధతిలో గర్భం ధరించే అవకాశాలు ఉంటాయి, అయితే ఆ ప్రయాణం కాస్త ప్రమాదకరంగా ఉంటుందని చెబుతున్నారు వైద్యులు. ఎందుకంటే 35 ఏళ్ల వయసు ఉన్న స్త్రీలలో అండాలు నాణ్యతగా ఉండకపోవచ్చని, గుడ్ల సంఖ్య కూడా తక్కువగానే ఉంటుందని వారు వివరిస్తున్నారు. ఆడపిల్ల పుట్టుకతోనే లక్షల కొద్దీ అండాలను కలిగి ఉంటుందని, వయసు పెరుగుతున్న కొద్దీ ఆ అండాల సంఖ్య కూడా తగ్గిపోతూ ఉంటుందని వారు చెబుతున్నారు. ఆడపిల్ల రజస్వల అయ్యే నాటికి పుట్టుకతో వచ్చిన అండాలలో కేవలం సగం మాత్రమే మిగులుతాయని వారు వివరిస్తున్నారు. ప్రతినెలా నెలసరి సమయంలో అండాలు విడుదలై బయటికి పోతుంటాయని చెబుతున్నారు. 20 ఏళ్ల నుంచి 30 ఏళ్ల మధ్య అండాలు నాణ్యతను కలిగి ఉంటాయని, ఆ సమయంలోనే గర్భం ధరించడం చాలా ముఖ్యమని వివరిస్తున్నారు.

ఆడవాళ్ళలో మెనోపాజ్ ఒకప్పుడు 45 ఏళ్లకు వచ్చేది. ఇప్పుడు కొందరిలో 40 ఏళ్లకే మెనోపాజ్ వచ్చే అవకాశాలు పెరుగుతున్నాయి. 35 ఏళ్ల తర్వాత మెనోపాజ్‌కు దగ్గర అవుతున్నట్టే లెక్క. అలాంటి సమయంలో గర్భం దాల్చడం వల్ల తల్లీబిడ్డలు ఇద్దరూ ఆరోగ్యపరంగా బలహీనంగా ఉన్నట్టే లెక్క. అలాగే స్త్రీలో ఉండే అండాలు కూడా నాణ్యతగా ఉండవు. కాబట్టి పుట్టే బిడ్డ ఆరోగ్యం పై కూడా ఆ ప్రభావం పడవచ్చు. 35 ఏళ్ల తర్వాత గర్భం దాల్చడం వల్ల గర్భస్రావం అయ్యే ప్రమాదం అధికంగా ఉంటుంది. అలాగే ఆ స్త్రీకి అధిక రక్తపోటు, మధుమేహం ఉన్నట్లయితే ఆ గర్భం నిలవడం కూడా కష్టంగా మారుతుంది. తొమ్మిది నెలలు గర్భం నిలిచినా కూడా ప్రసవం మరొక సవాలుగా ఉంటుంది. ముప్ఫై అయిదేళ్లు  దాటిన తర్వాత గర్భం ధరించినా ప్రతి మహిళా చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది.

ముప్పై అయిదేళ్లు దాటిన తర్వాత ఎంతోమంది మహిళలు బిడ్డలను కంటున్నారు. అయితే ఆ బిడ్డలో క్రోమోజోమ్ సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంటే ఆ బిడ్డ డౌన్ సిండ్రోమ్‌తో లేదా ఆటిజంతో పుట్టే అవకాశాలు కూడా ఉన్నాయి. 365 ప్రసవాల్లో ఒక బిడ్డకు ఇలాంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అలాగే లేటుగా గర్భం ధరించడం వల్ల నెలలు నిండకుండానే ప్రసవం అవడం, తల్లికి ఆరోగ్య సమస్యలు లేదా బిడ్డలో లోపాలు వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు వైద్యులు. వీరికి సాధారణ ప్రసవం అయ్యే అవకాశం చాలా తక్కువగా ఉంటుందని, సిజేరియన్ చేయించుకోవడమే ఉత్తమమని వివరిస్తున్నారు. సంతానోత్పత్తికి 30 ఏళ్లలోపే మహిళల వయస్సు నాణ్యమైనదిగా చెబుతున్నారు వైద్యులు.

Also read: మధుమేహం ఉన్నవారు మద్యం తాగుతున్నారా? ఇక అంతే సంగతులు

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Good News For Farmers: సన్న వడ్లకు క్వింటాకు రూ.500 బోనస్, రైతుల ఖాతాల్లో జమపై ప్రభుత్వం శుభవార్త
సన్న వడ్లకు క్వింటాకు రూ.500 బోనస్, రైతుల ఖాతాల్లో జమపై ప్రభుత్వం శుభవార్త
Tirumala Brahmotsavalu 2024: శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు శాస్త్రోక్తంగా అంకురార్పణ, Photo చూశారా
శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు శాస్త్రోక్తంగా అంకురార్పణ, Photo చూశారా
Ola Offer: రూ.50 వేలలోపే ఎలక్ట్రిక్ స్కూటర్ - అద్భుతమైన ఆఫర్ ఇస్తున్న ఓలా!
రూ.50 వేలలోపే ఎలక్ట్రిక్ స్కూటర్ - అద్భుతమైన ఆఫర్ ఇస్తున్న ఓలా!
Telangana News: కేటీఆర్ పై ఉట్నూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన ఆత్రం సుగుణక్క
కేటీఆర్ పై ఉట్నూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన ఆత్రం సుగుణక్క
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Rupai Village Story | ఈ ఊరి పేరు వెనుక స్టోరీ వింటే ఆశ్చర్యపోతారు | ABP DesamThalapathy69 Cast Reveal | తలపతి విజయ్ ఆఖరి సినిమా కథ ఇదేనా.? | ABP DesamRohit Sharma on Virat Kohli | టెస్ట్ క్రికెట్ లో టీమిండియా ప్రభంజనం..ఓపెన్ అయిన రోహిత్ | ABP Desamఇజ్రాయేల్‌పై ఇరాన్ భీకర దాడులు, నెతన్యాహు స్ట్రాంగ్ వార్నింగ్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Good News For Farmers: సన్న వడ్లకు క్వింటాకు రూ.500 బోనస్, రైతుల ఖాతాల్లో జమపై ప్రభుత్వం శుభవార్త
సన్న వడ్లకు క్వింటాకు రూ.500 బోనస్, రైతుల ఖాతాల్లో జమపై ప్రభుత్వం శుభవార్త
Tirumala Brahmotsavalu 2024: శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు శాస్త్రోక్తంగా అంకురార్పణ, Photo చూశారా
శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు శాస్త్రోక్తంగా అంకురార్పణ, Photo చూశారా
Ola Offer: రూ.50 వేలలోపే ఎలక్ట్రిక్ స్కూటర్ - అద్భుతమైన ఆఫర్ ఇస్తున్న ఓలా!
రూ.50 వేలలోపే ఎలక్ట్రిక్ స్కూటర్ - అద్భుతమైన ఆఫర్ ఇస్తున్న ఓలా!
Telangana News: కేటీఆర్ పై ఉట్నూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన ఆత్రం సుగుణక్క
కేటీఆర్ పై ఉట్నూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన ఆత్రం సుగుణక్క
Jio Best 5G Plan: జియో చవకైన 5జీ ప్లాన్ - రూ.200 లోపే అన్‌లిమిటెడ్ డేటా!
జియో చవకైన 5జీ ప్లాన్ - రూ.200 లోపే అన్‌లిమిటెడ్ డేటా!
Raashi Khanna : గ్రే సూట్​లో హాట్​ ఫోటోషూట్ చేసిన రాశీ ఖన్నా.. స్టైలిష్​ లుక్స్​ చూశారా?
గ్రే సూట్​లో హాట్​ ఫోటోషూట్ చేసిన రాశీ ఖన్నా.. స్టైలిష్​ లుక్స్​ చూశారా?
Nagarjuna Defamation: మంత్రి కొండా సురేఖపై పరువు నష్టం దావా వేసిన నాగార్జున, ఏం డిమాండ్ చేశారంటే!
మంత్రి కొండా సురేఖపై పరువు నష్టం దావా వేసిన నాగార్జున, ఏం డిమాండ్ చేశారంటే!
Happy Dussehra 2024 : దసరా శుభాకాంక్షలు సోషల్ మీడియాలో ఇలా చెప్పేయండి.. ఫేస్​బుక్, వాట్సాప్​ల​లో ఇవి షేర్ చేసేయండి
దసరా శుభాకాంక్షలు సోషల్ మీడియాలో ఇలా చెప్పేయండి.. ఫేస్​బుక్, వాట్సాప్​ల​లో ఇవి షేర్ చేసేయండి
Embed widget