అన్వేషించండి

Fruit Chat: ఉప్పు, కారం అద్దుకుని పండ్లు తింటున్నారా? అయితే ఈ సమస్యలు ఎదుర్కోవాల్సిందే

స్పైసీగా ఉండే ఫ్రూట్ చాట్ అంటే చాలా మందికి ఇష్టం. నోరూరించే ఈ చిరుతిండి రుచిగా ఉంటుంది. కానీ ఎన్నో అనారోగ్య సమస్యల్ని తీసుకొస్తుంది.

జామకాయ, పచ్చి మామిడి పండ్లు తినేటప్పుడు చాలా మంది ఉప్పు, కారం, పంచదార లేదంటే మసాలా అద్దుకుని తింటారు. వాటిని అలా చూడగానే నోట్లో నీళ్ళు ఊరిపోతాయి. అలా తింటుంటే చాలా టేస్టీగా ఉంటుందని అనుకుంటారు. కాస్త స్పైసీగా మరికొంచెం తియ్యగా ఉంటాయి. రుచి సరే మరి పోషకాల సంగతి ఏంటి? భారతీయులు ఎక్కువగా ‘ఫ్రూట్ చాట్’ తినడానికి ఇష్టపడతారు. చాట్ లో భాగంగా ఉప్పు, మసాలా చల్లగానే పండ్ల నుంచి నీరు రావడం ఎప్పుడైనా గమనించారా? ఈ నీరు పోషకాల నష్టాన్ని సూచిస్తుంది. అంతే కాదు ఉప్పు, చాట్ మసాలాలో ఉండే సోడియం ఆరోగ్యానికి హాని కలిగిస్తుంది. అదెలాగో తెలుసా..

బరువు పెరుగుతారు

పండ్లపై చల్లిన ఉప్పు, చాట్ మసాలా లేదా చక్కెర శరీరానికి అవసరం లేదు. ఎక్కువ చక్కెరను జోడించడం వల్ల రోజువారీ కేలరీల సంఖ్య పెరిగిపోతుంది. రోజులో తీసుకోవాల్సిన దాని కంటే అధిక కేలరీలు తీసుకున్నట్టు అవుతుంది. దీని వల్ల బరువు పెరుగుతారు. ఊబకాయం వంటి సమస్యలు ఎదురవుతాయి.

పోషకాలు ఉండవు

సాధారణంగా పండ్లలో ఉండే పోషకాలు మీరు చల్లుకునే ఉప్పు, కారం, మసాలా చల్లడం వల్ల పోషకాలు నశిస్తాయి. ఆరోగ్యానికి మేలు చేసే పండ్లు మాదిరిగా కాకుండా అదొక చిరుతిండిలా మారిపోతుంది. పండ్లలోని అవసరమైన విటమిన్లు, ఖనిజాలను ఇవి బయటకి పంపించేస్తాయి. ఉప్పు లేకుండా పండ్లు తినడం వల్ల తక్కువగా నీరు బయటకి వస్తుంది. అందువల్ల అందులోని పోషకాలు చెక్కు చెదరకుండా ఉంటాయి.

మూత్రపిండాలు ప్రభావితం

పండ్ల మీద ఉప్పు చల్లడం వల్ల అనవసరమైన సోడియాన్ని శరీరానికి జోడించినట్టు అవుతుంది. సోడియం శరీరంలో నీటిని నిలుపుకునేలా చేస్తుంది. దాని వల్ల మూత్రపిండాలు దెబ్బతింటాయి. ఇప్పటికే మీరు మూత్రపిండాల సమస్యతో బాధపడుతున్నట్టయితే పండ్లు ప్రాసెస్ చేయకుండా, ఉప్పు, మసాలా లేకుండా తీసుకోవడం మంచిది. అప్పుడే ఆరోగ్యంగా ఉంటారు.

ఉబ్బరం

మసాలాతో కూడిన పండ్లు తినడం వల్ల పొట్టలో అసౌకర్యంగా ఉంటుంది. pH స్థాయిలు, సోడియం కారణంగా శరీరం నీటిని నిలుపుకుంటుంది. దీని వల్ల పొట్ట ఉబ్బరంగా, గ్యాస్ పట్టేసినట్టు ఉంటుంది. ఇది రోజంతా అసౌకర్యంగా అనిపించేలా చేస్తుంది. మసాలా తింటే సాధారణంగానే కొంతమందికి పొట్టలో గ్యాస్ ఫామ్ అయిపోతుంది. ఇక పండ్లతో పాటు దాన్ని తీసుకుంటే అది తీవ్రమైన సమస్యగా మారే ప్రమాదం ఉంది.

ఇలా తినొచ్చు

పండ్లకి మరింత రుచిని ఇవ్వాలని అనుకుంటే అందుకు వేరే మార్గం ఉంది. ఆయుర్వేదం ప్రకారం ఆరోగ్యంగా ఉండేందుకు రోజుకి ఒకటి ఏదైనా పండు తినడం మంచిది. వేసవిలో పండ్ల మీద యాలకులు, మిరియాలు వేసుకుని తినొచ్చు. అదే శీతాకాలంలో అయితే దాల్చిన చెక్క, లవంగాల పొడిని చల్లుకోవచ్చు. ఇలా తింటే ఎటువంటి ఆరోగ్య సమస్యలు రాకుండా రుచికరమైన పండ్లు తిన్న ఫీలింగ్ కలుగుతుంది.

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.

Also Read: పిల్లల్లో యూరినరీ ఇన్ఫెక్షన్‌ని గుర్తించడం ఎలా? చికిత్స ఏమిటి?

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

KTR Challenge to CM Revanth: పది మందితో రాజీనామా చేయిస్తావా? సీఎం రేవంత్‌కు కేటీఆర్ బహిరంగ సవాల్
పది మందితో రాజీనామా చేయిస్తావా? సీఎం రేవంత్‌కు కేటీఆర్ బహిరంగ సవాల్
Adilabad News: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు అడ్డుకుంటే తిరగబడతాం; అటవీశాఖ అధికారులకు ఆదివాసీ గిరిజనుల హెచ్చరిక
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు అడ్డుకుంటే తిరగబడతాం; అటవీశాఖ అధికారులకు ఆదివాసీ గిరిజనుల హెచ్చరిక
Sharif Usman Hadi: కాజీ నజ్రుల్ సమాధి పక్కనే షరీఫ్ ఉస్మాన్ హదీ అంత్యక్రియలు! నేడు బంగ్లాదేశ్‌ జాతీయ సంతాప దినం!
కాజీ నజ్రుల్ సమాధి పక్కనే షరీఫ్ ఉస్మాన్ హదీ అంత్యక్రియలు! నేడు బంగ్లాదేశ్‌ జాతీయ సంతాప దినం!
Ind vs SA 5th T20 Highlights : తిలక్, హార్దిక్ తుపాను, వరుణ్ చక్రవర్తి వ్యూహంలో సౌతాఫ్రికా విలవిల- అహ్మదాబాద్‌లో భారత్ విజయం!
తిలక్, హార్దిక్ తుపాను, వరుణ్ చక్రవర్తి వ్యూహంలో సౌతాఫ్రికా విలవిల- అహ్మదాబాద్‌లో భారత్ విజయం!

వీడియోలు

Atha Kodalu In Sarpanch Elections Heerapur | హోరాహోరీ పోరులో కోడలిపై గెలిచిన అత్త | ABP Desam
టీమిండియా, సౌతాఫ్రికా మధ్య నేడు ఆఖరి పోరు
సంజూ.. చుక్కలు చూపించాల!
కోహ్లీ రికార్డ్‌ బద్దలు కొట్టడానికి అడుగు దూరంలో అభిషేక్ శర్మ
టీమిండియా కోచ్ గౌతం గంభీర్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన కపిల్ దేవ్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR Challenge to CM Revanth: పది మందితో రాజీనామా చేయిస్తావా? సీఎం రేవంత్‌కు కేటీఆర్ బహిరంగ సవాల్
పది మందితో రాజీనామా చేయిస్తావా? సీఎం రేవంత్‌కు కేటీఆర్ బహిరంగ సవాల్
Adilabad News: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు అడ్డుకుంటే తిరగబడతాం; అటవీశాఖ అధికారులకు ఆదివాసీ గిరిజనుల హెచ్చరిక
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు అడ్డుకుంటే తిరగబడతాం; అటవీశాఖ అధికారులకు ఆదివాసీ గిరిజనుల హెచ్చరిక
Sharif Usman Hadi: కాజీ నజ్రుల్ సమాధి పక్కనే షరీఫ్ ఉస్మాన్ హదీ అంత్యక్రియలు! నేడు బంగ్లాదేశ్‌ జాతీయ సంతాప దినం!
కాజీ నజ్రుల్ సమాధి పక్కనే షరీఫ్ ఉస్మాన్ హదీ అంత్యక్రియలు! నేడు బంగ్లాదేశ్‌ జాతీయ సంతాప దినం!
Ind vs SA 5th T20 Highlights : తిలక్, హార్దిక్ తుపాను, వరుణ్ చక్రవర్తి వ్యూహంలో సౌతాఫ్రికా విలవిల- అహ్మదాబాద్‌లో భారత్ విజయం!
తిలక్, హార్దిక్ తుపాను, వరుణ్ చక్రవర్తి వ్యూహంలో సౌతాఫ్రికా విలవిల- అహ్మదాబాద్‌లో భారత్ విజయం!
Minister Komatireddy Rajagopal Reddy: మంత్రిని కాబోతున్నా - డిక్లేర్ చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
మంత్రిని కాబోతున్నా - డిక్లేర్ చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
Phone tapping case is SIT: ఫోన్ ట్యాపింగ్ కేసులో సజ్జనార్ నేతృత్వంలో సిట్ - ఇప్పటి వరకూ ఏం తేల్చలేకపోయారా?
ఫోన్ ట్యాపింగ్ కేసులో సజ్జనార్ నేతృత్వంలో సిట్ - ఇప్పటి వరకూ ఏం తేల్చలేకపోయారా?
Andhra intermediate exams: ఏపీలో ఇంటర్ పరీక్షల షెడ్యూల్‌లో మార్పుచేర్పులు - కొత్త షెడ్యూల్ ఫుల్ డీటైల్స్ ఇక్కడ
ఏపీలో ఇంటర్ పరీక్షల షెడ్యూల్‌లో మార్పుచేర్పులు - కొత్త షెడ్యూల్ ఫుల్ డీటైల్స్ ఇక్కడ
Pawan Kalyan: జనసేన ఎమ్మెల్యేలతో పవన్ కల్యాణ్ వన్ టు వన్ భేటీ - పనితీరుపై సమీక్ష - గట్టి వార్నింగ్ ఇస్తున్నారా?
జనసేన ఎమ్మెల్యేలతో పవన్ కల్యాణ్ వన్ టు వన్ భేటీ - పనితీరుపై సమీక్ష - గట్టి వార్నింగ్ ఇస్తున్నారా?
Embed widget