అన్వేషించండి

Marriage: పెళ్లి చేసుకుంటే మతిమరుపు పోతుందా ! అధ్యయనంలో తేలిన విషయాలివే

పెళ్లి వల్ల ఎన్ని లాభాలో, ఇప్పుడు మరో ప్రయోజనం కూడా చేరింది.

మతిమరుపు, చిత్త వైకల్యం ఈ సమస్యలను డెమెన్షియా అంటారు. వయసు పెరుగుతున్న కొద్దీ చాలా మందిలో ఈ లక్షణాలు కనిపిస్తుంటాయి. కొత్తగా చేసిన ఓ అధ్యయనంలో ఒంటరిగా ఉండే వారిలో మతిమరుపు వచ్చే అవకాశం ఎక్కువని తేలింది. డెమెన్షియా రాకుండా ఉండాలంటే పెళ్లి చేసుకోవడం, స్నేహితులతో మాట్లాడుతూ ఉండడం  చేయాలని చెబుతోంది పరిశోధనా. ఈ అధ్యయనాన్ని రోమ్‌కి చెందిన విశ్వవిద్యాలయ పరిశోధకులు నిర్వహించారు. ఇందలో పెళ్లికి, స్నేహానికి మతిమరుపుతో సంబందం ఉన్నట్టు తేలింది. 

ఎవరిలో ఎక్కువగా వస్తుంది?
మతిమరుపు రావడానికి చాలా కారణాలు ఉన్నాయి. ఒంటరితనంతో బాధపడేవారు, డిప్రెషన్ కు చికిత్స తీసుకోకుండా వదిలేసే వారు, పరీక్షలు ఫెయిలయ్యే వారు, చెవుడు ఉన్న వారు, అధిక రక్తపోటు, ఊబకాయం, మధుమేహం ఉన్నవారిలో ఈ వ్యాధి వస్తుంటుంది. అధికంగా చెప్పుకుంటే చెవుడు ఉన్నా వారిలోనే త్వరగా దాడి చేస్తుంది. ఒంటరితనం కూడా మనిషికి అన్ని రకాలుగా కుంగదీస్తుంది. 

పెళ్లితో సేఫ్
మతిమరుపు పెళ్లయిన వారితో పోలిస్తే ఒంటరిగా ఉండే వారిలో అధికంగా వచ్చే అవకాశం ఉన్నట్టు ఓ అధ్యయనం తేల్చింది. అల్జీమర్స్ సొసైటీ చెప్పిన ప్రకారం పెళ్లి కాని ప్రతి 100 మంది ఒకరికి కచ్చితంగా మతిమరుపు ఉంటోందని తెలిపారు. దీనికి ఒంటరితనం, బాధను పంచుకునే వ్యక్తి లేకపోవడం, లోలోపలే కుంగిపోవడం కారణం కావచ్చని భావిస్తున్నారు. ఈ అధ్యయనాన్ని దాదపు 6677 మందిపై నిర్వహించారు. మొదట్లో ఎవరికీ మతిమరుపు వ్యాధి లేదు. కొన్నేళ్లకు 220 మందకి ఈ సమస్య వచ్చింది. వారంతా ఒంటరి వారే.  

ఒకప్పుడు 60 ఏళ్లు దాటితేనే మతిమరుపు వ్యాధి వచ్చేది. ఇప్పుడు అంతకన్నా ముందునుంచే వెలుగు చూడడం మొదలుపెట్టింది. అందుకే చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది.జ్ఞాపకశక్తిని కోల్పోవటాన్ని అల్జీమర్స్‌ (మతిమరుపు) అంటారు. జ్ఞాపకశక్తి  తగ్గడంతో పాటూ  బంధువులను గుర్తుపట్టలేని స్థితికి చేరుకుంటే దాన్ని డిమెన్షియా అంటారు. ఇది ఒకసారి వచ్చిందా మళ్లీ తిరిగి పోదు. సరైన చికిత్స లేదు. మొదటి దశలోనే గుర్తిస్తే చికిత్స సులువవుతుంది. 

గమనిక:ఈ కథనంలో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు. ఏదైనా వ్యాయామం లేదా డైట్‌లో మార్పులు చేయాలనుకుంటే తప్పకుండా మీరు వైద్యుడు, డైటీషియన్‌ను సంప్రదించాలి.

Also read: క్యాబెజీ చికెన్ కర్రీ, ఆ రెండూ కలిపి తినడం వల్ల ఎన్ని లాభాలో

Also read: ఐస్‌క్రీముల్లో వాడే ఈ ద్రావకం ఎంత ప్రమాదకరమో తెలుసా?

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Good news for Telangana government employees: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ - ఒక డీఏ ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ - ఒక డీఏ ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి
Andhra IAS Transfers: ఏపీలో 14 మంది ఐఏఎస్‌ల బదిలీ - పలు చోట్ల మున్సిపల్ కమిషనర్లు మార్పు
ఏపీలో 14 మంది ఐఏఎస్‌ల బదిలీ - పలు చోట్ల మున్సిపల్ కమిషనర్లు మార్పు
Hatao Lungi Bajao Pungi: ముంబైలో హటావో లుంగీ, బజావో పుంగీ నినాదం - రాజ్ ఠాక్రే పై అన్నామలై విమర్శలు
ముంబైలో హటావో లుంగీ, బజావో పుంగీ నినాదం - రాజ్ ఠాక్రే పై అన్నామలై విమర్శలు
Telangana Latest News: తెలంగాణలో విద్యార్థులకు ఇచ్చే కిట్‌లపై సీఎం సమీక్ష- కీలక ఆదేశాలు
తెలంగాణలో విద్యార్థులకు ఇచ్చే కిట్‌లపై సీఎం సమీక్ష- కీలక ఆదేశాలు

వీడియోలు

Haimendorf 39th Death Anniversary | ఆదివాసీల ఆత్మబంధువు పేరు భావి తరాలకు నిలిచిపోయేలా చేస్తాం | ABP Desam
Sophie Devine All Rounder Show | DCW vs GGTW మ్యాచ్ లో సోఫీ డివైన్ ఆశ్చర్యపరిచే ప్రదర్శన | ABP Desam
Ind vs NZ First ODI Highlights | మొదటి వన్డేలో న్యూజిలాండ్ పై భారత్ ఘన విజయం | ABP Desam
Virat Kohli 71st PoTM Award | తన తల్లితో అనుబంధాన్ని, సచిన్ పై ప్రేమను మరో సారి చాటిన కోహ్లీ | ABP Desam
Virat Kohli Reached Second Place | సంగక్కరను దాటేసి...సచిన్ తర్వాతి స్థానంలో విరాట్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Good news for Telangana government employees: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ - ఒక డీఏ ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ - ఒక డీఏ ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి
Andhra IAS Transfers: ఏపీలో 14 మంది ఐఏఎస్‌ల బదిలీ - పలు చోట్ల మున్సిపల్ కమిషనర్లు మార్పు
ఏపీలో 14 మంది ఐఏఎస్‌ల బదిలీ - పలు చోట్ల మున్సిపల్ కమిషనర్లు మార్పు
Hatao Lungi Bajao Pungi: ముంబైలో హటావో లుంగీ, బజావో పుంగీ నినాదం - రాజ్ ఠాక్రే పై అన్నామలై విమర్శలు
ముంబైలో హటావో లుంగీ, బజావో పుంగీ నినాదం - రాజ్ ఠాక్రే పై అన్నామలై విమర్శలు
Telangana Latest News: తెలంగాణలో విద్యార్థులకు ఇచ్చే కిట్‌లపై సీఎం సమీక్ష- కీలక ఆదేశాలు
తెలంగాణలో విద్యార్థులకు ఇచ్చే కిట్‌లపై సీఎం సమీక్ష- కీలక ఆదేశాలు
Virat Kohli:విరాట్ కోహ్లీ మ్యాన్ ఆఫ్‌ ద మ్యాచ్ ట్రోఫీలను ఎక్కడ ఉంచుతాడో తెలుసా? సీక్రెట్ చెప్పిన ఛేజ్‌ మాస్టర్!
విరాట్ కోహ్లీ మ్యాన్ ఆఫ్‌ ద మ్యాచ్ ట్రోఫీలను ఎక్కడ ఉంచుతాడో తెలుసా? సీక్రెట్ చెప్పిన ఛేజ్‌ మాస్టర్!
Kishan Reddy: పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు జాతీయహోదా సాధ్యం కాదు - ఉపాధి హామీ పథకం బలోపేతం - కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు జాతీయహోదా సాధ్యం కాదు - ఉపాధి హామీ పథకం బలోపేతం - కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
AP CM Chandrababu: పుష్కరాలలోపు పోలవరం ప్రాజెక్టు పూర్తి, 25 శాతం విదేశీ పెట్టుబడులు ఏపీకే: సీఎం చంద్రబాబు
పుష్కరాలలోపు పోలవరం ప్రాజెక్టు పూర్తి, 25 శాతం విదేశీ పెట్టుబడులు ఏపీకే: సీఎం చంద్రబాబు
Guntur Latest News:గుంటూరు జిల్లాలోని రావిపాడు గ్రామ ఆరోగ్య కేంద్రంలో కాలం చెల్లిన మందులు- ఎమ్మెల్యే ఆగ్రహం
గుంటూరు జిల్లాలోని రావిపాడు గ్రామ ఆరోగ్య కేంద్రంలో కాలం చెల్లిన మందులు- ఎమ్మెల్యే ఆగ్రహం
Embed widget