అన్వేషించండి

Vitamin D: వ్యక్తి ప్రాణం తీసిన ‘విటమిన్ D’ - అది అంత ప్రమాదకరమా?

Vitamin D : రోగ నిరోధక శక్తి పెంచుకోవాలనే ఉద్దేశంతో చాలా మంది అధిక పోషకాలున్న పదార్థాలు తింటే అసలుకే మోసం వస్తుంది. ముఖ్యంగా విటమిన్​ డి అధికంగా ఉండే సప్లిమెంట్స్ తీసుకోవద్దని సూచిస్తున్నారు.

Vitamin D : నేటికాలంలో చాలామంది ఆరోగ్యంపై శ్రద్ధ చూపిస్తున్నారు. కోవిడ్ నేపథ్యంలో అందరూ ఆహారంపై జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇమ్యూనిటీని పెంచే పోషకాలను ఎక్కువగా తీసుకుంటున్నారు. రోగనిరోధకశక్తి పెంచుకోవాలనే ఉద్దేశ్యంతో అధిక పోషకాలున్న పదార్థాలు, ఔషదాలు తీసుకుంటున్నారు. అందులో ఒకటి విటమిన్ D. ఈ విటమిన్ శరీరానికి చాలా ముఖ్యమైంది. కానీ అధిక మోతాదులో తీసుకుంటే ప్రాణాలకు ముప్పు తప్పదు. విటమిన్ D అధికమోతాదులో తీసుకున్న ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. దీంతో నిపుణులు సప్లిమెంట్స్ తక్కువగా తీసుకోవాలని చెబుతున్నారు. 

యూకేలోని సర్రీలో నివాసం ఉంటున్న డేవిడ్ మిచెనర్ అనే 89 ఏళ్ల వ్యక్తి... విటమిన్ D అధిక మోతాదులో తీసుకోవడం వల్ల ప్రాణాలు కోల్పోయాడు. డేవిడ్ రక్త నమూనాలను పరీక్షించగా అతను అధికమోతాదులో విటమిన్ D సప్లిమెంట్స్ తీసుకున్నట్లు తేలింది. వైద్య పరీక్షల్లో విటమిన్ D మొతాదు 380 వరకు ఉన్నట్లు తేలింది. అతడు సుమారు 9 నెలలుగా విటమిన్ D సప్లిమెంట్లు తీసుకుంటున్నారు.

విటమిన్ D అధిక మోతాదు వల్ల  హైపర్‌కాల్కేమియాకు గురయ్యాడని.. గుండె, కిడ్నీ ఫెయిల్ అయ్యాయని వైద్యులు తెలిపారు. మిచెనర్ మరణం వెనుక మరో కారణం.. సప్లిమెంట్ ప్యాకేజ్‌పై హెచ్చరికలు లేకపోవడమేనని నివేదిక వెల్లడించింది. దానిపై ఎంత మోతాదు తీసుకోవాలనే వివరాలు కూడా లేవని అధికారులు తెలిపారు. విటమిన్ D  అధికంగా తీసుకున్నప్పుడు చాలా తీవ్రమైన ప్రమాదాలు, సైడ్ ఎఫెక్ట్స్ ఏర్పడవచ్చని నివేదికలో వెల్లడించారు.

విటమిన్ D ఎక్కువగా తీసుకోవడం వల్ల రక్తంలో కాల్షియం పేరుకుపోతుందని, అది విషపూరితంగా మారుతుందని నిపుణులు తెలిపారు. శరీరంలో కాల్షియం పెరిగితే వికారం, వాంతులు, బలహీనత, తరచుగా మూత్రవిసర్జన సమస్యలు ఏర్పడే అవకాశాలున్నాయని పేర్కొన్నారు. బాధితుడు మిచెనర్ కూడా ఇలాంటి లక్షణాలతోనే ఆసుపత్రిలో చేరాడు. రక్త నమూనాలను సేకరించిన వైద్యులు మిచెనర్ శరీరంలో విటమిన్ D... ఉండాల్సిన పరిమాణం కంటే అధిక మోతాదులో ఉన్నట్లు గుర్తించారు. ఈ కారణంతో మిచెనర్ చికిత్స పొందుతూ మరణించాడని నిర్ధరించారు. 

చాలా మంది వయస్సు పైబడిన వారు విటమి డి తీసుకుంటారు. కానీ వారు తీసుకునే సప్లిమెంట్స్ ఏ మోతాదులో తీసుకోవాలన్న అవగాహన తప్పనిసరిగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. ఆరోగ్యానికి మంచిదని అధిక మోతాదులో తీసుకుంటే విషంగా మారుతుందని మిచెనర్ మరణాన్ని ఉదాహరణగా చెప్పవచ్చు. కాబట్టి.. డాక్టర్ సలహా తీసుకోకుండా ఎటువంటి ఔషదాలు ఉపయోగించకూడదు.

Also Read : స్ట్రోక్ రాకుండా హార్ట్​ను రక్షించే హెల్తీ డ్రింక్స్ ఇవే.. ఇలా తయారు చేసుకోండి

గమనిక : పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.

Also Read: రోజూ 10 నిమిషాలు ఇలా చెయ్యండి - ‘విటమిన్ డి’ లోపమే ఉండదు

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Vijayawada Temple Power Cut: విజయవాడ దుర్గ గుడికి కరెంట్ కట్ చేసిన విద్యుత్ శాఖ.. అసలేం జరిగింది
విజయవాడ దుర్గ గుడికి కరెంట్ కట్ చేసిన విద్యుత్ శాఖ.. అసలేం జరిగింది
Taiwan Earthquake: తైవాన్‌లో భారీ భూకంపం.. కంపించిన ఎత్తైన భవనాలు - రిక్టర్ స్కేలుపై 7 తీవ్రతతో ప్రకంపనలు
తైవాన్‌లో భారీ భూకంపం.. కంపించిన ఎత్తైన భవనాలు - రిక్టర్ స్కేలుపై 7 తీవ్రతతో ప్రకంపనలు
Amaravati Farmers: ఇంకా ఎంతమందిని చంపుతారు.. కేంద్రమంత్రి పెమ్మసానికి అమరావతి రైతుల సెగ.. అసలు కోపం ఎమ్మెల్యేపై
ఇంకా ఎంతమందిని చంపుతారు.. పెమ్మసానికి అమరావతి రైతుల సెగ.. అసలు కోపం ఎమ్మెల్యేపై
Division of Andhra Pradesh Districts: ఏపీలో కొత్త జిల్లాలు, డివిజన్లపై డిసెంబర్ 31న తుది నోటిఫికేషన్ - చంద్రబాబు సమక్షంలో కీలక నిర్ణయం
ఏపీలో కొత్త జిల్లాలు, డివిజన్లపై డిసెంబర్ 31న తుది నోటిఫికేషన్ - చంద్రబాబు సమక్షంలో కీలక నిర్ణయం

వీడియోలు

India vs Sri Lanka 3rd T20 Highlights | మూడో టి20లో టీమ్ ఇండియా ఘన విజయం
Rohit Sharma Golden Duck | రోహిత్ శర్మ గోల్డెన్ డకౌట్
Virat Kohli Half Century in Vijay Hazare Trophy | 29 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేసిన కింగ్
Rinku Singh Century in Vijay Hazare Trophy | విజయ్ హజారే ట్రోఫీలీ రింకూ సింగ్ సెంచరీ
Union Minister Kishan Reddy Interview | త్వరలోనే ఆదిలాబాద్ ఎయిర్ పోర్ట్ అభివృద్ధి పనులు | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vijayawada Temple Power Cut: విజయవాడ దుర్గ గుడికి కరెంట్ కట్ చేసిన విద్యుత్ శాఖ.. అసలేం జరిగింది
విజయవాడ దుర్గ గుడికి కరెంట్ కట్ చేసిన విద్యుత్ శాఖ.. అసలేం జరిగింది
Taiwan Earthquake: తైవాన్‌లో భారీ భూకంపం.. కంపించిన ఎత్తైన భవనాలు - రిక్టర్ స్కేలుపై 7 తీవ్రతతో ప్రకంపనలు
తైవాన్‌లో భారీ భూకంపం.. కంపించిన ఎత్తైన భవనాలు - రిక్టర్ స్కేలుపై 7 తీవ్రతతో ప్రకంపనలు
Amaravati Farmers: ఇంకా ఎంతమందిని చంపుతారు.. కేంద్రమంత్రి పెమ్మసానికి అమరావతి రైతుల సెగ.. అసలు కోపం ఎమ్మెల్యేపై
ఇంకా ఎంతమందిని చంపుతారు.. పెమ్మసానికి అమరావతి రైతుల సెగ.. అసలు కోపం ఎమ్మెల్యేపై
Division of Andhra Pradesh Districts: ఏపీలో కొత్త జిల్లాలు, డివిజన్లపై డిసెంబర్ 31న తుది నోటిఫికేషన్ - చంద్రబాబు సమక్షంలో కీలక నిర్ణయం
ఏపీలో కొత్త జిల్లాలు, డివిజన్లపై డిసెంబర్ 31న తుది నోటిఫికేషన్ - చంద్రబాబు సమక్షంలో కీలక నిర్ణయం
YSRCP Politics: ఆగని రప్పా.. రప్పా.. అరెస్ట్ చేసే కొద్దీ రెచ్చిపోతున్న వైకాపా శ్రేణులు
ఆగని రప్పా.. రప్పా.. అరెస్ట్ చేసే కొద్దీ రెచ్చిపోతున్న వైకాపా శ్రేణులు
Year Ender 2025: ఈ ఏడాది NPS లో 5 భారీ మార్పులు.. ఉద్యోగులకు ప్రయోజనం కలిగించే రూల్స్ ఇవే
ఈ ఏడాది NPS లో 5 భారీ మార్పులు.. ఉద్యోగులకు ప్రయోజనం కలిగించే రూల్స్ ఇవే
Hyderabad Crime Report: హైదరాబాద్‌లో 15 శాతం తగ్గిన నేరాలు.. మహిళలు, చిన్నారులపై పెరిగిన అఘాయిత్యాలు
హైదరాబాద్‌లో 15 శాతం తగ్గిన నేరాలు.. మహిళలు, చిన్నారులపై పెరిగిన అఘాయిత్యాలు
Kerala Gen Z political Leader: జెన్‌జీ తరం మున్సిపల్ చైర్మన్ దియా బిను - వారసురాలు కాదు.. నాయకత్వంతో ఎదిగిన లీడర్ -మనకూ స్ఫూర్తే !
జెన్‌జీ తరం మున్సిపల్ చైర్మన్ దియా బిను - వారసురాలు కాదు.. నాయకత్వంతో ఎదిగిన లీడర్ -మనకూ స్ఫూర్తే !
Embed widget