అన్వేషించండి

Leg Tingling : కాళ్లలో తిమ్మిర్లు తరచూ వస్తున్నాయా? డయాబెటిస్, విటమిన్ B12 లోపం సహా ఈ సమస్యలకు సంకేతం కావచ్చు

Leg Tingling and Numbness : కాళ్లల్లో తిమ్మిర్లు రావడం కామన్ అయినా.. తరచూ రావడం మాత్రం ఆరోగ్య సమస్యలకు ప్రధాన హెచ్చరిక అని.. దానిని లైట్ తీసుకోవద్దంటున్నారు. అవేంటో తెలుసుకుందాం.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • కాళ్ల తిమ్మిర్లు విటమిన్ B12 లోపం, మధుమేహానికి సూచన.
  • నరాలపై ఒత్తిడి, రక్త ప్రసరణ లోపం, థైరాయిడ్ కారణాలు.
  • సరైన జీవనశైలి, ఆహారం, వ్యాయామం తిమ్మిర్లను తగ్గిస్తుంది.
  • తీవ్ర బలహీనత, నొప్పితో వస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.

Leg Tingling Causes, Warning Signs : రోజంతా కూర్చొని పనిచేయడం లేదా ఒకే భంగిమలో ఎక్కువసేపు ఉన్నప్పుడు కాళ్లలో తిమ్మిర్లు వస్తాయి. అయితే ఎలాంటి కారణం లేకుండా తరచూ కాళ్లలో తిమ్మిర్లు, సూదులతో గుచ్చినట్లు అనిపించడం, మొద్దుబారడం వంటి లక్షణాలు కనిపిస్తే వాటిని నిర్లక్ష్యం చేయకూడదని వైద్యులు హెచ్చరిస్తున్నారు. కొన్ని సందర్భాల్లో ఇవి నరాల సమస్యలు, విటమిన్ లోపాలు లేదా ఇతర ఆరోగ్య సమస్యలకు సంకేతం కావచ్చని అంటున్నారు. మరి కాళ్లలో తిమ్మిర్లు రావడానికి కారణాలు ఏంటో చూసేద్దాం.

విటమిన్ B12 లోపం

విటమిన్ B12 నరాల ఆరోగ్యానికి చాలా ముఖ్యమైన పోషకం. దీని లోపం వల్ల చేతులు, కాళ్లలో తిమ్మిర్లు, మొద్దుబారడం, బలహీనత వంటి సమస్యలు రావచ్చు. శాకాహారులు, వృద్ధుల్లో ఈ లోపం ఎక్కువగా కనిపిస్తుంది.

మధుమేహం

రక్తంలో చక్కెర స్థాయిలు ఎక్కువ కాలం నియంత్రణలో లేకపోతే నరాలు దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. దీనిని డయాబెటిక్ న్యూరోపతి అంటారు. ప్రారంభ లక్షణాల్లో కాళ్లలో తిమ్మిర్లు, మంట, నొప్పి ఉంటాయి.

నరాలపై ఒత్తిడి

వెన్నెముకలో డిస్క్ సమస్యలు, సయాటికా (Sciatica) వంటి పరిస్థితుల్లో నరాలపై ఒత్తిడి పెరిగి కాళ్లలో తిమ్మిర్లు, నొప్పి రావచ్చు.

రక్త ప్రసరణ సరిగా లేకపోవడం

శరీరంలోని కొన్ని భాగాలకు తగినంత రక్తప్రసరణ జరగకపోతే తిమ్మిర్లు, చల్లదనం లేదా మొద్దుబారిన భావన కలగవచ్చు.

ఎక్కువసేపు ఒకే భంగిమలో ఉండటం

గంటల తరబడి కూర్చోవడం లేదా కాళ్లు మడిచి కూర్చోవడం వల్ల నరాలపై తాత్కాలికంగా ఒత్తిడి ఏర్పడి తిమ్మిర్లు రావచ్చు.

ఎలక్ట్రోలైట్ అసమతుల్యత

శరీరంలో పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం వంటి ఖనిజాల లోపం ఉంటే.. నరాలు, కండరాల పనితీరును ప్రభావితం చేసి తిమ్మిర్లకు కారణమవుతుంది.

థైరాయిడ్ సమస్యలు

హైపోథైరాయిడిజం ఉన్నవారిలో నరాల పనితీరు మందగించి చేతులు, కాళ్లలో తిమ్మిర్లు కనిపించే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు.

పరిశోధనలు ఏమంటున్నాయంటే..

వైద్య పరిశోధనల ప్రకారం.. కాళ్లలో తరచూ తిమ్మిర్లు రావడం అనేది ఎక్కువగా నరాల సంబంధిత సమస్యలకు సంకేతంగా చెప్తున్నారు. ముఖ్యంగా డయాబెటిస్, విటమిన్ B12 లోపం, నరాల దెబ్బతినడం వంటి పరిస్థితులు ఉన్నవారిలో ఈ లక్షణం ఎక్కువగా కనిపిస్తుందని అధ్యయనాలు సూచిస్తున్నాయి. అలాగే ఎక్కువసేపు కూర్చునే జీవనశైలి కూడా ఈ సమస్యను పెంచుతుందని చెప్తున్నాయి.

తీసుకోవాల్సిన జాగ్రత్తలు

మీరు ఈ లక్షణాలు గుర్తిస్తే ముందుగా వైద్య పరీక్షలు చేయించుకోవాలి. అలాగే వైద్యుల సూచనలతో విటమిన్ B12, ఐరన్, మెగ్నీషియం అధికంగా ఉండే ఫుడ్స్, సప్లిమెంట్స్ డైట్లో చేర్చుకోవాలి. డయాబెటిస్ ఉంటే రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుకోవాలి. అలాగే ఎక్కువసేపు ఒకే భంగిమలో కూర్చోకూడదని నిపుణులు సూచిస్తున్నారు. అలాగే రోజూ కనీసం 30 నిమిషాలు నడక లేదా వ్యాయామం చేయాలని.. తగినంత నీరు తాగాలని చెప్తున్నారు. మద్యం, ధూమపానం మానేయాలని అంటున్నారు.

వైద్య సహాయం ఎప్పుడు తీసుకోవాలి?

కాళ్లలో తిమ్మిర్లతో పాటు బలహీనత, నడవడంలో ఇబ్బంది, తీవ్రమైన నొప్పి, మూత్రం లేదా మల విసర్జనపై నియంత్రణ కోల్పోవడం వంటి లక్షణాలు ఉంటే వెంటనే వైద్య సహాయం తీసుకోవాలి. ఇవి తీవ్రమైన నరాల లేదా వెన్నెముక సమస్యలకు సంకేతం కావచ్చు.

అప్పుడప్పుడు వచ్చే కాళ్ల తిమ్మిర్లు సాధారణమే అయినప్పటికీ.. తరచూ వస్తుంటే వాటిని చిన్న సమస్యగా తీసుకోకూడదు. అది శరీరం పంపే హెచ్చరిక సంకేతంగా భావించి కారణాన్ని గుర్తించడం, అవసరమైతే వైద్య పరీక్షలు చేయించుకోవడం చాలా ముఖ్యం. సరైన జీవనశైలి, పోషకాహారం, వ్యాయామంతో చాలా సందర్భాల్లో ఈ సమస్యను నియంత్రించవచ్చు.

మరిన్ని ఇంట్రెస్టింగ్ హెల్త్ ఆర్టికల్స్, ఇంటి చిట్కాల కోసం దీనిని క్లిక్ చేయండి.

గమనిక : ఈ కథనంలో అందించిన సమాచారం నిపుణులు పంచుకున్నారు. ఇది సాధారణ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది. వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే, ఎల్లప్పుడూ మీ వైద్యుడు లేదా ఇతర అర్హత కలిగిన ఆరోగ్య సంరక్షణ ప్రదాత సలహా తీసుకోండి.

 

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ మూడేళ్లు పనిచేశారు. తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో సంవత్సరం పాటు సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్​గా పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశంలో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ ఇస్తున్నారు.

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AI Intimacy Survey: లైంగిక ఆరోగ్య సమాచారం కోసం AIని వాడేస్తున్న వైజాగ్‌ వాసులు! దేశంలోనే బెంగుళూరు తర్వాత రెండో స్థానం!
లైంగిక ఆరోగ్య సమాచారం కోసం AIని వాడేస్తున్న వైజాగ్‌ వాసులు! దేశంలోనే బెంగుళూరు తర్వాత రెండో స్థానం!
Easy Breakfast Recipes: సింపుల్‌గా పది నిమిషాల్లో బ్యాచిలర్స్‌ చేసుకునే టిఫిన్స్‌ రెసిపీ లిస్ట్ ఇదే!
సింపుల్‌గా పది నిమిషాల్లో బ్యాచిలర్స్‌ చేసుకునే టిఫిన్స్‌ రెసిపీ లిస్ట్ ఇదే!
Indoor Pure Air Tips: ఇంట్లో గాలి ఫ్రెష్‌గా మార్చేసే మొక్కలు ఇవే! 5 ఇండోర్ ప్లాంట్స్‌తో అందం ఆక్సిజన్!
ఇంట్లో గాలి ఫ్రెష్‌గా మార్చేసే మొక్కలు ఇవే! 5 ఇండోర్ ప్లాంట్స్‌తో అందం ఆక్సిజన్!
Roti Pizza Recipe: మిగిలిపోయిన రొట్టెను పారేయొద్దు! 5 నిమిషాల్లో పిజ్జాను తయారు చేసుకోవచ్చు! 
మిగిలిపోయిన రొట్టెను పారేయొద్దు! 5 నిమిషాల్లో పిజ్జాను తయారు చేసుకోవచ్చు! 
Advertisement

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Shabad Mass Murder Case: షాబాద్‌ ఆరు హత్యల కేసులో కీలక పరిణామం.. రాజ్‌కుమార్ మృతిపై కేసు నమోదు
షాబాద్‌ ఆరు హత్యల కేసులో కీలక పరిణామం.. రాజ్‌కుమార్ మృతిపై కేసు నమోదు
1st Hydrogen Train: భారత్‌లో తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ.. దీని ప్రత్యేకతలు ఇవే
భారత్‌లో తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ.. దీని ప్రత్యేకతలు ఇవే
RBI Plastic Currency: ప్లాస్టిక్ కరెన్సీపై ఆర్బీఐ కీలక ప్రకటన! 10, 20 రూపాయల నోట్లతోనే మొదలెడుతున్నట్టు వెల్లడి!
ప్లాస్టిక్ కరెన్సీపై ఆర్బీఐ కీలక ప్రకటన! 10, 20 రూపాయల నోట్లతోనే మొదలెడుతున్నట్టు వెల్లడి!
Janasena Politics: స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పొత్తులు వర్తించవు, జనసేన సత్తా చాటుతాం: నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు
స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పొత్తులు వర్తించవు, జనసేన సత్తా చాటుతాం: నాదెండ్ల మనోహర్
US Airstrikes On Iran: ఇరాన్‌పై అమెరికా భీకర దాడులు.. రైల్వే స్టేషన్లు, ఎయిర్‌పోర్టులపై మిస్సైల్ దాడులు.. నిలిచిన విద్యుత్ సరఫరా
ఇరాన్‌పై అమెరికా భీకర దాడులు.. రైల్వే స్టేషన్లు, ఎయిర్‌పోర్టులపై మిస్సైల్ దాడులు.. నిలిచిన విద్యుత్ సరఫరా
AP Corona Deaths: ఏపీలో 12 మందికి కరోనా పాజిటివ్.. నలుగురు మృతితో కలకలం, మళ్లీ టెన్షన్ టెన్షన్
ఏపీలో 12 మందికి కరోనా పాజిటివ్.. నలుగురు మృతితో కలకలం, మళ్లీ టెన్షన్ టెన్షన్
Telangana Congress Crisis: తెలంగాణ కాంగ్రెస్‌లో ముదురుతున్న సమన్వయ లోపం - వరుసగా వివాదాలు.. పీసీసీ మార్పు తప్పదా?
తెలంగాణ కాంగ్రెస్‌లో ముదురుతున్న సమన్వయ లోపం - వరుసగా వివాదాలు.. పీసీసీ మార్పు తప్పదా?
Breaking News: కేదార్‌నాథ్‌లో విరిగిపడ్డ కొండచరియలు.. రాకపోకలకు అంతరాయం
కేదార్‌నాథ్‌లో విరిగిపడ్డ కొండచరియలు.. రాకపోకలకు అంతరాయం
Embed widget