అన్వేషించండి

Independence Day 2024 : 78వ స్వాతంత్య్ర దినోత్సవం.. దేశ అభివృద్ధే లక్ష్యంగా ఈ ఏడాది థీమ్.. చరిత్ర, ప్రాముఖ్యతలు ఇవే

78th Independence Day : ప్రతి సంవత్సరం ఇండియాలో ఆగస్టు 15వ తేదిన స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకుంటాము. ఈ స్పెషల్​ డే థీమ్, చరిత్ర గురించి ఓ లుక్కేద్దాం. 

Independence Day 2024 Theme : రెండు శతాబ్ధాల పాటు కొనసాగిన బ్రిటీష్ పాలన నుంచి విముక్తి పొందేందుకు భారతదేశంలో స్వాతంత్య్ర ఉద్యమాన్ని ప్రారంభించారు. ఈ పోరాటంలో గెలిచినందుకుగానూ.. ప్రతి సంవత్సరం ఆగస్టు 15వ తేదీన స్వాతంత్య్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము. ఆగస్టు 15, 2024తో దేశవ్యాప్తంగా మనం 78వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని నిర్వహించుకుంటున్నాము. మరి ఈ సంవత్సరం థీమ్ ఏంటి? ఈరోజు ఏమి చేస్తారు? స్వాతంత్య్ర దినోత్సవ చరిత్ర, ప్రాముఖ్యత ఏంటి వంటి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. 

స్వాతంత్య్ర దినోత్సవ థీమ్

ఆగస్టు 15 స్వాతంత్య్ర దినోత్సవాన్ని ప్రతి ఏడాది ఓ థీమ్​తో నిర్వహిస్తూ ఉంటారు. ఇండియాకు ఇండిపెండెన్స్​ డే వచ్చి 78వ సంవత్సరంలోకి అడుగుతుంది. ఈ సమయంలో ఈ స్పెషల్​ డే థీమ్​గా వీక్షిత్ భారత్​ని 2024కు గానూ థీమ్​గా ఎంచుకుంది. దీని ప్రకారం 2047 నాటికి దేశం అభివృద్ధి చెందిన దేశంగా మారాలనే ఆకాంక్షను ప్రతిబింబిస్తుంది. అప్పటికి భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చి 100 సంవత్సరాలు అవుతుంది. అందుకే ఆ సమయానికి భారతదేశాన్ని సంపన్నమైన, అభివృద్ధి చెందిన దేశంగా మార్చాలని ప్రభుత్వం ఈ థీమ్​ని ఎంచుకుంది. 

స్వాతంత్య్ర దినోత్సవ చరిత్ర ఇదే

భారతదేశంలో రెండు శతాబ్ధాల పాటు.. బ్రిటిష్ పాలన కొనసాగింది. ప్రజలను హింసిస్తూ.. పన్నులు భారం వేసి జాత్యాహంకారంతో బ్రిటిష్ వాళ్లు ఇండియాలో పాలన చేశారు. దీని నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో అది స్వాతంత్య్ర పోరాటానికి దారి తీసింది. 1857 తిరుగుబాటుతో ఈ స్వాతంత్య్ర పోరాటం తీవ్రరూపం దాల్చింది. ఈ సిపాయిల తిరుగుబాటు బ్రిటీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ పునాదినీ కదిలించింది. భారత పరిపాలనలో బ్రిటీష్ వారి అసమర్థతను ఇది బహిర్గతం చేసింది.

అనంతరం 1920ల్లో మహాత్మా గాంధీ నాయకత్వంలో ఈ తిరుగుబాటు ఊపందుకుంది. భారత స్వాతంత్య్ర బిల్లును బ్రిటీష్ హౌస్ ఆఫ్ కామన్స్ జూలై 4, 1947న ప్రవేశపెట్టింది. అంతిమంగా ఇది ఆగస్టు 15, 1947న భారతదేశానికి స్వాతంత్య్రాన్ని తెచ్చిపెట్టింది. బ్రిటిష్ పాలన నుంచి భారత్ విముక్తి పొందిన జ్ఞాపకార్థంగా ఈ స్పెషల్​ డేని ఏటా జరుపుకుంటాము. 

స్వాతంత్య్ర దినోత్సవ ప్రాముఖ్యత

దేశవిముక్తి కోసం ప్రాణాలు అర్పించిన ఎందరో స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలను గుర్తుచేసుకుంటూ ఇండిపెండెన్స్ డేని నిర్వహిస్తున్నారు. ఎందరో సమరయోధులు సేవలు, త్యాగాలను గుర్తిస్తూ.. వారిని గౌరవించడం ఆనవాయితీగా వస్తుంది. దీనివల్ల ముందుతరం వారికి స్వాతంత్య్ర ప్రాముఖ్యత తెలుస్తుంది. అందుకే ఈ రోజును దేశవ్యాప్తంగా జాతీయ సెలవుదినంగా పాటిస్తారు. 

Also Read : ఆగస్టు 15ని 90's కిడ్స్ ఎలా జరుపుకునేవారో తెలుసా? అలెక్సా ప్లీజ్ ప్లే ఆ రోజులు.. మళ్లీరావు..

స్వాతంత్య్రం వచ్చిన సందర్భంగా దేశ మొదటి ప్రధానమంత్రిగా ఎన్నికైన జవహర్​లాల్ నెహ్రూ ట్రైస్ట్ విత్ డెస్టినీ అంటూ తన ఐకానిక్ ప్రసంగాన్ని అందించి.. ఢిల్లీలోని ఎర్రకోటపై భారతీయ జెండాను ఎగురవేశారు. ఇది భారతదేశ చరిత్రలో కొత్త అధ్యయాన్ని సూచిస్తుంది. ఈ సంప్రదాయాన్ని ప్రతి ప్రధానమంత్రి స్వాతంత్య్ర దినోత్సవం నాడు కొనసాగిస్తున్నారు. ఢిల్లీలోని ఎర్రకోట లాహోరీ గేట్​పై జెండాను ఎగురవేసి.. జాతీకి తమ ప్రసంగాన్ని అందిస్తారు. 

ఎలా జరుపుకుంటామంటే.. 

స్వాతంత్య్ర దినోత్సవం రోజున.. స్కూల్స్, ప్రభుత్వ కార్యాలయాలు, పలు ఆఫీస్​లలో జాతీయ జెండాను ఎగురవేస్తారు. కవాతులు, సాంస్కృతిక కార్యక్రమాలు, దేశభక్తి గీతాలు పాడటం చేస్తారు. పోరాటయోధులు, స్వాతంత్య్రం గురించిన ప్రసంగాలు అందిస్తారు. స్వాతంత్య్ర సమరయోధులకు నివాళులు అర్పిస్తారు. అంతేకాకుండా ఢిల్లీలోని ఎర్రకోట నుంచి ప్రధానమంత్రి జాతిని ఉద్దేశించి ప్రసంగం అందిస్తారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మూడవసారి తన ప్రసంగాన్ని అందించనున్నారు. దేశ పురోగతిని, అభివృద్ధిని.. ఈ స్వాతంత్య్రాన్ని మనకి తెచ్చి పెట్టి పోరాటయోధులను స్మరించుకుంటూ.. స్వాతంత్య్ర దినోత్సవాన్ని జరుపుకుంటాము. 

Also Read : స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు 2024.. వాట్సాప్, ఫేస్​బుక్​, ఇన్​స్టాలో షేర్ చేసుకునేందుకు బెస్ట్ కోట్స్ ఇవే

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Balineni Srinivasa Reddy : నేడు పవన్‌తో భేటీకానున్న బాలినేనికి వైసీపీకి గ్యాప్ ఎందుకొచ్చింది?
నేడు పవన్‌తో భేటీకానున్న బాలినేనికి వైసీపీకి గ్యాప్ ఎందుకొచ్చింది?
Jani Master: పరారీలో జానీ మాస్టర్‌ - ఎక్కడున్నాడో పట్టేసిన పోలీసులు - ఏ క్షణమైనా అరెస్టు!
పరారీలో జానీ మాస్టర్‌ - ఎక్కడున్నాడో పట్టేసిన పోలీసులు - ఏ క్షణమైనా అరెస్టు!
YSRCP : పార్టీకి పిల్లర్ల లాంటి వాళ్లను కాపాడుకోలేకపోతున్న  జగన్ - వదులుకుంటున్నారా ? వదిలేస్తున్నారా ?
పార్టీకి పిల్లర్ల లాంటి వాళ్లను కాపాడుకోలేకపోతున్న జగన్ - వదులుకుంటున్నారా ? వదిలేస్తున్నారా ?
Telangana News: వైద్యారోగ్యశాఖలో 2050 స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల- దరఖాస్తు, ఎంపిక వివరాలు ఇలా
వైద్యారోగ్యశాఖలో 2050 స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల- దరఖాస్తు, ఎంపిక వివరాలు ఇలా
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

One Nation One Election | జమిలి ఎన్నికలంటే ఏంటి | ABP Desamమోదీని త్వరలోనే కలుస్తా, అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలుఏపీలో బడి పంతులమ్మ, ఇప్పుడు ఢిల్లీ సీఎం - అతిషి గురించి ఈ ఆసక్తికర విషయాలు తెలుసా?రాహుల్‌ ఓ టెర్రరిస్ట్ అంటూ కేంద్రమంత్రి సంచలన వ్యాఖ్యలు, కాంగ్రెస్ ఆందోళనలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Balineni Srinivasa Reddy : నేడు పవన్‌తో భేటీకానున్న బాలినేనికి వైసీపీకి గ్యాప్ ఎందుకొచ్చింది?
నేడు పవన్‌తో భేటీకానున్న బాలినేనికి వైసీపీకి గ్యాప్ ఎందుకొచ్చింది?
Jani Master: పరారీలో జానీ మాస్టర్‌ - ఎక్కడున్నాడో పట్టేసిన పోలీసులు - ఏ క్షణమైనా అరెస్టు!
పరారీలో జానీ మాస్టర్‌ - ఎక్కడున్నాడో పట్టేసిన పోలీసులు - ఏ క్షణమైనా అరెస్టు!
YSRCP : పార్టీకి పిల్లర్ల లాంటి వాళ్లను కాపాడుకోలేకపోతున్న  జగన్ - వదులుకుంటున్నారా ? వదిలేస్తున్నారా ?
పార్టీకి పిల్లర్ల లాంటి వాళ్లను కాపాడుకోలేకపోతున్న జగన్ - వదులుకుంటున్నారా ? వదిలేస్తున్నారా ?
Telangana News: వైద్యారోగ్యశాఖలో 2050 స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల- దరఖాస్తు, ఎంపిక వివరాలు ఇలా
వైద్యారోగ్యశాఖలో 2050 స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల- దరఖాస్తు, ఎంపిక వివరాలు ఇలా
US Fed Rates Cut: అమెరికాలో వడ్డీ రేట్ల కోత, నాలుగేళ్ల తర్వాత చారిత్రాత్మక నిర్ణయం, ఇప్పుడు RBI ఏం చేస్తుంది?
అమెరికాలో వడ్డీ రేట్ల కోత, నాలుగేళ్ల తర్వాత చారిత్రాత్మక నిర్ణయం, ఇప్పుడు RBI ఏం చేస్తుంది?
Bhogapuram Airport : వాయువేగంతో రెడీ అవుతున్న అల్లూరి సీతారామరాజు ఎయిర్ పోర్టు - బోగాపురం మరో శంషాబాద్ కానుందా ?
వాయువేగంతో రెడీ అవుతున్న అల్లూరి సీతారామరాజు ఎయిర్ పోర్టు - బోగాపురం మరో శంషాబాద్ కానుందా ?
Hyderabad Metro: హైదరాబాద్‌ మెట్రో కీలక ప్రకటన- తమ ఎక్స్‌ హ్యాండిల్‌లో లింక్స్ క్లిక్ చేయొద్దని సూచన
హైదరాబాద్‌ మెట్రో కీలక ప్రకటన- తమ ఎక్స్‌ హ్యాండిల్‌లో లింక్స్ క్లిక్ చేయొద్దని సూచన
KTR: 'కేసీఆర్ చరిత్ర చెరిపేస్తే చెరిగిపోయేది కాదు' - ఎంఎస్ఎంఈలపై కాంగ్రెస్ ప్రభుత్వ లెక్కలే నిదర్శనమన్న కేటీఆర్
'కేసీఆర్ చరిత్ర చెరిపేస్తే చెరిగిపోయేది కాదు' - ఎంఎస్ఎంఈలపై కాంగ్రెస్ ప్రభుత్వ లెక్కలే నిదర్శనమన్న కేటీఆర్
Embed widget