అన్వేషించండి

Independence Day 2024 : 78వ స్వాతంత్య్ర దినోత్సవం.. దేశ అభివృద్ధే లక్ష్యంగా ఈ ఏడాది థీమ్.. చరిత్ర, ప్రాముఖ్యతలు ఇవే

78th Independence Day : ప్రతి సంవత్సరం ఇండియాలో ఆగస్టు 15వ తేదిన స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకుంటాము. ఈ స్పెషల్​ డే థీమ్, చరిత్ర గురించి ఓ లుక్కేద్దాం. 

Independence Day 2024 Theme : రెండు శతాబ్ధాల పాటు కొనసాగిన బ్రిటీష్ పాలన నుంచి విముక్తి పొందేందుకు భారతదేశంలో స్వాతంత్య్ర ఉద్యమాన్ని ప్రారంభించారు. ఈ పోరాటంలో గెలిచినందుకుగానూ.. ప్రతి సంవత్సరం ఆగస్టు 15వ తేదీన స్వాతంత్య్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము. ఆగస్టు 15, 2024తో దేశవ్యాప్తంగా మనం 78వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని నిర్వహించుకుంటున్నాము. మరి ఈ సంవత్సరం థీమ్ ఏంటి? ఈరోజు ఏమి చేస్తారు? స్వాతంత్య్ర దినోత్సవ చరిత్ర, ప్రాముఖ్యత ఏంటి వంటి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. 

స్వాతంత్య్ర దినోత్సవ థీమ్

ఆగస్టు 15 స్వాతంత్య్ర దినోత్సవాన్ని ప్రతి ఏడాది ఓ థీమ్​తో నిర్వహిస్తూ ఉంటారు. ఇండియాకు ఇండిపెండెన్స్​ డే వచ్చి 78వ సంవత్సరంలోకి అడుగుతుంది. ఈ సమయంలో ఈ స్పెషల్​ డే థీమ్​గా వీక్షిత్ భారత్​ని 2024కు గానూ థీమ్​గా ఎంచుకుంది. దీని ప్రకారం 2047 నాటికి దేశం అభివృద్ధి చెందిన దేశంగా మారాలనే ఆకాంక్షను ప్రతిబింబిస్తుంది. అప్పటికి భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చి 100 సంవత్సరాలు అవుతుంది. అందుకే ఆ సమయానికి భారతదేశాన్ని సంపన్నమైన, అభివృద్ధి చెందిన దేశంగా మార్చాలని ప్రభుత్వం ఈ థీమ్​ని ఎంచుకుంది. 

స్వాతంత్య్ర దినోత్సవ చరిత్ర ఇదే

భారతదేశంలో రెండు శతాబ్ధాల పాటు.. బ్రిటిష్ పాలన కొనసాగింది. ప్రజలను హింసిస్తూ.. పన్నులు భారం వేసి జాత్యాహంకారంతో బ్రిటిష్ వాళ్లు ఇండియాలో పాలన చేశారు. దీని నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో అది స్వాతంత్య్ర పోరాటానికి దారి తీసింది. 1857 తిరుగుబాటుతో ఈ స్వాతంత్య్ర పోరాటం తీవ్రరూపం దాల్చింది. ఈ సిపాయిల తిరుగుబాటు బ్రిటీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ పునాదినీ కదిలించింది. భారత పరిపాలనలో బ్రిటీష్ వారి అసమర్థతను ఇది బహిర్గతం చేసింది.

అనంతరం 1920ల్లో మహాత్మా గాంధీ నాయకత్వంలో ఈ తిరుగుబాటు ఊపందుకుంది. భారత స్వాతంత్య్ర బిల్లును బ్రిటీష్ హౌస్ ఆఫ్ కామన్స్ జూలై 4, 1947న ప్రవేశపెట్టింది. అంతిమంగా ఇది ఆగస్టు 15, 1947న భారతదేశానికి స్వాతంత్య్రాన్ని తెచ్చిపెట్టింది. బ్రిటిష్ పాలన నుంచి భారత్ విముక్తి పొందిన జ్ఞాపకార్థంగా ఈ స్పెషల్​ డేని ఏటా జరుపుకుంటాము. 

స్వాతంత్య్ర దినోత్సవ ప్రాముఖ్యత

దేశవిముక్తి కోసం ప్రాణాలు అర్పించిన ఎందరో స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలను గుర్తుచేసుకుంటూ ఇండిపెండెన్స్ డేని నిర్వహిస్తున్నారు. ఎందరో సమరయోధులు సేవలు, త్యాగాలను గుర్తిస్తూ.. వారిని గౌరవించడం ఆనవాయితీగా వస్తుంది. దీనివల్ల ముందుతరం వారికి స్వాతంత్య్ర ప్రాముఖ్యత తెలుస్తుంది. అందుకే ఈ రోజును దేశవ్యాప్తంగా జాతీయ సెలవుదినంగా పాటిస్తారు. 

Also Read : ఆగస్టు 15ని 90's కిడ్స్ ఎలా జరుపుకునేవారో తెలుసా? అలెక్సా ప్లీజ్ ప్లే ఆ రోజులు.. మళ్లీరావు..

స్వాతంత్య్రం వచ్చిన సందర్భంగా దేశ మొదటి ప్రధానమంత్రిగా ఎన్నికైన జవహర్​లాల్ నెహ్రూ ట్రైస్ట్ విత్ డెస్టినీ అంటూ తన ఐకానిక్ ప్రసంగాన్ని అందించి.. ఢిల్లీలోని ఎర్రకోటపై భారతీయ జెండాను ఎగురవేశారు. ఇది భారతదేశ చరిత్రలో కొత్త అధ్యయాన్ని సూచిస్తుంది. ఈ సంప్రదాయాన్ని ప్రతి ప్రధానమంత్రి స్వాతంత్య్ర దినోత్సవం నాడు కొనసాగిస్తున్నారు. ఢిల్లీలోని ఎర్రకోట లాహోరీ గేట్​పై జెండాను ఎగురవేసి.. జాతీకి తమ ప్రసంగాన్ని అందిస్తారు. 

ఎలా జరుపుకుంటామంటే.. 

స్వాతంత్య్ర దినోత్సవం రోజున.. స్కూల్స్, ప్రభుత్వ కార్యాలయాలు, పలు ఆఫీస్​లలో జాతీయ జెండాను ఎగురవేస్తారు. కవాతులు, సాంస్కృతిక కార్యక్రమాలు, దేశభక్తి గీతాలు పాడటం చేస్తారు. పోరాటయోధులు, స్వాతంత్య్రం గురించిన ప్రసంగాలు అందిస్తారు. స్వాతంత్య్ర సమరయోధులకు నివాళులు అర్పిస్తారు. అంతేకాకుండా ఢిల్లీలోని ఎర్రకోట నుంచి ప్రధానమంత్రి జాతిని ఉద్దేశించి ప్రసంగం అందిస్తారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మూడవసారి తన ప్రసంగాన్ని అందించనున్నారు. దేశ పురోగతిని, అభివృద్ధిని.. ఈ స్వాతంత్య్రాన్ని మనకి తెచ్చి పెట్టి పోరాటయోధులను స్మరించుకుంటూ.. స్వాతంత్య్ర దినోత్సవాన్ని జరుపుకుంటాము. 

Also Read : స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు 2024.. వాట్సాప్, ఫేస్​బుక్​, ఇన్​స్టాలో షేర్ చేసుకునేందుకు బెస్ట్ కోట్స్ ఇవే

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ మూడేళ్లు పనిచేశారు. తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో సంవత్సరం పాటు సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్​గా పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశంలో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ ఇస్తున్నారు.

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Nara Lokesh: ఏపీ ఆర్థిక రాజధాని విశాఖ - స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదు - తేల్చి చెప్పిన నారా లోకేష్
ఏపీ ఆర్థిక రాజధాని విశాఖ - స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదు - తేల్చి చెప్పిన నారా లోకేష్
Phone tapping case: ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం - సీఎం సోదరుడు కొండల్ రెడ్డికి సిట్ నోటీసులు
ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం - సీఎం సోదరుడు కొండల్ రెడ్డికి సిట్ నోటీసులు
Raja Saab Ticket Price: ప్రభాస్ 'ది రాజా సాబ్' ప్రీమియర్ టికెట్ వెయ్యి రూపాయలు! రెగ్యులర్ షోల టికెట్‌లను పెంచిన ఏపీప్రభుత్వం!
ప్రభాస్ 'ది రాజా సాబ్' ప్రీమియర్ టికెట్ వెయ్యి రూపాయలు! రెగ్యులర్ షోల టికెట్‌లను పెంచిన ఏపీప్రభుత్వం!
AP CM Chandrababu: ఏపీలో హైవేల నిర్మాణంలో 2 గిన్నిస్ రికార్డులు నమోదు: సీఎం చంద్రబాబు హర్షం
ఏపీలో హైవేల నిర్మాణంలో 2 గిన్నిస్ రికార్డులు నమోదు: సీఎం చంద్రబాబు హర్షం

వీడియోలు

Keslapur Nagoba Mesram Padayatra | హస్తలమడుగులో గంగమ్మకు మెస్రం వంశీయుల పూజలు | ABP Desam
Harbhajan Singh Warning To BCCI | బీసీసీఐకు హర్భజన్ వార్నింగ్
Shreyas Iyer Vijay Hazare Trophy | శ్రేయాస్ అయ్య‌ర్‌ రీఎంట్రీ సూపర్
Nita Ambani Prize Money to Blind Cricketers | వరల్డ్ కప్ విజేతలకు అంబానీ భారీ గిఫ్ట్
Shubman Gill Vijay Hazare Trophy | దేశవాళీ టోర్నీలో గిల్ వైఫల్యం!

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nara Lokesh: ఏపీ ఆర్థిక రాజధాని విశాఖ - స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదు - తేల్చి చెప్పిన నారా లోకేష్
ఏపీ ఆర్థిక రాజధాని విశాఖ - స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదు - తేల్చి చెప్పిన నారా లోకేష్
Phone tapping case: ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం - సీఎం సోదరుడు కొండల్ రెడ్డికి సిట్ నోటీసులు
ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం - సీఎం సోదరుడు కొండల్ రెడ్డికి సిట్ నోటీసులు
Raja Saab Ticket Price: ప్రభాస్ 'ది రాజా సాబ్' ప్రీమియర్ టికెట్ వెయ్యి రూపాయలు! రెగ్యులర్ షోల టికెట్‌లను పెంచిన ఏపీప్రభుత్వం!
ప్రభాస్ 'ది రాజా సాబ్' ప్రీమియర్ టికెట్ వెయ్యి రూపాయలు! రెగ్యులర్ షోల టికెట్‌లను పెంచిన ఏపీప్రభుత్వం!
AP CM Chandrababu: ఏపీలో హైవేల నిర్మాణంలో 2 గిన్నిస్ రికార్డులు నమోదు: సీఎం చంద్రబాబు హర్షం
ఏపీలో హైవేల నిర్మాణంలో 2 గిన్నిస్ రికార్డులు నమోదు: సీఎం చంద్రబాబు హర్షం
Avakai Amaravati Festival : పర్యాటకులను ఆహ్వానిస్తున్న విజయవాడలోని
పర్యాటకులను ఆహ్వానిస్తున్న విజయవాడలోని "అవకాయ్ -అమరావతి సంబరాలు", పాసులు ఎలా తీసుకోవాలి అంటే?
Jana Nayagan:విజయ్ చివరి సినిమా 'జన నాయగన్' విడుదల వాయిదా! అభిమానులకు షాక్ ఇచ్చిన నిర్మాణ సంస్థ!
విజయ్ చివరి సినిమా 'జన నాయగన్' విడుదల వాయిదా! అభిమానులకు షాక్ ఇచ్చిన నిర్మాణ సంస్థ!
​​US Student Visa :భారతీయ విద్యార్థులను టెన్షన్‌ పెడుతున్న ట్రంప్‌! ఇప్పుడు ఏం జరిగిందంటే?
భారతీయ విద్యార్థులను టెన్షన్‌ పెడుతున్న ట్రంప్‌! ఇప్పుడు ఏం జరిగిందంటే?
Asteroids: ఆస్టరాయిడ్స్ పై మైనింగ్‌కు పరిశోధనలు షురూ - అవతార్‌ కథను నిజం చేస్తారా?
ఆస్టరాయిడ్స్ పై మైనింగ్‌కు పరిశోధనలు షురూ - అవతార్‌ కథను నిజం చేస్తారా?
Embed widget