అన్వేషించండి

Dangerous Food Combinations : చేపలు తిన్నాక ఆ ఫుడ్​కి దూరంగా ఉండాలట.. అలాగే ఈ ఫుడ్ కాంబినేషన్స్ అస్సలు తినొద్దట, ఎందుకంటే

Toxic Food Pairings to Avoid : కొన్ని ఆహారపదార్థాలు కలిపి తినకూడదని చెప్తున్నారు నిపుణులు. అలా తినడం వల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయట. ఇంతకీ ఆ ఫుడ్ కాంబినేషన్స్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. 

Food Combinations to Avoid : ఫుడ్ లవర్స్, తినడాన్ని బాగా ఇష్టపడేవారు.. రకరకాల ఫుడ్ కాంబినేషన్స్​ని ట్రై చేస్తారు. కొన్ని సూపర్ సక్సెస్ అయితే.. మరికొన్ని అట్టర్​ఫ్లాప్ అవుతాయి. అలాగే కొన్ని పదార్థాలు కలిపి తిన్నా ఎలాంటి ఇబ్బంది ఉండదు. కొన్ని కాంబినేషన్స్ మాత్రం ఆరోగ్యానికి నష్టం కలిగిస్తాయి. అలాంటి వాటిలో కలిపి తినకూడని ఫుడ్స్ కొన్ని ఉన్నాయి. అవేంటి? వాటిని తింటే కలిగే నష్టాలు ఏంటి? ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోవాలో తెలుసుకుందాం. 

చేపలు తిన్నాక.. 

చేపలు మంచి రుచితో పాటు ఆరోగ్య ప్రయోజనాలు అందిస్తాయి. అలాగే పాలు కూడా ఆరోగ్యానికి చాలామంచిది. కానీ చేపలు తిన్నాక పాలు తాగకూడదట. ఎందుకంటే చేపలు, పాలల్లో ప్రోటీన్స్ పుష్కలంగా ఉంటాయి. కాకపోతే విభిన్న లక్షణాలు కలిగి ఉంటాయి. చేపలు వేడినిస్తే.. పాలు చల్లదనాన్ని ఇస్తాయట. ఈ రెండూ కలిపి తీసుకున్నప్పుడు జీర్ణ సమస్యలు వస్తాయి. శరీరంలో టాక్సిన్లు ఏర్పడతాయి. మరికొందరిలో అలెర్జీలు, చర్మసమస్యలు వస్తాయట. గట్ హెల్త్​పై ప్రభావం చూపి జీర్ణ సమస్యలను పెంచుతుందట. 

పండ్లు తిన్నాక.. 

పాలు, పండ్లు డెడ్లీ కాంబినేషన్ అనిపిస్తుంది. అందుకే వీటితో జ్యూస్​ లాంటివి చేసుకుంటారు. కానీ కొన్నిరకాల పండ్లు తిన్నప్పుడు పాలు అస్సలు తాగకూడదట. నారింజ, పైనాపిల్స్, కివీలు వంటి ఎసిడిక్, సిట్రస్ పండ్లు తిన్న సమయంలో పాలు తాగొద్దట. దీనివల్ల ఫుడ్ జీర్ణం కాకుండా ఇబ్బంది పెడుతుంది. అంతేకాకుండా గ్యాస్, ఉబ్బరం, కడుపులో అసౌకర్యం ఏర్పడుతుంది. జీర్ణక్రియను నెమ్మదించేలా చేసి.. పోషకాల శోషణను అడ్డుకుంటుందని నిపుణులు చెప్తున్నారు.

గుడ్లతో.. 

చాలామంది చికెన్, మటన్, రొయ్యలు వాటిలో గుడ్లు వేసుకుంటారు. చికెన్ బిర్యానీలో కూడా గుడ్డు తింటూ ఉంటారు. అయితే నిపుణుల ప్రకారం.. మీట్ తినేప్పుడు గుడ్డు తినకపోవడమే మంచిదట. ఎందుకంటే మీట్, గుడ్లలో ప్రోటీన్​ ఎక్కువగా ఉంటుంది. ప్రోటీన్​ను ఎక్కువ మోతాదులో తీసుకుంటే జీర్ణ వ్యవస్థ దెబ్బతింటుంది. కడుపు ఉబ్బరం, అలసట, జీర్ణ సమస్యలు పెరుగుతాయి. అలాగే తిన్నది అరగడానికి కూడా ఎక్కువ సమయం పడుతుంది. పోషకాలను శరీరానికి అందకుండా చేసి.. తీసుకున్న ఆహారాన్ని టాక్సిన్లుగా మారుస్తుందట. 

భోజనం తిన్నాక.. 

మధ్యాహ్నం లేదా రాత్రి భోజనం చేసేప్పుడు కాంబినేషన్​గా ఫ్రూట్స్ తీసుకోకూడదట. దానికంటే వెజిటెబుల్స్ ఉడికించుకొని తినడం మంచి ఆప్షన్​గా చెప్తున్నారు. అలాగే పండ్లు వేగంగా జీర్ణమవుతాయి కానీ.. భోజనంతో కలిపి తింటే.. లేట్​గా జీర్ణమవుతాయి. దీనివల్ల కడుపులోనే పులిసిపోయే.. గ్యాస్, ఉబ్బరం, అసౌకర్యాన్ని కలిగిస్తాయి. అలాగే పండ్లలోని పోషకాలు కూడా శరీరానికి అందవని చెప్తున్నారు నిపుణులు. 

కూల్ డ్రింక్స్​తో 

కొందరు స్నాక్స్​ని, కూల్​ డ్రింక్స్​తో కలిపి తీసుకుంటారు. అయితే చీజ్ ఎక్కువగా ఉండే ఫుడ్ తినేప్పుడు కూల్ డ్రింక్స్ తాగకపోవడమే మంచిదట. చీజ్​లో కొవ్వు ఎక్కువగా ఉంటుంది. చల్లని, కార్బోనేటెడ్ పానీయాలతో కలిపి తీసుకుంటే జీర్ణక్రియపై నెగిటివ్ ఎఫెక్ట్ ఉంటుంది. దీనివల్ల కొవ్వులు టాక్సిన్లుగా మారతాయి. కడుపు ఉబ్బరం, అసౌకర్యం ఏర్పడుతుంది. 

బంగాళదుంపలను చికెన్​తో వద్దు..

ఆలులో పిండి పదార్థాలు ఎక్కువగా ఉంటాయి. అందుకే దీనిని చికెన్​ లేదా మటన్​తో కలిపి తీసుకోకూడదట. అంటే ప్రోటీన్​ ఎక్కువగా ఉండే ఫుడ్​తో కలిపి తినకూడదట. బంగాళదుంపలకు ఆల్కలీన్.. ప్రోటీన్లకు ఆమ్లాలు ఉండాలి. కాబట్టి వీటిని కలిపి తింటే జీర్ణక్రియ నెమ్మదిస్తుంది. గ్యాస్, ఉబ్బరం సమస్యలు వస్తాయి. బరువు కూడా పెరుగుతారు. ఇది మొత్తం జీవక్రియను డిస్టర్బ్ చేస్తుంది. కాబట్టి ఫ్రెంచ్ ఫ్రైస్, చికెన్​ను కలిపి తినేవారు ఓసారి ఆలోచించుకోవాలి అంటున్నారు. 

ఈ ఫుడ్ కాంబినేషన్సే కాకుండా చేపలు, పెరుగు కలిపి తినొద్దని చెప్తున్నారు. తెలియకుండా చేసే చిన్న చిన్న మిస్టేక్​లు పూర్తి ఆరోగ్యంపై ప్రభావం చూపే అవకాశముంది కాబట్టి.. మీరు ఈ ఫుడ్స్ తినేప్పుడు జాగ్రత్తగా ఉండాలి. అలాగే మీకు ఏ ఫుడ్స్ అలెర్జీనిస్తాయో వాటికి దూరంగా ఉండాలి అంటున్నారు. డైటీషియన్​తో మీరు మీ ఫుడ్ చార్ట్​ని ప్రిపేర్ చేయించుకుని హెల్తీగా తినొచ్చు. 

Also Read : మహిళల్లో పొట్ట పెరగడానికి కారణాలివే.. ఫ్లాట్ బెల్లీ కోసం ఈ డ్రింక్స్ తాగేయండి

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ మూడేళ్లు పనిచేశారు. తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో సంవత్సరం పాటు సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్​గా పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశంలో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ ఇస్తున్నారు.

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Post-Festival Health Guide : హోలీ తర్వాత ఉబ్బరం, షుగర్ క్రేవింగ్స్ ఉన్నాయా? ఈ టిప్స్​తో శరీరాన్ని రీసెట్ చేసుకోండి
హోలీ తర్వాత ఉబ్బరం, షుగర్ క్రేవింగ్స్ ఉన్నాయా? ఈ టిప్స్​తో శరీరాన్ని రీసెట్ చేసుకోండి
Heaviest Baby Born : 5.9 కిలోల ‘సూపర్ బేబీ’.. ఆసుపత్రిలో పుట్టిన వెంటనే రికార్డు, ఫోటోలు చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే
5.9 కిలోల ‘సూపర్ బేబీ’.. ఆసుపత్రిలో పుట్టిన వెంటనే రికార్డు, ఫోటోలు చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే
AI for Income : AIతో నెలకు లక్షల్లో సంపాదించవచ్చు.. ఇలా వాడితే డబ్బే డబ్బు
AIతో నెలకు లక్షల్లో సంపాదించవచ్చు.. ఇలా వాడితే డబ్బే డబ్బు
Holi 2026 : హోలీ ఆడక ముందు, ఆడిన తర్వాత ఈ టిప్స్ ఫాలో అవ్వండి.. రంగులు సులభంగా వదిలిపోతాయి, స్కిన్ డ్యామేజ్ కాదు
హోలీ ఆడక ముందు, ఆడిన తర్వాత ఈ టిప్స్ ఫాలో అవ్వండి.. రంగులు సులభంగా వదిలిపోతాయి, స్కిన్ డ్యామేజ్ కాదు

వీడియోలు

Sanju Samson 97 vs West Indies T20 World Cup | సంజూ శాంసన్ పరుగుల సునామీ
Sanju Emotional Speech After 97 vs West Indies | సంజూ శాంసన్ ఎమోషనల్ స్పీచ్
Ayatollah Ali Khamenei Death News | ఇరాన్ సుప్రీం లీడర్ మృతి
Sahibzada Farhan Breaks Virat Record | కోహ్లీ రికార్డు బద్ధలు కొట్టిన పాక్ ఓపెనర్
India vs West Indies Preview T20 World Cup | టీమిండియాకు వెస్టిండీస్‌తో సెమీస్ ఫైట్|

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Guntur Mirchi: ఆనంద్ మహింద్రాను కదిలించిన గుంటూరు మిర్చి వీడియో - లోకేష్‌కు సలహా - ఇలా చేస్తే అదుర్స్ !
ఆనంద్ మహింద్రాను కదిలించిన గుంటూరు మిర్చి వీడియో - లోకేష్‌కు సలహా - ఇలా చేస్తే అదుర్స్ !
Kolikapudi controversy: చివరి హెచ్చరిక అయిపోయింది - కొలికపూడికి తేల్చి చెప్పిన పల్లా శ్రీనివాస్
చివరి హెచ్చరిక అయిపోయింది - కొలికపూడికి తేల్చి చెప్పిన పల్లా శ్రీనివాస్
YS Jagan: కల్తీ నెయ్యి, టీటీడీ ఛైర్మన్‌పై వైఎస్ జగన్ సంచలన ఆరోపణలు
కల్తీ నెయ్యి, టీటీడీ ఛైర్మన్‌పై వైఎస్ జగన్ సంచలన ఆరోపణలు
ఇరాన్‌-అమెరికా యుద్ధం: బ్యారెల్‌కు ఒక్క డాలర్‌ పెరిగినా ₹12,000 కోట్ల అదనపు భారం - మన పెట్రోల్‌ బడ్జెట్‌పై ప్రభావం ఎంత?
ఇరాన్‌-అమెరికా యుద్ధం: ఇండియాలో పెట్రోల్, డీజిల్‌ ధరలు పెరుగుతాయా? ఆటో ఇండస్ట్రీకి హెచ్చరిక సంకేతాలు
Andhra Pradesh Latest News: ఏపీ రాజకీయాల్లో మండలి సెగ; ఛైర్మన్‌ మోషేన్‌ రాజుపై అవిశ్వాసం పెట్టే యోచనలో వైసీపీ తిరుగుబాటు ఎమ్మెల్సీలు!
ఏపీ రాజకీయాల్లో మండలి సెగ; ఛైర్మన్‌ మోషేన్‌ రాజుపై అవిశ్వాసం పెట్టే యోచనలో వైసీపీ తిరుగుబాటు ఎమ్మెల్సీలు!
Balka Suman Released : ఆదిలాబాద్ జైలు నుంచి బాల్క సుమన్ విడుదల! భారీగా తరలి వచ్చిన బీఆర్‌ఎస్‌ శ్రేణులు 
ఆదిలాబాద్ జైలు నుంచి బాల్క సుమన్ విడుదల! భారీగా తరలి వచ్చిన బీఆర్‌ఎస్‌ శ్రేణులు 
US Shooting: అమెరికాలో ఇరాన్ జెండా టీ-షర్ట్ ధరించిన వ్యక్తి కాల్పులు! భారతీయ విద్యార్థి సహా ముగ్గురు మృతి!
అమెరికాలో ఇరాన్ జెండా టీ-షర్ట్ ధరించిన వ్యక్తి కాల్పులు! భారతీయ విద్యార్థి సహా ముగ్గురు మృతి!
Palamaner Latest News:తిరుమల వెళ్తుండగా తీరని విషాదం; పలమనేరు వద్ద ఘోర ప్రమాదం! ఐదుగురు బెంగళూరు వాసులు మృతి!
తిరుమల వెళ్తుండగా తీరని విషాదం; పలమనేరు వద్ద ఘోర ప్రమాదం! ఐదుగురు బెంగళూరు వాసులు మృతి!
Embed widget