అన్వేషించండి

Engineer’s Day: మూసీ వరదల నుంచి హైదరాబాద్ ను రక్షించిన మహనీయుడు... మోక్షగుండం విశ్వేశ్వరయ్య

భారత నీటిపారుదల వ్యవస్థకు ఒక రూపాన్ని ఇచ్చిన వ్యక్తి మోక్షగుండం విశ్వేశ్వరయ్య. ఆయన పుట్టినరోజైన సెప్టెంబర్ 15ను ‘ఇంజినీర్స్ డే’గా మన దేశంలో నిర్వహించుకుంటారు.

దాదాపు వందేళ్ల క్రితం... మూసీ నది ఉద్ధృతంగా ప్రవహించేది. 1908లో కురిసిన భారీ వర్షాలకు మూసీ ఉప్పొంగి... నివాస ప్రాంతాలపై విరుచుకుపడింది. ఆ వరదలకు వందల మంది ఇళ్లు లేక నిరాశ్రయులయ్యారు. అంతకుముందు కూడా మూసీ నది వరదలు వచ్చినా ఈ స్థాయిలో రాలేదు. మొదటిసారి మూసీ భాగ్యనగరాన్ని అతలాకుతలం చేసింది. దీంతో అప్పటి నవాబు ప్రత్యేకంగా మోక్షగుండం విశ్వేశ్వరయ్యను నగరానికి ఆహ్వానించారు. ఆయన సూచనల మేరకు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థను నిర్మించారు.అప్పట్నించి మూసీ నది వల్ల భాగ్య నగరం వరదలు రావడం తగ్గాయి. కేవలం ఇదొక్కటే కాదు దేశంలో ఎన్నో నగరాల మురుగునీటి పారుదల వ్యవస్థలకు ఆయన రూపకల్పన చేశారు. పలుడ్యామ్ ల నిర్మాణంలో పాలుపంచుకున్నారు. భారత నీటిపారుదల వ్యవస్థకు ఒక రూపాన్ని ఇచ్చిన వ్యక్తి మోక్షగుండం విశ్వేశ్వరయ్య. ఈయన పుట్టినరోజు సందర్భంగా సెప్టెంబర్ 15న ‘ఇంజినీర్స్ డే’గా వ్యవహరిస్తాం. 

శ్రీ మోక్షగుండం విశ్వేశ్వరయ్య 1861, సెప్టెంబర్ 15న కర్ణాటకలోని ముద్దనహళ్లిలో జన్మించారు. ఇతని తలిదండ్రులు  ప్రకాశం జిల్లా నుంచి అక్కడికి వలస వెళ్లారు. విశ్వేశ్వరయ్యకు పన్నేండేళ్ల వయసులోనే తండ్రి మరణించారు. కుటుంబ పరిస్థితులు సహకరించకపోయినా చదువును ఆపలేదు. 1881లో మద్రాసు విశ్వవిద్యాలయం నుండి బి.ఏ.,  పుణె సైన్సు కాలేజి నుండి సివిలు ఇంజనీరింగు పూర్తి చేశారు. 23 ఏళ్ల వయసులోనే బొంబాయిలో అసిస్టెంటు ఇంజినీరుగా చేరారు. తరువాత భారత నీటిపారుదల కమిషనులో పనిచేసే అవకాశం వచ్చింది. అప్పట్నించి అతని ధ్యేయం దేశంలో ఉన్నత నీటిపారుదల వ్యవస్థను ఏర్పాటు చేయడమే. 

ఆనకట్టకు ఎలాంటి ప్రమాదం లేకుండా నీటిని నిల్వచేసేందుకు ఆటోమేటిక్ గేట్ల వ్యవస్థకు శ్రీకారం చుట్టారు విశ్వేశ్వరయ్య. దీన్ని మొదటిసారి 1903లో పుణె దగ్గరి ఖడక్ వాస్లా ఆనకట్టపై ఈ వ్యవస్థను అమలుపరిచారు. విజయవంతం కావడంతో  గ్వాలియర్ దగ్గరున్న ఆనకట్ట, మైసూరులో గల కృష్ణరాజ సాగర్ ఆనకట్టలలోను దీనిని వాడారు. అంతేకాదు దేశంలోని పలు నగరాల్లోని మురుగు నీటి వ్యవస్థకు ప్రణాళికలు వేసి విజయం సాధించారు. ఆయన గురించి తెలిసి1906-1907 మధ్య కాలంలో భారత ప్రభుత్వం యెమెన్ కి పంపింది. అక్కడి నీటి పారుదల వ్యవస్థనూ, మురికి కాలువల వ్యవస్థను రూపకల్పన చేయమని కోరింది. అక్కడి ప్రాజెక్టులను విజయవంతం చేసి తిరిగి స్వదేశానికి వచ్చారు విశ్వేశ్వరయ్య. 

విశాఖపట్నం తీరంలో సాగరం ఉవ్వెత్తున ఎగిసిపడేది. విశాఖపట్నం రేవును సముద్రపు కోత నుంచి నివారించే వ్యవస్థను ఆయన రూపొందించారు. అంతేకాదు కోట్లాది భక్తులు శ్రీవెంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు ప్రయాణించే  తిరుమల తిరుపతి ఘాట్ రోడ్డు నిర్మాణానికి ప్రణాళిక రూపొందించింది కూడా ఆయనే. 1944లో తొలి విడత ఘాట్ రోడ్డును నిర్మించారు. ఈయన సేవలను గుర్తించి భారత ప్రభుత్వం ‘భారతరత్న’పురస్కారంతో సత్కరించింది. 1912 నుంచి 1918 వరకు మైసూర్ దివాన్‌గా పనిచేశారు  విశ్వేశ్వరయ్య. ఆ నగరాన్ని ఉత్తమ నగరంగా తీర్చి దిద్దారు. వందేళ్లకు పైగా జీవించిన ఈ మహనీయుడు 1962 ఏప్రిల్ 14న మరణించారు. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Andhra PPP Politics: మెడికల్ కాలేజీల పీపీపీ విధానంపై పాలిటిక్స్‌కు కేంద్రం చెక్ - వైసీపీ బీజేపీపైనా యుద్ధం ప్రకటించే ధైర్యం చేస్తుందా?
మెడికల్ కాలేజీల పీపీపీ విధానంపై పాలిటిక్స్‌కు కేంద్రం చెక్ - వైసీపీ బీజేపీపైనా యుద్ధం ప్రకటించే ధైర్యం చేస్తుందా?
Tata Ernakulam Express Fire Accident: ఎలమంచిలి వద్ద టాటా- ఎర్నాకుళం ఎక్స్‌ప్రెస్‌లో అగ్నిప్రమాదం.. ఒకరు మృతి
ఎలమంచిలి వద్ద టాటా- ఎర్నాకుళం ఎక్స్‌ప్రెస్‌లో అగ్నిప్రమాదం.. ఒకరు మృతి
iBomma Case: ఐబొమ్మ కేసులో కొత్త కోణం.. ఐడెంటిటీ చోరీకి పాల్పడిన రవి- విచారణలో షాకింగ్ విషయాలు!
ఐబొమ్మ కేసులో కొత్త కోణం.. ఐడెంటిటీ చోరీకి పాల్పడిన రవి- విచారణలో షాకింగ్ విషయాలు!
Sankranti 2026 Movies Telugu: హిట్ ఆల్బమ్ లేని సంక్రాంతి సినిమాలు, BGM హోరులో పాటలను పక్కన పెట్టేస్తున్న మ్యూజిక్ డైరెక్టర్లు
హిట్ ఆల్బమ్ లేని సంక్రాంతి సినిమాలు, BGM హోరులో పాటలను పక్కన పెట్టేస్తున్న మ్యూజిక్ డైరెక్టర్లు

వీడియోలు

అసెంబ్లీకి కేసీఆర్? టీ-పాలిటిక్స్‌లో ఉత్కంఠ?
World Test Championship Points Table | Aus vs Eng | టెస్ట్ ఛాంపియన్‌షిప్ పాయింట్స్ టేబుల్
Virat Kohli Surprises to Bowler | బౌలర్‌కు సర్‌ప్రైజ్ ఇచ్చిన విరాట్
Team India New Test Coach | గంభీర్ ను కోచ్ గా తప్పించే ఆలోచనలో బీసీసీఐ
Shubman Gill to Play in Vijay Hazare Trophy | పంజాబ్ తరపున ఆడనున్న గిల్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra PPP Politics: మెడికల్ కాలేజీల పీపీపీ విధానంపై పాలిటిక్స్‌కు కేంద్రం చెక్ - వైసీపీ బీజేపీపైనా యుద్ధం ప్రకటించే ధైర్యం చేస్తుందా?
మెడికల్ కాలేజీల పీపీపీ విధానంపై పాలిటిక్స్‌కు కేంద్రం చెక్ - వైసీపీ బీజేపీపైనా యుద్ధం ప్రకటించే ధైర్యం చేస్తుందా?
Tata Ernakulam Express Fire Accident: ఎలమంచిలి వద్ద టాటా- ఎర్నాకుళం ఎక్స్‌ప్రెస్‌లో అగ్నిప్రమాదం.. ఒకరు మృతి
ఎలమంచిలి వద్ద టాటా- ఎర్నాకుళం ఎక్స్‌ప్రెస్‌లో అగ్నిప్రమాదం.. ఒకరు మృతి
iBomma Case: ఐబొమ్మ కేసులో కొత్త కోణం.. ఐడెంటిటీ చోరీకి పాల్పడిన రవి- విచారణలో షాకింగ్ విషయాలు!
ఐబొమ్మ కేసులో కొత్త కోణం.. ఐడెంటిటీ చోరీకి పాల్పడిన రవి- విచారణలో షాకింగ్ విషయాలు!
Sankranti 2026 Movies Telugu: హిట్ ఆల్బమ్ లేని సంక్రాంతి సినిమాలు, BGM హోరులో పాటలను పక్కన పెట్టేస్తున్న మ్యూజిక్ డైరెక్టర్లు
హిట్ ఆల్బమ్ లేని సంక్రాంతి సినిమాలు, BGM హోరులో పాటలను పక్కన పెట్టేస్తున్న మ్యూజిక్ డైరెక్టర్లు
Rule Changes From 1st January: పాన్- ఆధార్ అనుసంధానం నుంచి ఎల్పీజీ వరకు.. జనవరి నుంచి అమలులోకి కొత్త రూల్స్!
పాన్- ఆధార్ అనుసంధానం నుంచి ఎల్పీజీ వరకు.. జనవరి నుంచి అమలులోకి కొత్త రూల్స్!
Telugu Film Chamber : తెలుగు ఫిలిం ఛాంబర్ నూతన కార్యవర్గం - అధ్యక్షుడిగా నిర్మాత సురేష్ బాబు, ఉపాధ్యక్షుడిగా నాగవంశీ
తెలుగు ఫిలిం ఛాంబర్ నూతన కార్యవర్గం - అధ్యక్షుడిగా నిర్మాత సురేష్ బాబు, ఉపాధ్యక్షుడిగా నాగవంశీ
Year Ender 2025: ఈ సంవత్సరం టీమిండియా 5 అతిపెద్ద ఓటములు.. చేదు జ్ఞాపకాలకు గుడ్ బై!
ఈ సంవత్సరం టీమిండియా 5 అతిపెద్ద ఓటములు.. చేదు జ్ఞాపకాలకు గుడ్ బై!
MLC Nagababu: గత అనవాయితీకి భిన్నంగా పవన్ కళ్యాణ్ ఆలోచన.. జనసేనాని నిర్ణయానికి కట్టుబడిన పార్టీ
గత అనవాయితీకి భిన్నంగా పవన్ కళ్యాణ్ ఆలోచన.. జనసేనాని నిర్ణయానికి కట్టుబడిన పార్టీ
Embed widget