అన్వేషించండి

Fish Side Effects: చేపలు తింటే చర్మ క్యాన్సర్ వస్తుందా? షాకింగ్ న్యూస్ చెప్పిన పరిశోధకులు

చేపలకు చర్మ క్యాన్సర్‌కు లింకేమిటీ? సాధారణంగా సూర్యుడి నుంచి వెలువడే యూవీ కిరణాల వల్ల ఏర్పడే చర్మ క్యాన్సర్‌ చేపల వల్ల ఎలా ఏర్పడుతుంది?

చేపలు ఆరోగ్యానికి మంచిదనే సంగతి తెలిసిందే. చేపలు తినడం వల్ల శరీరానికి అనేక పోషకాలు, విటమిన్లు లభిస్తాయి. ఐరన్, మెగ్నీషియం, పోటాషియం, జింగ్, అయోడిన్ వంటివి చేపల్లో ఉంటాయి. చేపల్లో ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు ఉంటాయి. చేపలు తినడం వల్ల విటమిన్-డి, బీ2, కాల్షియం, ఫాస్పరస్ శరీరానికి లభిస్తాయి. ఈ నేపథ్యంలో వారంలో కనీసం రెండుసార్లైన చేపలు తినాలని అమెరికన్ హార్ట్ అసోసియేషన్ చెబుతోంది. అయితే, తాజా అధ్యయనం మాత్రం చేపలు తినడం వల్ల ఆరోగ్యానికి ముప్పు ఉందని, ముఖ్యంగా చర్మ క్యాన్సర్ ప్రమాదం పొంచివుందని హెచ్చరిస్తోంది. ఇందుకు బలమైన కారణాలు కూడా ఉన్నాయని చెబుతోంది. 

అమెరికాకు చెందిన నిపుణులు చేపల్లో ప్రాణాంతక మెలనోమా అభివృద్ధి చెందే అవకాశాలను పరిశీలించారు. రోజూ 43 గ్రాముల చేపలను తినేవారికి చర్మ క్యాన్సర్ ముప్పు ఉందని వెల్లడించారు. అరుదుగా చేపలు తినేవారితో పోల్చితే.. రెగ్యులర్‌గా తినేవారిలో ఈ వ్యాధి వచ్చే అవకాశం 22 శాతం ఎక్కువగా ఉన్నట్లు వెల్లడించారు. ముఖ్యంగా సీఫుడ్‌‌లోని కాలుష్య కారకాలే ఇందుకు ప్రధాన కారణమని అంటున్నారు. 

వైద్య నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం.. మనం ఆరోగ్యంగా ఉండాలంటే వారంలో కనీసం రెండు 140 గ్రాముల చేపలను తినాలి. సాల్మన్ చేపలైతే మరింత మంచిది. అయితే, ప్రస్తుత ఫలితాలపై ప్రజలు భయాందోళనలు చెందాల్సిన అవసరం లేదని, చేపలను అతిగా కాకుండా వారంలో రెండుసార్లు తీసుకోవడం వల్ల ప్రమాదం తక్కువనని పేర్కొన్నారు.  

అమెరికాలోని బ్రౌన్ యూనివర్శిటీకి చెందిన ప్రముఖ పరిశోధకుడు ఎన్‌యంగ్ చో ఓ మీడియా సంస్థతో మాట్లాడుతూ.. పాలీక్లోరినేటెడ్ బైఫినిల్స్, డయాక్సిన్లు, ఆర్సెనిక్, పాదరసం వంటి కలుషితాలను చేపల్లో గుర్తించినట్లు తెలిపారు. అధికంగా చేపలను తీసుకోవడం వల్ల శరీరంలో ఆయా కలుషితాల స్థాయిలు పెరుగుతాయన్నారు. దాని వల్ల చర్మ క్యాన్సర్ ప్రమాదం పొంచి ఉందని తెలిపారు. 

లండన్‌లోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ క్యాన్సర్ రీసెర్చ్‌కు చెందిన డాక్టర్ మైఖేల్ జోన్స్ మాట్లాడుతూ.. ‘‘ట్యూనా చేపల్లో మెలనోమా స్థాయిలు ఎక్కువగా ఉన్నాయి. అయితే, దీనిపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎందుకంటే.. మీరు తీసుకొనే సమతుల్య ఆహారంలో తప్పకుండా చేపలు ఉండాలి. ఈ అధ్యయనాల తర్వాత వైద్య నిపుణులు కూడా చేపలను తినాలనే సిఫార్సును వెనక్కి తీసుకోలేదు’’ అని స్పష్టం చేశారు.

Also Read: జస్టిన్ బీబర్‌కు ముఖ పక్షవాతం, ‘రామ్సే హంట్’ వ్యాధి మీకూ రావచ్చు, లక్షణాలివే! 
 
లండన్‌లోని క్వీన్ మేరీ యూనివర్శిటీ క్యాన్సర్ స్క్రీనింగ్ ప్రొఫెసర్ ప్రొఫెసర్ స్టీఫెన్ డఫీ మాట్లాడుతూ ‘‘చేపలను రెగ్యులర్‌గా తినేవారిలో మెలనోమా ప్రమాదం కేవలం 22 శాతమే ఉంది. కాబట్టి, పెద్దగా ఆందోళన అవసరం లేదు. సూర్యరశ్మికి ఎక్కువగా గురైనవారికి చేపల వల్ల కాస్త సమస్య ఉండవచ్చు. అలాగే వేయించిన చేపల వల్ల కూడా పెద్దగా ప్రమాదం ఉండదు’’ అని తెలిపారు. కాబట్టి, మీరు చేపలను నిరభ్యంతరంగా తినొచ్చు. అయితే, మొతాదు మించకుండా చూడండి. సాధారణంగా సీఫుడ్‌లో కాలుష్యాలు ఎక్కువే. కాబట్టి, వాటిని వీలైనంత తక్కువ తీసుకోవడం మంచిది. 

Also Read: ఫోన్ అతిగా చూస్తే ఆయుష్షు ఫట్! 34 ఏళ్లు వృథా చేస్తున్నారట: తాజా స్టడీ వెల్లడి

గమనిక: పలు అధ్యయనాల్లో పేర్కొన్న అంశాలను మీ అవగాహన కోసం యథావిధిగా ఈ కథనంలో అందించాం. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ బాధ్యత వహించదని గమనించగలరు.

టాప్ హెడ్ లైన్స్

Kidney Cancer : నగరవాసుల్లో పెరుగుతోన్న కిడ్నీ క్యాన్సర్ కేసులు.. కారణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు సూచిస్తోన్న ఆంకాలజిస్ట్
నగరవాసుల్లో పెరుగుతోన్న కిడ్నీ క్యాన్సర్ కేసులు.. కారణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు సూచిస్తోన్న ఆంకాలజిస్ట్
Monsoon Hair Fall : వర్షాకాలంలో జుట్టు ఎక్కువగా ఊడుతుందా? కారణాలివే.. తగ్గించేందుకు నిపుణులు చెప్పిన చిట్కాలు
వర్షాకాలంలో జుట్టు ఎక్కువగా ఊడుతుందా? కారణాలివే.. తగ్గించేందుకు నిపుణులు చెప్పిన చిట్కాలు
Blood Tests : రొటీన్​కు భిన్నంగా వైద్యులు సూచిస్తోన్న 5 రక్త పరీక్షలు.. వీటితో వ్యాధులు ముందుగానే గుర్తించవచ్చా?
రొటీన్​కు భిన్నంగా వైద్యులు సూచిస్తోన్న 5 రక్త పరీక్షలు.. వీటితో వ్యాధులు ముందుగానే గుర్తించవచ్చా?
Blood in Urine : మూత్రంలో రక్తం కనిపిస్తుందా? కిడ్నీ క్యాన్సర్‌(Kidney Cancer)కు సంకేతం కావచ్చు.. నిర్లక్ష్యం చేయొద్దంటోన్న నిపుణులు
మూత్రంలో రక్తం కనిపిస్తుందా? కిడ్నీ క్యాన్సర్‌(Kidney Cancer)కు సంకేతం కావచ్చు.. నిర్లక్ష్యం చేయొద్దంటోన్న నిపుణులు

వీడియోలు

IND W vs AUS W World Cup | టీ20 వరల్డ్ కప్ లో ముగిసిన భారత్ పోరాటం
IND vs IRE 2nd T20 Highlights | ఐర్లాండ్ చేతిలో భారత్ క్లీన్ స్వీప్
Vaibhav Debut in England Series | ఇంగ్లాండ్ సిరీస్ లో వైభవ్ సూర్యవంశీ ఎంట్రీ ?
Ricky Ponting To Replace Gautam Gambhir ? | త్వరలోనే టీమిండియాకు కొత్త హెడ్ కోచ్ ?
IND vs AUS Women's T20 World Cup 2026 | ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్ వెళ్తామా?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Why Europe Is Heating Up?: యూరోప్ ఎందుకు ఓవెన్‌లా ఉడుకుతోంది..తీవ్రమైన ఎండల వెనుక కారణం ఏంటి..? 
యూరోప్ ఎందుకు ఓవెన్‌లా ఉడుకుతోంది..తీవ్రమైన ఎండల వెనుక కారణం ఏంటి..? 
Polavaram MLA Attacked: ​ఏలూరు జనసేన ఆఫీస్‌ వద్ద ఎమ్మెల్యేపై దాడికి యత్నం! సొంత పార్టీ నేతలపైనే చిర్రి బాలరాజు ఫైర్‌!
​ఏలూరు జనసేన ఆఫీస్‌ వద్ద ఎమ్మెల్యేపై దాడికి యత్నం! సొంత పార్టీ నేతలపైనే చిర్రి బాలరాజు ఫైర్‌!
Rushikonda Hilltop Buildings: రుషికొండ భవనాలపై ఏపీటీడీసీ కీలక నిర్ణయం.. ప్రైవేట్ భాగస్వామ్యానికి లీజ్ నోటిఫికేషన్ విడుదల!
రుషికొండ భవనాలపై ఏపీటీడీసీ కీలక నిర్ణయం.. ప్రైవేట్ భాగస్వామ్యానికి లీజ్ నోటిఫికేషన్ విడుదల!
WhatsApp Business AI: వాట్సాప్ బిజినెస్ కోసం కొత్త నిబంధనలు! మొత్తం ధరల విధానాన్నే మార్చేసిన మెటా!
వాట్సాప్ బిజినెస్ కోసం కొత్త నిబంధనలు! మొత్తం ధరల విధానాన్నే మార్చేసిన మెటా!
DMK MLA Anitha Radhakrishnan Arrest: సీఎం విజయ్, త్రిషలపై ‘చీప్’ వ్యాఖ్యలు.. డీఎంకే ఎమ్మెల్యే అనితా రాధాకృష్ణన్ అరెస్ట్!
సీఎం విజయ్, త్రిషలపై ‘చీప్’ వ్యాఖ్యలు.. డీఎంకే ఎమ్మెల్యే అనితా రాధాకృష్ణన్ అరెస్ట్!
Garuda vs Lord Yama: బ్రహ్మ రాత ఎవ్వరూ మార్చలేరు! గరుత్మంతుడు - యముడు - చిలుక కథ
బ్రహ్మ రాత ఎవ్వరూ మార్చలేరు! గరుత్మంతుడు - యముడు - చిలుక కథ
Maa Inti Bangaram Deleted Scenes : మా ఇంటి బంగారం డిలీటెడ్ సీన్స్ చూశారా? - సమంత, ఆమె ఫ్రెండ్ అల్లరి మామూలుగా లేదు
మా ఇంటి బంగారం డిలీటెడ్ సీన్స్ చూశారా? - సమంత, ఆమె ఫ్రెండ్ అల్లరి మామూలుగా లేదు
Breaking News: మార్కపురంలోని కంభం వద్ద రోడ్డు ప్రమాదం- పెళ్లి ఆటోను ఢీ కొట్టిన లారీ- నలుగురు స్పాట్‌ డెడ్‌!
మార్కాపురంలోని కంభం వద్ద రోడ్డు ప్రమాదం- పెళ్లి ఆటోను ఢీ కొట్టిన లారీ- నలుగురు స్పాట్‌ డెడ్‌!
Embed widget