అన్వేషించండి

Fish Side Effects: చేపలు తింటే చర్మ క్యాన్సర్ వస్తుందా? షాకింగ్ న్యూస్ చెప్పిన పరిశోధకులు

చేపలకు చర్మ క్యాన్సర్‌కు లింకేమిటీ? సాధారణంగా సూర్యుడి నుంచి వెలువడే యూవీ కిరణాల వల్ల ఏర్పడే చర్మ క్యాన్సర్‌ చేపల వల్ల ఎలా ఏర్పడుతుంది?

చేపలు ఆరోగ్యానికి మంచిదనే సంగతి తెలిసిందే. చేపలు తినడం వల్ల శరీరానికి అనేక పోషకాలు, విటమిన్లు లభిస్తాయి. ఐరన్, మెగ్నీషియం, పోటాషియం, జింగ్, అయోడిన్ వంటివి చేపల్లో ఉంటాయి. చేపల్లో ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు ఉంటాయి. చేపలు తినడం వల్ల విటమిన్-డి, బీ2, కాల్షియం, ఫాస్పరస్ శరీరానికి లభిస్తాయి. ఈ నేపథ్యంలో వారంలో కనీసం రెండుసార్లైన చేపలు తినాలని అమెరికన్ హార్ట్ అసోసియేషన్ చెబుతోంది. అయితే, తాజా అధ్యయనం మాత్రం చేపలు తినడం వల్ల ఆరోగ్యానికి ముప్పు ఉందని, ముఖ్యంగా చర్మ క్యాన్సర్ ప్రమాదం పొంచివుందని హెచ్చరిస్తోంది. ఇందుకు బలమైన కారణాలు కూడా ఉన్నాయని చెబుతోంది. 

అమెరికాకు చెందిన నిపుణులు చేపల్లో ప్రాణాంతక మెలనోమా అభివృద్ధి చెందే అవకాశాలను పరిశీలించారు. రోజూ 43 గ్రాముల చేపలను తినేవారికి చర్మ క్యాన్సర్ ముప్పు ఉందని వెల్లడించారు. అరుదుగా చేపలు తినేవారితో పోల్చితే.. రెగ్యులర్‌గా తినేవారిలో ఈ వ్యాధి వచ్చే అవకాశం 22 శాతం ఎక్కువగా ఉన్నట్లు వెల్లడించారు. ముఖ్యంగా సీఫుడ్‌‌లోని కాలుష్య కారకాలే ఇందుకు ప్రధాన కారణమని అంటున్నారు. 

వైద్య నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం.. మనం ఆరోగ్యంగా ఉండాలంటే వారంలో కనీసం రెండు 140 గ్రాముల చేపలను తినాలి. సాల్మన్ చేపలైతే మరింత మంచిది. అయితే, ప్రస్తుత ఫలితాలపై ప్రజలు భయాందోళనలు చెందాల్సిన అవసరం లేదని, చేపలను అతిగా కాకుండా వారంలో రెండుసార్లు తీసుకోవడం వల్ల ప్రమాదం తక్కువనని పేర్కొన్నారు.  

అమెరికాలోని బ్రౌన్ యూనివర్శిటీకి చెందిన ప్రముఖ పరిశోధకుడు ఎన్‌యంగ్ చో ఓ మీడియా సంస్థతో మాట్లాడుతూ.. పాలీక్లోరినేటెడ్ బైఫినిల్స్, డయాక్సిన్లు, ఆర్సెనిక్, పాదరసం వంటి కలుషితాలను చేపల్లో గుర్తించినట్లు తెలిపారు. అధికంగా చేపలను తీసుకోవడం వల్ల శరీరంలో ఆయా కలుషితాల స్థాయిలు పెరుగుతాయన్నారు. దాని వల్ల చర్మ క్యాన్సర్ ప్రమాదం పొంచి ఉందని తెలిపారు. 

లండన్‌లోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ క్యాన్సర్ రీసెర్చ్‌కు చెందిన డాక్టర్ మైఖేల్ జోన్స్ మాట్లాడుతూ.. ‘‘ట్యూనా చేపల్లో మెలనోమా స్థాయిలు ఎక్కువగా ఉన్నాయి. అయితే, దీనిపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎందుకంటే.. మీరు తీసుకొనే సమతుల్య ఆహారంలో తప్పకుండా చేపలు ఉండాలి. ఈ అధ్యయనాల తర్వాత వైద్య నిపుణులు కూడా చేపలను తినాలనే సిఫార్సును వెనక్కి తీసుకోలేదు’’ అని స్పష్టం చేశారు.

Also Read: జస్టిన్ బీబర్‌కు ముఖ పక్షవాతం, ‘రామ్సే హంట్’ వ్యాధి మీకూ రావచ్చు, లక్షణాలివే! 
 
లండన్‌లోని క్వీన్ మేరీ యూనివర్శిటీ క్యాన్సర్ స్క్రీనింగ్ ప్రొఫెసర్ ప్రొఫెసర్ స్టీఫెన్ డఫీ మాట్లాడుతూ ‘‘చేపలను రెగ్యులర్‌గా తినేవారిలో మెలనోమా ప్రమాదం కేవలం 22 శాతమే ఉంది. కాబట్టి, పెద్దగా ఆందోళన అవసరం లేదు. సూర్యరశ్మికి ఎక్కువగా గురైనవారికి చేపల వల్ల కాస్త సమస్య ఉండవచ్చు. అలాగే వేయించిన చేపల వల్ల కూడా పెద్దగా ప్రమాదం ఉండదు’’ అని తెలిపారు. కాబట్టి, మీరు చేపలను నిరభ్యంతరంగా తినొచ్చు. అయితే, మొతాదు మించకుండా చూడండి. సాధారణంగా సీఫుడ్‌లో కాలుష్యాలు ఎక్కువే. కాబట్టి, వాటిని వీలైనంత తక్కువ తీసుకోవడం మంచిది. 

Also Read: ఫోన్ అతిగా చూస్తే ఆయుష్షు ఫట్! 34 ఏళ్లు వృథా చేస్తున్నారట: తాజా స్టడీ వెల్లడి

గమనిక: పలు అధ్యయనాల్లో పేర్కొన్న అంశాలను మీ అవగాహన కోసం యథావిధిగా ఈ కథనంలో అందించాం. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ బాధ్యత వహించదని గమనించగలరు.

టాప్ హెడ్ లైన్స్

Gas Stove Cleaning: గ్యాస్ స్టవ్‌పై పాల మరకలను ఎలా తొలగించాలి? సులభమైన పరిష్కారా చిట్కాలు ఇవే!
గ్యాస్ స్టవ్‌పై పాల మరకలను ఎలా తొలగించాలి? సులభమైన పరిష్కారా చిట్కాలు ఇవే!
Managing Diabetes : డయాబెటిస్ మందులతో మాత్రమే కాదు.. ఈ అలవాట్లు కూడా పాటిస్తేనే షుగర్ అదుపులో ఉంటుందట, డాక్టర్ల సూచనలు ఇవే
డయాబెటిస్ మందులతో మాత్రమే కాదు.. ఈ అలవాట్లు కూడా పాటిస్తేనే షుగర్ అదుపులో ఉంటుందట, డాక్టర్ల సూచనలు ఇవే
Kidney Health : కిడ్నీలను డీటాక్స్ చేసి ఆరోగ్యంగా ఉంచే డ్రింక్స్.. నీటి తర్వాత ఇవే బెస్ట్
కిడ్నీలను డీటాక్స్ చేసి ఆరోగ్యంగా ఉంచే డ్రింక్స్.. నీటి తర్వాత ఇవే బెస్ట్
Diabetes and Dengue : మధుమేహం(Type 2 Diabetes) ఉన్నవారికి డెంగ్యూ వస్తే ప్రమాదమా? ఈ లక్షణాలను అస్సలు నిర్లక్ష్యం చేయకండి
మధుమేహం(Type 2 Diabetes) ఉన్నవారికి డెంగ్యూ వస్తే ప్రమాదమా? ఈ లక్షణాలను అస్సలు నిర్లక్ష్యం చేయకండి

వీడియోలు

Ashes Test Match To Be Hosted In India? | ఇండియాలో 'యాషెస్' టెస్ట్ మ్యాచ్?
Serial Actress Preethi Srinivas Real Life Facts | సీరియల్ నటి ప్రీతి శ్రీనివాస్ రియల్ లైఫ్ సీక్రెట్స్
Vaibhav Suryavanshi Creates World Record | 15 ఏళ్ల వయసులో వైభవ్ సూర్యవంశీ వరల్డ్ రికార్డ్
PM Modi Gains 10 Lakh Followers In 12 Hours | పీఎం మోదీ సోషల్ మీడియాలో రికార్డ్
PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ED Rains In Hyderabad: డ్రగ్స్ కేసులో హైదరాబాద్, బెంగళూరులో ఈడీ ఆకస్మిక దాడులు.. మత్తు లింకులపై ఫోకస్!
డ్రగ్స్ కేసులో హైదరాబాద్, బెంగళూరులో ఈడీ ఆకస్మిక దాడులు.. మత్తు లింకులపై ఫోకస్!
Team India Squad: శ్రీలంకతో టెస్ట్ సిరీస్‌కు భారత జట్టును ప్రకటించిన BCCI - రవీంద్ర జడేజా రీఎంట్రీ
శ్రీలంకతో టెస్ట్ సిరీస్‌కు భారత జట్టును ప్రకటించిన BCCI - రవీంద్ర జడేజా రీఎంట్రీ
Telangana ACB Raids: తెలంగాణ ఏసీబీ భారీ స్కెచ్ - ఐఏఎస్, ఐపీఎస్, రెవెన్యూ అధికారులపై దాడులకు రంగం సిద్ధం - తిమింగలాలపైనే గురి?
తెలంగాణ ఏసీబీ భారీ స్కెచ్ - ఐఏఎస్, ఐపీఎస్, రెవెన్యూ అధికారులపై దాడులకు రంగం సిద్ధం - తిమింగలాలపైనే గురి?
Crop Insurance: పంటల బీమాకు మరో 3 రోజులే డెడ్‌లైన్.. ఎల్‌నినో ముప్పు ఉన్నా తక్కువగా రైతుల నమోదు
పంటల బీమాకు మరో 3 రోజులే డెడ్‌లైన్.. ఎల్‌నినో ముప్పు ఉన్నా తక్కువగా రైతుల నమోదు
Vizianagaram Road Accident: దైవదర్శనానికి వెళ్తుండగా విషాదం.. వ్యాన్‌ను ఢీకొట్టిన లారీ, ముగ్గురు మృతి, 13 మందికి గాయాలు
దైవదర్శనానికి వెళ్తుండగా విషాదం.. వ్యాన్‌ను ఢీకొట్టిన లారీ, ముగ్గురు మృతి, 13 మందికి గాయాలు
Maruti Brezza 2026: మారుతి బ్రెజ్జాలో బడ్జెట్‌ ఫ్రెండ్లీ వేరియంట్‌ ఇదే! - తగ్గిన ధర, పెరిగిన ఫీచర్లు
2026 మారుతి బ్రెజ్జా పూర్తి ధరల జాబితా విడుదల - ఏ వేరియంట్‌ రేటు ఎంతంటే?
AP Telangana Rain Alert: తీరం దాటనున్న వాయుగుండం.. తెలంగాణలో 8 జిల్లాలకు ఎల్లో అలర్ట్.. ఏపీలో ఆ జిల్లాలకు పిడుగుల వార్నింగ్
తీరం దాటనున్న వాయుగుండం.. తెలంగాణలో 8 జిల్లాలకు ఎల్లో అలర్ట్.. ఏపీలో అక్కడ పిడుగులు పడే అవకాశం
Driving Safety Tips: రోడ్డు మీద హీరో కావాలంటే స్పీడ్ కాదు.. సేఫ్టీ ముఖ్యం! ప్రతి డ్రైవర్ తప్పక తెలుసుకోవాల్సిన టిప్స్
బండి స్పీడ్‌లో ఉంది.. కానీ బ్రెయిన్‌ అలర్ట్‌గా ఉందా? ప్రమాదాలను తప్పించే సింపుల్ ట్రిక్స్
Embed widget