అన్వేషించండి

Deepavali 2025 : దసరా జరిగిన 20 రోజుల తర్వాతే దీపావళిని ఎందుకు చేసుకుంటారు? గూగుల్ మ్యాప్ చెప్పిన సీక్రెట్ ఇదే

Diwali Facts 2025 : ప్రతి సంవత్సరం దసరా తర్వాత 20 రోజులకి దీపావళి వస్తుంది. దీని వెనుక కారణం ఏంటో, ఇంట్రెస్టింగ్ విషయాలు ఏంటో ఇప్పుడు చూసేద్దాం.

Dussehra to Diwali Gap Story : భారతదేశంలో ప్రతి సంవత్సరం దీపావళి (Deepavali 2025)ని ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారు. సనాతన ధర్మంలో ఇది ముఖ్యమైన పండుగ. అయితే ఈ దీపాల పండుగ ప్రతి సంవత్సరం దసరా జరిగిన 20 లేదా 21 రోజుల తర్వాత వస్తుంది. ఈ సంవత్సరం 2025లో దసరా తర్వాత సరిగ్గా 20 రోజులకు అక్టోబర్ 20వ తేదీన వచ్చింది. అసలు దసరా జరిగిన.. 20 రోజుల తర్వాతే దీపావళిని ఎందుకు జరుపుకుంటారో తెలుసా? దీని వెనుక ఓ ఇంట్రెస్టింగ్ రీజన్ ఉందట. దీనిగురించి అందరికీ పెద్దగా తెలియకపోవచ్చు. మరి ఆ కారణమేంటో ఇప్పుడు చూసేద్దాం. 

దసరా తర్వాత 20 రోజులకే దీపావళి.. ఎందుకంటే..

దసరా తర్వాత 20 లేదా 21 రోజుల తర్వాత దీపావళిని జరుపుకోవడానికి ఒక మతపరమైన నమ్మకం ఉంది. మహర్షి వాల్మీకి రామాయణం ప్రకారం.. రావణుడు సీతను ఎత్తుకెళ్లిన తర్వాత.. వానర సైన్యంతో వెళ్లిన రాముడు.. లంకాధిపతి రావణుడిని వధిస్తాడు. అనంతరం ధర్మం వైపు నిలిచిన బంగారు లంకను రావణుడి తమ్ముడు విభీషణుడికి అప్పగిస్తాడు. రావణుడి సంహరణకు ప్రతీకగా దసరా చేసుకుంటారు. ఆ తర్వాత శ్రీరాముడు సీతా సమేతుడై.. అయోధ్యకు తిరిగి వస్తాడు. ఇలా లంక నుంచి రాముడు అయోధ్య రావడానికి మొత్తం 20 రోజులు పట్టిందని వాల్మికీ రామాయణం చెప్తోంది. రాముడు రాగానే అయోధ్య నగరంలోని వారందరూ ఆయనకు స్వాగతం పలుకుతూ దీపాలు వెలిగించారని.. అప్పటి నుంచి ఈ పండుగను దీపావళిగా జరుపుకోవడం ప్రారంభించారని చెప్తోంది రామాయణం. ప్రతి సంవత్సరం తిథుల ప్రకారం దసరా తర్వాత 20 లేదా 21 రోజులకు దీపావళి చేస్తారు. 

గూగుల్ మ్యాప్ ఏం చెబుతోంది?

దసరా తర్వాత దీపావళిని జరుపుకోవడం గురించి విశ్లేషిస్తే.. అనేక ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వస్తాయి. ఎలా అంటే.. శ్రీరాముడు శ్రీలంక నుంచి భారతదేశానికి ప్రయాణించారు. కాబట్టి ఇప్పుడు ఉపయోగించే గూగుల్ మ్యాప్ ద్వారా రెండు స్థానాల మధ్య ప్రయాణ దూరాన్ని సులభంగా లెక్కించవచ్చు. దాని కోసం ఫోన్‌లో గూగుల్ మ్యాప్‌ ఓపెన్ చేయాలి. ఆ తర్వాత మీ లొకేషన్​లో శ్రీలంకను ఎంచుకుని.. గమ్యస్థానంలో అయోధ్య, ఉత్తరప్రదేశ్‌ను ఎంచుకోవాలి. ఇప్పుడు సెర్చ్ చేస్తే.. ఈ మొత్తం దూరం 3127 కి.మీ అని చూపిస్తుంది.


Deepavali 2025 : దసరా జరిగిన 20 రోజుల తర్వాతే దీపావళిని ఎందుకు చేసుకుంటారు? గూగుల్ మ్యాప్ చెప్పిన సీక్రెట్ ఇదే

వాకింగ్ సింబల్​పై క్లిక్ చేస్తే.. సమయం చూపిస్తుంది. అప్పుడు మొత్తం సమయం 491 గంటలు ఉంటుంది. అంటే ఇరవైన్నర రోజులు అని చూపిస్తుంది. అందుకే దీపావళి కొన్నిసార్లు దసరా నుంచి 20 రోజుల తర్వాత.. మరికొన్నిసార్లు 21 రోజుల తర్వాత జరుపుకుంటారు. ఓ రకంగా టెక్నాలజీ కూడా 20 రోజుల ప్రయాణాన్ని సమర్థిస్తుందని భక్తులు బలంగా నమ్ముతున్నారు.

గమనిక : ఇక్కడ అందించిన సమాచారం నమ్మకాలు, సమాచారంపై మాత్రమే ఆధారపడి ఉంటుంది. ABP దేశం ఏదైనా నమ్మకం లేదా సమాచారాన్ని ధృవీకరించట్లేదు. ఏదైనా సమాచారం లేదా నమ్మకాన్ని ఫాలో అవ్వడానికి ముందు సంబంధిత నిపుణుడిని సంప్రదించండి. 

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ మూడేళ్లు పనిచేశారు. తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో సంవత్సరం పాటు సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్​గా పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశంలో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ ఇస్తున్నారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Kidney Health : కిడ్నీలను డీటాక్స్ చేసి ఆరోగ్యంగా ఉంచే డ్రింక్స్.. నీటి తర్వాత ఇవే బెస్ట్
కిడ్నీలను డీటాక్స్ చేసి ఆరోగ్యంగా ఉంచే డ్రింక్స్.. నీటి తర్వాత ఇవే బెస్ట్
Diabetes and Dengue : మధుమేహం(Type 2 Diabetes) ఉన్నవారికి డెంగ్యూ వస్తే ప్రమాదమా? ఈ లక్షణాలను అస్సలు నిర్లక్ష్యం చేయకండి
మధుమేహం(Type 2 Diabetes) ఉన్నవారికి డెంగ్యూ వస్తే ప్రమాదమా? ఈ లక్షణాలను అస్సలు నిర్లక్ష్యం చేయకండి
Joint Stiffness : కీళ్ల నొప్పి, బిగుతు తగ్గాలంటే ఈ 10 సూపర్ ఫుడ్స్ తినేయండి.. నిపుణుల సూచనలు ఇవే
కీళ్ల నొప్పి, బిగుతు తగ్గాలంటే ఈ 10 సూపర్ ఫుడ్స్ తినేయండి.. నిపుణుల సూచనలు ఇవే
Monsoon Laundry Hacks : వర్షాకాలంలో బట్టలు త్వరగా ఆరాలంటే ఈ చిట్కాలు పాటించండి.. దుర్వాసన కూడా రాదు
వర్షాకాలంలో బట్టలు త్వరగా ఆరాలంటే ఈ చిట్కాలు పాటించండి.. దుర్వాసన కూడా రాదు

వీడియోలు

Ashes Test Match To Be Hosted In India? | ఇండియాలో 'యాషెస్' టెస్ట్ మ్యాచ్?
Serial Actress Preethi Srinivas Real Life Facts | సీరియల్ నటి ప్రీతి శ్రీనివాస్ రియల్ లైఫ్ సీక్రెట్స్
Vaibhav Suryavanshi Creates World Record | 15 ఏళ్ల వయసులో వైభవ్ సూర్యవంశీ వరల్డ్ రికార్డ్
PM Modi Gains 10 Lakh Followers In 12 Hours | పీఎం మోదీ సోషల్ మీడియాలో రికార్డ్
PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ED Rains In Hyderabad: డ్రగ్స్ కేసులో హైదరాబాద్, బెంగళూరులో ఈడీ ఆకస్మిక దాడులు.. మత్తు లింకులపై ఫోకస్!
డ్రగ్స్ కేసులో హైదరాబాద్, బెంగళూరులో ఈడీ ఆకస్మిక దాడులు.. మత్తు లింకులపై ఫోకస్!
Team India Squad: శ్రీలంకతో టెస్ట్ సిరీస్‌కు భారత జట్టును ప్రకటించిన BCCI - రవీంద్ర జడేజా రీఎంట్రీ
శ్రీలంకతో టెస్ట్ సిరీస్‌కు భారత జట్టును ప్రకటించిన BCCI - రవీంద్ర జడేజా రీఎంట్రీ
Telangana ACB Raids: తెలంగాణ ఏసీబీ భారీ స్కెచ్ - ఐఏఎస్, ఐపీఎస్, రెవెన్యూ అధికారులపై దాడులకు రంగం సిద్ధం - తిమింగలాలపైనే గురి?
తెలంగాణ ఏసీబీ భారీ స్కెచ్ - ఐఏఎస్, ఐపీఎస్, రెవెన్యూ అధికారులపై దాడులకు రంగం సిద్ధం - తిమింగలాలపైనే గురి?
Crop Insurance: పంటల బీమాకు మరో 3 రోజులే డెడ్‌లైన్.. ఎల్‌నినో ముప్పు ఉన్నా తక్కువగా రైతుల నమోదు
పంటల బీమాకు మరో 3 రోజులే డెడ్‌లైన్.. ఎల్‌నినో ముప్పు ఉన్నా తక్కువగా రైతుల నమోదు
Vizianagaram Road Accident: దైవదర్శనానికి వెళ్తుండగా విషాదం.. వ్యాన్‌ను ఢీకొట్టిన లారీ, ముగ్గురు మృతి, 13 మందికి గాయాలు
దైవదర్శనానికి వెళ్తుండగా విషాదం.. వ్యాన్‌ను ఢీకొట్టిన లారీ, ముగ్గురు మృతి, 13 మందికి గాయాలు
Maruti Brezza 2026: మారుతి బ్రెజ్జాలో బడ్జెట్‌ ఫ్రెండ్లీ వేరియంట్‌ ఇదే! - తగ్గిన ధర, పెరిగిన ఫీచర్లు
2026 మారుతి బ్రెజ్జా పూర్తి ధరల జాబితా విడుదల - ఏ వేరియంట్‌ రేటు ఎంతంటే?
AP Telangana Rain Alert: తీరం దాటనున్న వాయుగుండం.. తెలంగాణలో 8 జిల్లాలకు ఎల్లో అలర్ట్.. ఏపీలో ఆ జిల్లాలకు పిడుగుల వార్నింగ్
తీరం దాటనున్న వాయుగుండం.. తెలంగాణలో 8 జిల్లాలకు ఎల్లో అలర్ట్.. ఏపీలో అక్కడ పిడుగులు పడే అవకాశం
Driving Safety Tips: రోడ్డు మీద హీరో కావాలంటే స్పీడ్ కాదు.. సేఫ్టీ ముఖ్యం! ప్రతి డ్రైవర్ తప్పక తెలుసుకోవాల్సిన టిప్స్
బండి స్పీడ్‌లో ఉంది.. కానీ బ్రెయిన్‌ అలర్ట్‌గా ఉందా? ప్రమాదాలను తప్పించే సింపుల్ ట్రిక్స్
Embed widget