అన్వేషించండి

Deepavali 2025 : దసరా జరిగిన 20 రోజుల తర్వాతే దీపావళిని ఎందుకు చేసుకుంటారు? గూగుల్ మ్యాప్ చెప్పిన సీక్రెట్ ఇదే

Diwali Facts 2025 : ప్రతి సంవత్సరం దసరా తర్వాత 20 రోజులకి దీపావళి వస్తుంది. దీని వెనుక కారణం ఏంటో, ఇంట్రెస్టింగ్ విషయాలు ఏంటో ఇప్పుడు చూసేద్దాం.

Dussehra to Diwali Gap Story : భారతదేశంలో ప్రతి సంవత్సరం దీపావళి (Deepavali 2025)ని ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారు. సనాతన ధర్మంలో ఇది ముఖ్యమైన పండుగ. అయితే ఈ దీపాల పండుగ ప్రతి సంవత్సరం దసరా జరిగిన 20 లేదా 21 రోజుల తర్వాత వస్తుంది. ఈ సంవత్సరం 2025లో దసరా తర్వాత సరిగ్గా 20 రోజులకు అక్టోబర్ 20వ తేదీన వచ్చింది. అసలు దసరా జరిగిన.. 20 రోజుల తర్వాతే దీపావళిని ఎందుకు జరుపుకుంటారో తెలుసా? దీని వెనుక ఓ ఇంట్రెస్టింగ్ రీజన్ ఉందట. దీనిగురించి అందరికీ పెద్దగా తెలియకపోవచ్చు. మరి ఆ కారణమేంటో ఇప్పుడు చూసేద్దాం. 

దసరా తర్వాత 20 రోజులకే దీపావళి.. ఎందుకంటే..

దసరా తర్వాత 20 లేదా 21 రోజుల తర్వాత దీపావళిని జరుపుకోవడానికి ఒక మతపరమైన నమ్మకం ఉంది. మహర్షి వాల్మీకి రామాయణం ప్రకారం.. రావణుడు సీతను ఎత్తుకెళ్లిన తర్వాత.. వానర సైన్యంతో వెళ్లిన రాముడు.. లంకాధిపతి రావణుడిని వధిస్తాడు. అనంతరం ధర్మం వైపు నిలిచిన బంగారు లంకను రావణుడి తమ్ముడు విభీషణుడికి అప్పగిస్తాడు. రావణుడి సంహరణకు ప్రతీకగా దసరా చేసుకుంటారు. ఆ తర్వాత శ్రీరాముడు సీతా సమేతుడై.. అయోధ్యకు తిరిగి వస్తాడు. ఇలా లంక నుంచి రాముడు అయోధ్య రావడానికి మొత్తం 20 రోజులు పట్టిందని వాల్మికీ రామాయణం చెప్తోంది. రాముడు రాగానే అయోధ్య నగరంలోని వారందరూ ఆయనకు స్వాగతం పలుకుతూ దీపాలు వెలిగించారని.. అప్పటి నుంచి ఈ పండుగను దీపావళిగా జరుపుకోవడం ప్రారంభించారని చెప్తోంది రామాయణం. ప్రతి సంవత్సరం తిథుల ప్రకారం దసరా తర్వాత 20 లేదా 21 రోజులకు దీపావళి చేస్తారు. 

గూగుల్ మ్యాప్ ఏం చెబుతోంది?

దసరా తర్వాత దీపావళిని జరుపుకోవడం గురించి విశ్లేషిస్తే.. అనేక ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వస్తాయి. ఎలా అంటే.. శ్రీరాముడు శ్రీలంక నుంచి భారతదేశానికి ప్రయాణించారు. కాబట్టి ఇప్పుడు ఉపయోగించే గూగుల్ మ్యాప్ ద్వారా రెండు స్థానాల మధ్య ప్రయాణ దూరాన్ని సులభంగా లెక్కించవచ్చు. దాని కోసం ఫోన్‌లో గూగుల్ మ్యాప్‌ ఓపెన్ చేయాలి. ఆ తర్వాత మీ లొకేషన్​లో శ్రీలంకను ఎంచుకుని.. గమ్యస్థానంలో అయోధ్య, ఉత్తరప్రదేశ్‌ను ఎంచుకోవాలి. ఇప్పుడు సెర్చ్ చేస్తే.. ఈ మొత్తం దూరం 3127 కి.మీ అని చూపిస్తుంది.


Deepavali 2025 : దసరా జరిగిన 20 రోజుల తర్వాతే దీపావళిని ఎందుకు చేసుకుంటారు? గూగుల్ మ్యాప్ చెప్పిన సీక్రెట్ ఇదే

వాకింగ్ సింబల్​పై క్లిక్ చేస్తే.. సమయం చూపిస్తుంది. అప్పుడు మొత్తం సమయం 491 గంటలు ఉంటుంది. అంటే ఇరవైన్నర రోజులు అని చూపిస్తుంది. అందుకే దీపావళి కొన్నిసార్లు దసరా నుంచి 20 రోజుల తర్వాత.. మరికొన్నిసార్లు 21 రోజుల తర్వాత జరుపుకుంటారు. ఓ రకంగా టెక్నాలజీ కూడా 20 రోజుల ప్రయాణాన్ని సమర్థిస్తుందని భక్తులు బలంగా నమ్ముతున్నారు.

గమనిక : ఇక్కడ అందించిన సమాచారం నమ్మకాలు, సమాచారంపై మాత్రమే ఆధారపడి ఉంటుంది. ABP దేశం ఏదైనా నమ్మకం లేదా సమాచారాన్ని ధృవీకరించట్లేదు. ఏదైనా సమాచారం లేదా నమ్మకాన్ని ఫాలో అవ్వడానికి ముందు సంబంధిత నిపుణుడిని సంప్రదించండి. 

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ మూడేళ్లు పనిచేశారు. తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో సంవత్సరం పాటు సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్​గా పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశంలో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ ఇస్తున్నారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Besan and Lemon Face Pack : ముఖంపై ట్యాన్, డల్‌నెస్ పెరిగిందా? అయితే శనగపిండి-నిమ్మకాయ ఫేస్‌ప్యాక్‌తో చెక్ పెట్టేయండి
ముఖంపై ట్యాన్, డల్‌నెస్ పెరిగిందా? అయితే శనగపిండి-నిమ్మకాయ ఫేస్‌ప్యాక్‌తో చెక్ పెట్టేయండి
Daily Tea Consumption : రోజుకు ఎన్ని కప్పుల టీ తాగాలి? వయసు, ఆరోగ్యాన్ని బట్టి సరైన మోతాదు ఇదే
రోజుకు ఎన్ని కప్పుల టీ తాగాలి? వయసు, ఆరోగ్యాన్ని బట్టి సరైన మోతాదు ఇదే
Cumin vs Fennel Seeds : జీర్ణక్రియ నుంచి వెయిట్ లాస్ వరకు.. జీలకర్ర మంచిదా? సోంపు మంచిదా? రెండింటి మధ్య తేడాలు ఇవే
జీర్ణక్రియ నుంచి వెయిట్ లాస్ వరకు.. జీలకర్ర మంచిదా? సోంపు మంచిదా? రెండింటి మధ్య తేడాలు ఇవే
World Bicycle Day : రోజూ సైక్లింగ్ చేస్తే గుండెకు, ఆరోగ్యానికి ఎన్ని లాభాలో.. కానీ వీరు మాత్రం జాగ్రత్త అంటోన్న కార్డియాలజిస్ట్
రోజూ సైక్లింగ్ చేస్తే గుండెకు, ఆరోగ్యానికి ఎన్ని లాభాలో.. కానీ వీరు మాత్రం జాగ్రత్త అంటోన్న కార్డియాలజిస్ట్

వీడియోలు

AB de Villiers comments On Gujarat Titans | గుజరాత్ టీమ్‌పై ఏబీ డివిలియర్స్ ఫైర్
Gujarat Titans Team Bus Catches Fire | గుజరాత్ టైటాన్స్ బస్సులో అగ్నిప్రమాదం
Krunal Pandya 5 Fingers Celebration | వైరల్ అవుతున్న కృనాల్ పాండ్యా సెలబ్రేషన్స్
Akash Chopra Comments on Shumban Gill | గిల్‌పై ఆకాశ్ చోప్రా సంచలన వ్యాఖ్యలు
Sai Sudharsan Sledges Virat Kohli In IPL 2026 | కోహ్లీ, సాయి సుదర్శన్ మధ్య మాటల యుద్ధం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan Press Meet: తెలంగాణ 100 శాతం భూమిపుత్రుల జాగీరే.. కానీ మనసుల్లో విభజన రేఖలు వద్దు! - అమరావతిలో పవన్ కీలక వ్యాఖ్యలు
తెలంగాణ 100 శాతం భూమిపుత్రుల జాగీరే.. కానీ మనసుల్లో విభజన రేఖలు వద్దు! - అమరావతిలో పవన్ కీలక వ్యాఖ్యలు
KTR vs Pawan Kalyan:
"పవన్‌ కల్యాణ్‌ను గౌరవిస్తా, అభిమానిస్తా, బిర్యానీ పెడతా కానీ..." కేటీఆర్ ఆసక్తికర కామెంట్స్‌
Imtiaz Ali : లవ్ స్టోరీస్ తీసేందుకు ఇదే రైట్ టైం - యాక్షన్ మూవీస్ ట్రెండ్‌పై ఇంతియాజ్ అలీ రియాక్షన్
లవ్ స్టోరీస్ తీసేందుకు ఇదే రైట్ టైం - యాక్షన్ మూవీస్ ట్రెండ్‌పై ఇంతియాజ్ అలీ రియాక్షన్
Telangana AP Weather Alert June 2026: తెలుగు రాష్ట్రాల ప్రజలకు గుడ్ న్యూస్‌! రెండు రోజుల్లో ఏపీలోకి నైరుతి ప్రవేశం!
తెలుగు రాష్ట్రాల ప్రజలకు గుడ్ న్యూస్‌! రెండు రోజుల్లో ఏపీలోకి నైరుతి ప్రవేశం!
TTD Ghee Scam: టీటీడీ కల్తీ నెయ్యి స్కామ్‌పై ఈడీ మెరుపు దాడులు- దేశవ్యాప్తంగా 15 చోట్ల సోదాలు.. రూ.45 కోట్ల ఆస్తులు సీజ్!
టీటీడీ కల్తీ నెయ్యి స్కామ్‌పై ఈడీ మెరుపు దాడులు- దేశవ్యాప్తంగా 15 చోట్ల సోదాలు.. రూ.45 కోట్ల ఆస్తులు సీజ్!
Karnataka Chief Minister DK Shivakumar : కర్ణాటక ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్! మంత్రులుగా 13 మంది ప్రమాణం 
కర్ణాటక ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్! మంత్రులుగా 13 మంది ప్రమాణం 
Delhi Fire Accident: ఢిల్లీ రెస్టారెంట్లో అగ్నిప్రమాదంలో 20 మంది మృతి.. ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన ప్రధాని నరేంద్ర మోదీ
ఢిల్లీ రెస్టారెంట్లో అగ్నిప్రమాదంలో 20 మంది మృతి.. ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన ప్రధాని నరేంద్ర మోదీ
Congress Internal Rifts: ఇందిరమ్మ ఇళ్ల కోటా లొల్లి - పల్లెల్లో సెగ రేపుతున్న లబ్ధిదారుల ఎంపిక.. కాంగ్రెస్ నేతల్లోనే అంతర్గత కుమ్ములాటలు!
ఇందిరమ్మ ఇళ్ల కోటా లొల్లి - పల్లెల్లో సెగ రేపుతున్న లబ్ధిదారుల ఎంపిక.. కాంగ్రెస్ నేతల్లోనే అంతర్గత కుమ్ములాటలు!
Embed widget