అన్వేషించండి

Deepavali 2025 : దసరా జరిగిన 20 రోజుల తర్వాతే దీపావళిని ఎందుకు చేసుకుంటారు? గూగుల్ మ్యాప్ చెప్పిన సీక్రెట్ ఇదే

Diwali Facts 2025 : ప్రతి సంవత్సరం దసరా తర్వాత 20 రోజులకి దీపావళి వస్తుంది. దీని వెనుక కారణం ఏంటో, ఇంట్రెస్టింగ్ విషయాలు ఏంటో ఇప్పుడు చూసేద్దాం.

Dussehra to Diwali Gap Story : భారతదేశంలో ప్రతి సంవత్సరం దీపావళి (Deepavali 2025)ని ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారు. సనాతన ధర్మంలో ఇది ముఖ్యమైన పండుగ. అయితే ఈ దీపాల పండుగ ప్రతి సంవత్సరం దసరా జరిగిన 20 లేదా 21 రోజుల తర్వాత వస్తుంది. ఈ సంవత్సరం 2025లో దసరా తర్వాత సరిగ్గా 20 రోజులకు అక్టోబర్ 20వ తేదీన వచ్చింది. అసలు దసరా జరిగిన.. 20 రోజుల తర్వాతే దీపావళిని ఎందుకు జరుపుకుంటారో తెలుసా? దీని వెనుక ఓ ఇంట్రెస్టింగ్ రీజన్ ఉందట. దీనిగురించి అందరికీ పెద్దగా తెలియకపోవచ్చు. మరి ఆ కారణమేంటో ఇప్పుడు చూసేద్దాం. 

దసరా తర్వాత 20 రోజులకే దీపావళి.. ఎందుకంటే..

దసరా తర్వాత 20 లేదా 21 రోజుల తర్వాత దీపావళిని జరుపుకోవడానికి ఒక మతపరమైన నమ్మకం ఉంది. మహర్షి వాల్మీకి రామాయణం ప్రకారం.. రావణుడు సీతను ఎత్తుకెళ్లిన తర్వాత.. వానర సైన్యంతో వెళ్లిన రాముడు.. లంకాధిపతి రావణుడిని వధిస్తాడు. అనంతరం ధర్మం వైపు నిలిచిన బంగారు లంకను రావణుడి తమ్ముడు విభీషణుడికి అప్పగిస్తాడు. రావణుడి సంహరణకు ప్రతీకగా దసరా చేసుకుంటారు. ఆ తర్వాత శ్రీరాముడు సీతా సమేతుడై.. అయోధ్యకు తిరిగి వస్తాడు. ఇలా లంక నుంచి రాముడు అయోధ్య రావడానికి మొత్తం 20 రోజులు పట్టిందని వాల్మికీ రామాయణం చెప్తోంది. రాముడు రాగానే అయోధ్య నగరంలోని వారందరూ ఆయనకు స్వాగతం పలుకుతూ దీపాలు వెలిగించారని.. అప్పటి నుంచి ఈ పండుగను దీపావళిగా జరుపుకోవడం ప్రారంభించారని చెప్తోంది రామాయణం. ప్రతి సంవత్సరం తిథుల ప్రకారం దసరా తర్వాత 20 లేదా 21 రోజులకు దీపావళి చేస్తారు. 

గూగుల్ మ్యాప్ ఏం చెబుతోంది?

దసరా తర్వాత దీపావళిని జరుపుకోవడం గురించి విశ్లేషిస్తే.. అనేక ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వస్తాయి. ఎలా అంటే.. శ్రీరాముడు శ్రీలంక నుంచి భారతదేశానికి ప్రయాణించారు. కాబట్టి ఇప్పుడు ఉపయోగించే గూగుల్ మ్యాప్ ద్వారా రెండు స్థానాల మధ్య ప్రయాణ దూరాన్ని సులభంగా లెక్కించవచ్చు. దాని కోసం ఫోన్‌లో గూగుల్ మ్యాప్‌ ఓపెన్ చేయాలి. ఆ తర్వాత మీ లొకేషన్​లో శ్రీలంకను ఎంచుకుని.. గమ్యస్థానంలో అయోధ్య, ఉత్తరప్రదేశ్‌ను ఎంచుకోవాలి. ఇప్పుడు సెర్చ్ చేస్తే.. ఈ మొత్తం దూరం 3127 కి.మీ అని చూపిస్తుంది.


Deepavali 2025 : దసరా జరిగిన 20 రోజుల తర్వాతే దీపావళిని ఎందుకు చేసుకుంటారు? గూగుల్ మ్యాప్ చెప్పిన సీక్రెట్ ఇదే

వాకింగ్ సింబల్​పై క్లిక్ చేస్తే.. సమయం చూపిస్తుంది. అప్పుడు మొత్తం సమయం 491 గంటలు ఉంటుంది. అంటే ఇరవైన్నర రోజులు అని చూపిస్తుంది. అందుకే దీపావళి కొన్నిసార్లు దసరా నుంచి 20 రోజుల తర్వాత.. మరికొన్నిసార్లు 21 రోజుల తర్వాత జరుపుకుంటారు. ఓ రకంగా టెక్నాలజీ కూడా 20 రోజుల ప్రయాణాన్ని సమర్థిస్తుందని భక్తులు బలంగా నమ్ముతున్నారు.

గమనిక : ఇక్కడ అందించిన సమాచారం నమ్మకాలు, సమాచారంపై మాత్రమే ఆధారపడి ఉంటుంది. ABP దేశం ఏదైనా నమ్మకం లేదా సమాచారాన్ని ధృవీకరించట్లేదు. ఏదైనా సమాచారం లేదా నమ్మకాన్ని ఫాలో అవ్వడానికి ముందు సంబంధిత నిపుణుడిని సంప్రదించండి. 

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ మూడేళ్లు పనిచేశారు. తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో సంవత్సరం పాటు సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్​గా పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశంలో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ ఇస్తున్నారు.

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Supreme Court: కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
MLC Kavitha: బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
Pawan Kalyan : పవర్ స్టార్... మార్షల్ ఆర్ట్స్ 'న్యూ చాప్టర్' - రిమైండ్ ద డేట్... ఫ్యాన్స్‌కు సస్పెన్స్?
పవర్ స్టార్... మార్షల్ ఆర్ట్స్ 'న్యూ చాప్టర్' - రిమైండ్ ద డేట్... ఫ్యాన్స్‌కు సస్పెన్స్?
Anasuya Bharadwaj : హీరోయిన్ రాశికి సారీ చెప్పిన అనసూయ - ఆ డైలాగ్‍పై క్షమాపణలు చెబుతూ పోస్ట్
హీరోయిన్ రాశికి సారీ చెప్పిన అనసూయ - ఆ డైలాగ్‍పై క్షమాపణలు చెబుతూ పోస్ట్
Advertisement

వీడియోలు

అగార్కర్‌పై మహ్మద్ షమి కోచ్ సంచలన కామెంట్స్
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా!
ఫార్మ్ లో లేడని తెలుసు  కానీ ఇలా చేస్తారని అనుకోలేదు: రికీ పాంటింగ్
ఇంకా అందని ఆసియా కప్ ట్రోఫీ.. నఖ్వీ షాకింగ్ కామెంట్స్..
బెంగళూరు to గోదావరి.. ఈ స్పెషల్ ట్రైన్ ఉందని మీలో ఎంతమందికి తెలుసు?
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Supreme Court: కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
MLC Kavitha: బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
Pawan Kalyan : పవర్ స్టార్... మార్షల్ ఆర్ట్స్ 'న్యూ చాప్టర్' - రిమైండ్ ద డేట్... ఫ్యాన్స్‌కు సస్పెన్స్?
పవర్ స్టార్... మార్షల్ ఆర్ట్స్ 'న్యూ చాప్టర్' - రిమైండ్ ద డేట్... ఫ్యాన్స్‌కు సస్పెన్స్?
Anasuya Bharadwaj : హీరోయిన్ రాశికి సారీ చెప్పిన అనసూయ - ఆ డైలాగ్‍పై క్షమాపణలు చెబుతూ పోస్ట్
హీరోయిన్ రాశికి సారీ చెప్పిన అనసూయ - ఆ డైలాగ్‍పై క్షమాపణలు చెబుతూ పోస్ట్
Kavitha New Party: రాజకీయ శక్తిగా జాగృతి - మావోయిస్టు సానుభూతిపరులు కలసి రావాలని కవిత పిలుపు
రాజకీయ శక్తిగా జాగృతి - మావోయిస్టు సానుభూతిపరులు కలసి రావాలని కవిత పిలుపు
Nicolas Maduro Guerra Warning:చరిత్ర చెబుతుంది ద్రోహి ఎవరో? తల్లి మీద ఒట్టు అంటూ ట్రంప్‌కు మదురో కుమారుడు వార్నింగ్
చరిత్ర చెబుతుంది ద్రోహి ఎవరో? తల్లి మీద ఒట్టు అంటూ ట్రంప్‌కు మదురో కుమారుడు వార్నింగ్
Telugu Woman Murder: అమెరికాలో తెలుగు యువతి దారుణహత్య.. బాయ్ ఫ్రెండ్ ఫ్లాట్‌లో డెడ్‌బాడీ లభ్యం
అమెరికాలో తెలుగు యువతి దారుణహత్య.. బాయ్ ఫ్రెండ్ ఫ్లాట్‌లో డెడ్‌బాడీ లభ్యం
Nizamabad Crime News:నిజామాబాద్‌లో మిస్టరీ డెత్‌; గుండెపోటుతో భర్త చనిపోయినట్టు భార్య డ్రామా! ఒక్క ఫోన్ కాల్‌తో ఆటకట్టు!
నిజామాబాద్‌లో మిస్టరీ డెత్‌; గుండెపోటుతో భర్త చనిపోయినట్టు భార్య డ్రామా! ఒక్క ఫోన్ కాల్‌తో ఆటకట్టు!
Embed widget