అన్వేషించండి

Coronavirus: కూరగాయలకు కూడా కరోనా టెస్టులు... నెగిటివ్ సర్టిఫికెట్ చూపిస్తేనే కొనుగోళ్లు

కరోనా వైరస్ వల్ల పరిస్థితి ఎంతగా దిగజారిందో చెప్పే సంఘటన ఇది.

కరోనా వైరస్ ప్రపంచాన్ని చుట్టేసింది. మొదటి వేవ్, రెండో వేవ్... ఇప్పుడు మూడో వేవ్, ఇంకెన్ని వేవ్‌లు వస్తాయో ఎవరికీ తెలియదు. కొత్త వేరియంట్లు కూడా ఎప్పటికప్పుడు పుట్టుకొస్తూ పరిస్థితిని మరింత దిగజారుస్తున్నాయి. కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ఏకంగా పిల్ల వేరియంట్లను కూడా పుట్టించేసి చాప కింద నీరులా పాకేస్తోంది. మనదేశంలో పరిస్థితి ఇలా ఉంటే దాని పుట్టినిల్లు అదేనండి చైనాలో పరిస్థితులు మరీ దారుణంగా ఉన్నాయి. వైరస్ భయానికి చాలా మంది కూరగాయలు కొనేందుకు కూడా భయపడుతున్నారు. కూరగాయలపై కూడా వైరస్ కొన్ని గంటల పాటూ ఉంటుందని వారి నమ్మకం. అందుకే అక్కడ  కూరగాయల ధరలే కాదు, అమ్మకాలు కూడా దారుణంగా పడిపోయాయి. 

చైనాలోని హెనాన్ ప్రావిన్స్ లో పరిస్థితి మరీ దిగజారింది. కూరగాయలు, ఉల్లిపాయలు, వెల్లుల్లి పాయల్లాంటివి అమ్ముడవ్వడం లేదు. కొనుగోలుదారులు కూరగాయలు వైరస్ రహితమైనవని రిపోర్టు చూపిస్తేనే కొంటామని చెబుతున్నారు. దీంతో రైతులు ప్రభుత్వాన్ని ఆశ్రయించారు. అక్కడి స్థానిక ప్రభుత్వం స్పందించి కూరగాయలకు కరోనా టెస్టులు చేయిస్తోంది. న్యూక్లియిక్ యాసిడ్ పరీక్షలను నిర్వహిస్తోంది. అధికారులు పంటలు ఉన్న చోటికి, మార్కెట్లకు వెళ్లి మరీ ఈ పరీక్షలు చేస్తున్నారు. ఈ వ్యవహారమంతా చైనాలోని సోషల్ మీడియాలో చాలా వైరల్ అయ్యింది. అక్కడి పాపులర్ సోషల్ మీడియా సీనా వీబో. ఇందులో ఇప్పుడిదే హాట్ టాపిక్. కూరగాయలకు పరీక్షలు చేస్తున్న వీడియోలు, ఫోటోలు తెగ షేర్ అవుతున్నాయి. 

అక్కడి నెటిజన్లు దీనిపై రకరకాలు స్పందిస్తున్నారు. ఒక నెటిజన్ ‘నేను చూసిన అతి వినోదాత్మకమైన కోవిడ్ టెస్టు ఇదే’ అని కామెంట్ చేయగా మరొకరు ‘అమ్మేవాళ్లు, కొనేవాళ్లు ఇద్దరూ అతి జాగ్రత్తపరులు, అయినా వైరస్ తెచ్చుకునే కన్నా పరీక్షలు చేయడం ఉత్తమమైన పద్ధతి’ అని అభిప్రాయపడ్డారు. చైనాలో పలుచోట్ల కొత్త కేసులు వస్తుండడంతో ప్రజలు భయభ్రాంతులకు గురై ఇలా కూరగాయలు కొనాలన్న భయపడుతున్నారు. చైనా రాజధాని బీజింగ్, షాంఘై, టియాంజిన్ నగరాల్లో కేసులు సంఖ్య పెరగుతోందని సమాచారం. 

కరోనా వైరస్ ఆహారం ద్వారా వ్యాప్తి చెందుతున్నట్టు ఇంతవరకు ఏ అధ్యయనం తేల్చలేదు. పొట్లాల్లో కట్టిన ఆహారాన్ని తింటే ఆ పొట్లాల ద్వారా కరోనా రావచ్చేమో కానీ, ఆహారం ద్వారా వచ్చినట్టు ఎక్కడా రికార్డుల్లో లేదు. నీటిని కూడా స్థానిక ప్రభుత్వం శుధ్ది చేసి క్రిమిసంహారకమందులు చల్లి పంపిణీ చేస్తుంది. కాబట్టి కరోనా నీటి ద్వారా సంక్రమించిన దాఖలాలు లేవు.

Also read: టాటూ వేయించుకుంటున్నారా? అయితే వేయించుకోవడానికి ముందు, తరువాత ఈ పనులు చేయకూడదు

Also read: కాఫీ ప్రియులకు శుభవార్త... ఆ క్యాన్సర్ నుంచి రక్షణ కల్పించే సత్తా కాఫీకే ఉంది, వెల్లడించిన కొత్త అధ్యయనం

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Andhra Pradesh Latest Updates: 2029లో కూటమిగానే పోటీ- కలిసి నడవాలని నేతలకు చంద్రబాబు సూచన- లిక్కర్‌ వ్యాపారానికి దూరంగా ఉండాలని హెచ్చరిక
2029లో కూటమిగానే పోటీ- కలిసి నడవాలని నేతలకు చంద్రబాబు సూచన- లిక్కర్‌ వ్యాపారానికి దూరంగా ఉండాలని హెచ్చరిక
Telangana latest News: మూసీ నిర్వాసితుల వద్దకు ఇద్దరం వెళ్దామని రేవంత్‌కు హరీష్‌ సవాల్‌- నది చుట్టూ రిటైనింగ్ వాల్ నిర్మించాలని కిషన్ రెడ్డి డిమాండ్
మూసీ నిర్వాసితుల వద్దకు ఇద్దరం వెళ్దామని రేవంత్‌కు హరీష్‌ సవాల్‌- నది చుట్టూ రిటైనింగ్ వాల్ నిర్మించాలని కిషన్ రెడ్డి డిమాండ్
Andhra BJP : మహారాష్ట్ర ఎన్నికల్లో ఏపీ బీజేపీ నేతలకు కీలక బాధ్యతలు - నాందేడ్ పరిశీలకుడిగా విష్ణువర్ధన్ రెడ్డి
మహారాష్ట్ర ఎన్నికల్లో ఏపీ బీజేపీ నేతలకు కీలక బాధ్యతలు - నాందేడ్ పరిశీలకుడిగా విష్ణువర్ధన్ రెడ్డి
HYDRA Updates: మరో బిగ్ ఆపరేషన్‌కు సిద్ధమవుతున్న హైడ్రా- ట్రాఫిక్ పోలీసు అధికారులతో సంప్రదింపులు
మరో బిగ్ ఆపరేషన్‌కు సిద్ధమవుతున్న హైడ్రా- ట్రాఫిక్ పోలీసు అధికారులతో సంప్రదింపులు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

నటి తమన్నాని ప్రశ్నించిన ఈడీ, మనీ లాండరింగ్ కేసులో విచారణహమాస్ చీఫ్ సిన్వర్ హతం, కీలక ప్రకటన చేసిన ఇజ్రాయేల్సల్మాన్ ఖాన్‌కి మరోసారి బెదిరింపులు, వాట్సాప్‌లో మెసేజ్‌అంబానీ Vs మస్క్: బిలియనీర్స్ మధ్య వార్ ఎందుకు!

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra Pradesh Latest Updates: 2029లో కూటమిగానే పోటీ- కలిసి నడవాలని నేతలకు చంద్రబాబు సూచన- లిక్కర్‌ వ్యాపారానికి దూరంగా ఉండాలని హెచ్చరిక
2029లో కూటమిగానే పోటీ- కలిసి నడవాలని నేతలకు చంద్రబాబు సూచన- లిక్కర్‌ వ్యాపారానికి దూరంగా ఉండాలని హెచ్చరిక
Telangana latest News: మూసీ నిర్వాసితుల వద్దకు ఇద్దరం వెళ్దామని రేవంత్‌కు హరీష్‌ సవాల్‌- నది చుట్టూ రిటైనింగ్ వాల్ నిర్మించాలని కిషన్ రెడ్డి డిమాండ్
మూసీ నిర్వాసితుల వద్దకు ఇద్దరం వెళ్దామని రేవంత్‌కు హరీష్‌ సవాల్‌- నది చుట్టూ రిటైనింగ్ వాల్ నిర్మించాలని కిషన్ రెడ్డి డిమాండ్
Andhra BJP : మహారాష్ట్ర ఎన్నికల్లో ఏపీ బీజేపీ నేతలకు కీలక బాధ్యతలు - నాందేడ్ పరిశీలకుడిగా విష్ణువర్ధన్ రెడ్డి
మహారాష్ట్ర ఎన్నికల్లో ఏపీ బీజేపీ నేతలకు కీలక బాధ్యతలు - నాందేడ్ పరిశీలకుడిగా విష్ణువర్ధన్ రెడ్డి
HYDRA Updates: మరో బిగ్ ఆపరేషన్‌కు సిద్ధమవుతున్న హైడ్రా- ట్రాఫిక్ పోలీసు అధికారులతో సంప్రదింపులు
మరో బిగ్ ఆపరేషన్‌కు సిద్ధమవుతున్న హైడ్రా- ట్రాఫిక్ పోలీసు అధికారులతో సంప్రదింపులు
Talliki Vandanam News: ఆంధ్రప్రదేశ్‌లో జనవరి నుంచి తల్లికి వందనం పథకం అమలు- ఎవరెవరికి ఇస్తారంటే?
ఆంధ్రప్రదేశ్‌లో జనవరి నుంచి తల్లికి వందనం పథకం అమలు- ఎవరెవరికి ఇస్తారంటే?
Ratan Tata Death Reason: రతన్‌ టాటా ఎలా చనిపోయారు, డాక్టర్ రిపోర్ట్‌లో ఏం ఉంది?
రతన్‌ టాటా ఎలా చనిపోయారు, డాక్టర్ రిపోర్ట్‌లో ఏం ఉంది?
Ticket Reservation Update: ట్రైన్ టికెట్ల అడ్వాన్స్‌ బుకింగ్‌ గడువు తగ్గించడానికి కారణమేంటీ? మేలు ప్రయాణికులకా? రైల్వేశాఖకా?
ట్రైన్ టికెట్ల అడ్వాన్స్‌ బుకింగ్‌ గడువు తగ్గించడానికి కారణమేంటీ? మేలు ప్రయాణికులకా? రైల్వేశాఖకా?
Suriya 44: సూర్య గ్యాంగ్‌స్టర్ కాదు... కొత్త సినిమా బ్యాక్‌డ్రాప్ మీద క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్
సూర్య గ్యాంగ్‌స్టర్ కాదు... కొత్త సినిమా బ్యాక్‌డ్రాప్ మీద క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్
Embed widget