అన్వేషించండి

New Deadly Virus : అలెర్ట్ - చైనా శాస్త్రవేత్తలు క్రియేట్ చేసిన మరో వైరస్.. ఇది మూడురోజుల్లోనే మనుషులను చంపేస్తుందట

Ebola Virus China : చైనా నుంచి వైరస్​లు రావడం కొత్తేమి కాదు. ప్రపంచాన్ని వణికించిన కరోనా వైరస్​ కూడా అక్కడి నుంచే వచ్చింది. ఇప్పుడు తాజాగా మూడు రోజుల్లో మనిషిని చంపేసే వైరస్​ను తయారు చేశారు. 

Deadly Virus Created by Chinese Scientists : వైరస్ సోకితే కొన్ని సమస్యలు ఇబ్బంది పెడుతాయి కానీ.. చైనాలోని శాస్త్రవేత్తలు క్రియేట్ చేసిన వైరస్​ సోకితే మూడు రోజుల్లో మనిషిని చనిపోతాడు. ఓ వ్యాధి, దానికి సంబంధించిన లక్షణాలను అధ్యయనం చేయాలనుకున్నారు. దాని పరిశోధనలో భాగంగా వారు ఓ ప్రాణాంతక వైరస్​ను సృష్టించారు. ఇంతకీ వారు ఏ వ్యాధిపై అధ్యయనం చేయాలనుకున్నారు. ఏ వైరస్​ను ఇంజెక్ట్ చేశారు. దానివల్ల కలిగే ప్రమాదం ఏమిటి? మరో ముప్పు రానుందా? వంటి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. 

ఇంజెక్ట్ చేసిన మూడు రోజుల్లోనే..

చైనాలోని హెబీ మెడికల్ యూనివర్శిటిలో శాస్త్రవేత్తలు ప్రాణాంతకమైన ఎబోలా(Ebola) వ్యాధిపై అధ్యయనం చేయడానికి ఓ వైరస్​ను రూపొందించారు. ఈ ప్రయోగానికి సంబంధించిన అధ్యయానం గురించి సైన్స్ డైరక్ట్​లో ప్రచురించారు. ఎబోలా, దాని లక్షణాలపై అధ్యయనం చేసేందుకు.. ఎబోలా సోకిన ఎలుకలకు ప్రాణాంతకమైన వైరస్​ను ఇంజెక్ట్ చేశారు. ఇలా ఇంజెక్ట్ చేసిన మూడు రోజుల్లోనే ఎలుకలు చనిపోయాయని పరిశోధకులు అధ్యయనంలో గుర్తించారు. తీవ్రమైన అవయవాల వైఫల్యంతో ఈ ఎలుకలు చనిపోయాయని వారు తెలిపారు. మానవుల్లోని ఎబోలా మాదిరి వ్యాధులు ఎలుకల్లో అభివృద్ధి అయ్యాయని షాకింగ్ విషయాలు తెలిపారు. 

ఎబోలాపై అధ్యయనంలో భాగంగా..

ప్రాణాంతకమైన ఎబోలా వైరస్​పై సింథటిక్ వైరస్​ని ఉపయోగించి.. వ్యాధికారక క్రిములను మరింత లోతుగా అర్థం చేసుకునేందుకు ట్రై చేశారు. అది కాస్త రివర్స్ కొట్టింది. ఈ వైరస్​ క్రియేషన్​ ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. ఎందుకంటే ఎబోలా మనుషులపై చూపించే ప్రభావాలను.. దీనిలో పరిశోధించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. దానికోసం వెసిక్యులర్ స్టోమాటిటిస్ వైరస్​ (VSV)ను ఎబోలా సోకిన ఎలుకలపై ఉపయోగించారు. ఈ వైరస్​ నుంచి గ్లైకో ప్రోటీన్​ (GP)ని తీసుకున్నారు. వైరస్​ ఎలుకలో ప్రవేశించడానికి, సోకడానికి ఈ ప్రోటీన్ కీలకమైనదిగా గుర్తించారు. ఇందుకోసం.. ఐదు ఆడ, ఐదు మగ ఎలుకలపై ప్రయోగించారు. 

తీవ్రమైన ప్రతికూల లక్షణాలతో..

వైరస్ ఇంజెక్ట్ చేసిన తర్వాత ఎలుకలు మానవుల్లోని ఎబోలా రోగుల మాదిరిగానే తీవ్రమైన లక్షణాలను అభివృద్ధి చేశాయి. వ్యాధులతో పాటు.. తీవ్రమైన ప్రతికూల లక్షణాలు కనిపించాయి. అంతేకాకుండా మూడు రోజులలో అవి మరణించాయి. కొన్ని ఎలుకల కళ్లలో నుంచి స్రావాలు కూడా వచ్చాయని.. కంటి చూపును కోల్పోయాయని అధ్యయనంలో పేర్కొన్నారు. అవి మరణించిన తర్వాత వైరస్ ప్రభావాన్ని విశ్లేషించేందుకు పరిశోధకులు వాటి అవయవాలను సేకరించారు. గుండె, కాలేయం, ఊపిరితిత్తులు, మూత్రపిండాలు వంటి ముఖ్యమైన అవయవాలను తీసుకున్నారు. 

మనుషులపై కూడా ఇదే ఇంపాక్ట్ ఉంటుంది..

పరిశోధకులు సేకరించిన అన్ని అవయవాల కణాజాలాలలో వైరస్​ పేరుకుపోయినట్లు గుర్తించారు. ఇది మానవుల్లో కూడా ఇదే తరహా లక్షణాలు చూపిస్తుందని గుర్తించారు. తీవ్రమైన లక్షణాలతో అవయవాలు డ్యామేజ్ అవతాయని నిర్థారించారు. బయోసేఫ్టీ లెవల్ 4 అవసరం లేకుండా ఎబోలా లక్షణాలు ప్రతిబింబించే నమూనా కోసం ఈ అధ్యయనం చేశారు. ఇలాంటి పరిశోధనకు అత్యంత సురక్షితమైన ల్యాబ్​లు అవసరమని పరిశోధకులు అభిప్రాయం వ్యక్తం చేశారు. 

అప్రమత్తంగా లేకుంటే మరో మహమ్మారి తప్పదు

ఈ స్టడీ ఎబోలాకు వ్యతిరేకంగా వైద్యపరమైన ప్రతికూలతలను వేగవంతం చేసేందుకు వీలవుతుంది. టీకాలు, చికిత్సలను అభివృద్ధి చేయడంలో హెల్ప్ చేస్తుంది. అయితే ముఖ్యమైన భద్రతా సమస్యలపై కూడా ప్రభావం చూపిస్తుంది. నియంత్రిత వాతావరణంలో ఈ తరహా ప్రాణాంతక వైరస్​ ప్రమాదవశాత్తు విడుదలైనా, దుర్వినియోగం చేసిన ఘోరమైన ప్రమాదాలను కలిగిస్తుంది. ప్రయోగశాలలో సరైన భద్రత తీసుకోకపోవడం వల్లనే కొవిడ్ మహమ్మారి ప్రపంచాన్ని వణికించింది. కాబట్టి ఈ తరహా పరిశోధనల విషయంలో మరింత జాగ్రత్తగా, అప్రమత్తంగా ఉండాలని చెప్తున్నారు. 

Also Read : మగవారికంటే ఆడవారే యూరిన్​ను ఎక్కువగా కంట్రోల్ చేసుకుంటారట.. సమస్య పెరగడానికి ఇదే ప్రధాన కారణం

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Chandra Babu: పోలవరం ఇక పరుగులు పెడుతుందా?- చంద్రబాబు పర్యటన కీలక మలుపు అవుతుందా?
పోలవరం ఇక పరుగులు పెడుతుందా? చంద్రబాబు పర్యటన కీలక మలుపు అవుతుందా?
Farmers loan : రుణమాఫీపై తెలంగాణ ప్రభుత్వం తీవ్ర కసరత్తు- కీలక ప్రతిపాదనలు రెడీ చేస్తున్న అధికారులు
రుణమాఫీపై తెలంగాణ ప్రభుత్వం తీవ్ర కసరత్తు- కీలక ప్రతిపాదనలు రెడీ చేస్తున్న అధికారులు
Janasena : జనసేనకు మరో డిప్యూటీ- పోటీలో బొలిశెట్టి, మండలి
జనసేనకు మరో డిప్యూటీ- పోటీలో బొలిశెట్టి, మండలి
Telangana News: గనుల వేలంపై తెలంగాణకు కేంద్రం డెడ్ లైన్, లేకపోతే తామే చేస్తామంటూ అలర్ట్
గనుల వేలంపై తెలంగాణకు కేంద్రం డెడ్ లైన్, లేకపోతే తామే చేస్తామంటూ అలర్ట్
Advertisement
Advertisement
Advertisement
metaverse

వీడియోలు

Two Sisters Stopped Cow Slaughtering | గోవధను ధైర్యంగా అడ్డుకున్న అక్కచెల్లెళ్లు | ABP DesamShyamala Rao Take Charges TTD EO | టీటీడీ ఈవో గా బాధ్యతలు చేపట్టిన శ్యామలరావు | ABP DesamDelhi Water Crisis | ఢిల్లీలో హింసకు దారి తీస్తున్న నీటి సంక్షోభం | ABP DesamChandrababu Visits Polavaram | ప్రతీ సోమవారం పోలవరం రోజుగా మళ్లీ పనులు మొదలు | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandra Babu: పోలవరం ఇక పరుగులు పెడుతుందా?- చంద్రబాబు పర్యటన కీలక మలుపు అవుతుందా?
పోలవరం ఇక పరుగులు పెడుతుందా? చంద్రబాబు పర్యటన కీలక మలుపు అవుతుందా?
Farmers loan : రుణమాఫీపై తెలంగాణ ప్రభుత్వం తీవ్ర కసరత్తు- కీలక ప్రతిపాదనలు రెడీ చేస్తున్న అధికారులు
రుణమాఫీపై తెలంగాణ ప్రభుత్వం తీవ్ర కసరత్తు- కీలక ప్రతిపాదనలు రెడీ చేస్తున్న అధికారులు
Janasena : జనసేనకు మరో డిప్యూటీ- పోటీలో బొలిశెట్టి, మండలి
జనసేనకు మరో డిప్యూటీ- పోటీలో బొలిశెట్టి, మండలి
Telangana News: గనుల వేలంపై తెలంగాణకు కేంద్రం డెడ్ లైన్, లేకపోతే తామే చేస్తామంటూ అలర్ట్
గనుల వేలంపై తెలంగాణకు కేంద్రం డెడ్ లైన్, లేకపోతే తామే చేస్తామంటూ అలర్ట్
Weather Latest Update: నైరుతికి తోడైన ద్రోణి- తెలుగు రాష్ట్రాల్లో మూడు రోజుల పాటు వర్షాలే
నైరుతికి తోడైన ద్రోణి- తెలుగు రాష్ట్రాల్లో మూడు రోజుల పాటు వర్షాలే
Palla Srinivasa Rao: టీడీపీ ఏపీ అధ్యక్షుడిగా పల్లా శ్రీనివాసరావు యాదవ్, గాజువాక ఎమ్మెల్యేకు చంద్రబాబు బాధ్యతలు
టీడీపీ ఏపీ అధ్యక్షుడిగా పల్లా శ్రీనివాసరావు యాదవ్, గాజువాక ఎమ్మెల్యేకు చంద్రబాబు బాధ్యతలు
Rushikonda Palace Photos: రుషికొండ రాజ్‌మహల్ రహస్యాలు! రూ.500 కోట్లతో కళ్లు చెదిరేలా నిర్మాణాలు, ఫొటోలు చూస్తే షాక్
రుషికొండ రాజ్‌మహల్ రహస్యాలు! రూ.500 కోట్లతో కళ్లు చెదిరేలా నిర్మాణాలు, ఫొటోలు చూస్తే షాక్
AP Minister Pawan Kalyan: ఏపీ డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ బాధ్యతల స్వీకరణకు ముహూర్తం ఫిక్స్
ఏపీ డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ బాధ్యతల స్వీకరణకు ముహూర్తం ఫిక్స్
Embed widget