అన్వేషించండి

Late Breakfast : టిఫిన్ లేట్​గా తింటున్నారా? వయసు పెరిగేకొద్ది ఆ తప్పు చేయకండి, ప్రాణాంతకమట

Breakfast Importance : ఉదయాన్నే తీసుకునే ఆహారంలో ఈ తప్పులు చేస్తే ఆరోగ్యానికి మంచిది కాదని చెప్తున్నారు. అలాగే ప్రాణాంతకమని చెప్తున్నారు. టిఫెన్ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చూసేద్దాం.

Disadvantages of Skipping or Delay Breakfast : ప్రతిరోజూ ఉదయం అల్పాహారం తీసుకోవడం చాలా ముఖ్యం. బ్రేక్​ఫాస్ట్​ స్కిప్ చేయవద్దని ఆరోగ్యానికి మంచిది కాదని చెప్తారు నిపుణులు. అంతేకాకుండా మీరు ఏ టైమ్​కి తింటున్నారు.. ఏమి తింటున్నారనేది కూడా ముఖ్యమేనని చెప్తున్నారు.  ఎందుకంటే ఈరోజు మీరు తీసుకునే ఆహారం.. వయసు పెరిగే కొద్ది ఆరోగ్యంపై ఇంపాక్ట్ చూపిస్తుందట. వయసు పెరిగేకొద్ది తెలియకుండానే ఆహారంలో మార్పు చేస్తూ ఉంటాము. అలా చేసే మార్పుల్లో కొందరు అల్పాహారం చాలా లేట్​గా తింటారు. లేదా అస్సలు పూర్తిగా తినడాన్ని ఆపేస్తారు. ఇది అస్సలు మంచిది కాదని.. ఇప్పుడు బాగానే ఉన్నా.. ఫ్యూచర్​లో ఇది మీ ఆరోగ్యంపై నెగిటివ్​ ప్రభావాలు చూపిస్తుందని చెప్తున్నారు. 

చిన్నవారికి, పెద్దవారికి తేడా అదే

ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్, టైమ్-రెస్ట్రిక్టెడ్ ఈటింగ్ వంటి పోకడలు ప్రజాదరణ పొందుతూనే ఉన్నాయి. అయితే వాటి ప్రభావాలు వయస్సు, వ్యక్తిగత ఆరోగ్య స్థితిని బట్టి మారవచ్చు. వయుసు తక్కువగా ఉండేవారు.. ఆహారం తీసుకునే సమయాన్ని తగ్గించడం వల్ల జీవక్రియకు ప్రయోజనం చేకూరుతుంది. కానీ పెద్దవారిలో ఆలస్యంగా లేదా అల్పాహారం మానేయడం వల్ల మంచి కంటే ఎక్కువ హాని జరుగుతుంది.

టిఫిన్​ లేట్​గా తింటే మంచిది కాదా?

బ్రేక్​ఫాస్ట్​ ఆలస్యంగా చేయడం వల్ల అంతర్లీన శారీరక లేదా మానసిక ఆరోగ్య సమస్యలు వస్తాయట. మొదటి భోజనాన్ని ఎంత ఆలస్యం చేస్తే అంత సమస్యలు పెరుగుతాయని చెప్తున్నారు. ముఖ్యంగా వయసు పెరిగే కొద్ది అలసట ఎక్కువ అవ్వడం, మానసిక స్థితిలో మార్పులు, నోటి ఆరోగ్యంలో ఇబ్బందులు, నిద్రలో ఇబ్బంది వంటి సమస్యలను ఎదుర్కొనే అవకాశం ఉందని చెప్తున్నారు. కొన్ని సందర్భాల్లో ఈ అలవాట్లు రోజూ చేసే పనులు చేయడంలో ఇబ్బందులు కలిగిస్తాయి. 

ఆహారం ఆలస్యంగా తీసుకోవడం వల్ల సర్కాడియన్ రిథమ్​లో మార్పులు వస్తాయి. ఇది నిద్ర, ఆకలిని నియంత్రిస్తుంది. దీనివల్ల సహజంగానే ఆలస్యంగా నిద్రపోయే, మేల్కొనే వ్యక్తులు రోజులో ఆలస్యంగా భోజనం చేసే అవకాశాలు పెరుగుతాయి. ఉంది. అయితే పెద్దవారిలో ఈ మార్పు జీవక్రియ, శక్తి స్థాయిలు, మొత్తం శ్రేయస్సుపై ప్రభావం చూపిస్తుంది.

ఆయుష్షుపై ప్రభావం.. 

ఆహార షెడ్యూల్‌ పాటించకపోతే.. వృద్ధాప్యం త్వరగా రావడంతో పాటు.. వయసు పెరిగాక ఆరోగ్య సమస్యలు మరింత పెరుగుతాయని చెప్తున్నారు. ముఖ్యంగా ఉదయం తీసుకునే మొదటి భోజనం.. జీర్ణక్రియ, హార్మోన్ల సమతుల్యత, మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తుంది కాబట్టి దానిని అస్సలు విస్మరించవద్దని చెప్తున్నారు. బ్రేక్​ఫాస్ట్​ అనేది శరీరంలోని అంతర్గత వ్యవస్థలను సమకాలీకరించడానికి సహాయపడుతుందని.. సరిగ్గా తినకపోయినా, తినడం మానేసినా ఇబ్బందులను కలిగిస్తుంది. ఆరోగ్య ప్రమాదాలతో పాటు మరణాల రేట్లతో సంబంధం కలిగి ఉంటుందట.

క్రమం తప్పకుండా భోజనం తీసుకోవడం.. ముఖ్యంగా అల్పాహారానికి ప్రాధాన్యత ఇవ్వడం.. మంచి ఆరోగ్యం, దీర్ఘాయువును కాపాడుకోవడానికి హెల్ప్ చేస్తుంది. సమతుల్యమైన భోజనం తీసుకోవడం, టైమ్​కి తీసుకోవడం ప్రారంభించినప్పుడు శరీరానికి కావాల్సిన శక్తి అందుతుంది. ఆరోగ్యానకి మేలు జరుగుతుంది. అల్పాహారం టైమ్​కి తినడం చిన్న మార్పే అయినా.. ఫ్యూచర్​లో మంచి ప్రయోజనాలు ఇస్తుంది.

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఆమె, డా. బి.ఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్శిటీ (Dr. BRAOU) నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. 2018లో హైదరాబాద్‌లో ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ ఆమె మూడేళ్లు పనిచేశారు.

తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో ఒక సంవత్సరం పాటు పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశం లో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ అందిస్తున్నారు.

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Vijayawada Temple Power Cut: విజయవాడ దుర్గ గుడికి కరెంట్ కట్ చేసిన విద్యుత్ శాఖ.. అసలేం జరిగింది
విజయవాడ దుర్గ గుడికి కరెంట్ కట్ చేసిన విద్యుత్ శాఖ.. అసలేం జరిగింది
Taiwan Earthquake: తైవాన్‌లో భారీ భూకంపం.. కంపించిన ఎత్తైన భవనాలు - రిక్టర్ స్కేలుపై 7 తీవ్రతతో ప్రకంపనలు
తైవాన్‌లో భారీ భూకంపం.. కంపించిన ఎత్తైన భవనాలు - రిక్టర్ స్కేలుపై 7 తీవ్రతతో ప్రకంపనలు
Amaravati Farmers: ఇంకా ఎంతమందిని చంపుతారు.. కేంద్రమంత్రి పెమ్మసానికి అమరావతి రైతుల సెగ.. అసలు కోపం ఎమ్మెల్యేపై
ఇంకా ఎంతమందిని చంపుతారు.. పెమ్మసానికి అమరావతి రైతుల సెగ.. అసలు కోపం ఎమ్మెల్యేపై
Division of Andhra Pradesh Districts: ఏపీలో కొత్త జిల్లాలు, డివిజన్లపై డిసెంబర్ 31న తుది నోటిఫికేషన్ - చంద్రబాబు సమక్షంలో కీలక నిర్ణయం
ఏపీలో కొత్త జిల్లాలు, డివిజన్లపై డిసెంబర్ 31న తుది నోటిఫికేషన్ - చంద్రబాబు సమక్షంలో కీలక నిర్ణయం
Advertisement

వీడియోలు

India vs Sri Lanka 3rd T20 Highlights | మూడో టి20లో టీమ్ ఇండియా ఘన విజయం
Rohit Sharma Golden Duck | రోహిత్ శర్మ గోల్డెన్ డకౌట్
Virat Kohli Half Century in Vijay Hazare Trophy | 29 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేసిన కింగ్
Rinku Singh Century in Vijay Hazare Trophy | విజయ్ హజారే ట్రోఫీలీ రింకూ సింగ్ సెంచరీ
Union Minister Kishan Reddy Interview | త్వరలోనే ఆదిలాబాద్ ఎయిర్ పోర్ట్ అభివృద్ధి పనులు | ABP Desam
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vijayawada Temple Power Cut: విజయవాడ దుర్గ గుడికి కరెంట్ కట్ చేసిన విద్యుత్ శాఖ.. అసలేం జరిగింది
విజయవాడ దుర్గ గుడికి కరెంట్ కట్ చేసిన విద్యుత్ శాఖ.. అసలేం జరిగింది
Taiwan Earthquake: తైవాన్‌లో భారీ భూకంపం.. కంపించిన ఎత్తైన భవనాలు - రిక్టర్ స్కేలుపై 7 తీవ్రతతో ప్రకంపనలు
తైవాన్‌లో భారీ భూకంపం.. కంపించిన ఎత్తైన భవనాలు - రిక్టర్ స్కేలుపై 7 తీవ్రతతో ప్రకంపనలు
Amaravati Farmers: ఇంకా ఎంతమందిని చంపుతారు.. కేంద్రమంత్రి పెమ్మసానికి అమరావతి రైతుల సెగ.. అసలు కోపం ఎమ్మెల్యేపై
ఇంకా ఎంతమందిని చంపుతారు.. పెమ్మసానికి అమరావతి రైతుల సెగ.. అసలు కోపం ఎమ్మెల్యేపై
Division of Andhra Pradesh Districts: ఏపీలో కొత్త జిల్లాలు, డివిజన్లపై డిసెంబర్ 31న తుది నోటిఫికేషన్ - చంద్రబాబు సమక్షంలో కీలక నిర్ణయం
ఏపీలో కొత్త జిల్లాలు, డివిజన్లపై డిసెంబర్ 31న తుది నోటిఫికేషన్ - చంద్రబాబు సమక్షంలో కీలక నిర్ణయం
YSRCP Politics: ఆగని రప్పా.. రప్పా.. అరెస్ట్ చేసే కొద్దీ రెచ్చిపోతున్న వైకాపా శ్రేణులు
ఆగని రప్పా.. రప్పా.. అరెస్ట్ చేసే కొద్దీ రెచ్చిపోతున్న వైకాపా శ్రేణులు
Year Ender 2025: ఈ ఏడాది NPS లో 5 భారీ మార్పులు.. ఉద్యోగులకు ప్రయోజనం కలిగించే రూల్స్ ఇవే
ఈ ఏడాది NPS లో 5 భారీ మార్పులు.. ఉద్యోగులకు ప్రయోజనం కలిగించే రూల్స్ ఇవే
Hyderabad Crime Report: హైదరాబాద్‌లో 15 శాతం తగ్గిన నేరాలు.. మహిళలు, చిన్నారులపై పెరిగిన అఘాయిత్యాలు
హైదరాబాద్‌లో 15 శాతం తగ్గిన నేరాలు.. మహిళలు, చిన్నారులపై పెరిగిన అఘాయిత్యాలు
Kerala Gen Z political Leader: జెన్‌జీ తరం మున్సిపల్ చైర్మన్ దియా బిను - వారసురాలు కాదు.. నాయకత్వంతో ఎదిగిన లీడర్ -మనకూ స్ఫూర్తే !
జెన్‌జీ తరం మున్సిపల్ చైర్మన్ దియా బిను - వారసురాలు కాదు.. నాయకత్వంతో ఎదిగిన లీడర్ -మనకూ స్ఫూర్తే !
Embed widget