అన్వేషించండి

Breast Cancer: మహిళలూ రొమ్ము క్యాన్సర్ బారిన పడకుండా ఉండాలా? ఈ పంచ సూత్రాలు పాటించండి

మహిళలు ఎక్కువగా ఎదుర్కొంటున్న సమస్య రొమ్ము క్యాన్సర్. దీని నుంచి బయట పడాలంటే తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.

మహిళలు ఎదుర్కొంటున్న ముఖ్యమైన సమస్యలలో రొమ్ము క్యాన్సర్ ఒకటి. భారతదేశంలో ప్రతి నలుగురు మహిళల్లో ఒకరు రొమ్ము క్యాన్సర్ బారిన పడుతున్నాట్టు నివేదకలు వెల్లడిస్తున్నాయి. చాలా మంది మహిళలకి దీని గురించి అవగాహన లేక క్యాన్సర్ చివరి దశ వచ్చేంత వరకి గుర్తించలేకపోతున్నారు. అందుకే ఏటా అక్టోబర్ నెలని రొమ్ము క్యాన్సర్ అవేర్ నెస్ మంత్ గా పరిగణిస్తారు. మహిళలకి రొమ్ము క్యాన్సర్ గురించి అవగాహన కల్పించేందుకు పలు స్వచ్చంద సంస్థలు కార్యక్రమాలు ఏర్పాటు చేస్తూ ఉంటాయి.  

చెడు అలవాట్లతో పలు రకాల క్యాన్సర్లు 
ధూమపానం, పొగాకు నమలడం వంటివి చేయడం వల్ల కాలేయం, తల, గొంతు, ఊపిరితిత్తుల క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని తెలుసు. కానీ రొమ్ము క్యాన్సర్ విషయంలో మాత్రం అది ఎందుకు వస్తుంది అనేందుకు స్పష్టమైన కారణాలు ఏవి లేవని వైద్యులు వెల్లడించారు. అలా అని రొమ్ము క్యాన్సర్ వస్తే తగ్గించలేని స్థితి కాదని చెప్పుకొచ్చారు. అయితే క్యాన్సర్ వచ్చిన వెంటనే చికిత్స ద్వారా దీన్ని పరిష్కరించవచ్చు. లేదంటే రొమ్ము భాగం తొలగించాల్సి వస్తుంది. అందుకే ఈ క్యాన్సర్ బారిన పడకుండా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అవేంటంటే..

ఊబకాయాన్ని నివారించాలి: ప్రస్తుతం చాలా మంది ఊబకాయం, అధిక బరువు సమస్యతో బాధపడుతున్నారు. ఊబకాయం ఉన్న మహిళల్లో రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు నిపుణులు చెబుతున్నారు. అందుకే బరువు అదుపులో ఉంచుకోవాల్సిన అవసరం చాలా ఉంది. ఆహారం విషయంలో డైట్ పాటిస్తూ బరువు పెరగకుండా చూసుకోవాలి.

సమతుల్య ఆహారం తీసుకోవాలి: ఆహారంలో పిండి పదార్థాలు, ప్రోటీన్లు, కొవ్వులు సమతుల్యంగా ఉండే విధంగా చూసుకోవాలి. ప్రాసెస్ చేయబడిన ఆహారానికి దూరంగా ఉండాలి. ఉప్పు, చక్కెర అధిక వినియోగం తగ్గించాలి. తప్పనిసరిగా దినచర్యలో భాగంగా పండ్లు తీసుకోవడం, ఆకుకూరలు సైతం తీసుకోవాలి. కొన్ని రకాల కార్బో హైడ్రేట్స్ తగ్గించి తీసుకోవడం వల్ల క్యాన్సర్ ని నిరోధించవచ్చని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు. యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండే ఆహారం ఎంచుకోవాలి.

జీవనశైలిలో మార్పులు: ఆరోగ్యంగా ఉండాలంటే ఖచ్చితంగా రోజుకి కనీసం 30 నిమిషాల పాటు వ్యాయామం చెయ్యాలి. జిమ్ కి వెళ్ళి కష్టపడాల్సిన అవసరం లేకుండా ఇంట్లోనే సొంత పనులు చేసుకోవడం, నడక, ఒళ్లు వంచి పనులు చేసుకోవడం వంటివి చెయ్యొచ్చు. లిఫ్ట్ వాడకానికి బదులుగా మెట్లు ఎక్కడం, చిన్న చిన్న దూరాలకి వాహనాలు వినియోగించకుండా కాలి నడకకి ప్రాధాన్యత ఇవ్వడం అలవాటు చేసుకోవాలి. ఇవే కాకుండా యోగా, మెడిటేషన్, పలు రకాల ఎక్సర్ సైజ్ లు చేయడం అలవర్చుకుంటే అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టవచ్చు.

లేట్ ప్రెగ్నెన్సీ వద్దు: 30 ఏళ్ల తర్వాత ప్రసవం లాంటి కారణాలతో రొమ్ము క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంది. అందుకే వీలైనంత వరకు 30 ఏళ్లలోపు కనీసం ఒకసారి గర్భం ధరించాలని వైద్యులు సూచిస్తున్నారు.

చనుబాలు ఇవ్వాలి: అందం తరిగిపోతుంది కదా అని తల్లి పాలకి బదులుగా డబ్బా పాలు పడుతుంటారు కొందరు మహిళలు. కానీ తల్లి బిడ్డకి పాలు ఇవ్వడం వల్ల ఇద్దరికీ మేలు జరుగుతుంది. తల్లిపాలు రొమ్ము క్యాన్సర్ కి రక్షణగా నిలుస్తాయి. అందుకే బిడ్డకి కనీసం పుట్టిన తర్వాత నుంచి 6 నెలల పాటు తల్లిపాలు మాత్రమే ఇవ్వాలని వైద్యులు సిఫార్సు చేస్తారు.

రొమ్ము క్యాన్సర్ ని సకాలంలో గుర్తించి చికిత్స తీసుకోవచ్చు. 45 సంవత్సరాలు దాటిన ప్రతి మహిళ రొమ్ము క్యాన్సర్ కి సంబంధించి మామోగ్రామ్ పరీక్ష చేయించుకోవడం ఉత్తమం.

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.

Also read: ‘లివర్ సిర్రోసిస్’ అంటే ఏమిటీ? అది కాలేయ క్యాన్సర్‌‌గా మారకూడదంటే ఏం చేయాలి?

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Sara Tendulkar Skincare Routine : సారా టెండూల్కర్ స్కిన్ కేర్ సీక్రెట్స్ ఇవే.. సింపుల్ రొటీన్‌తో గ్లాస్ స్కిన్
సారా టెండూల్కర్ స్కిన్ కేర్ సీక్రెట్స్ ఇవే.. సింపుల్ రొటీన్‌తో గ్లాస్ స్కిన్
World Happiness Report : ఇండియాలో జనాలు సంతోషంగా లేరట.. తాజా రిపోర్ట్​లో ఇంట్రెస్టింగ్ విషయాలు, టాప్​లో ఉన్న దేశమిదే
ఇండియాలో జనాలు సంతోషంగా లేరట.. తాజా రిపోర్ట్​లో ఇంట్రెస్టింగ్ విషయాలు, టాప్​లో ఉన్న దేశమిదే
Water Tank Cleaning Tips : ఇంట్లో వాటర్ ట్యాంక్ ఇలా క్లీన్ చేయండి.. స్టెప్ బై స్టెప్ గైడ్
ఇంట్లో వాటర్ ట్యాంక్ ఇలా క్లీన్ చేయండి.. స్టెప్ బై స్టెప్ గైడ్
Backward Walking : ఉదయాన్నే 30 సెకన్లు వెనక్కి నడిస్తే చాలు.. శారీరక, మానసిక ప్రయోజనాలు పొందడం ఖాయం
ఉదయాన్నే 30 సెకన్లు వెనక్కి నడిస్తే చాలు.. శారీరక, మానసిక ప్రయోజనాలు పొందడం ఖాయం

వీడియోలు

Madhu Park Ridge Issue Updates | బండ్లగూడ కూల్చివేతలు గాంధీ సరోవర్ కోసం కాదు.!
Ashwin Predicts RCB to Win IPL 2026 | ఆర్‌సీబీపై అశ్విన్ ఆసక్తికర విశ్లేషణ
Tilak Varma about Mega Family | మెగాస్టార్ పై తిలక్ వర్మ ఎమోషనల్ కామెంట్స్
Mohammad Kaif Warns Gujarat Titans | గుజరాత్ టైటాన్స్‌కు మహమ్మద్ కైఫ్ వార్నింగ్
Ishan Kishan SRH Practice Match | ఇషాన్ కిషన్‌పై యువ బౌలర్ ఫైర్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Iran US War Updates: శత్రువులపై నిషేధం.. మిత్ర దేశాలపై హర్మూజ్‌లో ఆంక్షలు లేవు: ట్రంప్ హెచ్చరికపై ఇరాన్ అధ్యక్షుడు
శత్రువులపై నిషేధం.. మిత్ర దేశాలపై హర్మూజ్‌లో ఆంక్షలు లేవు: ట్రంప్ హెచ్చరికపై ఇరాన్ అధ్యక్షుడు
CM Chandrababu: ఒక సామాన్యుడికి సీఎం చంద్రబాబు భరోసా.. చర్మకారుడి కుటుంబంలో సరికొత్త వెలుగులు
ఒక సామాన్యుడికి సీఎం చంద్రబాబు భరోసా.. చర్మకారుడి కుటుంబంలో సరికొత్త వెలుగులు
ArcelorMittal Nippon Steel Plant: రేపే అనకాపల్లి స్టీల్ ప్లాంట్‌కి శంకుస్థాపన.. రూ.1.5 లక్షల కోట్లతో AM/NS ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్
రేపే అనకాపల్లి స్టీల్ ప్లాంట్‌కి శంకుస్థాపన.. 1.5 లక్షల కోట్లతో AM/NS ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్
Moinabad Farmhouse Case: మొయినాబాద్ ఫాంహౌస్ కేసులో కీలక పరిణామం.. వీకెండ్ పార్టీలకు 20 సార్లు డ్రగ్స్ సరఫరా!
మొయినాబాద్ ఫాంహౌస్ కేసులో కీలక పరిణామం.. వీకెండ్ పార్టీలకు 20 సార్లు డ్రగ్స్ సరఫరా!
Simhadri Express Train: సింహాద్రి ఎక్స్ ప్రెస్ ప్రయాణికులకు ఊరట.. ట్రైన్ లో మార్పులు చేసిన రైల్వే
సింహాద్రి ఎక్స్ ప్రెస్ ప్రయాణికులకు ఊరట.. ట్రైన్ లో మార్పులు చేసిన రైల్వే
SRH Playing 11: ట్రావిస్ హెడ్- అభిషేక్ శర్మ ఓపెనింగ్.. సన్‌రైజర్స్ ప్లేయింగ్ XI ఇలా ఉండవచ్చు
ట్రావిస్ హెడ్- అభిషేక్ శర్మ ఓపెనింగ్.. SRH ప్లేయింగ్ XI ఇలా ఉండవచ్చు
World Happiness Report : ఇండియాలో జనాలు సంతోషంగా లేరట.. తాజా రిపోర్ట్​లో ఇంట్రెస్టింగ్ విషయాలు, టాప్​లో ఉన్న దేశమిదే
ఇండియాలో జనాలు సంతోషంగా లేరట.. తాజా రిపోర్ట్​లో ఇంట్రెస్టింగ్ విషయాలు, టాప్​లో ఉన్న దేశమిదే
CM Revanth Reddy: సిద్దిపేట జిల్లాలో ఆయిల్ పాం ఫ్యాక్టరీ ప్రారంభం సహా 775 కోట్ల పనులకు సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం
సిద్దిపేట జిల్లాలో ఆయిల్ పాం ఫ్యాక్టరీ ప్రారంభం సహా 775 కోట్ల పనులకు సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం
Embed widget