అన్వేషించండి

Breast Cancer: మహిళలూ రొమ్ము క్యాన్సర్ బారిన పడకుండా ఉండాలా? ఈ పంచ సూత్రాలు పాటించండి

మహిళలు ఎక్కువగా ఎదుర్కొంటున్న సమస్య రొమ్ము క్యాన్సర్. దీని నుంచి బయట పడాలంటే తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.

మహిళలు ఎదుర్కొంటున్న ముఖ్యమైన సమస్యలలో రొమ్ము క్యాన్సర్ ఒకటి. భారతదేశంలో ప్రతి నలుగురు మహిళల్లో ఒకరు రొమ్ము క్యాన్సర్ బారిన పడుతున్నాట్టు నివేదకలు వెల్లడిస్తున్నాయి. చాలా మంది మహిళలకి దీని గురించి అవగాహన లేక క్యాన్సర్ చివరి దశ వచ్చేంత వరకి గుర్తించలేకపోతున్నారు. అందుకే ఏటా అక్టోబర్ నెలని రొమ్ము క్యాన్సర్ అవేర్ నెస్ మంత్ గా పరిగణిస్తారు. మహిళలకి రొమ్ము క్యాన్సర్ గురించి అవగాహన కల్పించేందుకు పలు స్వచ్చంద సంస్థలు కార్యక్రమాలు ఏర్పాటు చేస్తూ ఉంటాయి.  

చెడు అలవాట్లతో పలు రకాల క్యాన్సర్లు 
ధూమపానం, పొగాకు నమలడం వంటివి చేయడం వల్ల కాలేయం, తల, గొంతు, ఊపిరితిత్తుల క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని తెలుసు. కానీ రొమ్ము క్యాన్సర్ విషయంలో మాత్రం అది ఎందుకు వస్తుంది అనేందుకు స్పష్టమైన కారణాలు ఏవి లేవని వైద్యులు వెల్లడించారు. అలా అని రొమ్ము క్యాన్సర్ వస్తే తగ్గించలేని స్థితి కాదని చెప్పుకొచ్చారు. అయితే క్యాన్సర్ వచ్చిన వెంటనే చికిత్స ద్వారా దీన్ని పరిష్కరించవచ్చు. లేదంటే రొమ్ము భాగం తొలగించాల్సి వస్తుంది. అందుకే ఈ క్యాన్సర్ బారిన పడకుండా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అవేంటంటే..

ఊబకాయాన్ని నివారించాలి: ప్రస్తుతం చాలా మంది ఊబకాయం, అధిక బరువు సమస్యతో బాధపడుతున్నారు. ఊబకాయం ఉన్న మహిళల్లో రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు నిపుణులు చెబుతున్నారు. అందుకే బరువు అదుపులో ఉంచుకోవాల్సిన అవసరం చాలా ఉంది. ఆహారం విషయంలో డైట్ పాటిస్తూ బరువు పెరగకుండా చూసుకోవాలి.

సమతుల్య ఆహారం తీసుకోవాలి: ఆహారంలో పిండి పదార్థాలు, ప్రోటీన్లు, కొవ్వులు సమతుల్యంగా ఉండే విధంగా చూసుకోవాలి. ప్రాసెస్ చేయబడిన ఆహారానికి దూరంగా ఉండాలి. ఉప్పు, చక్కెర అధిక వినియోగం తగ్గించాలి. తప్పనిసరిగా దినచర్యలో భాగంగా పండ్లు తీసుకోవడం, ఆకుకూరలు సైతం తీసుకోవాలి. కొన్ని రకాల కార్బో హైడ్రేట్స్ తగ్గించి తీసుకోవడం వల్ల క్యాన్సర్ ని నిరోధించవచ్చని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు. యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండే ఆహారం ఎంచుకోవాలి.

జీవనశైలిలో మార్పులు: ఆరోగ్యంగా ఉండాలంటే ఖచ్చితంగా రోజుకి కనీసం 30 నిమిషాల పాటు వ్యాయామం చెయ్యాలి. జిమ్ కి వెళ్ళి కష్టపడాల్సిన అవసరం లేకుండా ఇంట్లోనే సొంత పనులు చేసుకోవడం, నడక, ఒళ్లు వంచి పనులు చేసుకోవడం వంటివి చెయ్యొచ్చు. లిఫ్ట్ వాడకానికి బదులుగా మెట్లు ఎక్కడం, చిన్న చిన్న దూరాలకి వాహనాలు వినియోగించకుండా కాలి నడకకి ప్రాధాన్యత ఇవ్వడం అలవాటు చేసుకోవాలి. ఇవే కాకుండా యోగా, మెడిటేషన్, పలు రకాల ఎక్సర్ సైజ్ లు చేయడం అలవర్చుకుంటే అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టవచ్చు.

లేట్ ప్రెగ్నెన్సీ వద్దు: 30 ఏళ్ల తర్వాత ప్రసవం లాంటి కారణాలతో రొమ్ము క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంది. అందుకే వీలైనంత వరకు 30 ఏళ్లలోపు కనీసం ఒకసారి గర్భం ధరించాలని వైద్యులు సూచిస్తున్నారు.

చనుబాలు ఇవ్వాలి: అందం తరిగిపోతుంది కదా అని తల్లి పాలకి బదులుగా డబ్బా పాలు పడుతుంటారు కొందరు మహిళలు. కానీ తల్లి బిడ్డకి పాలు ఇవ్వడం వల్ల ఇద్దరికీ మేలు జరుగుతుంది. తల్లిపాలు రొమ్ము క్యాన్సర్ కి రక్షణగా నిలుస్తాయి. అందుకే బిడ్డకి కనీసం పుట్టిన తర్వాత నుంచి 6 నెలల పాటు తల్లిపాలు మాత్రమే ఇవ్వాలని వైద్యులు సిఫార్సు చేస్తారు.

రొమ్ము క్యాన్సర్ ని సకాలంలో గుర్తించి చికిత్స తీసుకోవచ్చు. 45 సంవత్సరాలు దాటిన ప్రతి మహిళ రొమ్ము క్యాన్సర్ కి సంబంధించి మామోగ్రామ్ పరీక్ష చేయించుకోవడం ఉత్తమం.

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.

Also read: ‘లివర్ సిర్రోసిస్’ అంటే ఏమిటీ? అది కాలేయ క్యాన్సర్‌‌గా మారకూడదంటే ఏం చేయాలి?

టాప్ హెడ్ లైన్స్

ఉదయం సూర్యుడు ఎర్రగా ఎందుకు? శాస్త్రీయ, ఆధ్యాత్మిక కారణాలు!
ఉదయం సూర్యుడు ఎర్రగా ఎందుకు? శాస్త్రీయ, ఆధ్యాత్మిక కారణాలు!
Cancer Risk: అర గంట కంటే ఎక్కువ సేపు కంటిన్యూగా కూర్చుంటే క్యాన్సర్ వచ్చే ఛాన్స్‌! ఆందోళన కలిగిస్తున్న కొత్త పరిశోధన !
అర గంట కంటే ఎక్కువ సేపు కంటిన్యూగా కూర్చుంటే క్యాన్సర్ వచ్చే ఛాన్స్‌! ఆందోళన కలిగిస్తున్న కొత్త పరిశోధన !
Monsoon 2026: వర్షం పడుతుంటే టీ తాగుతూ పకోడీలు తినాలనే కోరిక ఎందుకు పెరుగుతుంది?
వర్షం పడుతుంటే టీ తాగుతూ పకోడీలు తినాలనే కోరిక ఎందుకు పెరుగుతుంది?
Gen Z vs Millennials: మిలీనియల్స్ కంటే జెన్ జీ ఎక్కువ ఫిట్‌, ఆరోగ్యంగా ఉందా? ఆశ్చర్యపరుస్తున్న కొత్త నివేదిక! 
మిలీనియల్స్ కంటే జెన్ జీ ఎక్కువ ఫిట్‌, ఆరోగ్యంగా ఉందా? ఆశ్చర్యపరుస్తున్న కొత్త నివేదిక! 

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IND VS ENG 5th T20 Result Update: క‌థ మార‌లేదు.. ఐదో టీ20లోనూ టీమిండియా ఘోర ప‌రాజ‌యం.. 4-0తో ఇంగ్లాండ్ క్లీన్ స్వీప్..  
క‌థ మార‌లేదు.. ఐదో టీ20లోనూ టీమిండియా ఘోర ప‌రాజ‌యం.. 4-0తో ఇంగ్లాండ్ క్లీన్ స్వీప్..  రాణించిన ఇషాన్, తిలక్
Shabad Mass Killing News: ఆరు హత్యల ఘటనలో షాబాద్ సీఐ సస్పెండ్..! నిందితుడ్ని పట్టిస్తే రూ.2 లక్షల బహుమతి
ఆరు హత్యల ఘటనలో షాబాద్ సీఐ సస్పెండ్..! నిందితుడ్ని పట్టిస్తే రూ.2 లక్షల బహుమతి
Tribute To Singer S Janaki: సింగర్ ఎస్. జానకి మృతి పట్ల ఏపీ, తెలంగాణ సీఎంలు సహా ప్రముఖులు దిగ్భ్రాంతి
సింగర్ ఎస్. జానకి మృతి పట్ల ఏపీ, తెలంగాణ సీఎంలు సహా ప్రముఖులు దిగ్భ్రాంతి
IND vs ENG T20I: బట్లర్ విధ్వంసకర సెంచరీ, బ్రూక్ మెరుపులు.. భారత్‌పై T20ల్లో అత్యధిక స్కోరు నమోదు
బట్లర్ విధ్వంసకర సెంచరీ, బ్రూక్ మెరుపులు.. భారత్‌పై T20ల్లో అత్యధిక స్కోరు నమోదు
US Iran War: హత్యకు గురవుతానని ట్రంప్ ఆందోళన! ప్రాణానికి ప్రాణం.. మొజ్తబా ఖమేనీ కీలక ప్రకటన
హత్యకు గురవుతానని ట్రంప్ ఆందోళన! ప్రాణానికి ప్రాణం.. మొజ్తబా ఖమేనీ కీలక ప్రకటన
Vietnam Boat Accident: వాళ్లను తీసుకెళ్లింది మొబైల్ కంపెనీ - బాధ్యత వారిదేనా? మృతుల కుటుంబాలకు ఎంత పరిహారం ఇస్తారు?
వాళ్లను తీసుకెళ్లింది మొబైల్ కంపెనీ - బాధ్యత వారిదేనా? మృతుల కుటుంబాలకు ఎంత పరిహారం ఇస్తారు?
Visakhapatnam Techie Death Case: విశాఖ టెకీ రాధా గాయత్రి హత్య కేసులో కీలక పరిణామం.. భర్త శ్రీచరణ్‌ అరెస్ట్
విశాఖ టెకీ రాధా గాయత్రి హత్య కేసులో కీలక పరిణామం.. భర్త శ్రీచరణ్‌ అరెస్ట్
Indian Tourists Boat Tragedy: వియత్నాం బోటు ప్రమాదంలో తెలుగు వారు మృతి.. హెల్ప్ లైన్ నెంబర్లు ఏర్పాటు చేసిన భారత ఎంబసీ
వియత్నాం బోటు ప్రమాదంలో తెలుగు వారు మృతి.. హెల్ప్ లైన్ నెంబర్లు ఏర్పాటు చేసిన భారత ఎంబసీ
Embed widget