అన్వేషించండి

AEE Results: ఏఈఈ ఎంపిక ఫలితాలు విడుదల, ఉద్యోగాలకు 1154 మంది ఎంపిక

AEE Final Results: తెలంగాణలో అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్స్‌ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్ధుల ఫలితాలను టీజీపీఎస్సీ విడుదల చేసింది. మొత్తం 1154 మంది అభ్యర్థులు ఉద్యోగాలకు ఎంపికయ్యారు.

TGPSC AEE Final Results Announced:: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలోని వివిధ విభాగాల్లో అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్స్‌(ఏఈఈ) ఉద్యోగాల రాతపరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. ఫలితాలను టీజీపీఎస్సీ అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. మొత్తం 1540 పోస్టులకుగాను 1,154 మంది అభ్యర్థుల ఎంపిక జాబితాను కమిషన్ విడుదల చేసింది. ఏఈఈ ఫలితాలకు సంబంధించి మిషన్ భగీరథలో ఉద్యోగాలకు మల్టీ జోన్-1 పరిధిలో 195 మంది, మల్టీ జోన్-2 పరిధిలో 98 మంది ఎంపియ్యారు. పంచాయతీరాజ్ విభాగానికి సంబంధించి మల్టీ జోన్-1 పరిధిలో 117 మంది, మల్టీ జోన్-2 పరిధిలో 89 మంది ఎంపికయ్యారు. పబ్లిక్ హెల్త్ విభాగంలో మల్టీ జోన్-1 పరిధిలో 14 మంది, మల్టీ జోన్-2 పరిధిలో 132 మంది ఎంపికయ్యారు. ట్రైబల్ వెల్ఫేర్ విభాగంలో మల్టీ జోన్-1, 2 పరిధి కలిపి 15 మంది ఎంపికయ్యారు. అదేవిధంగా కమాండ్ ఏరియా డెవలప్‌మెంట్ (CAD) విభాగంలో మల్టీ జోన్-1 పరిధిలో 136 మంది, మల్టీ జోన్-2 పరిధిలో 215 మంది ఎంపికయ్యారు. ఇక ప్రజారవాణా, రోడ్లు & భవనాల శాఖకు సంబంధించి మల్టీ జోన్-1 పరిధిలో 73 మంది, మల్టీ జోన్-2 పరిధిలో 70 మంది ఎంపికయ్యారు.

ఏఈఈ రాతపరీక్ష ఫలితాల కోసం క్లిక్ చేయండి..

Website

AEE Results: ఏఈఈ ఎంపిక ఫలితాలు విడుదల, ఉద్యోగాలకు 1154 మంది ఎంపిక

తెలంగాణలో ఏఈఈ నియామాకాలకు నిర్వహించిన ఎంపిక ఫలితాలను టీఎస్‌పీఎస్సీ మార్చి 13న విడుదల చేసిన సంగతి తెలిసిందే. అభ్యర్థులకు మార్చి 18 నుంచి 22 వరకు ధ్రువపత్రాల పరిశీలన నిర్వహించారు. మొత్తం 1540 పోస్టులకుగాను 1:2 నిష్పత్తిలో 3092 మంది అభ్యర్థులను సర్టిఫికేట్ల పరిశీలనకు టీఎస్‌పీఎస్సీ ఎంపికచేసింది. వీరిలో అగ్రికల్చర్ ఇంజినీరింగ్ విభాగంలో 188 మంది అభ్యర్థులు, సివిల్ ఇంజినీరింగ్ విభాగంలో 2362 మంది అభ్యర్థులు, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ విభాగంలో 338 మంది అభ్యర్థులు, మెకానికల్ ఇంజినీరింగ్ విభాగంలో 204 మంది అభ్యర్థులు ధ్రువపత్రాల పరిశీలనకు అర్హత సాధించారు. సర్టిఫికెట్లు వెరిఫికేషన్‌ ముగిసినప్పటికీ తుది ఫలితాలు విడుదలలో తీవ్ర జాప్యం ఏర్పడింది. దీంతో అభ్యర్థులు టీజీపీఎస్సీ కార్యాలయం ముందు ఆందోళనలు నిర్వహించారు. ఎట్టకేలకు ఆగస్టు 3న ఎంపిక ఫలితాలను కమిషన్ విడుదల చేసింది.

తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ 1540 పోస్టుల భర్తీకి 2022, సెప్టెంబరు 3న అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (ఏఈఈ)  నోటిఫికేషన్ విడుదలు చేసిన సంగతి తెలిసిందే. మొదట ఉద్యోగాల భర్తీకి సంబంధించి వెబ్ నోటీస్ విడుదల చేసిన కమిషన్, సెప్టెంబర్ 15న పూర్తి నోటిఫికేషన్ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. ఈ పోస్టుల భర్తీకి సెప్టెంబర్ 22 నుంచి అక్టోబర్ 15 వరకు దరఖాస్తు గడువు నిర్ణయించారు. అయితే దరఖాస్తు గడువు పొడిగించాలంటూ అభ్యర్థుల నుంచి విజ్ఞప్తులు రావటంతో అక్టోబర్ 20 వరకు అవకాశం కల్పించారు. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం మే 21, 22 తేదీల్లో సివిల్‌, ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్‌ విభాగాలకు సంబంధించిన పరీక్ష ఆన్‌లైన్‌లో నిర్వహించారు. మే 8న ఎలక్ట్రికల్‌ & ఎలక్ట్రానిక్స్‌ ఇంజినీరింగ్‌; మే 9న అగ్రికల్చర్‌, మెకానికల్‌ ఇంజినీరింగ్ అభ్యర్థుల‌కు ఆన్‌లైన్‌ పరీక్ష నిర్వహించింది. ఇక మే 21, 22 తేదీల్లో రెండు షిప్టుల్లో ఏఈఈ(సివిల్) పోస్టుల‌కు ఆన్‌లైన్‌లో ప‌రీక్ష నిర్వహించింది. తాజాగా ఫలితాలను విడుదల చేసింది. తుది స్కోరు ఖ‌రారులో నార్మలైజేష‌న్ ప‌ద్ధతిని పాటించింది. 

పోస్టుల వివరాలు.. 

* అసిస్టెంట్​ ఎగ్జిక్యూటివ్ ​ఇంజినీర్​(ఏఈఈ) పోస్టులు

మొత్తం ఖాళీల సంఖ్య: 1540

1)   ఏఈఈ(సివిల్)- పీఆర్‌ఆర్‌డీ డిపార్ట్‌మెంట్  (మిషన్ భగీరథ): 302 పోస్టులు     

2)   ఏఈఈ(సివిల్)- పీఆర్‌ఆర్‌డీ ‌డిపార్ట్‌మెంట్: 211 పోస్టులు    

3)  ఏఈఈ (సివిల్) ఎంఏ యూడీ- పీహెచ్: 147 పోస్టులు    

4)  ఏఈఈ(సివిల్) టీడబ్ల్యూ డిపార్ట్ మెంట్: 15 పోస్టులు

5)  ఏఈఈ ఐ‌సీఏడీ డిపార్ట్ మెంట్: 704 పోస్టులు    

 6)  ఏఈఈ (మెకానికల్) ఐసీఏడీ(జీడబ్ల్యూడీ): 03 పోస్టులు    

 7)  ఏఈఈ (సివిల్) టీఆర్‌బీ: 145 పోస్టులు    

 8)  ఏఈఈ (ఎలక్ట్రికల్) టీఆర్‌బీ: 13 పోస్టులు    

జీతం: రూ.54,220- రూ.1,33,630.

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి... 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Idi Manchi Prabhutvam:
"ఇది మంచి ప్రభుత్వం" ప్రారంభమయ్యేది శ్రీకాకుళంలో కాదు, ఆఖరి నిమిషంలో మారిన షెడ్యూల్
Tirupati Laddu: తిరుమల లడ్డూలో వాడే పదార్థాలు ఏంటీ? ఇప్పుడు టీటీడీ చేయాల్సిందేంటీ?
తిరుమల లడ్డూలో వాడే పదార్థాలు ఏంటీ? ఇప్పుడు టీటీడీ చేయాల్సిందేంటీ?
Jr NTR Interview: సిద్ధూ జొన్నలగడ్డను పిలిచి మరీ పరువు తీసిన ఎన్టీఆర్... యంగ్ హీరోలతో హిలేరియస్ 'దేవర' ప్రమోషన్స్ 
సిద్ధూ జొన్నలగడ్డను పిలిచి మరీ పరువు తీసిన ఎన్టీఆర్... యంగ్ హీరోలతో హిలేరియస్ 'దేవర' ప్రమోషన్స్ 
Doon Express : ఎక్స్ ప్రెస్ రైలును బోల్తా కొట్టించే కుట్ర.. రైల్వే ట్రాక్ పై ఏడు మీటర్ల కరెంట్ పోల్
ఎక్స్ ప్రెస్ రైలును బోల్తా కొట్టించే కుట్ర - రైల్వే ట్రాక్ పై ఏడు మీటర్ల కరెంట్ పోల్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Jani Master Issue Sr. Advocate Jayanthi Interview | జానీ మాస్టర్ కేసులో చట్టం ఏం చెబుతోంది.? | ABPISRO Projects Cabinet Fundings | స్పేస్ సైన్స్ రంగానికి తొలి ప్రాధాన్యతనిచ్చిన మోదీ సర్కార్ | ABPTDP revealed reports on TTD Laddus | టీటీడీ లడ్డూల ల్యాబ్ రిపోర్టులు బయటపెట్టిన టీడీపీ | ABP Desamహైదరాబాద్ దాటిన హైడ్రా బుల్‌డోజర్లు, ఇకపై రాష్ట్రవ్యాప్తంగా కూల్చివేతలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Idi Manchi Prabhutvam:
"ఇది మంచి ప్రభుత్వం" ప్రారంభమయ్యేది శ్రీకాకుళంలో కాదు, ఆఖరి నిమిషంలో మారిన షెడ్యూల్
Tirupati Laddu: తిరుమల లడ్డూలో వాడే పదార్థాలు ఏంటీ? ఇప్పుడు టీటీడీ చేయాల్సిందేంటీ?
తిరుమల లడ్డూలో వాడే పదార్థాలు ఏంటీ? ఇప్పుడు టీటీడీ చేయాల్సిందేంటీ?
Jr NTR Interview: సిద్ధూ జొన్నలగడ్డను పిలిచి మరీ పరువు తీసిన ఎన్టీఆర్... యంగ్ హీరోలతో హిలేరియస్ 'దేవర' ప్రమోషన్స్ 
సిద్ధూ జొన్నలగడ్డను పిలిచి మరీ పరువు తీసిన ఎన్టీఆర్... యంగ్ హీరోలతో హిలేరియస్ 'దేవర' ప్రమోషన్స్ 
Doon Express : ఎక్స్ ప్రెస్ రైలును బోల్తా కొట్టించే కుట్ర.. రైల్వే ట్రాక్ పై ఏడు మీటర్ల కరెంట్ పోల్
ఎక్స్ ప్రెస్ రైలును బోల్తా కొట్టించే కుట్ర - రైల్వే ట్రాక్ పై ఏడు మీటర్ల కరెంట్ పోల్
Prakasam Barrage: హమ్మయ్య! రెండో పడవను ఒడ్డుకు చేర్చిన ఇంజినీర్లు - మూడో దానికి ముహుర్తం ఎప్పుడో!
హమ్మయ్య! రెండో పడవను ఒడ్డుకు చేర్చిన ఇంజినీర్లు - మూడో దానికి ముహుర్తం ఎప్పుడో!
Balineni Srinivasa Reddy : వైసీపీకి భవిష్యత్ లేదు - జగన్‌కు విశ్వసనీయత లేదు - పవన్‌ను కలిసిన తర్వాత బాలినేని కీలక వ్యాఖ్యలు
వైసీపీకి భవిష్యత్ లేదు - జగన్‌కు విశ్వసనీయత లేదు - పవన్‌ను కలిసిన తర్వాత బాలినేని కీలక వ్యాఖ్యలు
Samineni Udaya Bhanu: వైసీపీకి సామినేని గుడ్ బై - ఆ రోజే జనసేన కండువా, మరో నేత కూడా!
వైసీపీకి సామినేని గుడ్ బై - ఆ రోజే జనసేన కండువా, మరో నేత కూడా!
Bigg Boss 8 Telugu: బిగ్ బాస్‌నే బూతులు తిట్టాడే... చీఫ్‌గా అభయ్ అట్టర్ ఫ్లాప్... విచక్షణ లేకుండా ఆట ఆడిన నిఖిల్, పృథ్వీ
బిగ్ బాస్‌నే బూతులు తిట్టాడే... చీఫ్‌గా అభయ్ అట్టర్ ఫ్లాప్... విచక్షణ లేకుండా ఆట ఆడిన నిఖిల్, పృథ్వీ
Embed widget