అన్వేషించండి

Sharmila: ఏపీ గ్రూప్ 2 తరహాలోనే గ్రూప్ 1 మెయిన్స్‌కు అభ్యర్థుల్ని ఎంపిక చేయాలి - ప్రభుత్వానికి షర్మిల డిమాండ్

AP Group 1 Exams | గ్రూప్ 2 మెయిన్స్ కు అభ్యర్థులను ఎంపిక చేస్తున్న 1:1000 విధానంలోనే గ్రూప్ 1 మెయిన్స్ కు అభ్యర్థులను ఎంపిక చేయాలని ఏపీ ప్రభుత్వాన్ని వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు.

YS Sharmila On AP Group 1 Mains | అమరావతి: గ్రూప్ 2 ఉద్యోగాల తరహాలోనే గ్రూప్ 1 మెయిన్స్ కి 1:100 విధానాన్ని అనుసరించాలని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. గ్రూప్ అభ్యర్థుల తరఫున మరోసారి విన్నపం అంటూ సీఎం చంద్రబాబును ఉద్దేశించి ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు.

గ్రూప్ 1 మెయిన్స్ ఎంపికపై షర్మిల పోస్ట్

‘ముఖ్యమంత్రి చంద్రబాబుగారు.. రాష్ట్రంలోని గ్రూప్ 1 అభ్యర్థుల పక్షాన మరోసారి విజ్ఞప్తి చేస్తున్నాం. గ్రూప్ 2, డిప్యూటీ ఈవో పోస్టుల ఎంపికలో అనుసరించిన 1:100 విధానాన్ని , గ్రూప్ 1 మెయిన్స్ కి సైతం పరిగణనలోకి తీసుకోవాలని కోరుతున్నాం. జీవో నెంబర్ 5 ప్రకారం 1:100 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేసే అధికారం ఏపీపీఎస్సీ (APPSC)కి ఉంది. ఆ అధికారాన్ని ఉపయోగించి 1:100 రేషియో ప్రకారం అవకాశం ఇవ్వాలని అభ్యర్థులు అడగడంలో న్యాయం ఉంది. 89 పోస్టులకు మీరు ఇచ్చిన 1:50 రేషియో ద్వారా 4450 మంది మెయిన్స్ కి అర్హత పొందారు. 1:100 రేషియో లెక్కన పిలిస్తే మరో 4450 మందికి అవకాశం దక్కుతుందని అభ్యర్థులు ఆశ పడుతున్నారు.

రాష్ట్రంలో గ్రూప్ 2, గ్రూప్ 1 పరీక్షల మధ్య సమయం తక్కువగా ఉండటం, సిలబస్ మధ్య వ్యత్యాసం, కొత్త సిలబస్ అని చెప్పి పాత సిలబస్ లోనే పరీక్షలు నిర్వహించడం లాంటి కారణాలతో నష్టపోయామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎంతోకాలంగా ఎదురు చూస్తున్న గ్రూప్ 1 ఉద్యోగాలు మళ్ళీ పోతే ఇప్పట్లో ఇక నోటిఫికేషన్ ఉండదని అభ్యర్థులు ఆందోళనలో ఉన్నారు. ఏపీపీఎస్సీ ఛైర్మన్ నీ కలిసి విజ్ఞప్తి చేసినా ప్రభుత్వానికి పట్టింపు లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మెయిన్స్ షెడ్యూల్ విడుదల కాకముందే అభ్యర్థుల విజ్ఞప్తులను పరిశీలించి, న్యాయం చేయాలని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం’ అని వైఎస్ షర్మిల పోస్ట్ చేశారు.

Also Read: Chandrababu Brother Passes Away: చంద్రబాబు ఇంట్లో తీవ్ర విషాదం, చికిత్స పొందుతూ సోదరుడు రామ్మూర్తి నాయుడు కన్నుమూత

తెలంగాణలో గ్రూప్ 1 మెయిన్స్ విషయంలో ఇటీవల వివాదం నెలకొంది. టీజీపీఎస్సీ పాటిస్తున్న రిజర్వేషన్ విధానం వల్ల నష్టపోతామని కొందరు అభ్యర్థులు ఆరోపించారు. మరికొందరేమో రాష్ట్రంలో రిజర్వేషన్లు లేకుండా మెయిన్స్ కు ఎంపికైన అందరూ జనరల్ కిందకి వస్తారని చెప్పారు. అశోక్ నగర్, ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో అభ్యర్థులు చేసే ఆందోళనకు బీజేపీ సైతం మద్దతు తెలిపింది. ఏకంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ గ్రూప్ 1 మెయిన్స్ అభ్యర్థుల తరఫున అశోక్ నగర్ వెళ్లి రోడ్డుపై బైటాయించారు. వారి సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని సీఎం రేవంత్ రెడ్డిని కేంద్ర మంత్రి బండి సంజయ్ డిమాండ్ చేశారు. ఈ క్రమంలో ఛలో సెక్రటేరియట్ కు సైతం పిలుపునివ్వగా, భారీ సంఖ్యలో నిరుద్యోగులు సెక్రటేరియట్ వైపు వడివడిగా అడుగులు వేశారు. సెక్రటేరియల్ కు కాలి నడకన బయలుదేరిన వెంటనే బండి సంజయ్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయినా ఆయన పోలీసుల వాహనం దిగి మరికొంత దూరం నడిచారు. చివరికి ఆయనను పోలీసులు బండి సంజయ్ ను అదుపులోకి తీసుకుని తమ వాహనంలో అక్కడి నుంచి తరలించారు.

Also Read: Andhra Loan Politics: అప్పులపై చంద్రబాబు, జగన్ తలో వాదన - అసెంబ్లీలో తేల్చుకునేందుకు ప్రతిపక్ష నేత వస్తారా ?

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Republic Day In Andhra Pradesh: తొలిసారి అమరావతిలో రిపబ్లిక్ డే వేడుకలు.. వాహనదారులకు ట్రాఫిక్ పోలీసుల అలర్ట్
తొలిసారి అమరావతిలో రిపబ్లిక్ డే వేడుకలు.. వాహనదారులకు ట్రాఫిక్ పోలీసుల అలర్ట్
IND vs NZ 3rd T20I: అభిషేక్ శర్మ, సూర్య కుమార్ హాఫ్ సెంచరీలు.. 10 ఓవర్లకే టార్గెట్ ఉఫ్.. 3-0తో సిరీస్ కైవసం
అభిషేక్ శర్మ, సూర్య కుమార్ హాఫ్ సెంచరీలు.. 10 ఓవర్లకే టార్గెట్ ఉఫ్.. 3-0తో సిరీస్ కైవసం
Kamareddy Crime News:రిపబ్లిక్ డే వేడుకలు.. బోధన్‌ ఎస్సీ గురుకుల విద్యార్థిని మృతి, స్కూల్ సిబ్బందిపై తీవ్ర విమర్శలు
రిపబ్లిక్ డే వేడుకలు.. బోధన్‌ ఎస్సీ గురుకుల విద్యార్థిని మృతి, స్కూల్ సిబ్బందిపై తీవ్ర విమర్శలు
Padma Awards 2026: పద్మ అవార్డులకు ఎంపికైన తెలుగు ప్రముఖులు వీరే.. వారి టాలెంట్ ఏంటి
పద్మ అవార్డులకు ఎంపికైన తెలుగు ప్రముఖులు వీరే.. వారి టాలెంట్ ఏంటి

వీడియోలు

Rohit Sharma Harman Preet Kaur Padma Shri | రోహిత్, హర్మన్ లను వరించిన పద్మశ్రీ | ABP Desam
Rajendra prasad Murali Mohan Padma Shri | నటకిరీటి, సహజ నటుడికి పద్మశ్రీలు | ABP Desam
Bangladesh Cricket Huge Loss | టీ20 వరల్డ్ కప్ ఆడనన్నుందుకు BCB కి భారీ నష్టం | ABP Desam
Ashwin Fire on Gambhir Decisions | డ్రెస్సింగ్ రూమ్ లో రన్నింగ్ రేస్ పెట్టడం కరెక్ట్ కాదు | ABP Desam
Ind vs Nz 3rd T20I Preview | న్యూజిలాండ్ తో నేడు మూడో టీ20 మ్యాచ్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Republic Day In Andhra Pradesh: తొలిసారి అమరావతిలో రిపబ్లిక్ డే వేడుకలు.. వాహనదారులకు ట్రాఫిక్ పోలీసుల అలర్ట్
తొలిసారి అమరావతిలో రిపబ్లిక్ డే వేడుకలు.. వాహనదారులకు ట్రాఫిక్ పోలీసుల అలర్ట్
IND vs NZ 3rd T20I: అభిషేక్ శర్మ, సూర్య కుమార్ హాఫ్ సెంచరీలు.. 10 ఓవర్లకే టార్గెట్ ఉఫ్.. 3-0తో సిరీస్ కైవసం
అభిషేక్ శర్మ, సూర్య కుమార్ హాఫ్ సెంచరీలు.. 10 ఓవర్లకే టార్గెట్ ఉఫ్.. 3-0తో సిరీస్ కైవసం
Kamareddy Crime News:రిపబ్లిక్ డే వేడుకలు.. బోధన్‌ ఎస్సీ గురుకుల విద్యార్థిని మృతి, స్కూల్ సిబ్బందిపై తీవ్ర విమర్శలు
రిపబ్లిక్ డే వేడుకలు.. బోధన్‌ ఎస్సీ గురుకుల విద్యార్థిని మృతి, స్కూల్ సిబ్బందిపై తీవ్ర విమర్శలు
Padma Awards 2026: పద్మ అవార్డులకు ఎంపికైన తెలుగు ప్రముఖులు వీరే.. వారి టాలెంట్ ఏంటి
పద్మ అవార్డులకు ఎంపికైన తెలుగు ప్రముఖులు వీరే.. వారి టాలెంట్ ఏంటి
Chiranjeevi: అనిల్ రావిపూడికి మెగాస్టార్ గిఫ్ట్... చిరంజీవి రేంజ్‌కు తగ్గట్టు అదిరిపోయే కార్
అనిల్ రావిపూడికి మెగాస్టార్ గిఫ్ట్... చిరంజీవి రేంజ్‌కు తగ్గట్టు అదిరిపోయే కార్
Rohit Sharma Padma Shri Award: రోహిత్ శర్మ, హర్మన్ ప్రీత్ కౌర్‌లను వరించిన పద్మశ్రీ పురస్కారం
రోహిత్ శర్మ, హర్మన్ ప్రీత్ కౌర్‌లను వరించిన పద్మశ్రీ పురస్కారం
GITAM Lands: విశాఖ భూములను క్రమబద్ధీకరించుకునేందుకు గీతం ప్రయత్నం - దోపిడీ అంటున్న విపక్షాలు - అసలు కథ ఇదీ!
విశాఖ భూములను క్రమబద్ధీకరించుకునేందుకు గీతం ప్రయత్నం - దోపిడీ అంటున్న విపక్షాలు - అసలు కథ ఇదీ!
Padma Awards 2026: సౌత్‌ సినిమాలో విరిసిన పద్మాలు... తెలుగు హీరోలు ఇద్దరికి పద్మశ్రీ, దివంగత ధరేంద్రకు పద్మ విభూషణ్
సౌత్‌ సినిమాలో విరిసిన పద్మాలు... తెలుగు హీరోలు ఇద్దరికి పద్మశ్రీ, దివంగత ధరేంద్రకు పద్మ విభూషణ్
Embed widget