By: ABP Desam | Updated at : 16 Mar 2023 07:26 PM (IST)
Edited By: omeprakash
కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో ఖాళీలు
దేశవ్యాప్తంగా కేంద్రీయ విశ్వ విద్యాలయాల్లో 6,028 పోస్టులు ఖాళీగా ఉన్నాయని కేంద్రం వెల్లడించింది. మొత్తం ఖాళీల్లో జనరల్-2154, ఎస్సీ-878, ఎస్టీ-520, ఓబీసీ-1543, ఈడబ్ల్యూఎస్-611, పీడబ్ల్యూడీ కేటగిరీ-322 పోస్టులు ఉన్నాయని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు. బీజేపీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేశ్ అడిగిన ప్రశ్నకు కేంద్రమంత్రి రాజ్యసభలో మార్చి 15న లిఖితపూర్వక సమాధానమిచ్చారు. ఐఐటీల్లో 4,562; ఐఐఎంల్లో 496 పోస్టులు ఖాళీగా ఉన్నాయని మంత్రి పేర్కొన్నారు.
దేశవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో 2018-19లో 10,83,747 ఉన్న విద్యార్థుల సంఖ్య 2021-22 నాటికి 10,22,386కి తగ్గిందని కేంద్ర విద్యాశాఖ సహాయ మంత్రి అన్నపూర్ణ దేవి తెలిపారు. వైకాపా రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి లిఖితపూర్వక సమాధానమిచ్చారు.
అదేవిధంగా కేంద్రీయ విద్యాలయాల్లో 12,099, నవోదయ స్కూళ్లలో 3,139, సెంట్రల్ వర్సిటీల్లో 6,028 ఖాళీలు ఉన్నట్టు కేంద్రం ప్రకటించింది.
కేంద్రీయ పాఠశాలలు, యూనివర్సిటీల్లో ఖాళీల వివరాలు
Also Read:
AP Budget 2023: బడ్జెట్లో విద్యారంగానికి పెద్దపీట, దేనికెంత కేటాయించారంటే?
ఏపీలో 2 లక్షల 79 వేల కోట్లతో ప్రభుత్వం 'ఏపీ బడ్జెట్-2023' ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఈసారి బడ్జెట్లో విద్యారంగానికి పెద్దపీట వేసింది. మన బడి నాడు-నేడు, జగనన్న విద్యా కానుక, జగనన్న గోరుముద్ద, జగనన్న అమ్మ ఒడి, పాఠ్యాంశ సంస్కరణలు, మరుగుదొడ్ల నిర్వహణ నిధి (టీఎమ్ఎఫ్), పాఠశాల నిర్వహణ నిధి, సమీకృత పాఠ్యాంశ, పరిపాలన సంస్కరణల వంటి కార్యక్రమాలను, విధి విధానాలను ప్రవేశపెట్టడం ద్వారా పాఠశాల విద్యలో సమూల మార్పులకు శ్రీకారం చుట్టింది. ప్రభుత్వ పాఠశాలలో విద్యను మెరుగుపరిచి రాష్ట్ర విద్యార్థులను ప్రపంచ స్థాయిలో పోటీ పడేలా చేయడమే ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
బడ్జెట్-2023 పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
విద్యార్థినులకు టీఎస్ఆర్టీసీ గుడ్న్యూస్, జూన్ నుంచి ప్రత్యేక బస్సులు!
విద్యార్థినుల కోసం త్వరలో ప్రత్యేక బస్సులు అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలంగాణ ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ అన్నారు. జూన్ నుంచి హైదరాబాద్ శివారు ప్రాంతాల్లోని విద్యాసంస్థల్లో చదివే విద్యార్థుల సౌకర్యార్థం 100 అదనపు ట్రిప్పులు ఏర్పాటు చేస్తామని తెలిపారు.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
ఆర్మీ 'అగ్నివీర్' దరఖాస్తు గడువు పొడిగింపు, చివరితేది ఎప్పుడంటే?
ఇండియన్ ఆర్మీలో 'అగ్నివీరుల' నియామకానికి సంబంధించిన దరఖాస్తు గడువును ఆర్మీ పొడిగించింది. అగ్నివీరుల దరఖాస్తు గుడువు ఫిబ్రవరి 16న ప్రారంభమైంది. మార్చి 15తో దరఖాస్తు గడువు ముగియాల్సి ఉండగా.. మార్చి 20 వరకు పొడిగిస్తున్నట్లు ఇండియన్ ఆర్మీ తెలిపింది. ఈ మేరకు అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఇప్పటివరకు దరఖాస్తు చేసుకోలేని అభ్యర్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి. ఈ ఏడాది ఆర్మీ అగ్నిపథ్ స్కీమ్ -2023 కింద దాదాపు 25 వేల ఖాళీలను భర్తీ చేయనున్నారు.
పోస్టులు, దరఖాస్తు కోసం క్లిక్ చేయండి..
TSPSC Paper Leak: 'గ్రూప్-1' మెయిన్స్ పేపర్ కూడా లీకయ్యేదా? బయటపడుతున్న కుట్రలు!
TSPSC గ్రూప్ 1లో 100 మార్కులు వచ్చిన అభ్యర్థులపై సిట్ నిఘా, నేడు ముగిసిన నిందితుల కస్టడీ
Group 1 Mains Postponed : ఏపీ గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు వాయిదా, మళ్లీ ఎప్పుడంటే?
APPSC Group 4 Hall Tickets: ఏపీపీఎస్సీ-గ్రూప్ 4 హాల్టికెట్లు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే!
SSC Selection Posts: 5369 సెలక్షన్ పోస్టుల దరఖాస్తుకు నేడే ఆఖరు, వెంటనే దరఖాస్తు చేసుకోండి!
KTR On Amaravati : అమరావతిలో పనులు జరగడం లేదన్న కేటీఆర్ - ఎందుకన్నారో తెలుసా ?
TDP Manifesto : ప్రతి పేదవాడి జీవితం మారేలా మేనిఫెస్టో, కసరత్తు ప్రారంభించిన టీడీపీ!
Taapsee Pannu: నటి తాప్సి పన్నుపై కేసు నమోదు - హిందువుల మనోభావాలు దెబ్బతీసిందని ఫిర్యాదు
Minister IK Reddy : కాంగ్రెస్ లో మహేశ్వర్ రెడ్డి పనైపోయింది, రేపో మాపో పార్టీ మరడం ఖాయం- మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి