అన్వేషించండి

Group1 Results: ఏపీపీఎస్సీ గ్రూప్‌-1 మెయిన్స్‌ ఫలితాలు విడుదల, ఇంటర్వ్యూ ఎప్పుడంటే?

గ్రూప్‌-1 మెయిన్స్‌ ఫలితాలను ఏపీపీఎస్సీ జులై 14న విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలను అందుబాటులో ఉంచింది. గ్రూప-1 మెయిన్స్ పరీక్షలకు హాజరైన అభ్యర్థులు ఫలితాలు చూసుకోవచ్చు.

గ్రూప్‌-1 మెయిన్స్‌ ఫలితాలను ఏపీపీఎస్సీ జులై 14న విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలను అందుబాటులో ఉంచింది. గ్రూప-1 మెయిన్స్ పరీక్షలకు హాజరైన అభ్యర్థులు ఫలితాలు చూసుకోవచ్చు. ఏపీలో మొత్తం 111 గ్రూప్‌-1 పోస్టులకుగాను 259 మంది అభ్యర్థులు ఇంటర్వ్యూకు అర్హత సాధించారు. వీరిలో 39 మంది స్పోర్ట్స్‌ కేటగిరీ నుంచి ఎంపికయ్యారు. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం జూన్‌ 3 నుంచి 10 వరకు పరీక్షలు నిర్వహించిన సంగతి తెలిసిందే. గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షలో అర్హత సాధించిన 6,455 మంది అభ్యర్థులు మెయిన్స్ పరీక్షలకు హాజరయ్యారు. మెయిన్స్ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు ఆగస్టు 2 నుంచి ఇంటర్వ్యూలు నిర్వహించేందుకు ఏపీపీఎస్సీ ఏర్పాట్లు చేస్తోంది.

గ్రూప్-1 ఇంటర్వ్యూలకు ఎంపికైన అభ్యర్థుల జాబితా కోసం క్లిక్ చేయండి..

స్పోర్ట్స్ కోటా కింది ఎంపికైన అభ్యర్థుల జాబితా కోసం క్లిక్ చేయండి..

Group1 Results: ఏపీపీఎస్సీ గ్రూప్‌-1 మెయిన్స్‌ ఫలితాలు విడుదల, ఇంటర్వ్యూ ఎప్పుడంటే?

ఏపీలో ఖాళీగా ఉన్న 111 'గ్రూప్-1' పోస్టుల భర్తీకి నిర్వహించిన ప్రిలిమ్స్ పరీక్ష జనవరి 8న నిర్వహించిన సంగతి తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా 18 జిల్లాల్లో 297 పరీక్షా కేంద్రాల్లో ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించారు. అత్యధికంగా విశాఖపట్నంలో 42 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయగా.. అత్యల్పంగా చిత్తూరులో 4 పరీక్ష కేంద్రాలను మాత్రమే ఏర్పాటుచేశారు. ఉదయం 10 నుంచి 12 గంటల వరకు పేపర్-1 పరీక్ష, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పేపర్-2 పరీక్ష నిర్వహించింది. గ్రూప్-1కు మొత్తం 1,26,449 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో 1,06,473 మంది అభ్యర్థులు హాల్‌టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోగా.. ఇందులో 87,718 మంది అభ్యర్థులు ప్రిలిమ్స్ పరీక్షకు హాజరయ్యారు. నంద్యాల జిల్లాలో అత్యధికంగా 85.89 శాతం మంది అభ్యర్థులు పరీక్షకు హాజరుకాగా.. కృష్ణా జిల్లాలో అత్యల్పంగా 73.99 శాతం మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు.

ఆంధ్రప్రదేశ్‌లో 'గ్రూప్-1' పోస్టుల భర్తీకి జనవరి 8న నిర్వహించిన ప్రిలిమ్స్ పరీక్ష ఫలితాలను ఏపీపీఎస్సీ జనవరి 27న విడుదల చేసింది. ప్రిలిమిన‌రీ ప‌రీక్షకు మొత్తం 87,718 మంది అభ్యర్థులు హాజ‌రుకాగా.. 6,455 మంది అభ్యర్థులు మెయిన్స్‌కు అర్హత సాధించారు.  ప్రిలిమినరీ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులను 1:50 నిష్పత్తిలో మెయిన్స్ పరీక్షకు ఎంపికచేశారు. వాస్తవానికి గ్రూప్-1 కింద అన్ని రకాలు భర్తీ చేయాల్సిన పోస్టులు 111 ఉన్నాయి. దీని ప్రకారం 5,550 మందిని ప్రధాన పరీక్షలకు ఎంపిక చేయాలి. కానీ... ఒకరి కంటే ఎక్కువ మందికి ఒకే మార్కులు రావడం, సామాజిక వర్గాల వారీగా అభ్యర్థులను ఎంపిక చేసే క్రమంలోనూ సంఖ్య పెరిగింది.

గ్రూప్-1 నోటిఫికేషన్, పరీక్ష విధానం కోసం క్లిక్ చేయండి.. 

'గ్రూప్-1' ఉద్యోగార్థులకు గుడ్‌న్యూస్, పోస్టుల సంఖ్య పెరిగిందోచ్! ఎన్ని పోస్టులంటే!

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...

ALSO READ:

'టెన్త్' అర్హతతో 1558 ఉద్యోగాలు, మల్టీటాస్కింగ్ స్టాఫ్ నోటిఫికేషన్ వచ్చేసింది!
మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఎగ్జామినేషన్-2023 నోటిఫికేషన్‌ను స్టాఫ్ సెలక్షన్ కమిషన్ జూన్ 30న విడుదల చేసింది. ఈ పరీక్ష ద్వారా కేంద్రప్రభుత్వ విభాగాల్లో 1558 మ‌ల్టీ టాస్కింగ్(నాన్ టెక్నికల్), హవిల్దార్ పోస్టులను భర్తీ చేయనున్నారు. పదోతరగతి లేదా తత్సమాన అర్హత ఉన్నవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఈ పోస్టుల భర్తీకి సంబంధించి జూన్ 30 ఆన్‌‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. అభ్యర్థులు జులై 21లోగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. కంప్యూటర్ ఆధారిత రాతపరీక్ష ద్వారా ఉద్యోగ ఎంపికలు చేపడతారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..

ఏకలవ్య గురుకుల పాఠశాలల్లో 4062 ఉద్యోగాలు, వివరాలు ఇలా!
భారత ప్రభుత్వ గిరిజ‌న వ్యవహారాల మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలోని నేషనల్‌ ఎడ్యుకేషన్‌ సోసైటీ ఫర్‌ ట్రైబల్‌ స్టూడెంట్స్‌(ఎన్‌ఈఎస్‌టీఎస్‌) దేశవ్యాప్తంగా ఉన్న ఏక‌ల‌వ్య మోడ‌ల్ రెసిడెన్షియ‌ల్ పాఠ‌శాల‌ల్లో (ఈఎంఆర్ఎస్‌) ఖాళీల భ‌ర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 4062 టీచింగ్, నాన్‌-టీచింగ్‌ పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలున్నవారు జులై 31లోగా ఆన్‌లైన్ ద్వారా తమ దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. జాతీయస్థాయి రాతపరీక్ష ద్వారా ఉద్యోగ ఎంపికలు చేపడతారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..

Join Us on Telegram: https://t.me/abpdesamofficial

టాప్ హెడ్ లైన్స్

GDS Recruitment 2026: పోస్టల్ జీడీఎస్ నోటిఫికేషన్ విడుదల.. రాత పరీక్ష లేకుండా ఉద్యోగాలు.. ఏపీ, తెలంగాణలో ఎన్ని పోస్టులంటే?
పోస్టల్ జీడీఎస్ నోటిఫికేషన్ విడుదల.. రాత పరీక్ష లేకుండా ఉద్యోగాలు..
NIC Recruitment 2026: ఎన్ఐసీలో 376 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్.. రాత పరీక్ష లేకుండానే ఉద్యోగాలు!
ఎన్ఐసీలో 376 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్.. రాత పరీక్ష లేకుండానే ఉద్యోగాలు!
SBI Junior Associates Recruitment : ఎస్బీఐలో 9,124 జూనియర్ అసోసియేట్ పోస్టులు.. భారీ జీతం, అలెవెన్సులు.. రిక్రూట్మెంట్ పూర్తి వివరాలు ఇవే!
ఎస్బీఐలో 9,124 జూనియర్ అసోసియేట్ పోస్టులు.. భారీ జీతం, అలెవెన్సు
AP Special TET 2026 Notification: ఏపీలో టీచర్లకు గుడ్ న్యూస్.. స్పెషల్ టెట్ నోటిఫికేషన్ విడుదల- ముఖ్యమైన తేదీలివే
ఏపీలో టీచర్లకు గుడ్ న్యూస్.. స్పెషల్ టెట్ నోటిఫికేషన్ విడుదల- ముఖ్యమైన తేదీలివే

వీడియోలు

Allu Arjun Graces Forbes India 2026 Cover | ఫోర్బ్స్ ఇండియా కవర్‌పై అల్లు అర్జున్
IND vs SL 2nd Test | కొలంబో టెస్ట్‌లో శ్రీలంక డ్రా
Dhoni CSK 25% Share Controversy | ధోనీ 25% సీఎస్‌కే వాటా? ఆకాష్ చోప్రా క్లారిటీ
CM Revanth Inspects Mir Alam Tank Bridge | క్రేన్ ఎక్కి బ్రిడ్జి పనులను పరిశీలించిన రేవంత్
Toxic Movie Telugu Review | యష్ 'టాక్సిక్' హిట్టా? ఫ్లాపా?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Galwan Operation: జనరల్ జావో జోంగ్కీపై చైనా ప్రభుత్వం వేటు.. గల్వాన్ లోయలో భారత్‌పై దాడికి ఆదేశించడమే కారణమా ?
జనరల్ జావో జోంగ్కీపై చైనా ప్రభుత్వం వేటు.. గల్వాన్ లోయలో భారత్‌పై దాడికి ఆదేశించడమే కారణమా ?
Vijaya Sai Reddy Letter: ఏపీని ఐదేళ్లు పాలించింది జగన్ కాదు సజ్జల ముఠా! వైసీపీలో ఆయనే నెంబర్ వన్‌! విజయసాయిరెడ్డి సంచలన లేఖ!
ఏపీని ఐదేళ్లు పాలించింది జగన్ కాదు సజ్జల ముఠా! వైసీపీలో ఆయనే నెంబర్ వన్‌! విజయసాయిరెడ్డి సంచలన లేఖ!
Tamil Nadu Governor Kiran Kumar: మాజీ సీఎం నల్లారి కిరణ్‌ కుమార్ రెడ్డిని తమిళనాడు గవర్నర్‌గా నియమించారా? 
మాజీ సీఎం నల్లారి కిరణ్‌ కుమార్ రెడ్డిని తమిళనాడు గవర్నర్‌గా నియమించారా? 
Kittu Pavan: హీరోగా ఫోక్ సాంగ్స్ స్టార్ కిట్టు పవన్... చంద్రబోస్ క్లాప్‌తో సినిమా షురూ
హీరోగా ఫోక్ సాంగ్స్ స్టార్ కిట్టు పవన్... చంద్రబోస్ క్లాప్‌తో సినిమా షురూ
Adilabad Congress Group War: ఆదిలాబాద్ కాంగ్రెస్‌లో భగ్గుమన్న విభేదాలు- డీసీసీ అధ్యక్షుడిపై బోథ్ నియోజకవర్గ ఇన్‌చార్జ్ ఆడే గజేందర్ తిరుగుబాటు!
ఆదిలాబాద్ కాంగ్రెస్‌లో భగ్గుమన్న విభేదాలు- డీసీసీ అధ్యక్షుడిపై బోథ్ నియోజకవర్గ ఇన్‌చార్జ్ ఆడే గజేందర్ తిరుగుబాటు!
Eesha Rebba: కొత్త ఇంటికి తల్లి పేరు... ఈషా రెబ్బా ఎమోషనల్ మూమెంట్... గృహ ప్రవేశం ఫోటోలు
కొత్త ఇంటికి తల్లి పేరు... ఈషా రెబ్బా ఎమోషనల్ మూమెంట్... గృహ ప్రవేశం ఫోటోలు
TGSRTC Night Bus Routes: హైదరాబాద్‌లో నైట్‌లైఫ్‌ ఎంజాయ్ చేసే వారికి బిగ్‌అప్‌డేట్‌! స్పెషల్ బస్‌లు వేస్తున్న తెలంగాణ ఆర్టీసీ!
హైదరాబాద్‌లో నైట్‌లైఫ్‌ ఎంజాయ్ చేసే వారికి బిగ్‌అప్‌డేట్‌! స్పెషల్ బస్‌లు వేస్తున్న తెలంగాణ ఆర్టీసీ!
Revanth Reddy Letter To EC: SIR తో 92 లక్షల మంది ఓట్లకు ముప్పు, గడువు పొడిగించండి.. ఈసీకి సీఎం రేవంత్ రెడ్డి లేఖ
SIR తో 92 లక్షల మంది ఓట్లకు ముప్పు, గడువు పొడిగించండి.. ఈసీకి సీఎం రేవంత్ రెడ్డి లేఖ
Embed widget