Patanjali: ఊపిరితిత్తుల క్యాన్సర్ - కారణాలు, లక్షణాలు, ఆయుర్వేద చికిత్స
Aurogrit: ఊపిరితిత్తుల కణాలు అనియంత్రితంగా పెరగడం వల్ల ఊపిరితిత్తుల క్యాన్సర్ వస్తుంది. ఇది ప్రధానంగా ధూమపానం వల్ల సంభవిస్తుంది. దగ్గు, ఛాతీ నొప్పి, బరువు తగ్గడం, అలసట దీని లక్షణాలు.

Cancer Overview:
క్యాన్సర్ అనేది శరీరంలోని కణాలు అసాధారణంగా పెరిగి ఇతర భాగాలకు వ్యాపించే తీవ్రమైన వ్యాధి. సాధారణంగా శరీర కణాలు ఒక నియంత్రిత పద్ధతిలో పెరుగుతూ, విభజన చెందుతూ, నశిస్తూ ఉంటాయి. ఈ ప్రక్రియలో లోపాలు తలెత్తినప్పుడు కణాలు అదుపులేకుండా పెరిగి గడ్డలుగా మారుతాయి. వీటినే ట్యూమర్లు అంటారు. ట్యూమర్లు రెండు రకాలు. ఒకటి బెనిన్, ఇది క్యాన్సర్ కాని గడ్డ. రెండోది మాలిగ్నెంట్, ఇది క్యాన్సర్ గడ్డ. మాలిగ్నెంట్ ట్యూమర్లు శరీరంలోని ఇతర భాగాలకు వ్యాపించి తీవ్రమైన ఆరోగ్య సమస్యలను కలిగిస్తాయి.
ఊపిరితిత్తుల క్యాన్సర్ రకాలు
ఊపిరితిత్తుల క్యాన్సర్ను ప్రధానంగా రెండు రకాలుగా వర్గీకరిస్తారు. మొదటిది నాన్-స్మాల్ సెల్ లంగ్ క్యాన్సర్. ఇది 85 శాతం కేసులలో కనిపిస్తుంది. ఇది నెమ్మదిగా పెరుగుతుంది. సరైన సమయంలో చికిత్స అందకపోతే ప్రమాదకరంగా మారుతుంది. రెండోది స్మాల్ సెల్ లంగ్ క్యాన్సర్. ఇది తక్కువ మందిలో కనిపిస్తుంది. కానీ చాలా వేగంగా వ్యాపిస్తుంది. దీనికి అత్యంత జాగ్రత్తగా, వేగంగా చికిత్స అందించాలి.
క్యాన్సర్ కారణాలు
దీనికి అనేక కారణాలు ఉన్నప్పటికీ ధూమపానం ప్రధానమైంది. పొగాకు పొగలో 7,000 పైగా రసాయనాలు ఉంటాయి. వీటిలో చాలా వరకు క్యాన్సర్ కారకాలు. ధూమపానం చేసే వారితో పాటు వారి చుట్టుపక్కల ఉండేవారికి కూడా ముప్పు పొంచి ఉంది. దీనినే పాసివ్ స్మోకింగ్ అంటారు. ఇది కూడా సమానమైన హాని కలిగిస్తుంది.
లక్షణాలు
ప్రారంభ దశలో లక్షణాలు స్పష్టంగా ఉండవు. దీనివల్ల వ్యాధిని గుర్తించడంలో జాప్యం జరుగుతుంది. నిరంతరంగా వేధించే దగ్గు, దగ్గులో రక్తం పడటం, ఛాతీ నొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, గొంతు బొంగురుపోవడం, అకస్మాత్తుగా బరువు తగ్గడం, తీవ్రమైన అలసట వంటివి సాధారణ లక్షణాలు. కొన్నిసార్లు బ్రోన్కైటిస్ లేదా న్యుమోనియా వంటి సమస్యలు పదేపదే వస్తుంటాయి. వీటిని నిర్లక్ష్యం చేయడం ప్రాణాంతకం. సకాలంలో పరీక్షలు, చికిత్స చేయించుకోవడం అవసరం.
వ్యాధి నిర్ధారణ
ఆధునిక వైద్యంలో దీని కోసం పలు పద్ధతులు ఉన్నాయి. వైద్యులు మొదట ఎక్స్-రే ద్వారా ఊపిరితిత్తుల పరిస్థితిని అంచనా వేస్తారు. ఆ తర్వాత సిటీ స్కాన్, పెట్ స్కాన్ వంటి పరికరాల సహాయంతో క్యాన్సర్ వ్యాప్తిని తెలుసుకుంటారు. ఎంఆర్ఐ ద్వారా వివరణాత్మక చిత్రాలు లభిస్తాయి. అవసరమైతే బయాప్సీ చేసి కణజాల నమూనాలను ప్రయోగశాలలో పరీక్షిస్తారు. వీటి ఆధారంగా క్యాన్సర్ ఏ దశలో ఉందో (1 నుండి 4 వరకు) నిర్ధారిస్తారు.
ఆయుర్వేదం ద్వారా చికిత్స
ఈ దిశగా పతంజలి ఒక ముఖ్యమైన ఆవిష్కరణ చేసింది. ఊపిరితిత్తుల క్యాన్సర్ నివారణకు అరో గ్రిట్ అనే ఆయుర్వేద మందును అభివృద్ధి చేసింది. దీనిని కర్కాట శృంగి (కాకడసింగి) నుండి తయారు చేశారు. ఆయుర్వేద గ్రంథాల ప్రకారం శ్వాసకోశ వ్యాధులకు ఇది ఎంతో మేలు చేస్తుంది. ఈ మందులో గాలిక్ యాసిడ్, మిథైల్ గాలెట్, పెంటా-ఓ-గాలాయిల్-బీటా-డి-గ్లూకోజ్ వంటి ఫైటోకెమికల్స్ ఉన్నాయి. వీటిలో పిజిజి అనేది వివిధ రకాల క్యాన్సర్లను అడ్డుకోవడంలో ప్రభావవంతంగా పనిచేస్తుంది.
ఊపిరితిత్తులలోని క్యాన్సర్ కణాలపై అరో గ్రిట్ పనితీరును విశ్లేషించారు. ఈ అధ్యయనంలో అరో గ్రిట్ ఆరోగ్యకరమైన కణాలకు హాని చేయకుండా కేవలం క్యాన్సర్ కణాలను మాత్రమే నాశనం చేస్తున్నట్లు తేలింది. ఇది క్యాన్సర్ పెరుగుదలను ఆపుతూ ట్యూమర్లు ఏర్పడే ప్రక్రియను నెమ్మదింపజేస్తుంది. మాలిక్యులర్ స్థాయిలో సిగ్నలింగ్ పాత్వేపై ప్రభావం చూపడం ద్వారా కొత్త క్యాన్సర్ కణాలు పుట్టే రేటును తగ్గిస్తుంది.
Disclaimer: This is a sponsored article. ABP Network Pvt. Ltd. and/or ABP Live do not endorse/subscribe to its contents and/or views expressed herein. All information is provided on an as-is basis. The information does not constitute a medical advice or an offer to buy. Consult an expert advisor/health professional before any such purchase. Reader discretion is advised.























