అన్వేషించండి

Ayurvedic Tips: భోజనం తర్వాత ఇలా చేయాలంటున్న ఆయుర్వేదం - శతపవ్లి అంటే?

ఆరోగ్యంగా ఉండాలంటే.. ఆహారం చాలా ముఖ్యం. ఆహారం వల్లే మన శరీరానికి కావల్సిన శక్తి లభిస్తుంది. అయితే, ఆహారం తింటే సరిపోదు ఆ తర్వాత కూడా కొన్ని అలవాట్లు చేసుకోవాలని ఆయుర్వేదం చెబుతోంది. అవేంటో చూడండి.

ఆరోగ్యం ఆధారపడి ఉండేది ముఖ్యంగా మూడు విషయాల మీద ఒకటి భోజనం, రెండోది విశ్రాంతి, మూడోది వ్యాయామం. ఈ మూడు అంశాలు సరిగ్గా ఉంటే పెద్దగా వేధించే అనారోగ్యాలు తక్కువ.

చురుగ్గా ఉండేందుకు కేవలం తినే భోజనం మాత్రమే కాదు, తిన్న తర్వాత చేసే పనుల మీద కూడా శ్రద్ధ పెట్టాలని ఆయుర్వేదం చెబుతోంది. మనదేశానికి చెందిన పురాతనమైన శతపవ్లి అనే ఒక కాన్సెప్ట్ ఉంది. దీని ప్రకారం భోంచేశాక షికారుకు వెళ్లమని చెబుతున్నారు. అలాగే భోజనం తర్వాత 100 అడుగులు నడవాలనే సూచన కూడా ఉంది. దీనిని షట్పావళి అంటారు. నితికా కోహ్లీ అనే ఆయుర్వేద డాక్టర్ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా దీనిపై పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు.

పూర్వకాలం నుంచి జీర్ణక్రియకు తోడ్పడే మంచి అలవాటుగా షట్పావళి రుజువైంది. భోజనం చేసిన తర్వాత 100 అడుగుల దూరం నడవడం జీర్ణవ్యవస్థకు చక్కని అలవాటుగా పరిణమిస్తుందని నితికా కోహ్లీ అంటున్నారు. వాకింగ్ లేదా జాగింగ్ శరీరాన్ని ఫిట్ గా ఉంచే మంచి వ్యాయామంగా నిపుణులు చెబుతున్నారు. కేవలం ఫిట్ గా ఉండడం బరువు అదుపులో పెట్టుకోవడం మాత్రమే కాదు ఇది జీర్ణవ్యవస్థను కూడా క్రమశిక్షణలో ఉంచుతుంది. భోజనం తర్వాత వంద అడుగులు నడవడం వల్ల కలిగే లాభాల గురించి మరో ఆయుర్వేద నిపుణులు డాక్టర్ శ్రీవాస్తవ వివరించారు

  • జీర్ణక్రియను మెరుగు పరుస్తుంది.
  • భోజనం తర్వాత నడిస్తే ఎక్కువ కాలరీలను బర్న్ చెయ్యడం సాధ్యమవుతుంది.
  • రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి.
  • ట్రైగ్లిజరాయిడ్ల నియంత్రణకు తోడ్పడుతుంది.
  • తీసుకున్న ఆహారంలోని పోషకాలు కూడా త్వరగా శరీరానికి అందుతాయి.

డయాబెటిస్‌తో బాధపడుతున్నవారు భోజనం తర్వాత చిన్నగా నడిస్తే రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉన్నట్టు స్పోర్ట్స్ మెడిసిన్ అనే జర్నల్ లో పేర్కొన్నారు. ఆయుర్వేదంలో సూచించిన ఈ పురాతన చిట్కా శట్పావళి చాలా ప్రయోజనకర ప్రక్రియ. భోజనం తర్వాత నిద్రపోయే అలవాటు ఉంటుంది చాలా మందిలో. అది శరీరంలో కఫం, కొవ్వు పెరగడానికి కారణం అవుతుంది. అంతేకాదు జీర్ణక్రియ కూడా నెమ్మదిస్తుంది. భోజనం తర్వాత వెంటనే నీళ్లు తాగడం కూడా జర్ణక్రియ నెమ్మదించడానికి కారణం కావచ్చని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు. అంతేకాదు ఈ అలవాటు బరువు పెరగడానికి కూడా కారణం అవుతుందట. భోజన సమయంలో లేదా భోజనం తర్వాత వెంటనే నీళ్లు తాగకూడదు. రెండు భోజనాల విరామ సమయంలోనే నీళ్లు తాగడం మంచిదనేది నిపుణుల సూచన.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Dr Nitika Kohli, Ayurveda (@drnitikakohli)

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pawan Kalyan vs Jagadish Reddy: చిచ్చు పెట్టిన దిష్టి వ్యాఖ్యలు - పవన్ కల్యాణ్‌పై బీఆర్ఎస్ నేత జగదీష్ రెడ్డి తీవ్ర విమర్శలు
చిచ్చు పెట్టిన దిష్టి వ్యాఖ్యలు - పవన్ కల్యాణ్‌పై బీఆర్ఎస్ నేత జగదీష్ రెడ్డి తీవ్ర విమర్శలు
Amaravati farmers: అమరావతి రైతులతో  చంద్రబాబు సమావేశం - కీలక సమస్యలపై చర్చ - 6 నెలల్లో  పరిష్కారానికి హామీ
అమరావతి రైతులతో చంద్రబాబు సమావేశం - కీలక సమస్యలపై చర్చ - 6 నెలల్లో పరిష్కారానికి హామీ
TTD Adulterated ghee case: కల్తీ నెయ్యి కేసులో మరో కీలక అరెస్టు - మొదటి సారి టీటీడీ జీఎం అరెస్ట్
కల్తీ నెయ్యి కేసులో మరో కీలక అరెస్టు - మొదటి సారి టీటీడీ జీఎం అరెస్ట్
Special Trains: రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్! SCR 42 ప్రత్యేక రైళ్లను పొడిగించింది: మీ గమ్యస్థానాలకు చేరేందుకు రెడీ అవ్వండి!
రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్! SCR 42 ప్రత్యేక రైళ్లను పొడిగించింది: మీ గమ్యస్థానాలకు చేరేందుకు రెడీ అవ్వండి!
Advertisement

వీడియోలు

Hong kong Apartments Fire Updates | 60ఏళ్లలో ప్రపంచంలోనే అతిపెద్ద అగ్నిప్రమాదం | ABP Desam
Gambhir Comments on Head Coach Position | గంభీర్ సెన్సేషనల్ స్టేట్‌మెంట్
World Test Championship Points Table | టెస్టు ఛాంపియన్‌షిప్ లో భారత్ స్థానం ఇదే
Reason for Team India Failure | భారత్ ఓటమికి కారణాలు ఇవే !
Rohit Sharma First Place in ICC ODI Rankings | అగ్రస్థానంలో
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan vs Jagadish Reddy: చిచ్చు పెట్టిన దిష్టి వ్యాఖ్యలు - పవన్ కల్యాణ్‌పై బీఆర్ఎస్ నేత జగదీష్ రెడ్డి తీవ్ర విమర్శలు
చిచ్చు పెట్టిన దిష్టి వ్యాఖ్యలు - పవన్ కల్యాణ్‌పై బీఆర్ఎస్ నేత జగదీష్ రెడ్డి తీవ్ర విమర్శలు
Amaravati farmers: అమరావతి రైతులతో  చంద్రబాబు సమావేశం - కీలక సమస్యలపై చర్చ - 6 నెలల్లో  పరిష్కారానికి హామీ
అమరావతి రైతులతో చంద్రబాబు సమావేశం - కీలక సమస్యలపై చర్చ - 6 నెలల్లో పరిష్కారానికి హామీ
TTD Adulterated ghee case: కల్తీ నెయ్యి కేసులో మరో కీలక అరెస్టు - మొదటి సారి టీటీడీ జీఎం అరెస్ట్
కల్తీ నెయ్యి కేసులో మరో కీలక అరెస్టు - మొదటి సారి టీటీడీ జీఎం అరెస్ట్
Special Trains: రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్! SCR 42 ప్రత్యేక రైళ్లను పొడిగించింది: మీ గమ్యస్థానాలకు చేరేందుకు రెడీ అవ్వండి!
రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్! SCR 42 ప్రత్యేక రైళ్లను పొడిగించింది: మీ గమ్యస్థానాలకు చేరేందుకు రెడీ అవ్వండి!
Sri charani: మహిళల ఐపీఎల్‌ ఆటగాళ్ల వేలంలో శ్రీచరణికి కోటి 30 లక్షలు - ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఆడనున్న స్టార్ ప్లేయర్
మహిళల ఐపీఎల్‌ వేలంలో శ్రీచరణికి కోటి 30 లక్షలు - ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఆడనున్న స్టార్ ప్లేయర్
Kalvakuntla Kavitha: ఎలా ట్రెండింగ్‌లో ఉండాలో కవితకు బాగా తెలుసా? - ఇప్పుడంతా ఆమె గురించే చర్చ
ఎలా ట్రెండింగ్‌లో ఉండాలో కవితకు బాగా తెలుసా? - ఇప్పుడంతా ఆమె గురించే చర్చ
Shiva Jyothi : శ్రీవారి దర్శనం... యాంకర్ శివజ్యోతి ఆధార్ కార్డ్ బ్లాక్ - ఆ వార్తలపై క్లారిటీ!
శ్రీవారి దర్శనం... యాంకర్ శివజ్యోతి ఆధార్ కార్డ్ బ్లాక్ - ఆ వార్తలపై క్లారిటీ!
2019 Group 2 Issue: గ్రూప్-2 2019 ర్యాంకర్లకు భారీ ఊరట.. సింగిల్ బెంచ్ తీర్పును సస్పెండ్ చేసిన డివిజన్ బెంచ్
గ్రూప్-2 2019 ర్యాంకర్లకు భారీ ఊరట.. సింగిల్ బెంచ్ తీర్పును సస్పెండ్ చేసిన డివిజన్ బెంచ్
Embed widget