అన్వేషించండి

Food Combinations: ఈ కాంబినేషన్‌ ఫుడ్స్‌ని పొరపాటున కూడా కలిపి తినకండి... స్లో పాయిజన్ అయ్యే అవకాశం ఉంది 

ఆహారం తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. కొన్ని కాంబినేషన్లు మంచివి కాదు. అవేమిటో, అవి కలిపి తీసుకుంటే ఏం జరుగుతుందో ఇప్పుడు చూద్దాం.

మనం రోజూ తినే ఆహారంలో కొన్ని పదార్థాలు జత చేసుకుని తింటే ఇంకా ఇంకా తినాలనిపిస్తోంది. కానీ, కొన్ని కాంబినేషన్లు మాత్రం స్లో పాయిజన్‌గా మారి మన ఆరోగ్యాన్ని పాడు చేస్తాయని తెలుసా? అందుకే ఆహారం తీసుకునేటప్పుడు జాగ్రత్తగా తీసుకోవాలి. ఆలోచనలేకుండా కలిపి తింటే కొన్ని పదార్థాలు మనకు మరణాన్ని చాలా తొందరగా తీసుకువస్తాయని వైద్యులు అంటున్నారు. ఇప్పుడు అవేమిటో చూద్దాం. 

Also Read: పులిపిర్ల సమస్యతో బాధపడుతున్నారా? ఇంట్లో ఈ చిట్కాలతో ఆ సమస్య నుంచి బయటపడండి

పాలు, పండ్లు

పాలు, పండ్లు కలిపి తీసుకోవడం వల్ల చెవి, ముక్కు, గొంతుకు సంబంధించిన సమస్యలు వస్తాయి. పాలల్లో ఉన్న కొవ్వు, పండ్లలో ఉండే చక్కెర వల్ల జరిగే చర్యలు అప్పటికప్పుడు సమస్య రాకపోయినా... భవిష్యత్తులో చెవి సమస్యలు అధికంగా వచ్చే ప్రమాదం ఉంటుంది. 

చపాతీ, పూరీ

గోధుమ పిండి ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఈ పిండితో పూరీలు, చపాతీలు చేసుకుని తినడం వల్ల పిండిలో ఉండే ఫైబర్... నూనెతో కలిసి శరీరానికి ఫైబర్ అందకుండా తొందరగా కరిగి గ్లూకోజ్ అయ్యేలా చేస్తుంది. దీనివల్ల షుగర్ వ్యాధితో బాధపడే వారికి గ్లూకోజ్ విలువలు పెరిగే అవకాశం ఉంది. ఇంకా పూరీలలో ఇది ఇంకా ఎక్కువ వేగంగా జరుగుతుంది. అంతేకాదు షుగర్ రాకుండా క్లోమ గ్రంథి విడుదల చేసే హార్మోన్స్ ఆగిపోతాయి. క్లోమ గ్రంథి పని తీరు నెమ్మదిస్తుంది. ఈ రెండు పదార్థాలు ఎక్కువగా తీసుకోవడం వల్ల షుగర్ స్థాయులు బాగా పెరిగిపోతాయి. అందుకే ఎప్పుడూ ఈ రెండు కలిపి తీసుకోకండి. 

తేనె, నెయ్యి 

తేనె, నెయ్యి రెండు ఆరోగ్యానికి ఎంతో మంచి పదార్థాలు. విడివిడిగా తింటే ఎంతో మంచిది. కానీ, ఈ రెండింటినీ కలిపి తీసుకుంటే మాత్రం ప్రమాదమే. ఈ రెండింటి మోతాదును సమానంగా ఒకేసారి తీసుకోకూడదు. అలా చేస్తే వీటి వల్ల స్లో పాయిజన్‌గా మారుతుంది. అందుకే చాలా చోట్ల ఈ రెండింటిని కలిపాలంటే రెండు సమాన మోతాదుల్లో వేయరు. ఒకటి ఎక్కువ, మరొకటి తక్కువ వేస్తారు. 

Also Read: రోజుకో క్యారెట్... ఎన్నో అనారోగ్యాలకు పెట్టొచ్చు చెక్... అధిక బరువు నుంచి కంటి చూపు మెరుగు వరకు

ఆకు కూరలు, పాలు

చాలా మందికి కొన్ని కూరల్లో పాలు పోసి వండటం అలవాటు. అయితే పాలకు ఉప్పు తగలడం వల్ల పాలు విరిగిపోయి దాన్ని ఆహారంగా తీసుకోవడం వల్ల రక్తానికి అందాల్సిన ఆక్సిజన్ అందదు. దీని వల్ల శరీరంలో చెడు రక్తం పెరిగిపోతుంది. దీని వల్ల భవిష్యత్తులో కొన్ని రకాల జబ్బులకు దారి తీస్తుంది. ఆకు కూరల్లో పాలు పోసి వండటం మంచిది కాదు. 

పెరుగు, అరటిపండు

చాలా మందికి పెరుగన్నంలో అరటి పండు కలిపి తినడం అలవాటు. ఈ రెండు కలిపి తింటే జీర్ణాశయంలో పులిసిపోయి చర్మ సంబంధ వ్యాధులు రావడానికి కారణం అవుతుంది. అంతేకాదు గ్యాస్ సమస్యలు తలెత్తుతాయి. 

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే. ఈ కథనానికి ‘abp దేశం’ ఎలాంటి బాధ్యత వహించదని గమనించగలరు. 

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channelసబ్‌స్క్రైబ్‌ చేయండి

టాప్ హెడ్ లైన్స్

Pregnancy and High BP : ప్రెగ్నెన్నీ సమయంలో అధిక రక్తపోటు.. ఈ 6 ఫుడ్స్ గర్భిణీలు తింటే మంచిదట
ప్రెగ్నెన్నీ సమయంలో అధిక రక్తపోటు.. ఈ 6 ఫుడ్స్ గర్భిణీలు తింటే మంచిదట
Matcha Tea : మాచా టీ ఎలా తయారు చేయాలి? రోజూ తాగితే మంచిదేనా? ఆరోగ్యానికి కలిగే లాభాలు ఇవే
మాచా టీ ఎలా తయారు చేయాలి? రోజూ తాగితే మంచిదేనా? ఆరోగ్యానికి కలిగే లాభాలు ఇవే
Dengue or Viral Fever : జ్వరం, ఒళ్లు నొప్పులు ఉంటే డెంగ్యూనా? వైరల్ ఫీవర్‌కు దీనికి మధ్య తేడా తెలుసుకోవాలి
జ్వరం, ఒళ్లు నొప్పులు ఉంటే డెంగ్యూనా? వైరల్ ఫీవర్‌కు దీనికి మధ్య తేడా తెలుసుకోవాలి
Piles Types and Grades : పైల్స్ ఎన్ని రకాలు ఉంటాయి? వాటిలో ఏది ప్రమాదకరం? ఈ లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త
పైల్స్ ఎన్ని రకాలు ఉంటాయి? వాటిలో ఏది ప్రమాదకరం? ఈ లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త

వీడియోలు

Gundenininda Gudigantalu Serial September 11
India vs Afghanistan T20I Series 2026 | అఫ్గానిస్తాన్‌ సిరీస్‌కు ముందు టీమ్ ఇండియాకు బిగ్ రిలీఫ్
India Vs Afghanistan T20 | టీ20 మ్యాచ్‌ నిర్వహణకు ఢిల్లీ పోలీస్ గ్రీన్ సిగ్నల్
Women's Asia Cup 2026 IND vs BAN Semifinal | ఆసియా కప్‌ ఫైనల్లో టీమిండియా
Ashish Nehra India Head Coach Rumors | టీమిండియా కోచ్ పోస్ట్ పై నెహ్రా ఫన్నీ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
EPFO Wage Ceiling Hike: ఉద్యోగులకు కేంద్రం భారీ గుడ్ న్యూస్.. ఈపీఎఫ్ వేతన పరిమితి రూ.25 వేలకు పెంపు
ఉద్యోగులకు కేంద్రం భారీ గుడ్ న్యూస్.. ఈపీఎఫ్ వేతన పరిమితి రూ.25 వేలకు పెంపు
Death Sentence For Maoists: జీరమ్ లోయ ఊచకోత కేసు.. 10 మంది మావోయిస్టులకు మరణశిక్ష విధించిన NIA కోర్టు
జీరమ్ లోయ ఊచకోత కేసు.. 10 మంది మావోయిస్టులకు మరణశిక్ష విధించిన NIA కోర్టు
KCR Family Assets: కేసీఆర్ ఫ్యామిలీ భూముల వివరాలు, ఎవరి పేరిట ఎన్ని ఎకరాలు- సభలో వెల్లడించిన సీఎం రేవంత్ రెడ్డి
కేసీఆర్ ఫ్యామిలీ భూముల వివరాలు, ఎవరి పేరిట ఎన్ని ఎకరాలు- సభలో వెల్లడించిన సీఎం రేవంత్ రెడ్డి
CM Chandrababu In Tirumala: వేంకటేశ్వర స్వామివారి కృపతోనే ప్రాణాలతో ఉన్నా.. తిరుమలలో సీఎం చంద్రబాబు భావోద్వేగం
వేంకటేశ్వర స్వామివారి కృపతోనే ప్రాణాలతో ఉన్నా.. తిరుమలలో సీఎం చంద్రబాబు భావోద్వేగం
Viral News: విశాఖలో రోడ్డు పక్కన కుప్పలుగా పడి ఉన్న చిరిగిన కరెన్సీ నోట్లు 
విశాఖలో రోడ్డు పక్కన కుప్పలుగా పడి ఉన్న చిరిగిన కరెన్సీ నోట్లు 
AP Police Recruitment: ఏపీలో పోలీస్ కొలువులు.. 2050 ఎస్ఐ, కానిస్టేబుల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్
ఏపీలో పోలీస్ కొలువులు.. 2050 ఎస్ఐ, కానిస్టేబుల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్
YSRCP Vizianagaram: బొత్స కుటుంబానికి జగన్ బిగ్ షాక్ - నెల్లిమర్ల ఇన్‌ఛార్జ్ మార్పు వెనుక ఉత్తరాంధ్ర పొలిటికల్ గేమ్?
బొత్స కుటుంబానికి జగన్ బిగ్ షాక్ - నెల్లిమర్ల ఇన్‌ఛార్జ్ మార్పు వెనుక ఉత్తరాంధ్ర పొలిటికల్ గేమ్?
NRI Become IAS: ఎన్ఆర్ఐలు UPSC సివిల్ సర్వీసెస్ పరీక్షలు రాయొచ్చా?.. ఐఏఎస్ అవ్వాలంటే అర్హతలేంటి?
ఎన్ఆర్ఐలు UPSC సివిల్ సర్వీసెస్ పరీక్షలు రాయొచ్చా?.. ఐఏఎస్ అవ్వాలంటే అర్హతలేంటి?
Embed widget