అన్వేషించండి

Food Combinations: ఈ కాంబినేషన్‌ ఫుడ్స్‌ని పొరపాటున కూడా కలిపి తినకండి... స్లో పాయిజన్ అయ్యే అవకాశం ఉంది 

ఆహారం తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. కొన్ని కాంబినేషన్లు మంచివి కాదు. అవేమిటో, అవి కలిపి తీసుకుంటే ఏం జరుగుతుందో ఇప్పుడు చూద్దాం.

మనం రోజూ తినే ఆహారంలో కొన్ని పదార్థాలు జత చేసుకుని తింటే ఇంకా ఇంకా తినాలనిపిస్తోంది. కానీ, కొన్ని కాంబినేషన్లు మాత్రం స్లో పాయిజన్‌గా మారి మన ఆరోగ్యాన్ని పాడు చేస్తాయని తెలుసా? అందుకే ఆహారం తీసుకునేటప్పుడు జాగ్రత్తగా తీసుకోవాలి. ఆలోచనలేకుండా కలిపి తింటే కొన్ని పదార్థాలు మనకు మరణాన్ని చాలా తొందరగా తీసుకువస్తాయని వైద్యులు అంటున్నారు. ఇప్పుడు అవేమిటో చూద్దాం. 

Also Read: పులిపిర్ల సమస్యతో బాధపడుతున్నారా? ఇంట్లో ఈ చిట్కాలతో ఆ సమస్య నుంచి బయటపడండి

పాలు, పండ్లు

పాలు, పండ్లు కలిపి తీసుకోవడం వల్ల చెవి, ముక్కు, గొంతుకు సంబంధించిన సమస్యలు వస్తాయి. పాలల్లో ఉన్న కొవ్వు, పండ్లలో ఉండే చక్కెర వల్ల జరిగే చర్యలు అప్పటికప్పుడు సమస్య రాకపోయినా... భవిష్యత్తులో చెవి సమస్యలు అధికంగా వచ్చే ప్రమాదం ఉంటుంది. 

చపాతీ, పూరీ

గోధుమ పిండి ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఈ పిండితో పూరీలు, చపాతీలు చేసుకుని తినడం వల్ల పిండిలో ఉండే ఫైబర్... నూనెతో కలిసి శరీరానికి ఫైబర్ అందకుండా తొందరగా కరిగి గ్లూకోజ్ అయ్యేలా చేస్తుంది. దీనివల్ల షుగర్ వ్యాధితో బాధపడే వారికి గ్లూకోజ్ విలువలు పెరిగే అవకాశం ఉంది. ఇంకా పూరీలలో ఇది ఇంకా ఎక్కువ వేగంగా జరుగుతుంది. అంతేకాదు షుగర్ రాకుండా క్లోమ గ్రంథి విడుదల చేసే హార్మోన్స్ ఆగిపోతాయి. క్లోమ గ్రంథి పని తీరు నెమ్మదిస్తుంది. ఈ రెండు పదార్థాలు ఎక్కువగా తీసుకోవడం వల్ల షుగర్ స్థాయులు బాగా పెరిగిపోతాయి. అందుకే ఎప్పుడూ ఈ రెండు కలిపి తీసుకోకండి. 

తేనె, నెయ్యి 

తేనె, నెయ్యి రెండు ఆరోగ్యానికి ఎంతో మంచి పదార్థాలు. విడివిడిగా తింటే ఎంతో మంచిది. కానీ, ఈ రెండింటినీ కలిపి తీసుకుంటే మాత్రం ప్రమాదమే. ఈ రెండింటి మోతాదును సమానంగా ఒకేసారి తీసుకోకూడదు. అలా చేస్తే వీటి వల్ల స్లో పాయిజన్‌గా మారుతుంది. అందుకే చాలా చోట్ల ఈ రెండింటిని కలిపాలంటే రెండు సమాన మోతాదుల్లో వేయరు. ఒకటి ఎక్కువ, మరొకటి తక్కువ వేస్తారు. 

Also Read: రోజుకో క్యారెట్... ఎన్నో అనారోగ్యాలకు పెట్టొచ్చు చెక్... అధిక బరువు నుంచి కంటి చూపు మెరుగు వరకు

ఆకు కూరలు, పాలు

చాలా మందికి కొన్ని కూరల్లో పాలు పోసి వండటం అలవాటు. అయితే పాలకు ఉప్పు తగలడం వల్ల పాలు విరిగిపోయి దాన్ని ఆహారంగా తీసుకోవడం వల్ల రక్తానికి అందాల్సిన ఆక్సిజన్ అందదు. దీని వల్ల శరీరంలో చెడు రక్తం పెరిగిపోతుంది. దీని వల్ల భవిష్యత్తులో కొన్ని రకాల జబ్బులకు దారి తీస్తుంది. ఆకు కూరల్లో పాలు పోసి వండటం మంచిది కాదు. 

పెరుగు, అరటిపండు

చాలా మందికి పెరుగన్నంలో అరటి పండు కలిపి తినడం అలవాటు. ఈ రెండు కలిపి తింటే జీర్ణాశయంలో పులిసిపోయి చర్మ సంబంధ వ్యాధులు రావడానికి కారణం అవుతుంది. అంతేకాదు గ్యాస్ సమస్యలు తలెత్తుతాయి. 

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే. ఈ కథనానికి ‘abp దేశం’ ఎలాంటి బాధ్యత వహించదని గమనించగలరు. 

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channelసబ్‌స్క్రైబ్‌ చేయండి

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Tiger and Leopard Deaths: వేర్వేరు ప్రమాదాల్లో పులి, చిరుతపులి మృతి.. విచారణకు పవన్ కళ్యాణ్ ఆదేశాలు
వేర్వేరు ప్రమాదాల్లో పులి, చిరుతపులి మృతి.. విచారణకు పవన్ కళ్యాణ్ ఆదేశాలు
Aravali Contraversi: ఆరావళి పర్వతాలను మైనింగ్ మాఫియాకు అప్పగించేస్తున్నారా? -అసలేం జరుగుతోంది?
ఆరావళి పర్వతాలను మైనింగ్ మాఫియాకు అప్పగించేస్తున్నారా? -అసలేం జరుగుతోంది?
YSRCP activist arrest: రాజకీయ అహంకారంతో చెలరేగిపోతున్న వారికి ఏపీ పోలీసుల షాక్ ట్రీట్‌మెంట్ - నడిపించుకుంటూ తీసుకెళ్తున్నారు !
రాజకీయ అహంకారంతో చెలరేగిపోతున్న వారికి ఏపీ పోలీసుల షాక్ ట్రీట్‌మెంట్ - నడిపించుకుంటూ తీసుకెళ్తున్నారు !
Harish Rao: తప్పుడు కేసుల్ని పెట్టే పోలీసుల్ని వదిలి పెట్టేది లేదు - ట్యాపింగ్ కేసు నోటీసుల ప్రచారంపై హరీష్ రావు హెచ్చరిక
తప్పుడు కేసుల్ని పెట్టే పోలీసుల్ని వదిలి పెట్టేది లేదు - ట్యాపింగ్ కేసు నోటీసుల ప్రచారంపై హరీష్ రావు హెచ్చరిక

వీడియోలు

Delhi Bangladesh High Commissionerate | బంగ్లాదేశ్ హైకమిషనరేట్‌ను ముట్టడించిన హిందూ సంఘాలు | ABP
1 Crore to Pak U-19 Players | పాక్ ఆటగాళ్లకి ఒక్కొక్కరికీ కోటి రూపాయలు | ABP Desam
Shubman Gill vs Yashasvi Jaiswal | t20 వరల్డ్ కప్ 2026 ఇండియన్ స్క్వాడ్ లో జైస్వాల్ కి చోటు దక్కల్సింది | ABP Desam
Virat Kohli Under Pant Captaincy | పంత్ కెప్టెన్సీలో బరిలోకి దిగబోతున్న విరాట్ కోహ్లీ | ABP Desam
Vaibhav Suryavanshi Shoe Controversy | పాక్ పేసర్‌కు వైభవ్ సూర్యవంశీ షూ చూపించిన ఘటనపై క్లారిటీ | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Tiger and Leopard Deaths: వేర్వేరు ప్రమాదాల్లో పులి, చిరుతపులి మృతి.. విచారణకు పవన్ కళ్యాణ్ ఆదేశాలు
వేర్వేరు ప్రమాదాల్లో పులి, చిరుతపులి మృతి.. విచారణకు పవన్ కళ్యాణ్ ఆదేశాలు
Aravali Contraversi: ఆరావళి పర్వతాలను మైనింగ్ మాఫియాకు అప్పగించేస్తున్నారా? -అసలేం జరుగుతోంది?
ఆరావళి పర్వతాలను మైనింగ్ మాఫియాకు అప్పగించేస్తున్నారా? -అసలేం జరుగుతోంది?
YSRCP activist arrest: రాజకీయ అహంకారంతో చెలరేగిపోతున్న వారికి ఏపీ పోలీసుల షాక్ ట్రీట్‌మెంట్ - నడిపించుకుంటూ తీసుకెళ్తున్నారు !
రాజకీయ అహంకారంతో చెలరేగిపోతున్న వారికి ఏపీ పోలీసుల షాక్ ట్రీట్‌మెంట్ - నడిపించుకుంటూ తీసుకెళ్తున్నారు !
Harish Rao: తప్పుడు కేసుల్ని పెట్టే పోలీసుల్ని వదిలి పెట్టేది లేదు - ట్యాపింగ్ కేసు నోటీసుల ప్రచారంపై హరీష్ రావు హెచ్చరిక
తప్పుడు కేసుల్ని పెట్టే పోలీసుల్ని వదిలి పెట్టేది లేదు - ట్యాపింగ్ కేసు నోటీసుల ప్రచారంపై హరీష్ రావు హెచ్చరిక
Shambhala Review : బడ్జెట్... హార్డ్ వర్క్ నో కాంప్రమైజ్ - 'శంబాల' థియేటర్స్‌లో చూస్తేనే ఫీల్... హీరో ఆది సాయికుమార్ ఇంటర్వ్యూ
బడ్జెట్... హార్డ్ వర్క్ నో కాంప్రమైజ్ - 'శంబాల' థియేటర్స్‌లో చూస్తేనే ఫీల్... హీరో ఆది సాయికుమార్ ఇంటర్వ్యూ
Indian Railways: అస్సాంలో ఏనుగుల మృతితో రైల్వేశాఖ కీలక నిర్ణయం.. AI టెక్నాలజీతో ప్రమాదాలకు చెక్
అస్సాంలో ఏనుగుల మృతితో రైల్వేశాఖ కీలక నిర్ణయం.. AI టెక్నాలజీతో ప్రమాదాలకు చెక్
Top Selling Hatchback: నవంబర్ 2025లో నంబర్ 1 హ్యాచ్‌బ్యాక్ స్విఫ్ట్.. హ్యుందాయ్, టాటాల పొజిషన్ ఇదే
నవంబర్ 2025లో నంబర్ 1 హ్యాచ్‌బ్యాక్ స్విఫ్ట్.. హ్యుందాయ్, టాటాల పొజిషన్ ఇదే
Tirupati Govindarajaswamy Temple: వైసీపీ హయాంలో గోవిందరాజస్వామి ఆలయంలో 50 కేజీల బంగారం గోల్ మాల్ ఆరోపణలు - విజిలెన్స్ విచారణ
వైసీపీ హయాంలో గోవిందరాజస్వామి ఆలయంలో 50 కేజీల బంగారం గోల్ మాల్ ఆరోపణలు - విజిలెన్స్ విచారణ
Embed widget