అన్వేషించండి

Trinayani Serial Today September 25th: 'త్రినయని' సీరియల్: కనికరించిన అడవితల్లి.. భర్త బిడ్డల్ని భుజాన మోసుకెళ్లిన నయని.. ఫాలో అవుతున్న గజగండ!

Trinayani Today Episode అడవి తల్లి దయతో నయని విశాల్, గాయత్రీ పాపలను కావిడలో మోసుకెళ్లడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Trinayani Serial Today Episode నయని ఎవరితో మాట్లాడిందో తనకు తెలీదని కనిపించలేదని విశాల్ నయనితో చెప్తాడు. దాంతో నయని షాక్ అయి అవ్వ తన పేరు కామసాని అని ప్రేమగా కాములమ్మ అని పిలుస్తారని చెప్పిందని అంటుంది. 

నయని: నాకు కనిపించిన అవ్వ ఆత్మ మీ పూర్వీకులు బాబుగారు. గరుడాంకబేధసాని గారి మేనత్త కామసాని దేవి గారు బాబుగారు.
విశాల్: అవును నయని మానసాదేవి ఆలయంలోని రాజ్య సంపదను భద్రంగా దాచి పెట్టింది ఆవిడే అని చరిత్రలో ఉంది.
నయని: ఎంతో పుణ్యం చేసుకుంటే గానీ ఆవిడ దర్శనం దొరకదు. నా అదృష్టం బాబుగారు.
విశాల్: మనసులో.. నిన్ను చూడటానికి వచ్చింది అనుకుంటా అమ్మ(పాపకి) నయని సాధనకు మీరంతా సాయం చేస్తున్నారని అర్థమవుతుంది అమ్మ.

మరోవైపు గజగండ అడవిలో తిరిగి తిరిగి అలిసిపోతాడు. ఇక పంచకమణి పట్టుకొని అలకని అంతం చేసే శక్తి ఇవ్వమని కోరుకుంటాడు. మరోవైపు విశాల్‌ అడుగులు ముందుకు పడవు చాలా ఇబ్బంది పడతాడు. ఇక దారిలో రాయి కాళ్లకి తగిలి పడిపోతాడు. కాలికి గాయం అయి రక్తం వస్తుంది. నయని ఏడుస్తుంది. నడవలేనని విశాల్ కూర్చొండిపోతాడు. 

గజగండ: గాయత్రీదేవి నన్ను దారి మళ్లించి తన కోడలిని మానసాదేవి ఆలయానికి పంపిందనుంకుంటా. ఎలా అయినా రాత్రి అయ్యేలోపు గుడికి చేరుకోవాలి.
చిలుకశివ: ఓయ్ నయని హలో బుల్లబ్బాయ్.. మణికాంత గిరి చూడాలని నాకు కోరిక కలిగింది. 
విశాల్: వద్దు శివ ఎప్పుడూ అలాంటి కోరిక కోరుకోవద్దు మేమే చేరుకోగలమో లేదో.
చిలుక: అయ్యయ్యో అంత మాట అనేశావ్ ఏంటి.
నయని: అక్కడికి వెళ్లాలి అంటే అడవితల్లి అమ్మ దగ్గరకు వెళ్లమని చెప్పింది కామసాని అమ్మ.
చిలుక: మీరు సరిగానే వచ్చారు వంద అడుగుల దూరంలో ఆ గుడి ఉంది రండి వెళ్దాం.

విశాల్ షూ అక్కడ వదిలేసి అతి కష్టం మీద నయని వెంట వెళ్తాడు. గజగండ అటుగా వచ్చి ఆ షూ చూసి అవి విశాల్‌ వని గుర్తించి అటుగా వెళ్తాడు. మరోవైపు ఇంట్లో దురంధర పూజ చేసి హారతి ఇస్తుంది. పావనా మూర్తి సెటైర్లు వేస్తాడు.  చాలా సార్లు స్నానం చేసి చాలా సార్లు పూజ చేశావ్ ఏంటి అని తిలోత్తమ అడుగుతుంది. దాంతో దురంధర వాళ్లు క్షేమంగా రావాలి అని పూజలు చేస్తున్నానని అంటుంది. దానికి తిలోత్తమ దురంధర వాళ్లిద్దరి గురించి ఎక్కువ భయపడి దాన్ని మర్చిపోవడానికి పూజలు చేస్తుందని అంటుంది. 

నయని, విశాల్, గాయత్రీ పాపతో పాటు చిలుక శివ కూడా అడవి తల్లి దగ్గరకు వచ్చేస్తారు. అమ్మవారికి దండం పెట్టుకుంటారు. నయనితో విశాల్ అమ్మవారికి బొట్టు పెట్టమని అంటాడు. బొట్టు ఎలా పెట్టాలని నయని అనుకుంటే విశాలాక్షి ఇచ్చిన కుంకుమ నీ కొంగున ఉంది కదా అది పెట్టు అని అంటాడు. దాంతో నయని బొట్టు పెడుతుంది. తన భర్త పిల్లని తీసుకొని వచ్చానని చేయి బాలేని తన భర్త ఇప్పుడు కాలికి కూడా గాయం అయిందని నువ్వే మాకు దారి చూపించని వేడుకుంటుంది. దాంతో ఉన్నట్టుండి పెద్ద గాలి వస్తుంది. దానితో రెండు బుట్టలు వస్తాయి. దాంతో నయని ఆ బుట్టుల్లో బాబుగారిని పాపని తీసుకెళ్లమని అమ్మవారి సూచించిందని నయని అంటుంది.

ఆ రెండు బుట్టల్ని ఓ కర్రకు కట్టి కావిడ సిద్దం చేస్తుంది. ఇక చిలుక నయనితో ఒక వైపు విశాల్ కూర్చొన్న మరోవైపు పాప కూర్చొంటే బ్యాలెన్స్ అవ్వదు కదా అని అంటుంది. దానికి నయని అమ్మవారే ఏదో మార్గం చూపిస్తుందని అంటుంది. ఇంతలో అమ్మవారి నుంచి ఏ వెలుగు వచ్చి ఓ చోట పడుతుంది. నయని అక్కడ మట్టి తొలగించి చూస్తే అమ్మవారి విగ్రహం కనిపిస్తుంది. అది చాలా బరువుగా ఉంటుంది. నయని విశాల్‌ని బుట్టలో కూర్చొమని చెప్తుంది. మరోవైపు పాపని ఆ విగ్రహాన్ని పెడుతుంది. ఇక అమ్మవారి నుంచి ఓ వెలుగు వచ్చి మానసాదేవి ఆలయానికి దారి చూపిస్తుంది.. నయని అతి కష్టం మీద ఇద్దరినీ భుజాన మోస్తుంది. అమ్మవారు కూడా శక్తి ప్రసాదిస్తుంది. ఇంతలో గజగండ అక్కడికి వస్తాడు. ఆ కాంతి మార్గం చూసి ఫాలో అవుతాడు. 

విక్రాంత్ ఆరుబయట వెన్నెలను చూస్తుంటాడు. సుమన అక్కడికి వస్తుంది. గాయత్రీ పాపని నయని వాళ్లు అడవిలో జంతువులు తమని తినడానికి వస్తే పాపని ఆ జంతువులకు ఇచ్చి తాము పారిపోతారని అంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 

Also Read: అమ్మాయి గారు సీరియల్: దీపక్, విరూపాక్షి, రాఘవలకు యాక్సిడెంట్.. విరూపాక్షిని తప్పుగా చిత్రీకరించిన విజయాంబిక!

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

kalavari kodalu kanaka mahalakshmi serial today march 31st: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: సహస్ర గర్భం మీద లక్ష్మీకి అనుమానం! వారసుడి కోసం దీక్ష చేసేదెవరు?
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: సహస్ర గర్భం మీద లక్ష్మీకి అనుమానం! వారసుడి కోసం దీక్ష చేసేదెవరు?
Nindu Manasulu Serial Today March 31st: నిండు మనసులు: రంజిత్‌ రాజశేఖరం మేనల్లుడా! ఇందిర, ప్రేరణల్ని నడివీధిలో నిలబెట్టేసిన గణ! చెంచలమ్మ ఎంట్రీ!
నిండు మనసులు: రంజిత్‌ రాజశేఖరం మేనల్లుడా! ఇందిర, ప్రేరణల్ని నడివీధిలో నిలబెట్టేసిన గణ! చెంచలమ్మ ఎంట్రీ!
Nindu Noorella Saavasam Serial Today march 31st: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: రణవీర్‌ను ఇంటికి తీసుకెళ్లిన అమర్‌ - షాకైన మనోహరి
‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: రణవీర్‌ను ఇంటికి తీసుకెళ్లిన అమర్‌ - షాకైన మనోహరి
Brahmamudi Serial Today march 31st: ‘బ్రహ్మముడి’ సీరియల్: వెంకీని పూల్‌ను చేసిన నందు – స్మగ్లర్‌ చేతిలో చిక్కిన రాజు  
‘బ్రహ్మముడి’ సీరియల్: వెంకీని పూల్‌ను చేసిన నందు – స్మగ్లర్‌ చేతిలో చిక్కిన రాజు  

వీడియోలు

CSK Plays Without Dhoni in 17 Years IPL 2026 | ధోనీ, రైనా, జడేజా లేకుండా CSK మ్యాచ్ | ABP Desam
Jadeja Destroys CSK vs RR IPL 2026 | ఒకే ఓవర్‌లో రెండు వికెట్లు తీసిన జడేజా | ABP Desam
IPL 2026 RR VS CSK Highlights | చెన్నైపై రాజ‌స్థాన్ ఈజీ విక్ట‌రీ | ABP Desam
Vaibhav Suryavanshi RR vs CSK IPL 2026 | వైభవ్ కు సలహా ఇచ్చిన జైస్వాల్ | ABP Desam
Rohit Suggestions to Hardik IPL 2026 | హిట్ మ్యాన్ వ్యూహంతో ముంబై విజయం | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
NTR Vaidya Seva: ఏపీలో బుధవారం నుంచి ఎన్టీఆర్ వైద్య సేవ బంద్ - ఆస్పత్రుల నిర్ణయం - బిల్లులు ఇవ్వలేదనే!
ఏపీలో బుధవారం నుంచి ఎన్టీఆర్ వైద్య సేవ బంద్ - ఆస్పత్రుల నిర్ణయం - బిల్లులు ఇవ్వలేదనే!
BRS MLA Padi Kaushik Reddy: ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి సీఐడీ నోటీసులు.. వెనక్కి తగ్గేది లేదంటూనే ప్రభుత్వంపై ఆరోపణలు
ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి సీఐడీ నోటీసులు.. వెనక్కి తగ్గేది లేదంటూనే ప్రభుత్వంపై ఆరోపణలు
AP handloom weavers: ఏపీలో చేనేతలకు కూటమి సర్కార్ గుడ్ న్యూస్ - అమల్లోకి ఉచిత విద్యుత్ పథకం
ఏపీలో చేనేతలకు కూటమి సర్కార్ గుడ్ న్యూస్ - అమల్లోకి ఉచిత విద్యుత్ పథకం
Kerala Assembly Elections: కేరళలో బీజేపీ అగ్రనేతల విస్తృత ప్రచారం - మార్పు కనిపిస్తోందని ధీమా!
కేరళలో బీజేపీ అగ్రనేతల విస్తృత ప్రచారం - మార్పు కనిపిస్తోందని ధీమా!
Donald Trump: దారిలోకి రాని ఇరాన్! ట్రంప్‌లో పెరిగిపోతున్న అసహనం! మిత్రదేశాలకు తీవ్ర హెచ్చరిక!
దారిలోకి రాని ఇరాన్! ట్రంప్‌లో పెరిగిపోతున్న అసహనం! మిత్రదేశాలకు తీవ్ర హెచ్చరిక!
IT Rules 2021 Amendments:డిజిటల్ మీడియాపై పట్టుకు కేంద్రం ప్రయత్నిస్తోందా? కొత్తగా తీసుకొస్తున్న మార్పులేంటీ?
డిజిటల్ మీడియాపై పట్టుకు కేంద్రం ప్రయత్నిస్తోందా? కొత్తగా తీసుకొస్తున్న మార్పులేంటీ?
Bihar Stampede: ఆలయంలో తొక్కిసలాట, 8 మంది భక్తులు మృతి.. సీఎం నితీష్ కుమార్ దిగ్భ్రాంతి
ఆలయంలో తొక్కిసలాట, 8 మంది భక్తులు మృతి.. సీఎం నితీష్ కుమార్ దిగ్భ్రాంతి
Third Temple In Israel: ఇజ్రాయెల్‌లో మూడో టెంపుల్ గొడవేంటి..? మెస్సియా కోసం యూదుల ఎదురుచూపులు.. ఇరాన్‌తో యుద్ధంలో నెతన్యాహు మతం సెంటిమెంట్
ఇజ్రాయెల్‌లో మూడో టెంపుల్ గొడవేంటి..? మెస్సియా కోసం యూదుల ఎదురుచూపులు.. ఇరాన్‌తో యుద్ధంలో నెతన్యాహు మతం సెంటిమెంట్
Embed widget