అన్వేషించండి

Karthika deepam and Brahmamudi Serials Story: 'కార్తీకదీపం'లో మోనిత..'బ్రహ్మముడి'లో యామిని సేమ్ టు సేమ్ - పెళ్లైన మగాళ్లంటే ఈ పిచ్చి ఎందుకో మరి!

Brahmamudi Serial: బ్రహ్మముడి సీరియల్ లో యామిని అనే కొత్త క్యారెక్టర్ ఎంట్రీ ఇచ్చింది. ఆమె గురించి ఇచ్చిన ఇంట్రడక్షన్ చూస్తే సేమ్ టు సేమ్ కార్తీకదీపం సీరియల్ లో మోనితలా ఉంది.. ఎందుకంటే..

Karthika deepam and Brahmamudi Serials Story

తెలుగు సీరియల్స్ అన్నిటిదీ ఇదే స్టోరీనా?

పెళ్లైన మగాడంటే పడి చచ్చిపోయే కథలే ఎందుకు?

స్మాల్ స్క్రీన్ బాహుబలి అయిన కార్తీక దీపం నుంచి ప్రస్తుతం టాప్ 5 లో ఉన్న బ్రహ్మముడి వరకూ అన్ని కథలూ ఇంతేనా?

పెళ్లైన మగాళ్లపై అంత మోజు ఎందుకు...పైగా వాళ్ల వైవాహిక జీవితాన్ని చిదిమేసి ఆ వ్యక్తి లైఫ్ లోకి ఎంట్రీ ఇవ్వాలి అనుకోవడం ఏంటి?

అందమైన ఆ మేకప్ వెనుక ఇంత రాక్షసత్వం దాగి ఉంటుందా?...సీరియల్స్ లో విలన్ అంటే వేరే ఆడదాని భర్తను కోరుకున్న అమ్మాయే అవుతుందా?

Also Read: మోనితను మించిన సైకో యామిని.. రాజ్ జీవితంలో కొత్త సునామి - బ్రహ్మముడి మార్చి 4 ఎపిసోడ్ హైలెట్స్!

కార్తీకదీపం కథ ఇదే

కార్తీకదీపం సీరియల్ తో డాక్టర్ బాబుతో కలసి చదువుకుంటుంది మోనిత. ప్రేమిస్తుంది..పెళ్లి చేసుకోవాలి అనుకుంటుంది. అప్పటికే హిమ అనే అమ్మాయితో ప్రేమలో ఉన్న డాక్టర్ బాబు మోనితను స్నేహితురాలిగా మాత్రమే చూస్తాడు. కానీ తనకు కార్తీక్ దక్కలేదన్న కోపంతో హిమకు యాక్సిడెంట్ చేయిస్తుంది..ఆ యాక్సిడెంట్ కారణంగా నీకు భవిష్యత్ లో పిల్లలు పుట్టరు అని డాక్టర్లతో కార్తీక్ కి అబద్ధం చెప్పిస్తుంది. అదే మాయలో ఉండిపోతాడు కార్తీక్. ఇక ఎప్పటికైనా నావాడే అని మోనిత ఫిక్సైపోతుంది..ఇంతలో అనుకోని పరిస్థితుల్లో దీప మెడలో తాళి కడతాడు కార్తీక్. అప్పటి నుంచి దాదాపు ఆరేళ్ల పాటూ సాగిన సీరియల్ లో కార్తీక్ దీపను విడిదీసి ఆ స్థానంలో తాను వెళ్లాలనే ఉద్దేశంతో ఎన్నో కుట్రలు చేస్తుంది మోనిత. డాక్టర్ బాబు దీప కలవాలి అంటూ నిజంగా చాలామంది అభిమానులు పూజలు చేశారు. బ్యానర్లు కట్టారు, సోషల్ మీడియాలో మోనితపై తిట్ల దండకం ఎత్తుకున్నారు. ఓవరాల్ గా ఆ సీరియల్ సూపర్ డూపర్ హిట్.... అందుకే ఇప్పుడు కార్తీకదీపం నవవసంతం పేరుతో మళ్లీ వచ్చారు దీప- కార్తీక్...

బ్రహ్మముడి కూడా ఇప్పుడు సేమ్ టు సేమ్ స్టోరీ నడుస్తోంది

అనామిక అనే ఓ అరాచక క్యారెక్టర్ ని అప్పట్లో పరిచయం చేశారు. కవి కళ్యాణ్ కవితల్ని ప్రేమిస్తూ తానెవరో చెప్పకుండా వెంటపడే అమ్మాయిలా చూపించారు. యండమూరి వీరేంద్రనాథ్ వెన్నెల్లో ఆడపిల్ల నవల రేంజ్ లో బిల్డప్ ఇచ్చారు. తీరా పెళ్లయ్యాక చూస్తే అనామిక తనలో రాక్షసత్వం చూపించింది. మొగుడితో విడిపోయింది..మరొకడితో చేరి తన పథకం నెరవేరకపోవడంతో వాడిని చంపేసి జైలుకెళ్లి కూర్చుంది. దుగ్గిరాల వారింటి వారసులు , కోడళ్లు ఓ దగ్గర చేరారు ...రుద్రాణికి చెక్ పెడితే చాలు సీరియల్ ముగింపు అనుకున్నారంతా. ఇలాంటి టైమ్ లో యామిని అనే కొత్త క్యారెక్టర్ ని తీసుకొచ్చారు...

చిన్నప్పుడు కుక్కపిల్ల తన మాట వినలేదని చంపేసింది..తాను అనుకున్నది సాధించలేకపోతే అంత పట్టుదల, రాక్షసత్వం ఉందని ఆమెకు ట్రీట్మెంట్ ఇచ్చిన డాక్టర్ చెప్పాడు. రాజ్ ని ప్రేమించి తను రిజెక్ట్ చేశాడని పిచ్చిదైపోయిన యామిని మత్తుపదార్థాలకు బానిసై ఫారెన్ వెళ్లి ట్రీట్మెంట్ తీసుకుని వచ్చింది. అంతా మెరుగైందని తల్లిదండ్రులు సంతోషించారు. కానీ కావ్యను రాజ్ జీవితం నుంచి తప్పించి తాను ఆ ప్లేస్ లోకి వెళ్లాలి అనుకుంటున్నా అని టార్గెట్ ఫిక్స్ చేసింది. అప్పుడే రాజ్ తో ఆట మొదలెట్టేసింది. 

Also Read: సంజయ్ కి సత్య వార్నింగ్.. జనతా గ్యారేజ్ పెట్టిన క్రిష్..పస్ట్ కారు మహదేవయ్యదే - సత్యభామ మార్చి 4ఎపిసోడ్ హైలెట్స్!

దుగ్గిరాల కుటుంబంలో వచ్చిన సమస్యలన్నింటికీ తీర్చుకుంటూ పోతున్న కావ్య జీవితం ఇప్పుడిప్పుడే గాడిన పడుతోంది. ఇంతలో యామిని ఎంట్రీ ఇవ్వడంతో కథ కీలక మలుపుతిరిగింది. ఇంతకీ రాజ్-యామిని ఫ్లాష్ బ్యాక్ స్టోరీ ఏంటి? ఆమె కారణంగా కావ్య ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోబోతోంది? ఇంకా ఎన్నో ప్రశ్నలు..

ఈ రెండు సీరియల్స్ మాత్రమే కాదు.. ప్రతి సీరియల్ లోనూ ఇదే తంతు. పెళ్లైన మగాడి జీవితంలోంచి భార్యను దూరం చేయాలి ఆ ప్లేస్ లోకి తాము వెళ్లాలనే ఉద్దేశంతో ఎన్నో కుట్రలు..

దురదృష్టవశాత్తూ ఇలాంటి సీరియల్స్ లో ఎక్కువ ఆదరణ దక్కుతోంది...

Also Read: చింటూ తో ఎంట్రీ ఇచ్చిన బాలు, మీనా, మనోజ్.. రోహిణి గతం బయటపడుతుందా - గుండె నిండా గుడి గంటలు మార్చి 4 ఎపిసోడ్ హైలెట్స్!

About the author RAMA

జర్నలిజంలో గత 15 ఏళ్లుగా పనిచేస్తున్నారు.  ప్రముఖ తెలుగు మీడియా సంస్థలు ఈటీవీ, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతిలో పని చేసిన అనుభవం ఉంది. ఏపీ, తెలంగాణ, రాజకీయ, సినిమా, ఆధ్యాత్మిక వార్తలు సహా వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక  MJMC, MSW, PGDPM కోర్సులు పూర్తిచేశారు. జర్నలిజం కోర్సు పూర్తి చేసి పలు తెలుగు మీడియా సంస్థలలో  కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో నాలుగేళ్లుగా డిప్యూటీ ప్రొడ్యూసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. 

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Nara Lokesh: ఏపీ ఆర్థిక రాజధాని విశాఖ - స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదు - తేల్చి చెప్పిన నారా లోకేష్
ఏపీ ఆర్థిక రాజధాని విశాఖ - స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదు - తేల్చి చెప్పిన నారా లోకేష్
Phone tapping case: ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం - సీఎం సోదరుడు కొండల్ రెడ్డికి సిట్ నోటీసులు
ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం - సీఎం సోదరుడు కొండల్ రెడ్డికి సిట్ నోటీసులు
AP CM Chandrababu: ఏపీలో హైవేల నిర్మాణంలో 2 గిన్నిస్ రికార్డులు నమోదు: సీఎం చంద్రబాబు హర్షం
ఏపీలో హైవేల నిర్మాణంలో 2 గిన్నిస్ రికార్డులు నమోదు: సీఎం చంద్రబాబు హర్షం
Asteroids: ఆస్టరాయిడ్స్ పై మైనింగ్‌కు పరిశోధనలు షురూ - అవతార్‌ కథను నిజం చేస్తారా?
ఆస్టరాయిడ్స్ పై మైనింగ్‌కు పరిశోధనలు షురూ - అవతార్‌ కథను నిజం చేస్తారా?

వీడియోలు

Harbhajan Singh Warning To BCCI | బీసీసీఐకు హర్భజన్ వార్నింగ్
Shreyas Iyer Vijay Hazare Trophy | శ్రేయాస్ అయ్య‌ర్‌ రీఎంట్రీ సూపర్
Nita Ambani Prize Money to Blind Cricketers | వరల్డ్ కప్ విజేతలకు అంబానీ భారీ గిఫ్ట్
Shubman Gill Vijay Hazare Trophy | దేశవాళీ టోర్నీలో గిల్ వైఫల్యం!
Medaram Jathara History Full Story | సమ్మక్క సారలమ్మ జాతరకు..బయ్యక్కపేటకు సంబంధం ఏంటి.? | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nara Lokesh: ఏపీ ఆర్థిక రాజధాని విశాఖ - స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదు - తేల్చి చెప్పిన నారా లోకేష్
ఏపీ ఆర్థిక రాజధాని విశాఖ - స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదు - తేల్చి చెప్పిన నారా లోకేష్
Phone tapping case: ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం - సీఎం సోదరుడు కొండల్ రెడ్డికి సిట్ నోటీసులు
ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం - సీఎం సోదరుడు కొండల్ రెడ్డికి సిట్ నోటీసులు
AP CM Chandrababu: ఏపీలో హైవేల నిర్మాణంలో 2 గిన్నిస్ రికార్డులు నమోదు: సీఎం చంద్రబాబు హర్షం
ఏపీలో హైవేల నిర్మాణంలో 2 గిన్నిస్ రికార్డులు నమోదు: సీఎం చంద్రబాబు హర్షం
Asteroids: ఆస్టరాయిడ్స్ పై మైనింగ్‌కు పరిశోధనలు షురూ - అవతార్‌ కథను నిజం చేస్తారా?
ఆస్టరాయిడ్స్ పై మైనింగ్‌కు పరిశోధనలు షురూ - అవతార్‌ కథను నిజం చేస్తారా?
Reliance Foundation: రిలయన్స్ ఫౌండేషన్ స్కాలర్‌షిప్‌లలో తెలుగు రాష్ట్రాల విద్యార్థుల సత్తా - ఏపీ నుంచి 1,345, తెలంగాణ నుంచి 538 మంది ఎంపిక
రిలయన్స్ ఫౌండేషన్ స్కాలర్‌షిప్‌లలో తెలుగు రాష్ట్రాల విద్యార్థుల సత్తా - ఏపీ నుంచి 1,345, తెలంగాణ నుంచి 538 మంది ఎంపిక
పోలవరం ఏరియల్‌ రివ్యూ చేస్తున్న సీఎం చంద్రబాబు..
పోలవరం ఏరియల్‌ రివ్యూ చేస్తున్న సీఎం చంద్రబాబు..
Nita Ambani: అంధ మహిళా క్రికెట్ జట్టుకు ఐదు కోట్ల సాయం - నీతా అంబానీ దాతృత్వానికి క్రీడాలోకం ప్రశంసలు
అంధ మహిళా క్రికెట్ జట్టుకు ఐదు కోట్ల సాయం - నీతా అంబానీ దాతృత్వానికి క్రీడాలోకం ప్రశంసలు
Chandrababu on water dispute: నీళ్లపై రాజకీయాలు సరి కాదు - పోటాపోటీగా మాట్లాడొద్దు చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
నీళ్లపై రాజకీయాలు సరి కాదు - పోటాపోటీగా మాట్లాడొద్దు చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
Embed widget