Jagadhatri Serial Today April 21th:మినిస్టర్ కొడుకుపై జేడీ ఎందుకు చేయిచేసుకుంది..? ఇంట్లో పనులు చేయలేక నిషిక,వైజయంతి ఏం చేశారు...?
Jagadhatri Serial Today Episode April 21th:మినిస్టర్ కొడుకుపై జేడీ ఎందుకు చేయిచేసుకుంది..? ఇంట్లో పనులు చేయలేక నిషిక,వైజయంతి ఏం చేశారు...?

Jagadhatri Serial Today Episode: పనిమనిషి రాధపై నిషిక చేయిచేసుకుని సారీ చెప్పకపోవడంతో పనివాళ్లంతా కౌషికి ఇంటిమీదకు వచ్చి ధర్నా చేస్తారు. నిషిక చేసిన తప్పునకు శిక్షగా ఈ ఇంట్లో 6నెలలపాటు ఏ పని అమ్మాయి రాకుండా నిషేదం విధించి వెళ్లిపోతారు. దీంతో ఇంట్లో పనులు చేయలేక నిషిక, వైజయంతి అల్లాడిపోతుంటారు. గిన్నెలు తోమడం,బట్టలు ఉతకడం, ఇల్లు శుభ్రం చేయలేక అత్తాకోడళ్లు ఇబ్బందిపడుతుంటారు. యువరాజును సాయం కోరగా....అతను తప్పించుకుని వెళ్లిపోతాడు. సుధాకర్ వాళ్ల అవస్థలు చూసి పని అమ్మాయిపై ప్రతాపం చూపినప్పుడు తెలియదా మీకు ఇలా జరుగుతుందని అంటాడు. ఒక్క సారీతో పోయేదానికి ఇంతవరకు తెచ్చుకున్నారని మీకు తగిన శాస్తి జరిగిందని అంటాడు.
మినిస్టర్ కొడుకు తప్పతాగి రోడ్డుపై యాక్సిడెంట్ చేసి ఓ బిక్షగత్తెతోపాటు డెలివరీబాయ్ను చంపేస్తాడు.ఆ తర్వాత తప్పించుకుని పారిపోతాడు.ఆ కేసు టేకప్ చేసిన జేడీ...యాక్సిడెంట్ జరిగిన ప్రాంతానికి వెళ్లగా....అక్కడ డెలివరీబాయ్ తల్లి ఏడుస్తు కనిపిస్తుంది. మా ఇంటికి నా కొడుకే ఆధారమని ఇప్పుడు వాడిని చంపేశారని అంటుంది. ఆమెను జేడీ ఓదార్చగా.....ఈ యాక్సిడెంట్ చేసింది మినిష్టర్ కొడుకని అంటున్నారని మీరు వాళ్లకే ఊడిగం చేస్తారు తప్ప మాకు ఎందుకు న్యాయం చేస్తారని ఏడుస్తుంది. దీంతో జేడీ ఆమెను ఓదార్చి...ఈకేసులో ఎంతపెద్దవాళ్లు ఉన్నా సరే శిక్షపడేలా చేస్తానని హామీ ఇస్తుంది.
మినిష్టర్ కొడుకుని అరెస్ట్ చేయడానికి మంత్రి ఇంటికి వెళ్లగా....అక్కడ రౌడీలు జేడీ,కేడీని అడ్డుకుంటారు.వాళ్లను ఇరగదీసి ఇద్దరూ లోపలికి వెళ్లగా అక్కడ మినిష్టర్తోపాటు వాళ్ల కొడుకు ఉంటాడు.ఎందుకు ఇలా వచ్చారని మినిష్టర్ ప్రశ్నించగా....నీ కొడుకు తప్పతాగి ఇద్దరిని చంపడమే గాక...ఓ కుటుంబాన్ని రోడ్డుపాలు చేశాడని అందుకే అరెస్ట్ చేయడానికి వచ్చానని జేడీ అంటుంది. ఇంతలో మినిష్టర్ కొడుకు రెచ్చిపోగా.....వాడికి నాలుగు జేడీ తగిలిస్తుంది. అయినా నా కొడుకే చంపాడని చెప్పడానికి మీ దగ్గర ఆధారం ఏముందని మంత్రి నిలదీస్తాడు. ఆరోజు కారు డ్రైవింగ్ చేసింది నా కొడుకు కాదని....మా డ్రైవర్ అని చెబుతాడు.వాడు ఈ పాటికే స్టేషన్కు వెళ్లి లొంగిపోయాడని అంటాడు. కావాలంటే ఫోన్ చేసి కనుక్కోమని చెబుతుండగానే సాధూసార్ నుంచి ఫోన్ వస్తుంది. ఆ మినిష్టర్ కొడుకుని వదిలేసి రమ్మని చెబుతాడు.వాళ్ల డ్రైవర్ ఈ పనిచేశానని స్టేన్కు వచ్చి లొంగిపోయాడని చెబుతాడు. దీంతో జేడీ,కేడీ మంత్రి కొడుకుని వదిలేసి తిరిగి వెళ్లిపోతారు.
ఇంట్లో పనులు చేయలేక ఆపసోపాలుపడి చెరో సోపోలో నిషిక, వైజయంతి కూలబడతారు.అప్పుడే శ్రీవల్లి ఇంట్లోకి రావడం చూసి వాళ్లకు ఆమె ఓ దేవతలా కనిపిస్తుంది.రెండురోజులుగా ఇంటిపనులు చేయలేక చచ్చిపోతున్నామని సమయానికి వచ్చావని అంటారు. మిగిలిన పనులు ఆమెకు అప్పగిస్తారు. మనం మరో 6నెలలుపాటు ఈ శ్రీవల్లిని ఇంట్లో నుంచి బయటకు పంపించే ప్రయత్నాలు మానుకోవాలని అనుకుంటారు. లేకపోతే ఇంటి పనులు చేయలేక మనం చచ్చిపోతామని అత్తాకోడళ్లు అనుకుంటారు. మనం ఇన్ని ఇబ్బందులుపడుుతున్నా.....ఆ జగధాత్రి మాత్రం బాగానే ఉందని నిషిక అంటుంది.అందుకే మనం పప్పు నానబెట్టి...మిక్సీపాడు చేద్దామని అత్తయ్యకు చెబుతుంది.అప్పుడు ఆ పప్పు రుబ్బలేక జగధాత్రి చేతులు పడిపోతాయని చెబుతుంది.అన్నట్లుగానే మిక్సీ పాడుచేస్తుండగా శ్రీవల్లి అక్కడికి వచ్చి చూస్తుంది.ఇదంతా జగధాత్రికి చెబితే నిన్ను మళ్లీ ఇంట్లో నుంచి గెంటేస్తామని చెప్పి నిషిక, వైజయంతి బెదిరిస్తారు.
మినిష్టర్ ఇంటి నుంచి నేరుగా స్టేషన్కు వచ్చి సాధూసార్ను జేడీ,కేడీ కలుస్తారు. ఈ యాక్సిడెంట్ చేసింది మినిష్టర్ కొడుకేనని తెలిసిన తర్వాత కూడా ఎందుకు వదిలేయమన్నారని జేడీ ప్రశ్నిస్తుంది. ఇలాంటి కేసుల్లో ఆవేశం పనికిరాదని...సరైన ఆధారాలు కావాలని సాధు అంటాడు. నువ్వు ఆ మినిస్టర్ కొడుకే ఈ పనిచేశాడని ఆధారం తీసుకొస్తే వాడు బయటకు రాకుండా నేను చూసుకుంటానని చెబుతాడు.దీంతో డ్రైవర్ను జేడీ,కేడీ ఇంటరాగేషన్ చేస్తారు. తికమక పెట్టే ప్రశ్నలు వేసి ఇబ్బందిపెడతారు.
Before You Go
Illu Illalu Pillalu Serial Actor Sai Kumar Kola | సీరియల్ నటుడు సాయి కుమార్ కోలా రియల్ లైఫ్
ట్రెండింగ్ వార్తలు






















