Brahmamudi Serial Today February 3rd: ‘బ్రహ్మముడి’ సీరియల్: కోపంతో రగిలిపోయిన ధర్మేంద్ర – దుగ్గిరాల ఫ్యామిలీ మొత్తం చంపేందుకు ప్లాన్
Brahmamudi serial today episode February 3rd: రుద్రాణి రెచ్చగొట్టడంతో మినిస్టర్ కోపంతో రగిలిపోతుంటాడు. దీంతో ఇవాల్టీ ఏపిసోడ్ చాలా ఆసక్తిగా జరిగింది.

Brahmamudi Serial Today Episode: ధర్మేంద్ర ఇంటి నుంచి వెళ్లిపోతూ.. బిడ్డను ఒకసారి ఎత్తుకోవచ్చా అని కావ్య, తులసిని అడుగుతుంది. దీంతో తులసి బిడ్డను కావ్యకు ఇస్తుంది. బిడ్డను ఎత్తుకున్న కావ్య ఎమోషనల్ అవుతుంది. బిడ్డను గుండెలకు హత్తుకుని హ్యాపీగా ఫీలవుతుంది. తర్వాత బిడ్డను తీసుకుని తులసి వెళ్లిపోతుంది.
రాజ్: మేం మీ ఫ్యామిలీ జోలికి రావడం తప్పే... కానీ దీనికి కారణం మీరే. మీ స్వార్ధం కోసం మా బిడ్డను మాకు దూరం చేశారు. అందుకే మీ భార్యకు దగ్గరయ్యాం.. మీ ఆవిడను కలిసినప్పుడే నిజం చెప్పడం మాకు చాలా చిన్న విషయం. కానీ ఆ తల్లిని చూస్తే జాలి వేసింది. నిజం చెప్పి తనని బాధపెట్టడం మాకు ఇష్టం లేదు. కానీ ఆ నిజం నువ్వే నీ భార్యకు చెప్పాలి. నా భార్య నీకు 15 రోజులు గడువిచ్చింది.. ఆ లోపు నువ్వే మాకు బిడ్డను తిరిగి అప్పగించాలి, లేదంటే జరిగే నష్టం మీకు తెలుసు
అంటూ వార్నింగ్ ఇచ్చి కావ్య, రాజ్ అక్కడి నుంచి వెళ్లిపోతారు. అక్కడే చాటుగా ఉండి అంతా వింటున్న రుద్రాణి వస్తుంది.
రుద్రాణి: ఆ రాజ్ గాడు దానిని అంత తేలికగా ఎలా నమ్మాడో అర్ధం కావడం లేదు.
ధర్మేంద్ర: వాడు నమ్మితే నాకేంటి..? నమ్మకపోతే నాకేంటి..? ఇప్పుడు ఏం చేయాలి? వాళ్లు మళ్లీ నా గడప తొక్కకూడదు ఏం చేయాలో నువ్వే చెప్పు
అంటూ ధర్మేంద్ర అడగ్గానే.. రుద్రాణి ఆలోచిస్తుంది. మరోవైపు దుగ్గిరాల ఇంట్లో అందరూ భోజనం చేస్తూ.. పాప బారసాల గురించి ఆలోచిస్తుంటారు. ఇంట్లో వాళ్ల మాటలకు రాజ్, కావ్య షాక్ అవుతారు.
ఇందిరాదేవి: దుగ్గిరాల వారి వారసురాలి బారసాల చేయాలి కదా? వచ్చే వారమే ముహూర్తం.. పంతులు గారు చెప్పారు.
అపర్ణ: కూతురి బారసాల అంటే మీ ఇద్దరూ ఏం మాట్లాడరేంటీ..?
ఇందిరాదేవి: ఇప్పుడే మీ నాన్నగారికి, బాబాయ్కి చెప్పాను. నా ముని మనవరాలి బారసాల అంటే చాలా గొప్పగా చేయాలి. అందుకే పనులన్నీ ఈరోజే మొదలుపెట్టండి.
రాజ్: పరిస్ధితులు తెలిసి కూడా అలా ఎలా మాట్లాడుతున్నారు.. డాక్టర్ ఇప్పుడిప్పుడే ట్రీట్మెంట్ మొదలుపెట్టారు. ఏరోజు ఎలా ఉంటుందో తెలియదు, పాపని అలా చూస్తు బారసాల ఎలా చేస్తాం.. అలాగని నేను పాపకు బారసాల చేయొద్దు అనడం లేదు.. అన్నీ అనుకున్నట్లు జరిగితే పాప ఆరోగ్యం కుదుటపడ్డాక చేద్దామంటున్నాను.
ఇందిరాదేవి: 21వ రోజుకు ఏ బిడ్డకైనా ఊయలలో వేసి, నల్లపూసలు కడితే చీడపీడ తొలగిపోతుంది. అందరి ఆనందోత్సాహాల మధ్య బిడ్డ తన ఒంటినిండా బంగారం పెట్టుకుంటే దాని భవిష్యత్ పండగలా ఉంటుంది.
రాజ్: పాప ఆపరేషన్ అయ్యే దాకా.. పాప భవిష్యత్ చెప్పే పరిస్ధితి లేనప్పుడు ఈ బారసాలతో ఆనందం ఎలా వస్తుంది
కావ్య: బారసాల విషయంలో కొద్దిరోజులు ఆగడం మంచిది. పాపకి ఆపరేషన్ అయిపోతుంది.. అప్పుకు కూడా నెలల నిండి తనకు కూడా డెలివరీ అవుతుంది. అప్పుడు ఇద్దరు బిడ్డలకు కలిపి బారసాల చేద్దాం
కళ్యాణ్: అవును వదిన చెప్పింది కరెక్టే కదా..? ఇంకొన్ని వారాల్లో అప్పూకి డెలివరీ అయిపోతుంది.. అప్పుడు పాపకి కూడా నయం అవుతుంది.. ఇద్దరికీ కలిపి బారసాల గ్రాండ్గా చేద్దాం
అంటూ ముగ్గురు చెప్పగానే మిగతా వారందరూ ఓకే అంటారు. ఇక రాజ్ వార్నింగ్ ఇవ్వడాన్ని అవమానంగా ఫీల్ అవుతూ రగిలిపోతుంటాడు మినిస్టర్. అప్పుడే రుద్రాణి వచ్చి మరింత రెచ్చగొట్టి నీ పవరేంటో వాళ్లకు చూపించు అంటుంది. దీంతో ధర్మేంద్ర, రాజ్కు ఫోన్ చేసి బయటకు వెళ్లిన నీ వాళ్లు జాగ్రత్త అంటూ హెచ్చరిస్తాడు. దీంతో రాజ్, కావ్య కంగారు పడుతుంటే.. అందరూ ఇంటికి వస్తారు. సుభాష్, అపర్ణ, కళ్యాణ్, అప్పు, ఇందిరాదేవి, సీతారామయ్య మూడు జంటలు తమ కార్లకు యాక్సిడెంట్ అయిందని చెప్తారు. అందరూ కంగారు పడుతుంటారు. ధాన్యలక్ష్మీ మాత్రం ముగ్గురికి ఒకేసారి యాక్సిడెంట్ అయిందంటే ఇదేదో అనుమానించాల్సిన విషయం అంటుంది. కరెక్టుగా చెప్పావు అంటూ మినిస్టర్ దర్మేంద్ర వస్తాడు. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!





















