అన్వేషించండి

Brahmamudi Serial Today August 16th: ‘బ్రహ్మముడి’ సీరియల్‌: రోడ్డు మీద బొమ్మలు అమ్మిన కళ్యాణ్ – ఇల్లు తగులబెట్టేందుకు రెడీ అయిన ధాన్యలక్ష్మీ

Brahmamudi Today Episode: కళ్యాణ్ ను ఒప్పించి ఇంటికి తీసుకురావడానికి వెళ్తున్న ధాన్యలక్మీకి కళ్యాణ్ బొమ్మలు అమ్ముతూ కనిపించడంతో ఇవాళ్టీ ఎపిసోడ్ చాలా ఆసక్తిగా జరిగింది.

Brahmamudi Serial Today Episode: రాజ్‌ ఒక్కడే ఇంటికి తిరిగి రావడంతో ఇంట్లో వాళ్లందరూ షాక్‌ అవుతారు. ఏమైందని అడుగుతారు. నువ్వు చెప్పినట్లే ఇద్దరిని రమ్మాన్నా కూడా వాడు రానన్నాడు పిన్ని. తన కోసమే నువ్వు అలా చెప్పి ఉంటావని అనుమానించాడు అని రాజ్‌ చెప్పగానే స్వప్న నిజమే కదా అంటుంది. రుద్రాణి ఏది నిజం అంటూ కోప్పడుతుంది. అసలు వాడికి ఏమైంది అని ప్రకాశం బాధపడతాడు.

ఇందిరాదేవి:  అనుభవం అయింది. ఇంట్లో అనామిక వల్ల జరిగిందంతా గుణపాఠం అయింది. ఇంకొకరి జోక్యం వల్ల భార్యాభర్తల మధ్య ఎలాంటి గొడవలు వస్తాయో తెలిసొచ్చింది. ఈ ధాన్యలక్ష్మీ, రుద్రాణి ఎలా కాల్చుకుతింటారో అర్థమైంది.

ధాన్యలక్ష్మీ: అనామిక సంగతి వదిలేయండి. ఆ పిల్ల తన ప్రవర్తనతోనే కాపురం నాశనం చేసుకుంది. కానీ, అప్పును కళ్యాణ్‌ ప్రేమిస్తున్నాడని అనామిక చెప్పిందే నిజం అయింది.

అపర్ణ: ఇప్పుడు ఆ దరిద్రం గురించి ఎందుకు. అనామిక ప్రవర్తనపై ధాన్యలక్ష్మీకి ఇంకా సానుభూతి ఉన్నట్లుంది.

ఇందిరాదేవి: అసలు వాడు ఏ కారణం చెప్పి రానన్నాడో అది చెప్పు రాజ్‌.

రాజ్‌: పిన్ని అప్పును కోడలిగా ఒప్పుకుని రమ్మందా? అని అడిగాడు. పిన్ని నాతో ఆ మాట చెప్పలేదు. అప్పును కోడలిగా ఒప్పుకుంటేనే వస్తానన్నాడు.

రుద్రాణి: అంటే ఏంటీ ఇప్పుడు ధాన్యలక్ష్మీ, అప్పు కాళ్లు పట్టుకుని రామ్మా మహాలక్ష్మీ అంటేనే వస్తారా?

ధాన్యలక్ష్మీ: ఏంటీ రాజ్ నేనిప్పుడు వెళ్లి అప్పు కాళ్లు పట్టుకోవాలా?

 అనగానే స్వప్న ధాన్యలక్ష్మీని తిడుతుంది. రాజ్‌ ఏం చెప్పాడు మీరే అంటున్నారు అంటుంది. రాజ్‌ చెప్పిన దాంట్లో అర్థం అదే వస్తుంది కదా అంటుంది రుద్రాణి. నేను అలా చెప్పలేదు కదా అంటాడు రాజ్‌. రుద్రాణిపై సీరియస్‌ అవుతాడు రాజ్‌. అప్పు ఒక్కమాట మాట్లాడలేదని అంతా కళ్యాణే చెప్పాడని రాజ్‌ చెప్పడంతో ధాన్యలక్ష్మీ ఇరిటేటింగ్‌ ఫీలవుతుంది. కనకం బిడ్డలు అనుభవించడానికే ఈ ఆస్థులు కూడబెట్టినట్లుంది అంటూ ధాన్యలక్ష్మీ వెళ్లిపోతుంది. మరోవైపు కల్యాణ్ జాబ్‌ కోసం వెతుకుతుంటాడు. తర్వాత కళ్యాణ్‌ తీసుకొచ్చేందుకు రుద్రాణి, ధాన్యలక్ష్మీ వెళ్తారు.

ధాన్యలక్ష్మీ: ఇప్పుడెళ్లి మనం రమ్మని  అడిగితే వాళ్లు వస్తారా?

రుద్రాణి: వస్తాడని కాదు. కానీ కల్యాణ్ పడే కష్టం చూసైన సరే నువ్ ఏదైనా నిర్ణయం తీసుకుంటావని ఈ ప్రయత్నం.

  మరోవైపు ఓ ముసాలయన బొమ్మలు అమ్ముతుండటం చూసి కళ్యాణ్‌ ఆ ముసలాయనకు సాయం చేసేందుకు ఆ బొమ్మలు అమ్మిస్తానని తీసుకుని కళ్యాణ్  బొమ్మలు అమ్ముతుంటాడు. కళ్యాణ్‌ బొమ్మలు అమ్మడం చూసి రుద్రాణి, ధాన్యలక్ష్మీ షాక్‌ అవుతారు. ధాన్యలక్ష్మీ, కళ్యాణ్‌ దగ్గరకు వెళ్లబోతుంటే రుద్రాణి అపుతుంది.

రుద్రాణి: చూడు ధాన్యలక్ష్మీ ఈ సిచ్యుయేషన్‌లో నువ్వు వెళ్లి పిలిచినా వాడు రాడు. కోట్ల వారసుడు రోడ్డు మీద బొమ్మలు అమ్ముకునే స్థితికి దిగజారిపోయాడు. రాజ్ మాత్రం దర్జాగా ఆఫీసుకు వెళ్తున్నాడు. వెళ్లి ఇంట్లో వాళ్లను నిగ్గదీసి అడుగు.  

 అంటూ రుద్రాణి రెచ్చగొట్టేసరికి ధాన్యలక్ష్మీ కోపంగో రగిలిపోతుంది. నా కొడుకును రోడ్డు మీదకు తీసుకొచ్చిన ఆ కావ్య, రాజ్‌లను ఊరికే వదలను అంటూ అక్కడి నుంచి వెళ్లిపోతారు. తర్వాత బొమ్మలన్నీ అమ్మిన కళ్యాణ్‌ డబ్బులు తీసుకెళ్లి ఆ ముసలాయనకు ఇస్తాడు. ఆయన కళ్యాణ్‌ను థాంక్స్‌ చెప్తాడు. తర్వాత రాజ్‌, కావ్య వాదులాడుకుంటారు.

కావ్య: రండి మీకోసం చూస్తున్నాను మొదలుపెట్టండి. నా వల్లే వాళ్లు రాలేదని..

రాజ్‌: వెటకారమా. అతి తెలివి చూపించకు. అన్నింటికి కారణం నువ్వే

కావ్య: మీరెందుకు ఒప్పించలేకపోయారు. మీ లక్ష్మణుడు మీ మాట ఎందుకు వినలేదు. మీ పిన్ని చెప్పగానే పెదరాయుడు స్టైల్‌లో వెళ్లారు. మరి ఎందుకు రాలేదు..?

రాజ్‌: ఏ నీకు తెలియదా.. నీలా నంగనాచి మాటలు నాకు మాట్లాడటం రాదే.

అంటూ ఇద్దరూ కళ్యాణ్‌, అప్పుల కోసం గొడవపడతారు. తర్వాత కళ్యాణ్‌ రోడ్డుమీద బుక్స్ అమ్మే వ్యక్తి దగ్గరకు వెళ్లి అక్కడ తన బుక్‌ ఉండటం చూసి హ్యాపీగా ఫీలవుతాడు. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial today march 3rd: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: జైలులో లక్ష్మీకి చిత్రహింసలు! ఎస్‌ఐతో అంబిక డీల్!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: జైలులో లక్ష్మీకి చిత్రహింసలు! ఎస్‌ఐతో అంబిక డీల్!
Gunde Ninda Gudi Gantalu March 3rd Episode: నీ పాపం పండే రోజు దగ్గరకొచ్చిందంటూ రోహిణికి తల్లి శాపం! ఓదార్చుకున్న బాలు మీనా - గుండెనిండా గుడిగంటలు మార్చి 03 ఎపిసోడ్
నీ పాపం పండే రోజు దగ్గరకొచ్చిందంటూ రోహిణికి తల్లి శాపం! ఓదార్చుకున్న బాలు మీనా - గుండెనిండా గుడిగంటలు మార్చి 03 ఎపిసోడ్
Nindu Manasulu Serial Today March 3rd: నిండు మనసులు: సిద్ధూకి నిజంగానే యాక్సిడెంట్ అయిందా! సిద్ధూ కోసం విలవిల్లాడిపోతున్న ప్రేరణ!
నిండు మనసులు: సిద్ధూకి నిజంగానే యాక్సిడెంట్ అయిందా! సిద్ధూ కోసం విలవిల్లాడిపోతున్న ప్రేరణ!
chinni serial today march 3rd: చిన్ని సీరియల్: శ్రేయ భవిష్యత్‌ ఏంటి? మ్యాడీ మనసు మారిందా! మధుని క్షమించాడా!
చిన్ని సీరియల్: శ్రేయ భవిష్యత్‌ ఏంటి? మ్యాడీ మనసు మారిందా! మధుని క్షమించాడా!

వీడియోలు

Sanju Samson 97 vs West Indies T20 World Cup | సంజూ శాంసన్ పరుగుల సునామీ
Sanju Emotional Speech After 97 vs West Indies | సంజూ శాంసన్ ఎమోషనల్ స్పీచ్
Ayatollah Ali Khamenei Death News | ఇరాన్ సుప్రీం లీడర్ మృతి
Sahibzada Farhan Breaks Virat Record | కోహ్లీ రికార్డు బద్ధలు కొట్టిన పాక్ ఓపెనర్
India vs West Indies Preview T20 World Cup | టీమిండియాకు వెస్టిండీస్‌తో సెమీస్ ఫైట్|

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Iran Israel War 2026:వార్‌ అంటే ఏంటీ? ఇరాన్‌పై అమెరికా చేస్తున్న దాడి సైనిక చర్యనా? యుద్ధమా? 
వార్‌ అంటే ఏంటీ? ఇరాన్‌పై అమెరికా చేస్తున్న దాడి సైనిక చర్యనా? యుద్ధమా? 
CPM leader impeached: జీవిత కాలం కమ్యూనిస్టుని అభిశంసించిన సీపీఎం - తమ్మినేని వీరభద్రం చేసిన తప్పేమిటి?
జీవిత కాలం కమ్యూనిస్టుని అభిశంసించిన సీపీఎం - తమ్మినేని వీరభద్రం చేసిన తప్పేమిటి?
Pawan Kalyan Meets CM Chandrababu: ఏపీ సీఎం చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీ, చర్చించిన అంశాలివే
ఏపీ సీఎం చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీ, చర్చించిన అంశాలివే
Renu Desai: సైబర్ క్రైమ్ డీసీపీని కలిసిన రేణూ దేశాయ్... ట్రోలర్స్‌పై కంప్లైంట్!
సైబర్ క్రైమ్ డీసీపీని కలిసిన రేణూ దేశాయ్... ట్రోలర్స్‌పై కంప్లైంట్!
Jubilee Hills traffic: కేబీఆర్ పార్క్ పరిసరాల్లో ఫ్లైఓవర్ పనులు ప్రారంభం - ట్రాఫిక్‌లో చిక్కుకోకుండా ఇవిగో ప్రత్యామ్నాయ రూట్స్
కేబీఆర్ పార్క్ పరిసరాల్లో ఫ్లైఓవర్ పనులు ప్రారంభం - ట్రాఫిక్‌లో చిక్కుకోకుండా ఇవిగో ప్రత్యామ్నాయ రూట్స్
Ayatollah Khomeini trap Story: సీసీ కెమెరాలతోనే ఖొమైనీని టార్గెట్ చేసిన ఇజ్రాయెల్ - ఈ రియల్ స్టోరీతో వెబ్ సిరీస్ తీయెచ్చు !
సీసీ కెమెరాలతోనే ఖొమైనీని టార్గెట్ చేసిన ఇజ్రాయెల్ - ఈ రియల్ స్టోరీతో వెబ్ సిరీస్ తీయెచ్చు !
Iran Israel War 2026: ఓమన్ తీరంలో ముగ్గురు భారతీయ నావికుల మృతి; 20 మందికిపైగా గాయాలు !
ఓమన్ తీరంలో ముగ్గురు భారతీయ నావికుల మృతి; 20 మందికిపైగా గాయాలు !
అమెరికా-ఇరాన్ మధ్య ఘర్షణ సమయంలో వైరల్ అవుతున్న బాబా వాంగ భవిష్యవాణి!
అమెరికా-ఇరాన్ మధ్య ఘర్షణ సమయంలో వైరల్ అవుతున్న బాబా వాంగ భవిష్యవాణి!
Embed widget