chinni serial today march 3rd: చిన్ని సీరియల్: శ్రేయ భవిష్యత్ ఏంటి? మ్యాడీ మనసు మారిందా! మధుని క్షమించాడా!
chinni serial today episode march 3rd శ్రేయకి నాగవల్లి పెళ్లి ఫిక్స్ చేస్తాను అని చెప్పడం.. శ్రేయ మ్యాడీతో మాట్లాడటంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Chinni Serial Today Episode మ్యాడీ జాగింగ్కి వస్తే మధు పార్క్కి వచ్చి వాటర్ ఇస్తుంది. తాగను అని మ్యాడీ అని నువ్వు ఎవరు అంటే నేను నీ భార్యని అని తాళి తీస్తుంది. పిచ్చి వేషాలు వేస్తే నాకు తిక్క రేగుతుంది అని మ్యాడీ అంటాడు. పార్క్లో మ్యాడీ మధులు మాటలు యుద్ధం చేస్తూఉంటే పక్కనే ఓ జంట కూర్చొని ఇలా ఉండాలి.. అలా ఉండాలి అని భార్యాభర్తలు చక్కగా ఉండాలి అని చెప్తారు. మా ఆవిడ నేను ఎన్ని సార్లు గొడవ పడినా కలిసిపోవాలి అని అంటారు. ఈసోది అంతా ఎందుకు అని మ్యాడీ మధు ఇచ్చిన బాటిల్తో మొత్తం తాగేస్తాడు.
మ్యాడీ మధుతో నువ్వు ఎందుకు వచ్చావ్ అని అంటే నువ్వు నన్ను అర్థం చేసుకునే వరకు చెప్పడానికి వచ్చానని అంటుంది. నిన్ను అర్థం చేసుకోవడం చాలా అని మ్యాడీ అంటాడు. వసంత బాధగా ఉంటే ప్రమీల మాట్లాడుతుంది. ఏమైంది అని అంటే ఇన్ని రోజులు వరకు మ్యాడీ అల్లుడు అనుకున్నా ఇప్పుడు సడెన్గా ఇంకెవరో వస్తే ఎలా అల్లుడిగా అంగీకరించాలి అని అంటుంది. శ్రేయ కూడా బాధ పడుతుంటే లోహిత వెళ్లి ఎందుకు బాధ పడుతున్నావ్ ఇవి కేవలం పెళ్లి చూపులే కదా.. పెళ్లి కొడుక్కి నువ్వు నచ్చాలి కదా అంటుంది. అటు పెద్దవాళ్లకి ఇటు పెద్దవాళ్లికి నచ్చాలి కదా అంటుంది. సింపుల్గా అతను నీకు నచ్చలేదు అని చెప్పు సంబంధం క్యానిల్ అయిపోతుంది అని శ్రేయకు లోహిత చెప్తుంది.
శ్రేయ వచ్చి టిఫెన్ చేస్తుంది. అందరూ తినడం చూసిన మ్యాడీ చిన్ని అన్నది నిజమేనా భార్య తప్ప భర్తని ఎవరూ పట్టించుకోరా.. అమ్మ కూడా వాడిని పట్టించుకోదా అని అనుకుంటాడు. ఇంతలో నాగవల్లి రా నాన్న టిఫెన్ చేద్దాం అంటుంది. లేటు అవుతుందని మ్యాడీ అంటే నీ కోసం నేను వెయిట్ చేస్తా అంటుంది. మ్యాడీ డల్గా ఉంటే ఏమైందని నాగవల్లి అంటే చిన్ని కనిపించి భర్తని భార్య తప్ప ఇంకెవరూ చూసుకోరు అని చెప్పింది కానీ నువ్వు ఇంత ప్రేమ చూపిస్తుంటే చిన్ని తప్పు అనిపించింది అంటాడు. అలా అంటావ్ ఏంటి నాన్న నువ్వు నా ప్రాణం అని నాగవల్లి అంటుంది. మ్యాడీ థ్యాంక్స్ చెప్తాడు. మధు ఆఫ్ టికెట్కి కాల్ చేసి ఈ రోజు మళ్లీ నాన్న కోసం వెతుకుదాం అని అంటుంది. అన్న దొరుకుతాడు అన్న నమ్మకం లేదు అని ఆఫ్ టికెట్ అంటే కచ్చితంగా దొరుకుతారు అని ధైర్యం చెప్తుంది.
శ్రేయ ఏడుస్తుంది. లోహిత అందర్ని పిలుస్తుంది. ఏమైంది అని నాగవల్లి అడిగితే బావ అంటే నాకు ఎంత ప్రాణమో మీకు తెలుసు అయినా నాకు వేరే వాడికి ఇచ్చి పెళ్లి చేయాలి అనుకుంటున్నారు. ఎవరూ నా గురించి ఆలోచించడం లేదు.. ఎలా ఇష్టం లేని వాడితో కాపురం చేయాలి.. దాని కంటే చావడం బెటర్.. అని అంటుంది. అయితే చావు అని నాగవల్లి అంటుంది. అందరూ షాక్ అయిపోతారు. హ్యాపీగా చావు అని నాగవల్లి అంటుంది. ఇలా చస్తాను అనేవాళ్లతో ఇలాగే చెప్పాలి అని నాగవల్లి అంటుంది. నాగవల్లి ఏం చేసినా ఆలోచించే చేస్తుంది.. నీ మంచి కోసమే చేస్తుంది. ఈ అమ్మ కంటే ఈ నాగవల్లి ఎక్కువ నీ కోసం ఆలోచిస్తుంది. అలాంటి నా నిర్ణయం ఆలోచించకుండా ఎందుకు ఇలా అంటావ్.. ఇప్పుడు నువ్వు నా నిర్ణయం తప్పు పట్టావ్ కాబట్టి ఇంకో నిర్ణయం తీసుకున్నా.. ఇప్పటి వరకు ఆ అబ్బాయి నీకు నచ్చితేనే పెళ్లి చేయాలి అనుకున్నా కానీ ఇప్పుడు మాత్రం అబ్బాయి నీకు నచ్చినా నచ్చకపోయినా ఆ పెళ్లి ఫిక్స్ చేయాలి అని నిర్ణయించా.. పెళ్లి వాళ్లు వస్తున్నారు వెళ్లి చీర కట్టుకో అని అంటుంది.
శ్రేయ లోహితను కోపంగా చూసి నువ్వు చేసిన దానికి నిన్ను చంపేయాలి అన్నంత కోపం వస్తుంది. దిక్కుమాలిన సలహా ఇచ్చావ్ అని అంటుంది. మ్యాడీ స్నానం చేసి వచ్చి మధు ఇచ్చిన బట్టలు పట్టుకొని చూస్తూ ఉంటాడు. ఇంతలో శ్రేయ అక్కడికి వెళ్తే మ్యాడీ ఆల్ది బెస్ట్ అంటాడు. చిన్నప్పటి నుంచి నేను నిన్ను ప్రేమించాను. నీ మీద ఎన్నో ఆశలు పెట్టుకుంటే నువ్వు ఇలా మాట్లాడటం కరెక్ట్ కాదు బావ అంటుంది.
నీ మంచి కోసమే అమ్మ ఆలోచించింది అంటే కానీ నా మనసు గురించి ఆలోచించడం లేదు.. మధు వెళ్లిపోయిన తర్వాత అయినా నన్ను పెళ్లి చేసుకుంటావ్ అనుకున్నా అని శ్రేయ అంటే నిన్నే కాదు నేను లైఫ్లో ఇంకెవరినీ ప్రేమించను పెళ్లి చేసుకోను.. ఆ విషయం అమ్మకి తెలుసు కాబట్టే నీకు మరో పెళ్లి చేయాలి అనుకుంది.. అని అంటాడు. నీకు తప్ప నా మనసులో ఇంకెవరికీ స్థానం ఉండదు అని అర్థం చేసుకో బావ అని అంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.























