Jagadhatri Serial Today JULY 28th:శ్రీవల్లిని ఇంట్లో నుంచి పంపించేందుకు నిషిక ప్లాన్..మళ్లీ ఇంటికి వచ్చిన పాపారాయుడు
Jagadhatri Serial Today Episode July 28th: శ్రీవల్లిని ఇంట్లో నుంచి పంపించేందుకు నిషిక ప్లాన్..మళ్లీ ఇంటికి వచ్చిన పాపారాయుడు

Jagadhatri Serial Today Episode: జీతెలుగు ఛానెల్లో ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకుంటున్న జగధాత్రి సీరియల్ ఈరోజు మంచి ట్విస్టులతో సాగుతుంది. శ్రీవల్లిని ఇంట్లో నుంచి పంపించడానికి ప్లాన్ చేసిన నిషిక, యువరాజు...పాపారాయుడికి ఫోన్ చేస్తారు.నేను ఆ పనిమీదే మీ ఇంటికి వస్తున్నానని..ఇంట్లో ఎవరూ లేకుండా చూసుకోమని చెబుతాడు. దీంతో ఆదిలక్ష్మీ మెట్లు ఎక్కుతుంటే నిషిక వెనక నుంచి గట్టిగా నెడుతుంది.ఆమె గోడకు తగిలి దెబ్బతగిలించుకోవడంతో వెంటనే కేదార్, జగధాత్రిని ఇచ్చి ఆస్పత్రికి పంపుతారు. కౌషికి,సుధాకర్ ఆఫీసుకు వెళ్లడంతో ఇంట్లో ఎవరూ ఉండకపోవడంతో పాపారాయుడు వచ్చి శ్రీవల్లిని తీసుకెళ్లడానికి ప్రయత్నిస్తాడు. దీంతో ఆమె అతని చేయి కొరికి గదిలోకి వెళ్లి తలుపు వేసుకుంటుంది. నిషిక వాళ్లు ఏదో ప్లాన్ చేస్తున్నారని జగధాత్రికి అనుమానం వస్తుంది.
కుళ్లుకున్న నిషిక, వైజయంతి
సుధాకర్, జగధాత్రి, కేదార్, శ్రీవల్లి కలిసి ఆనందంగా చెస్ ఆడుకుంటుండటం చూసి నిషిక, వైజయంతి కడుపు మంటతో రగిలిపోతారు.ఇప్పుడు ఈ కేదార్గాడితోనే చస్తున్నాం..వీడికి ఇప్పుడు ఈ శ్రీవల్లి తోడయ్యిందంటే మనం రోడ్డునపడటం ఖాయమని వైజయంతి అంటుంది. వాళ్ల రూమ్లోకి వెళ్తుంటే ఆదిలక్ష్మీ వచ్చి కాఫీ ఇవ్వమని గొడవ పెట్టుకుంటుంది. మాకే పనిచేసేవాళ్లు ఉన్నారని మేం నీకు కాఫీ ఇచ్చేది ఏంటని గొడవపడి నిషిక తన రూమ్లోకి వెళ్తుంది.శ్రీవల్లిని ఇంట్లో నుంచి పంపించే పని ఎంతవరకు వచ్చిందని యువరాజును అడగ్గా....తను వెంటనే వాళ్ల మామ పాపారాయుడికి ఫోన్ చేస్తాడు.ఆపని మీదే ఇంటికి వస్తున్నానని ఇంట్లో ఎవరూ లేకుండా చూసుకోమని చెబుతాడు.
ఒక్క దెబ్బకు రెండు పిట్టలు
ఆ జగధాత్రి,కేదార్ ఇంట్లో ఉంటే శ్రీవల్లిని పంపించరని....అందుకే వాళ్లను బయటకు పంపడం ఎలా అని ఆలోచిస్తుండగా నిషిక ఓ ఐడియా చెబుతుంది. ఒకే దెబ్బకు రెండు పిట్టలంటూ పథకం వేస్తుంది.ఇంతలో కౌషికి వాళ్ల బాబాయిని తీసుకుని బోర్డు మీటింగ్కు వెళ్తుంది. జగధాత్రి,కేదార్ కిచెన్లో పనిచేస్తుండగా.....ఆదిలక్ష్మీ హాల్లో నుంచి మెట్లు ఎక్కి పైకి వెళ్తుంటే...నిషిక వెనక నుంచి వెళ్లి గట్టిగా తోస్తుంది.దీంతో ఆమె గోడకు గుద్దుకుని దెబ్బ తగిలించుకుని గట్టిగా అరుస్తుంది. దీంతో కేదార్, ధాత్రి అక్కడికి వచ్చిఆమెకు పసుపు రాస్తారు. ఆస్పత్రికి తీసుకెళ్దాం యువరాజును రమ్మని అనగా...యువరాజు బయటకు వెళ్లిపోయాడని అబద్ధం చెబుతారు.నువ్వే వెంట వెళ్లమని నిషిక చెప్పడంతో కేదార్, జగధాత్రి ఆదిలక్ష్మీని తీసుకుని ఆస్పత్రికి బయలుదేరతారు. అయితే ఇంటి ముందు యువరాజు షూతోపాటు కారు ఉండటంతో జగధాత్రికి అనుమానం వస్తుంది.
శ్రీవల్లిపై చేయిచేసుకున్న పాపారాయుడు
ఇంట్లో అందరూ వెళ్లిపోవడంతో యువరాజు పాపారాయుడికి ఫోన్ చేస్తాడు. పది నిమిషాల్లో ఇంట్లో ఉంటానని చెబుతాడు. జగధాత్రి అదోలా ఆలోచిస్తుంటే కేదార్ ఏమైందని అడుగుతాడు.నాకు ఎందుకో నిషిక వాళ్లు ఏదో ప్లాన్ చేస్తున్నట్లు అనుమానం కలుగుతుందని జగధాత్రి అంటుంది.ఇంట్లో ఎవరూ ఉండకుండా అందరినీ కావాలనే బయటకు పంపినట్లు ఉందని అంటుంది.నాకు కూడా అదే అనిపిస్తుందని కేదార్ అంటాడు.యువరాజు ఇంట్లోనే ఉన్నాడని నాకు అనుమానం కలుగుతుందని చెబుతుంది. ఇంతలో పాపారాయుడు ఇంటికి రావడంతో శ్రీవల్లి అతన్ని చూసి బెదిరిపోతుంది. నువ్వు మామయ్య వెంట ఊరు వెళ్లమని యువరాజు అంటాడు. కౌషికి అక్క, జగధాత్రి వదిన,కేదార్ అన్నయ్య లేకుండా నేను వెళ్లనని చెబుతుంది. వాళ్లు వచ్చిన తర్వాత మేం చెబుతాంలేగానీ నువ్వు వెళ్లు అని వైజయంతి అంటుంది. బట్టలు సర్దుకుని వస్తానని చెప్పగా....ఆల్రెడీ బ్యాగ్ సర్దేశామని చూపిస్తుంది. అయినా సరే వాళ్లు రాగానే వాళ్లకు చెప్పి వెళ్తానని చెప్పగా....పాపారాయుడికి కోపం వచ్చి శ్రీవల్లిపై చేయిచేసుకుంటాడు. మంచిగా చెబుతుంటే వినవా అని జుట్టుపట్టుకుని పైకి లేపుతాడు. ఇవాళ ఏం జరిగినా నువ్వు నా వెంట రావాల్సిందేనని పట్టుబడతాడు. దీంతో శ్రీవల్లి పాపారాయుడు చేయి కొరికి గదిలోకి వెళ్లి తలుపువేసుకుంటుంది. వీళ్లంతా తలుపు తీయమని బాదుతూ ఉంటారు.ఇంతలో జగధాత్రికి అనుమానం వచ్చి శ్రీవల్లి ఫోన్కు ఫోన్ చేయగా....అదిహాల్లోనే ఉంటుంది. దీనికి అప్పుడే అనుమానం వచ్చినట్లు ఉందని నిషిక అంటుంది.
ట్రెండింగ్ వార్తలు






















