అన్వేషించండి
Advertisement
Sirivennela Sitarama Sastry: సిరివెన్నెల పాట.. ప్రశ్నించే తూటా..
సిరివెన్నెల సీతారామశాస్త్రి మనల్ని విడిచి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. ఆయన సాహిత్యంలో మనకి ఎప్పటికీ గుర్తుండిపోయే పాట..
తెలుగు చిత్రసీమ గర్వించదగ్గ గేయ రచయితల్లో సిరివెన్నెల సీతారామశాస్త్రి ఒకరు. ఆయన పాటల్లోని సాహిత్యం మనల్ని సూటిగా ప్రశ్నిస్తుంటుంది. ఆయన మూడు వేలకు పైగా పాటలు రాసినప్పటికీ.. సీతారామశాస్త్రి అనగానే వెంటనే గుర్తొచ్చే పాట.
'నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని
అగ్గితోటి కడుగు ఈ సమాజ జీవశ్చవాన్ని
మారదు లోకం.. మారదు కాలం..
దేవుడు దిగి రాని ఎవ్వరు ఏమై పోనీ
మారదు లోకం.. మారదు కాలం..'
ఈ అక్షరాలన్నీ సత్యాలే.. 1993లో విడుదలైన 'గాయం' సినిమాలోని ఈ పాట అప్పట్లో సెన్సేషన్ క్రియేట్ చేసింది. సీతారామశాస్త్రి గారి సాహిత్యంలో ప్రతీ పదం తూటాల పేలుతుంటుంది.
కొన్ని పాటలు మాత్రం మనల్ని ఆలోచింపజేసే విధంగా ఉంటాయి. దానికి ఉదాహరణగా 'కొత్తబంగారు లోకం' సినిమాలో ఓ పాట గురించి చెప్పుకోవచ్చు.
'నీ ప్రశ్నను నీవే ఎవ్వరూ బదులివ్వరుగా
నీ చిక్కులు నీవే ఎవ్వరూ విడిపించరుగా
ఏ గాలో నిన్ను తరుముతుంటే అల్లరిగా
ఆగాలో లేదో తెలియదంటే చెల్లదుగా
పదినెలలు తనలో నిన్ను మోసిన అమ్మయినా..
అపుడో ఇపుడో కననే కనను అంటుందా'
ఈ పాట వింటే ఏదో తెలియని ఎనర్జీ వస్తుంది. ఎన్ని కష్టాలు వచ్చినా.. తప్పకుండా ముందుకు సాగగలమనిపిస్తుంది. ఆ పద సంపదకు ఉన్న గొప్పతనం అలాంటిది.
నారా రోహిత్ నటించిన 'రౌడీ ఫెలో' సినిమా కోసం ఓ పాట రాశారు సిరివెన్నెల.
'పేరుకు ఇందరు జనం
పేరుకుపోయిన ఒంటరితనం
నరనరమున పిరికితనం
ప్రశ్నిస్తే జవాబు మనం'
ఈ నాలుగు లైన్లు.. తన మనసుకి దగ్గరగా ఉంటాయని చెబుతుంటారు నారా రోహిత్.
మారుతున్న కాలంతో తన కలం నుంచి వచ్చే పదాల్ని కూడా అప్డేట్ చేసుకుంటూ.. సరికొత్త సాహిత్యంతో అలరించారు సీతారామశాస్త్రి. ఆ సాహిత్యం ఇప్పుడు తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయిందని తెలిసి అభిమానులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
Also Read:సిరివెన్నెల దృష్టిలో 'క్లిష్టమైన పాట..'
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్స్క్రైబ్ చేయండి
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఐపీఎల్
తెలంగాణ
విజయవాడ
ఐపీఎల్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
for smartphones
and tablets
and tablets