అన్వేషించండి

Committee Kurrollu OTT Platform: కమిటీ కుర్రోళ్ళు ఓటీటీ... ఆహా కాదండోయ్, మరో వేదికలో నిహారిక నిర్మించిన సినిమా

Committee Kurrollu OTT Release: నిహారిక కొణిదెల నిర్మించిన ఫస్ట్ ఫీచర్ ఫిల్మ్ 'కమిటీ కుర్రోళ్ళు'. థియేటర్లలో మంచి వసూళ్లు రాబట్టింది. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ఏ సంస్థ తీసుకుందో తెలుసా?

మెగా డాటర్ నిహారిక కొణిదెల (Niharika Konidela)లో నటితో పాటు మంచి నిర్మాత కూడా ఉన్నారు. పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ సంస్థ స్థాపించి 'ముద్దపప్పు ఆవకాయ్', 'నాన్న కూచి', 'ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ' వెబ్ సిరీస్‌లు ప్రొడ్యూస్ చేశారు. ఇప్పుడు డిజిటల్ స్క్రీన్ నుంచి సిల్వర్ స్క్రీన్ మీదకు వచ్చారు. 'కమిటీ కుర్రోళ్ళు'తో నిర్మాతగా వెండితెరపై అడుగు పెట్టారు. ఆవిడ ప్రొడ్యూస్ చేసిన ఫస్ట్ ఫీచర్ ఫిల్మ్ ఇది. బాక్సాఫీస్ దగ్గర మంచి కలెక్షన్లు రాబట్టింది. మరి, ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ఏ ఓటీటీ సంస్థ దగ్గర ఉన్నాయో తెలుసా?

ఈటీవీ విన్ ఓటీటీకి కమిటీ కుర్రోళ్ళు
'కమిటీ కుర్రోళ్ళు' ఓటీటీ రైట్స్ ఆహా సంస్థ తీసుకుందని ఓ వార్త షికారు చేసింది. ఆ మాటకు కారణం నిహారిక సినిమా కావడమే. ఆహా ఓటీటీలో మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ కావడం వల్ల ఆ టాక్ వినిపించింది. అయితే, అందులో నిజం లేదు. ఈ మూవీ ఓటీటీ రైట్స్ మరో సంస్థ దగ్గరకు వెళ్లాయి.

'కమిటీ కుర్రోళ్ళు' సినిమా ఓటీటీ హక్కులను ఈటీవీ విన్ తీసుకుంది. ''ఈ రోజు మా ఈటీవీ విన్ ఆఫీసుకు 11 మంది కుర్రాళ్ళు వచ్చారు'' అని ఆ సంస్థ సోషల్ మీడియాలో పేర్కొంది. డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులు మాత్రమే కాదు, శాటిలైట్ (టీవీ) హక్కులను సైతం ఈటీవీ సంస్థ తీసుకుందని విశ్వసనీయ వర్గాల సమాచారం.

Also Readభయపడకు, నేనున్నాను... మహేష్ వాయిస్ ఓవర్‌తో 'ముఫాసా' తెలుగు ట్రైలర్ వచ్చేసిందోచ్!

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by ETV Win (@etvwin)

మూడు వారాల్లో రూ. 15 కోట్లు కలెక్ట్ చేసిన సినిమా
'కమిటీ కుర్రోళ్ళు'ను సుమారు తొమ్మిది కోట్ల నిర్మాణ వ్యయంతో తెరకెక్కించారు. ఆ సినిమా విడుదలైన మూడు వారాల్లో బాక్సాఫీస్ బరిలో పదిహేను కోట్ల రూపాయలకు పైగా కలెక్ట్ చేసింది. నిర్మాతగా నిహారిక కొణిదెలకు, అలాగే సినిమా పంపిణీ చేసిన డిస్ట్రిబ్యూటర్లకు ఈ సినిమా లాభాలు తీసుకు వచ్చింది.

Also Readమైండ్ బ్లాక్ అయ్యే రేంజ్‌లో మహేష్ - రాజమౌళి సినిమా... ఇది మామూలు ప్లాన్ కాదయ్యా!

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Pinkelephantpictures (@pinkelephantpictures)

'కమిటీ కుర్రోళ్ళు' సినిమాతో తాడేపల్లిగూడెం యువకుడు యదు వంశీ దర్శకుడిగా పరిచయం అయ్యారు. అలాగే, ఈ సినిమాతో పదకొండు మంది కుర్రోళ్ళను హీరోగా పరిచయం చేశారు. నలుగురు తెలుగు అమ్మాయిలను కథానాయికలుగా పరిచయం చేశారు. సినిమాలో ప్రతి ఒక్కరికీ పేరు వచ్చింది.

Also Readఓటీటీలోకి వచ్చేసిన 'ముంజ్యా'... వంద కోట్ల హారర్‌ కామెడీ కావాలా, అయితే డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో ఈ సినిమా చూసేయండి

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Akhanda 2: ‘హిందూ మతం’ -  ‘సనాతన హైందవ ధర్మం’.. రెండూ వేరు వేరా?
‘హిందూ మతం’ -  ‘సనాతన హైందవ ధర్మం’.. రెండూ వేరు వేరా?
Putin in India: ఢిల్లీలో రష్యా అధ్యక్షుడు పుతిన్ - ప్రోటోకాల్ పక్కన పెట్టి స్వాగతం పలికిన ప్రధాని మోదీ
ఢిల్లీలో రష్యా అధ్యక్షుడు పుతిన్ - ప్రోటోకాల్ పక్కన పెట్టి స్వాగతం పలికిన ప్రధాని మోదీ
Andhra Investments :  ఏపీలో  మరో రూ. 20,444 కోట్ల పెట్టుబడులకు ఆమోదం - 45 రోజుల్లోగా మెజార్టీ ఎంఓయూలు గ్రౌండింగ్
ఏపీలో మరో రూ. 20,444 కోట్ల పెట్టుబడులకు ఆమోదం - 45 రోజుల్లోగా మెజార్టీ ఎంఓయూలు గ్రౌండింగ్
Deputy CM Pawan Kalyan: వ్యవస్థల్లో మార్పులు తీసుకురాకపోతే మనకు ఎన్ని పదవులు ఉన్నా వేస్ట్ - చిత్తూరులో పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు
వ్యవస్థల్లో మార్పులు తీసుకురాకపోతే మనకు ఎన్ని పదవులు ఉన్నా వేస్ట్ - చిత్తూరులో పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు
Advertisement

వీడియోలు

PM Modi Protocol Break at Putin Welcome | రష్యా అధ్యక్షుడికి ఆత్మీయ ఆలింగనంతో మోదీ స్వాగతం | ABP Desam
Akhanda 2 Premieres Cancelled | భారత్ లో నిలిచిన బాలకృష్ణ అఖండ 2 ప్రీమియర్స్ | ABP Desam
Indigo Airlines Issue | ప్రయాణికులకు చుక్కలు చూపిస్తున్న ఇండియో ఎయిర్‌లైన్స్ | ABP Desam
Rupee Record Fall | ఘోరంగా పతనమవుతున్న రూపాయి విలువ | ABP Desam
సారీ రోహిత్, కోహ్లీ 2027 వరల్డ్ కప్ పోయినట్లే!
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Akhanda 2: ‘హిందూ మతం’ -  ‘సనాతన హైందవ ధర్మం’.. రెండూ వేరు వేరా?
‘హిందూ మతం’ -  ‘సనాతన హైందవ ధర్మం’.. రెండూ వేరు వేరా?
Putin in India: ఢిల్లీలో రష్యా అధ్యక్షుడు పుతిన్ - ప్రోటోకాల్ పక్కన పెట్టి స్వాగతం పలికిన ప్రధాని మోదీ
ఢిల్లీలో రష్యా అధ్యక్షుడు పుతిన్ - ప్రోటోకాల్ పక్కన పెట్టి స్వాగతం పలికిన ప్రధాని మోదీ
Andhra Investments :  ఏపీలో  మరో రూ. 20,444 కోట్ల పెట్టుబడులకు ఆమోదం - 45 రోజుల్లోగా మెజార్టీ ఎంఓయూలు గ్రౌండింగ్
ఏపీలో మరో రూ. 20,444 కోట్ల పెట్టుబడులకు ఆమోదం - 45 రోజుల్లోగా మెజార్టీ ఎంఓయూలు గ్రౌండింగ్
Deputy CM Pawan Kalyan: వ్యవస్థల్లో మార్పులు తీసుకురాకపోతే మనకు ఎన్ని పదవులు ఉన్నా వేస్ట్ - చిత్తూరులో పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు
వ్యవస్థల్లో మార్పులు తీసుకురాకపోతే మనకు ఎన్ని పదవులు ఉన్నా వేస్ట్ - చిత్తూరులో పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు
Loan Apps Ban: 87 లోన్ యాప్స్‌ను బ్యాన్ చేసిన కేంద్రం - ఇప్పుడు అప్పు తీసుకున్న వాళ్లందరూ ఎగ్గొట్టవచ్చా?
87 లోన్ యాప్స్‌ను బ్యాన్ చేసిన కేంద్రం - ఇప్పుడు అప్పు తీసుకున్న వాళ్లందరూ ఎగ్గొట్టవచ్చా?
Rupee Falling News: వంట నుంచి వాహనం నడపడం వరకు; రూపాయి పతనంతో జరిగే పరిణామాలు తెలుసుకోండి?
వంట నుంచి వాహనం నడపడం వరకు; రూపాయి పతనంతో జరిగే పరిణామాలు తెలుసుకోండి?
Akhanda 2 Nizam Bookings: అప్పుడు వీరమల్లు... ఇప్పుడు అఖండ 2... టికెట్ రేట్స్ కోసం భారీ రిస్క్!
అప్పుడు వీరమల్లు... ఇప్పుడు అఖండ 2... టికెట్ రేట్స్ కోసం భారీ రిస్క్!
US warning to Pakistan:  ఇమ్రాన్ ను వదిలి పెట్టాలని మునీర్‌పై అమెరికా ఒత్తిడి - ఆంక్షలకు సిద్దమవ్వాలని హెచ్చరిక
ఇమ్రాన్ ను వదిలి పెట్టాలని మునీర్‌పై అమెరికా ఒత్తిడి - ఆంక్షలకు సిద్దమవ్వాలని హెచ్చరిక
Embed widget