అన్వేషించండి

Manchu Vishnu: ఒళ్లు దగ్గర పెట్టుకోండి.. నా కుటుంబ సభ్యులను లాగితే మర్యాదగా ఉండదు: విష్ణు వార్నింగ్

మంచు విష్ణు మరోసారి ప్రకాష్ రాజ్‌ను దుమ్మత్తిపోశారు. తన కుటుంబంపై విమర్శలు చేస్తే మర్యాదగా ఉండదని విష్ణు వార్నింగ్ ఇచ్చారు.

ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్  వద్దు.. పేపర్ బ్యాలెట్ మాత్రమే పెట్టాలని ఈసీని కోరాం. ఎలక్ట్రానిక్ ఓటింగ్ వద్దు, పేపర్ బ్యాలెట్ చేద్దామని అంతా అంటున్నారు. రేపు మనం గెలిచిన తర్వాత ప్రకాష్ రాజ్ బీపీ మాత్ర వేసుకోకుండా.. పూనకం వచ్చి ట్యాంపర్ అయ్యిందని అంటాడు. కాబట్టి.. చెక్ చేసుకోడానికి అది ఉపయోగపడుతుంది. పేపర్ బ్యాలెట్ అయితే ఎన్నిసార్లు చెక్ చేసినా ఫలితం అలాగే వస్తుంది. గత ఎన్నికల్లోనూ పేపర్ బ్యాలెట్ వాడారని స్పష్టం చేశారు. 60 ఏళ్లు పైబడిన వారికి పేపర్ బ్యాలెట్ ఇస్తారు. ఇప్పుడు మా సభ్యులలో 180 నుంచి 190 వరకు 60 ఏళ్లు పైబడిన వారు ఉన్నారు. ఏ ప్యానల్ గెలిచినా భవన నిర్మాణానికి రూ.6 కోట్లు ఇచ్చేందుకు ఓ వ్యక్తి సిద్ధంగా ఉన్నారని సినీ నటుడు, మా అధ్యక్ష అభ్యర్థి మంచు విష్ణు తెలిపారు. ‘మా’ ఎన్నికల మధ్యలోకి తన కుటుంబ సభ్యుల పేర్లను తెస్తున్నారని, మరోసారి అలా మాట్లాడితే మర్యాదగా ఉండదని విష్ణు హెచ్చరించారు.  

ఒళ్లు దగ్గరపెట్టుకుని.. మర్యాద ఇవ్వండి: ‘‘శ్రీకాంత్, హేమా, బెనర్జీ మీరంటే నాకు చాలా ఇష్టం. ప్రకాష్ రాజ్ ప్యానెల్‌లో ఉన్న చాలామంది నాకిష్టం. 10వ తేదీ తర్వాత అంతా ముఖం చూసుకోవాలి. 10 లేదా 11వ తేదీ తర్వాత ప్రకాష్ రాజ్ ఫ్లైట్ ఎక్కి వెళ్లిపోతాడు. మీరంత ఒళ్లు దగ్గరపెట్టుకుని పెద్దలకు మర్యాద ఇవ్వండి. 10 తేదీలోపు మీరు నోరు జారితే 11వ తేదీ తర్వాత మనం ముఖాలు చూసుకోలేం. ‘మా’ కుటుంబం అంతా ఒక ఫ్యామిలీ. జీవిత.. నా తండ్రిని అనే హక్కు మీకు లేదు. ప్రకాష్ రాజ్.. మీ భార్య, మీ సిస్టర్ గురించి నేను మాట్లాడానా? నా ఫ్యామిలీ గురించి మాట్లాడేందుకు మీ హక్కు ఏంటీ? నా ఫ్యామిలీ మీకు ఏం చేసింది? శ్రీహరి ఉంటే మీకు తగిన గుణపాఠం చెప్పేవారు. శ్రీహరి.. మిమ్మల్ని తీసుకొస్తే మా నాన్న కాళ్లు పట్టుకున్నారు. నా సినిమాలో డైరెక్టర్‌ను దుర్భషలాడారు. శ్రీకాంత్.. నా గురించి చిన్నప్పటి నుంచి తెలుసు. మేం మోసం చేస్తామా లేదా అనేది మీకు తెలుసు. నా ఫ్యామిలీని లాగితే ప్రకాష్ రాజు బాగోదు. మీకు దమ్ముంటే నన్ను విమర్శించండి. మీ యాక్టింట్, డ్రామా కెమేరా ముందు పెట్టండి. ఇప్పుడు మిమ్మల్ని ప్రకాజ్ రాజ్ గారు అంటున్నా. ఆ తర్వాత గారు ఉండదు’’ అని విష్ణు అన్నారు.  

అందుకే డబ్బులు కట్టాం..: ప్రకాష్ రాజ్ చేసిన పోస్టల్ బ్యాలెట్ ఆరోపణలపై స్పందిస్తూ.. ‘‘మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్‌లో సుమారు 190 మంది 60 ఏళ్లు పైబడిన వాళ్లు ఉన్నారు. వాళ్లందరికీ నేను వ్యక్తిగతంగా ఫోన్‌ చేశాను. వారిలో 100 మంది నేరుగా వచ్చి ఓటు వేస్తామని చెప్పారు. ఇతర రాష్ట్రాల్లో ఉన్నవాళ్లు, హైదరాబాద్‌లో ఉన్న పరుచూరి బ్రదర్స్‌ కూడా పోస్టల్‌ బ్యాలెట్‌కు వెళ్తామని చెప్పారు. ఈ మేరకు మీరు ఒక లేఖ ఎన్నికల సంఘానికి పంపాలని వారికి సూచించాను. పోస్టల్ బ్యాలెట్  ఎలా చేయాలో వారికి తెలీదన్నారు. దీంతో వారికి ఒక లెటర్‌ ఫార్మాట్‌ పంపించాను. వాటిని ఎవరికి వారే కొరియర్‌ చేశారు. ఆ లెటర్లను వ్యక్తిగతంగా తీసుకురాలేదు. పోస్టల్‌ బ్యాలెట్‌ కోసం రూ.500 కట్టాలని ఎన్నికల సంఘం సభ్యులకు ఎస్‌ఎంఎస్‌ పంపింది. దీనిపై పలువురు పెద్దలు నాకు ఫోన్‌ చేసి అడిగారు. దీంతో ఆ రూ.500 నేను కడతా అని వాళ్లకు చెప్పాను. ఈ విషయాన్ని ఎన్నికల సంఘాన్ని అడిగితే అంగీకరించారు. దీంతో న్యాయబద్ధంగానే ఆ డబ్బులు కట్టాం. ఆ తర్వాత ఎన్నికల సంఘం పోస్టల్ బ్యాలెట్ డబ్బులు చెల్లించేందుకు సభ్యులకు సమయం ఇస్తామని, మీ డబ్బులు తీసుకెళ్లండని ఫోన్ వచ్చింది. దీంతో మేం ఆ డబ్బులు తీసుకున్నాం. ఇవన్నీ లీగల్‌గానే జరిగాయి. ఇదేమీ తెలియకుండా ప్రకాష్ రాజ్ ఆరోపణలు చేస్తున్నారు’’ అని మంచు విష్ణు పేర్కొన్నారు. 

Also Read: కన్నీళ్లు పెట్టుకున్న ప్రకాశ్‌రాజ్‌.. మంచు విష్ణు ప్యానల్‌పై ఫిర్యాదు 

విష్ణుపై ప్రకాష్ రాజ్ ఫిర్యాదు.. మీడియా ముందు కన్నీళ్లు: మంచు విష్ణు ప్యానెల్‌ పోస్టల్ బ్యాలెట్‌ను దుర్వినియోగం చేస్తోందంటూ ప్రకాష్ రాజ్ మంగళవారం ఉదయం ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేశారు. 60 మందితో పోస్టల్‌ బ్యాలెట్‌లో తమకు అనుకూలంగా మంచు విష్ణు ఓటు వేయించుకుంటున్నారని ప్రకాశ్‌ రాజ్‌ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆయన వెంట శ్రీకాంత్‌, జీవిత కూడా వెళ్లారు. వైజాగ్, చెన్నైల్లో ఉండేవారి పేర్లు చేర్చి ఇక్కడ డబ్బులు కట్టారని, వారితో ఓటు వేయించుకునే కుట్ర చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. మా ఎన్నికల్లో 60 ఏళ్లు పైబడినవారే పోస్టల్ బ్యాలెట్‌కు అర్హులు అని, వైజాగ్, చెన్నైల్లో ఉండేవారి పేర్లు చేర్చి డబ్బులు కట్టారని మండిపడ్డారు. మోహన్ బాబు కంపెనీలో మేనేజర్ 56 మందికి సంబంధించి రూ. 28 వేలు మోహన్ బాబు ఎలా కడతారని ప్రశ్నించారు. ఎన్నికలు జరుగుతున్న తీరుపై ప్రకాష్ రాజ్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రెస్ మీట్‌లో కన్నీరు పెట్టుకున్నారు. కృష్ణ, కృష్ణంరాజు, శారద, పరుచూరి బ్రదర్స్‌, శరత్‌బాబు తదితరుల పోస్టల్‌ బ్యాలెట్‌ డబ్బులు కూడా మంచు విష్ణు తరఫు వ్యక్తే కట్టారు. ఆగంతుకులతో ‘మా’ ఎన్నికలు నిర్వహిస్తామా? ఇలా గెలుస్తారా? మీ హామీలు చెప్పి గెలవరా? ఇంత దిగజారుతారా? ఈ విషయంపై పెద్దలు కృష్ణంరాజు, చిరంజీవి, నాగార్జున సమాధానం చెప్పాలి’’ అని ప్రకాశ్‌రాజ్‌ అన్నారు. 

Also Read: 'ఆదిపురుష్' మాత్రమే కాదు మరో రామాయణం వస్తోంది..ఇది కూడా భారీ ప్రాజెక్టే...

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

టాప్ హెడ్ లైన్స్

I Nobody OTT : ఓటీటీలోకి వారణాసి విలన్ క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి వారణాసి విలన్ క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Godavari Serial Today August 15th: 'గోదావరి' సీరియల్: సూర్యతోనే నీ పెళ్లి.. మాటిచ్చేసిన భువన! జాను పరిస్థితేంటి?
'గోదావరి' సీరియల్: సూర్యతోనే నీ పెళ్లి.. మాటిచ్చేసిన భువన! జాను పరిస్థితేంటి?
Nindu Manasulu Serial Today August 15th: నిండు మనసులు: ఐశ్వర్య మాటలకు తల పట్టుకున్న ప్రేరణ! ఐషూకి రంజిత్ చెప్పిన షాకింగ్‌ నిజాలు!
నిండు మనసులు: ఐశ్వర్య మాటలకు తల పట్టుకున్న ప్రేరణ! ఐషూకి రంజిత్ చెప్పిన షాకింగ్‌ నిజాలు!
Anasuya Bharadwaj : నేను హనుమంతుడి కుమార్తెను - వివాదంపై అనసూయ క్లారిటీ
నేను హనుమంతుడి కుమార్తెను - వివాదంపై అనసూయ క్లారిటీ

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Independence Day 2026: గోల్కొండ కోటపై జెండా ఆవిష్కరించిన రేవంత్ రెడ్డి! నీటి హక్కులు, రైతు సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రగతి ప్రస్థానం!
గోల్కొండ కోటపై జెండా ఆవిష్కరించిన రేవంత్ రెడ్డి! నీటి హక్కులు, రైతు సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రగతి ప్రస్థానం!
Independence Day 2026 At Amaravati: అమరావతి గడ్డపై తొలిసారి స్వాతంత్య్ర వేడుకలు! చంద్రబాబు ప్రసంగంలోని ముఖ్యాంశాలు!
అమరావతి గడ్డపై తొలిసారి స్వాతంత్య్ర వేడుకలు! చంద్రబాబు ప్రసంగంలోని ముఖ్యాంశాలు!
Komatireddy Rajagopal Reddy New Party: రాజగోపాల్ రెడ్డి కొత్త పార్టీ పెడతారా? కాంగ్రెస్ పై తిరుగుబాటా లేక మంత్రి పదవి కోసం ప్రెజర్ పాలిటిక్సా?
రాజగోపాల్ రెడ్డి కొత్త పార్టీ పెడతారా? కాంగ్రెస్ పై తిరుగుబాటా లేక మంత్రి పదవి కోసం ప్రెజర్ పాలిటిక్సా?
AP Teacher Suspension:మెగా డీఎస్సీపై కేంద్రానికి ఉపాధ్యాయుల ఫిర్యాదు! నలుగురిపై విద్యాశాఖ చర్యలు!
మెగా డీఎస్సీపై కేంద్రానికి ఉపాధ్యాయుల ఫిర్యాదు! నలుగురిపై విద్యాశాఖ చర్యలు!
Vande Mataram at Red Fort: ఎర్రకోటపై చారిత్రక ఘట్టం! 80వ స్వాతంత్య్ర వేడుకల్లో తొలిసారిగా
ఎర్రకోటపై చారిత్రక ఘట్టం! 80వ స్వాతంత్య్ర వేడుకల్లో తొలిసారిగా "వందేమాతరం" ఆలాపన!
YS Jagan Press Meets vs Protests: వైఎస్ జగన్ పరామర్శ రాజకీయం - రోడ్డెక్కుతున్న క్యాడర్.. ప్రెస్ మీట్లకే పరిమితమవుతున్న అధినేత! ఏపీలో వైఎస్సార్‌సీపీ ప్లాన్ ఏంటి?
వైఎస్ జగన్ పరామర్శ రాజకీయం - రోడ్డెక్కుతున్న క్యాడర్.. ప్రెస్ మీట్లకే పరిమితమవుతున్న అధినేత! ఏపీలో వైఎస్సార్‌సీపీ ప్లాన్ ఏంటి?
Telangana Police Recruitment 2026: తెలంగాణలో నిరుద్యోగులకు ఊరట! యూనిఫామ్ కొలువుల వయోపరిమితి రెండేళ్లు పెంపు!
తెలంగాణలో నిరుద్యోగులకు ఊరట! యూనిఫామ్ కొలువుల వయోపరిమితి రెండేళ్లు పెంపు!
PM Modi Sports Vision: 2036 ఒలింపిక్స్ ఆతిథ్యంతో పాటు నేషన్ వైడ్ టాలెంట్ హంట్.. క్వాలిఫై కానీ ఈవెంట్లపై ఫోకస్: ప్రధాని మోదీ
2036 ఒలింపిక్స్ ఆతిథ్యంతో పాటు నేషన్ వైడ్ టాలెంట్ హంట్.. క్వాలిఫై కానీ ఈవెంట్లపై ఫోకస్: ప్రధాని మోదీ
Embed widget