News
News
X

Mayilsamy Death: సినీ పరిశ్రమలో మరో విషాదం, ప్రముఖ కమెడియన్ కన్నుమూత

సినీ పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది. నిన్న నందమూరి తారకరత్న చనిపోగా, ఇవాళ ప్రముఖ తమిళ కమెడియన్ మైల్‌స్వామి చనిపోయారు.

FOLLOW US: 
Share:

చిత్ర పరిశ్రమలో వరుస విషాద ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. 23 రోజుల పాటు మృత్యువుతో పోరాడిన తారకరత్న నిన్న(శనివారం) సాయంత్రం కన్నుమూశారు. ఆయన అంత్యక్రియలు కూడా పూర్తి కాకముందే మరో ప్రముఖ నటుడు కన్నుమూశారు. తమిళ సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖ హాస్య నటుడు  మైల్‌స్వామి(57) కన్నుమూశారు. గ‌త  కొద్ది రోజులుగా అనారోగ్యంతో ఆయన బాధపడుతున్నారు. ఈ తెల్లవారు జామున ఒంట్లో కాస్త నీరసంగా ఉందని  కుటుంబ సభ్యులకు చెప్పారు. వెంటనే ఆయనను  పోరూర్‌లోని  ఆసుపత్రికి తరలించారు. డాక్టర్లు ఆయన్ని పరీక్షించి అప్పటికే ఆయన చనిపోయినట్లు తెలిపారు. మైల్‌స్వామి మరణ వార్తతో కోలీవుడ్ చిత్ర సీమలో విషాద ఛాయలు అలుముకున్నాయి.  

1984లో నటుడిగా సినిమా పరిశ్రమలోకి అడుగు పెట్టిన మైల్‌స్వామి

మిమిక్రీ ఆర్టిస్ట్‌ గా కెరీర్ మొదలు పెట్టిన మైల్ స్వామి 1984లో న‌టుడిగా చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టారు. మొదట్లో నటుడిగా గుర్తింపు తెచ్చుకునేందుకు చాలా కష్టపడాల్సి వచ్చింది.  నెమ్మదిగా ఇండస్ట్రీలో నిలదొక్కుకున్నారు. 2000 నుంచి కమెడియన్‌గా  మంచి గుర్తింపు సంపాదించారు. పలు సినిమాల్లో తనదైన నటనతో, కామెడీతో  ప్రేక్షకులను నవ్వించాడు. ఆయన తమిళంతో పాటు పలు తెలుగు సినిమాల్లోనూ నటించాడు. టాలీవుడ్ లో కమెడియన్ గా, విలన్ గా పలు పాత్రలు పోషించారు.  

  

మైల్‌స్వామి మృతి పట్ల పలువురు ప్రముఖుల సంతాపం

మైల్‌స్వామి మృతి పట్ల తమిళ, సినీ పరిశ్రమల్లో విషాదం నెలకొంది. ఆయన మరణం పట్ల తమిళ సినీ నటులు, రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ గవర్నర్ తమిళసై సౌందరరాజన్ సతైం మలై స్వామి మరణంపై ట్విట్టర్ వేదికగా సంతాపం వ్యక్తం చేసారు.  హాస్యనటుడు మయిల్ సామి అనారోగ్య కారణాలతో మరణించారనే వార్త విని బాధపడినట్టు వెల్లడించారు. అంతేకాదు, రాజకీయాలకు అతీతంగా ఆయన అన్ని పార్టీలతో స్నేహం కొనసాగించిన విషయాన్ని ఈ సందర్భంగా ఆమె గుర్తు చేశారు. అంతేకాదు, విరుగంపాక్కం ప్రాంత ప్రజలకు ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించారని చెప్పారు. తన హాస్యంతో ప్రజల హృదయాల్లోకి నిలిచి పోయిన ఆయన మరణం చిత్ర పరిశ్రమకు తీరని లోటు అన్నారు. ఈ సందర్భంగా మైల్‌స్వామి కుటుంబ సభ్యులకు, అభిమానులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్టు గవర్నర్ వెల్లడించారు.

అటు పలువురు సినీ ప్రముఖులు, నటీనటులు మైల్‌స్వామి ఇంటికి వెళ్లి ఆయన పార్దివదేహానికి పూల మాలలు వేసి శ్రధ్ధాంజలి ఘటిస్తున్నారు. కమల్ హాసన్, విక్రమ్ సహా పలువురు హీరోలు ఆయనతో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఆయన లేని లోటు తమిళ సినీ పరిశ్రమకు తీరనిదన్నారు.  

Read Also: నో పార్కింగ్‌లో హీరోగారి కారు, చలాన్ వేసిన పోలీసులు

Published at : 19 Feb 2023 12:18 PM (IST) Tags: Kollywood Comedian Mayilsamy Mayilsamy passes away Celebs condoles

సంబంధిత కథనాలు

Dasara Collections: ‘దసరా’ అడ్వాన్స్ బుకింగ్ అదుర్స్ - నాని కెరీర్‌లో సరికొత్త రికార్డు!

Dasara Collections: ‘దసరా’ అడ్వాన్స్ బుకింగ్ అదుర్స్ - నాని కెరీర్‌లో సరికొత్త రికార్డు!

Taapsee Pannu: నటి తాప్సి పన్నుపై కేసు నమోదు - హిందువుల మనోభావాలు దెబ్బతీసిందని ఫిర్యాదు

Taapsee Pannu: నటి తాప్సి పన్నుపై కేసు నమోదు - హిందువుల మనోభావాలు దెబ్బతీసిందని ఫిర్యాదు

Silk Smitha Poster: ‘దసరా’ మూవీలో సిల్క్ స్మితా పోస్టర్ వెనుక ఇంత కథ ఉందా - అసలు విషయం చెప్పేసిన దర్శకుడు

Silk Smitha Poster: ‘దసరా’ మూవీలో సిల్క్ స్మితా పోస్టర్ వెనుక ఇంత కథ ఉందా - అసలు విషయం చెప్పేసిన దర్శకుడు

Naga Chaitanya - Sobhita Dhulipala: చైతూ - శోభిత మళ్లీ దొరికిపోయారా? వైరల్ అవుతున్న డేటింగ్ ఫొటో!

Naga Chaitanya - Sobhita Dhulipala: చైతూ - శోభిత మళ్లీ దొరికిపోయారా? వైరల్ అవుతున్న డేటింగ్ ఫొటో!

Parineeti Chopra Wedding: ఆ ఎంపీతో బాలీవుడ్ నటి పరిణితీ చోప్రా పెళ్లి? అసలు విషయం చెప్పేసిన ఆమ్ ఆద్మీ పార్టీ నేత

Parineeti Chopra Wedding: ఆ ఎంపీతో బాలీవుడ్ నటి పరిణితీ చోప్రా పెళ్లి? అసలు విషయం చెప్పేసిన ఆమ్ ఆద్మీ పార్టీ నేత

టాప్ స్టోరీస్

Jagan G 20: ప్రతి ఒక్కరికీ ఇల్లు కల్పించాలన్నది మా ఉద్దేశం - విశాఖ జి-20 సదస్సులో సీఎం జగన్

Jagan G 20: ప్రతి ఒక్కరికీ ఇల్లు కల్పించాలన్నది మా ఉద్దేశం -  విశాఖ జి-20 సదస్సులో సీఎం జగన్

TSPSC Exam Postpone: పేపర్ల లీకుల ఎఫెక్ట్ - హార్టికల్చర్ ఆఫీసర్ పరీక్ష వాయిదా, కొత్త తేదీ ప్రకటించిన టీఎస్ పీఎస్సీ

TSPSC Exam Postpone: పేపర్ల లీకుల ఎఫెక్ట్ - హార్టికల్చర్ ఆఫీసర్ పరీక్ష వాయిదా, కొత్త తేదీ ప్రకటించిన టీఎస్ పీఎస్సీ

TDP Manifesto : ప్రతి పేదవాడి జీవితం మారేలా మేనిఫెస్టో, కసరత్తు ప్రారంభించిన టీడీపీ!

TDP Manifesto : ప్రతి పేదవాడి జీవితం మారేలా మేనిఫెస్టో, కసరత్తు ప్రారంభించిన టీడీపీ!

KTR On Amaravati : అమరావతిలో పనులు జరగడం లేదన్న కేటీఆర్ - ఎందుకన్నారో తెలుసా ?

KTR On Amaravati :   అమరావతిలో పనులు జరగడం లేదన్న కేటీఆర్ - ఎందుకన్నారో తెలుసా ?