అన్వేషించండి

Kareena Kapoor: ఆయన ఇన్‌స్టాగ్రామ్ వాడరు - ఎందుకో చెప్పేసిన కరీనా కపూర్

ఈ రోజుల్లో సెలబ్రిటీల నుంచి మొదలుకొని సామాన్యుల వరకు ఇన్ స్టాగ్రామ్ ను బాగా వినియోగిస్తున్నారు. అయితే, తన భర్త సైఫ్ అలీ ఖాన్ అస్సలు సోషల్ మీడియా చూడరని చెప్పింది బాలీవుడ్ బ్యూటీ కరీనా కపూర్.

Kareena Kapoor About Social Media: బాలీవుడ్ బ్యూటీ కరీనా కపూర్ గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. రెండు దశాబ్దాలకు పైగా హిందీ చిత్ర పరిశ్రమలో కొనసాగుతున్నారు. ఎన్నో అద్భుతమైన చిత్రాల్లో నటించి స్టార్ హీరోయిన్ గా ఎదిగారు. అందం, అభినయంతో లక్షలాది మంది అభిమానులను సంపాదించుకున్నారు. బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ (Saif Ali Khan)ను పెళ్లి చేసుకున్న కరీనా... కొంత కాలం పాటు సినిమాలకు దూరంగా ఉన్నారు. ఆ తర్వాత మళ్లీ సినిమాలతో బిజీగా అయ్యారు.

సైఫ్ సోషల్ మీడియా అస్సలు వాడరు- కరీనా

ఓ వైపు సినిమాలు, మరో వైపు పిల్లలతో బిజీగా ఉన్నా... సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటుంది కరీనా కపూర్. ప్రస్తుతం ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమెకు 11.7 మిలియన్లకు పైగా ఫాలోవర్లు ఉన్నారు. ఎప్పటికప్పుడు తన ఫోటోలు, వీడియోలు అభిమానులతో పంచుకుంటుంది. వ్యక్తిగత జీవితంలో పాటు తన సినిమాలకు సంబంధించిన అప్ డేట్స్ ఇస్తుంటుంది. తాజాగా ABP Ideas of India 2024 ఈవెంట్ లో పాల్గొన్న కరీనా, తన భర్త సైఫ్ అలీ ఖాన్ సోషల్ మీడియాను ఎందుకు ఉపయోగించరో చెప్పుకొచ్చింది.  

“సోషల్ మీడియాను ఉపయోగించడం నాకు చాలా ఆనందాన్ని కలిగిస్తుంది. నా అభిమానులతో కనెక్ట్ అవ్వడానికి ఇదో మంచి వేదికగా భావిస్తా. నా ఫ్యాన్స్ నుంచి లభిస్తున్న ప్రేమ, ఆదరణ చూస్తుంటే... చాలా సంతోషంగా అనిపిస్తుంది. అయితే, సైఫ్ అలీ ఖాన్ మాత్రం సోషల్ మీడియాను అస్సలు ఉపయోగించరు. రెగ్యులర్ గా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం, సెల్ఫీలు తీసుకోవడం లాంటివి ఆయనకు అస్సలు నచ్చవు. వ్యక్తిగత జీవితాన్ని పూర్తిగా బయటపెట్టుకోవడం ఆయనకు పెద్దగా ఇష్టం ఉండదు. సోషల్ మీడియా వినియోగం వల్ల కుటుంబం మీద, చేసే పని మీద ఎఫెక్ట్ పడుతుందని భావిస్తారు. అందుకే ఉపయోగించరు” అని చెప్పుకొచ్చింది కరీనా కపూర్ ఖాన్. అటు పెళ్లై పిల్లలు ఉన్నా,  నటిగా రాణించడం సంతోషంగా ఉందని కరీనా తెలిపింది. వర్కింగ్ మదర్ గా కొనసాగడం ఎంతో సంతోషాన్ని కలిగిస్తుందని వెల్లడించింది. సినిమాలకు ఎంత సమాయాన్ని కేటాయిస్తున్నానో, అంతే మొత్తంలో కుటుంబానికి కేటాయిస్తున్నానని కరీనా వివరించింది.

మార్చి 29న ‘క్రూ’ సినిమా విడుదల

ఇక కరీనా ప్రస్తుతం ‘క్రూ’ అనే సినిమాలో నటిస్తోంది. బాలీవుడ్ స్టార్ నటీమణులు టబు, కృతి సనన్ తో కలిసి ఆమె ఈ సినిమాలో నటిస్తోంది. ఈ చిత్రానికి రాజేష్ కృష్ణన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఏక్తా కపూర్‌‌, రియా కపూర్ నిర్మిస్తున్నారు. మార్చి 29న ఈ సినిమా విడుదలకు రెడీ అవుతోంది. ఇప్పటికే విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్ట‌ర్‌, టీజర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నాయి. ఎయిర్‌ హోస్టెస్‌గా పని చేస్తున్న ముగ్గురు మహిళల జీవితం ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ చిత్రంలో పంజాబీ సింగర్ & యాక్టర్ దిల్జీజ్‌ దోసాంజ్‌, కపిల్ శర్మ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. 'సింగమ్ ఎగైన్'లోనూ కరీనా కనిపించనుంది.

Read Also: టాలెంట్ ఉంటేనే రాణిస్తారు, నెపొటిజంపై శోభిత ధూళిపాళ్ల ఇంట్రెస్టింగ్ కామెంట్స్

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Chandrababu Naidu: సీఎం చంద్రబాబు ఇంటి స్థలానికి లంచం, డిప్యూటీ సర్వేయర్ నిర్వాకం..!
సీఎం చంద్రబాబు ఇంటి స్థలానికి లంచం, డిప్యూటీ సర్వేయర్ నిర్వాకం..!
Telangana News : తెలంగాణలో నిరుద్యోగులకు శుభవార్త.. త్వరలో జాబ్ క్యాలెండర్ విడుదల
తెలంగాణలో నిరుద్యోగులకు శుభవార్త.. త్వరలో జాబ్ క్యాలెండర్ విడుదల
Andhra Pradesh:  ఆంధ్రప్రదేశ్‌లో పింఛన్ పంపిణీ వేళ టీడీపీ కూటమి వైసీపీ మధ్య పొలిటికల్ వార్‌
ఆంధ్రప్రదేశ్‌లో పింఛన్ పంపిణీ వేళ టీడీపీ కూటమి వైసీపీ మధ్య పొలిటికల్ వార్‌
Electricity Bill Payment: మీ కరెంట్ బిల్లులను ఆన్‌లైన్‌లో ఎలా చెల్లించాలో తెలుసా, స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఇదీ
మీ కరెంట్ బిల్లులను ఆన్‌లైన్‌లో ఎలా చెల్లించాలో తెలుసా, స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఇదీ
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Surya Kumar Yadav Catch Controversy | T20 World Cup 2024| సూర్య స్టన్నింగ్ క్యాచ్ పై కొత్త అనుమానాలుRahul Dravid About Team India Victory | T20 World Cup 2024 | కోచ్ పదవి పోయిందంటూ ద్రవిడ్ కామెంట్స్BCCI Announce Rs 125 crore prize money | T20 World Cup2024 గెలిచిన టీం ఇండియాకు భారీ నజరానా | ABPJasprit Bumrah Player of the Tournament award | T20 World Cup 2024 లో బుమ్రానే మన బౌలింగ్ బలం | ABP

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Chandrababu Naidu: సీఎం చంద్రబాబు ఇంటి స్థలానికి లంచం, డిప్యూటీ సర్వేయర్ నిర్వాకం..!
సీఎం చంద్రబాబు ఇంటి స్థలానికి లంచం, డిప్యూటీ సర్వేయర్ నిర్వాకం..!
Telangana News : తెలంగాణలో నిరుద్యోగులకు శుభవార్త.. త్వరలో జాబ్ క్యాలెండర్ విడుదల
తెలంగాణలో నిరుద్యోగులకు శుభవార్త.. త్వరలో జాబ్ క్యాలెండర్ విడుదల
Andhra Pradesh:  ఆంధ్రప్రదేశ్‌లో పింఛన్ పంపిణీ వేళ టీడీపీ కూటమి వైసీపీ మధ్య పొలిటికల్ వార్‌
ఆంధ్రప్రదేశ్‌లో పింఛన్ పంపిణీ వేళ టీడీపీ కూటమి వైసీపీ మధ్య పొలిటికల్ వార్‌
Electricity Bill Payment: మీ కరెంట్ బిల్లులను ఆన్‌లైన్‌లో ఎలా చెల్లించాలో తెలుసా, స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఇదీ
మీ కరెంట్ బిల్లులను ఆన్‌లైన్‌లో ఎలా చెల్లించాలో తెలుసా, స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఇదీ
Polavaram Project: పోలవరం ప్రాజెక్ట్‌ పరిశీలిస్తున్న అంతర్జాతీయ నిపుణుల బృందం- డయాఫ్రంవాల్‌ గురించి ఏం చెప్పారంటే?
పోలవరం ప్రాజెక్ట్‌ పరిశీలిస్తున్న అంతర్జాతీయ నిపుణుల బృందం- డయాఫ్రంవాల్‌ గురించి ఏం చెప్పారంటే?
Thangalaan : విక్ర‌మ్ 'తంగలాన్' ఫ‌స్ట్ రివ్యూ ఇచ్చేసిన జీ.వి. ప్ర‌కాశ్.. ఏమ‌న్నారంటే?
విక్ర‌మ్ 'తంగలాన్' ఫ‌స్ట్ రివ్యూ ఇచ్చేసిన జీ.వి. ప్ర‌కాశ్.. ఏమ‌న్నారంటే?
Andhra Pradesh: చెప్పాపెట్టకుండానే ఉద్యోగులకు షాక్ ఇచ్చిన ఏపీ ప్రభుత్వం
చెప్పాపెట్టకుండానే ఉద్యోగులకు షాక్ ఇచ్చిన ఏపీ ప్రభుత్వం
Pawan Kalyan: “ఆరోపిస్తారు.. ఆధారాలు అడిగితే సైలెంట్ అవుతారు”.. పవన్ పై వైసీపీ ఫైర్
“ఆరోపిస్తారు.. ఆధారాలు అడిగితే సైలెంట్ అవుతారు”.. పవన్ పై వైసీపీ ఫైర్
Embed widget