అన్వేషించండి

Ram Charan: రామ్ చరణ్ ఇంట్లో ఇండియన్ క్రికెటర్స్ - బయటకొచ్చిన ఫొటోలు!

రామ్ చరణ్ ను కలవడానికి ఆయన ఇంటికి వెళ్లిన ప్లేయర్స్ లో కెప్టెన్ రోహిత్, విరాట్ కోహ్లీ, సూర్య కుమార్ యాదవ్, హార్థిక్ పాండ్యాతో పాటు మరికొంతమంది ప్లేయర్స్ ఉన్నట్లు సమాచారం.

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) ఇంటికి ఇండియన్ క్రికెట్ ప్లేయర్స్ కొందరు వెళ్లినట్లుగా తెలుస్తోంది. ఆదివారం నాడు హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో ఇండియా-ఆస్ట్రేలియా(IND vs AUS) మధ్య ఫైనల్ టీ20 మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ లో ఇండియా గెలిచింది. మ్యాచ్ తరువాత ఇండియన్ క్రికెట్ ప్లేయర్స్ కొందరు.. టాలీవుడ్ హీరో రామ్ చరణ్ ఇంటికి వెళ్లినట్లు సోషల్ మీడియాలో కొన్ని పోస్ట్ లు కనిపిస్తున్నాయి. 

ఈ ఫొటోలు సూచిన రామ్ చరణ్ ఫ్యాన్స్ ఆనందానికి అవధుల్లేవు. దీంతో వారు సోషల్ మీడియాలో ఈ ఫొటోలను మరింత సర్క్యూలేట్ చేస్తున్నారు. చరణ్ క్రేజ్ ఇది అంటూ తెగ పొగిడేస్తున్నారు. దీంతో రామ్ చరణ్ పేరు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. రామ్ చరణ్ ను కలవడానికి ఆయన ఇంటికి వెళ్లిన ప్లేయర్స్ లో కెప్టెన్ రోహిత్, విరాట్ కోహ్లీ, సూర్య కుమార్ యాదవ్, హార్థిక్ పాండ్యాతో పాటు మరికొంతమంది ప్లేయర్స్ ఉన్నట్లు సమాచారం. రామ్ చరణ్ అసిస్టెంట్స్ లో ఒక వ్యక్తి హార్థిక్ తో ఫొటో తీసుకున్నారు. ఈ ఫొటో ఇప్పుడు బయటకొచ్చింది. 

రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ కలిసి నటించిన 'ఆర్ఆర్ఆర్' సినిమా ఎంత పెద్ద సక్సెస్ అయిందో తెలిసిందే. ఈ సినిమా తెలుగులోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా సత్తా చాటింది. ఈ సినిమాలో చరణ్, ఎన్టీఆర్ ల నటనకు ప్రతి ఒక్కరూ ఫిదా అయ్యారు. ఇండియన్ క్రికెటర్స్ సైతం వారికి అభిమానులుగా మారిపోయారు. ఈ క్రమంలోనే వారంతా చరణ్ ఇంటికి వెళ్లినట్లు తెలుస్తోంది. 

ఇక రామ్ చరణ్ సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం ఆయన శంకర్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు.  ఈ సినిమాలో చరణ్ ఐఏఎస్ అధికారి పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాను అక్టోబర్ నాటికి పూర్తి చేయాలనేది శంకర్ ప్లాన్. కానీ ఇప్పుడు దర్శకుడు శంకర్ 'ఇండియన్2' ప్రాజెక్ట్ ను టేకప్ చేయడంతో చరణ్ సినిమా ఆలస్యమయ్యేలా ఉంది. ఈ సినిమాలో కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది. ఎస్ జె సూర్య విలన్ రోల్ లో కనిపించనున్నారు. 

గౌతమ్ ప్లేస్ లో కన్నడ దర్శకుడు:

'జెర్సీ' ఫేమ్ గౌతమ్ తిన్ననూరితో ఓ సినిమా చేయాలనుకున్నారు చరణ్. దీనికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా వచ్చింది. కానీ ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం.. చరణ్-గౌతమ్ సినిమా ఆగిపోయినట్లు తెలుస్తోంది.  ఇప్పుడు ఈ సినిమాకి బదులుగా మరో సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లనున్నారు రామ్ చరణ్. కొన్ని నెలలుగా చరణ్ ను కలిసి కథలు వినిపిస్తున్నారు దర్శకులు. ఈ క్రమంలో కన్నడ దర్శకుడు నర్తన్ చెప్పిన కథ చరణ్ కి బాగా నచ్చిందట. 

'మఫ్తి' అనే సినిమాతో కన్నడలో దర్శకుడిగా మంచి పేరు సంపాదించుకున్నారు నర్తన్. చాలా కాలంగా ఆయన చరణ్ తో సినిమా చేయాలనుకుంటున్నారు. ఫైనల్ గా కథ సెట్ అవ్వడంతో చరణ్ కి వినిపించారు. ఆయన ఓకే చెప్పడంతో.. మెగాస్టార్ చిరంజీవికి కూడా ఫైనల్ నేరేషన్ ఇచ్చారు నర్తన్. కథ ఇంప్రెసివ్ గా అనిపించడంతో చిరు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. కొన్ని రోజుల్లో ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ రానుంది. యూవీ క్రియేషన్స్ సంస్థ ఈ ప్రాజెక్ట్ ను నిర్మించనుంది.

Also read: రేవంత్ వల్లే ఎలిమినేట్ అయ్యాను, దమ్మున్న కంటెస్టెంట్స్ వాళ్లే - నేహా కామెంట్స్!

Also read: ఇంట్లో ఎవరు గాడిద? ఎవరు పాము? ఎవరు ఊసరవెల్లి? ఇదిగో మీరే చూడండి

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Vijay Deverakonda Rashmika : విరోష్ కపుల్ గొప్ప మనసు - ఫ్యాన్స్‌కు స్వీట్ సర్‌ప్రైజ్... ఆలయాల్లో అన్నదానం కూడా...
విరోష్ కపుల్ గొప్ప మనసు - ఫ్యాన్స్‌కు స్వీట్ సర్‌ప్రైజ్... ఆలయాల్లో అన్నదానం కూడా...
Vishnu Manchu : దుబాయ్‌లో హీరో విష్ణుకు భయానక అనుభవం - శాంతి కోసం ప్రార్థిసున్నామంటూ...
దుబాయ్‌లో హీరో విష్ణుకు భయానక అనుభవం - శాంతి కోసం ప్రార్థిసున్నామంటూ...
Rashmika Mandanna: రాజసం ఉట్టిపడేలా మండపంలోకి రష్మిక... పల్లకిలో పెళ్లి కూతురు - ఫోటోలు వైరల్
రాజసం ఉట్టిపడేలా మండపంలోకి రష్మిక... పల్లకిలో పెళ్లి కూతురు - ఫోటోలు వైరల్
Rajpal Yadav: చేతిలో 1200 కోట్ల పని, 10 సినిమాలు... చెక్ బౌన్స్‌ కేసులో జైలుకు... రాజ్‌పాల్ యాదవ్ సెన్సేషనల్ కామెంట్స్‌
చేతిలో 1200 కోట్ల పని, 10 సినిమాలు... చెక్ బౌన్స్‌ కేసులో జైలుకు... రాజ్‌పాల్ యాదవ్ సెన్సేషనల్ కామెంట్స్‌

వీడియోలు

ABP Network Chief Editor Atideb Sarkar Speech | ఐడియాస్ ఆఫ్ ఇండియా 2026 ప్రారంభోపన్యాసం చేసిన అతిదేబ్ సర్కార్ | ABP Desam
ABP Network Ideas of India Summit 2026 Inaguration | ఏబీపీ నెట్ వర్క్ ఐడియాస్ ఆఫ్ ఇండియా 2026 సమ్మిట్ ప్రారంభం | ABP Desam
Kavitha about Delhi Liquor Scam Case | లిక్కర్ స్కాం కేసులో కవితకు క్లీన్ చిట్
India vs Zimbabwe Highlights T20 World Cup | జింబాబ్వేను 72 పరుగుల తేడాతో ఓడించిన టీమిండియా
Rinku Singh Father Passes Away | రింకూ సింగ్ తండ్రి కన్నుమూత

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kakinada Fireworks Explosion: వేట్లపాలెంలో ప్రమాద తీవ్రత ఎందుకు పెరిగింది ? భారీ ప్రాణ నష్టానికి కారణం ఇదే!
వేట్లపాలెంలో ప్రమాద తీవ్రత ఎందుకు పెరిగింది ? భారీ ప్రాణ నష్టానికి కారణం ఇదే!
1st March Rules Change: ట్రైన్ టికెట్ బుకింగ్ నుంచి LPG సిలిండర్ వరకు... మార్చి 1 నుంచి మారుతున్న రూల్స్
ట్రైన్ టికెట్ బుకింగ్ నుంచి LPG సిలిండర్ వరకు... మార్చి 1 నుంచి మారుతున్న రూల్స్
CM Revanth Reddy: మదీనా ప్రమాద మృతుల కుటుంబాలకు పరిహారం చెక్ లు అందించిన సీఎం రేవంత్ రెడ్డి
మదీనా ప్రమాద మృతుల కుటుంబాలకు పరిహారం చెక్ లు అందించిన సీఎం రేవంత్ రెడ్డి
శ్రీలంకపై నెగ్గినా వరల్డ్ కప్ నుంచి పాకిస్తాన్ ఔట్.. సెమీఫైనల్స్‌కు న్యూజిలాండ్
శ్రీలంకపై నెగ్గినా వరల్డ్ కప్ నుంచి పాకిస్తాన్ ఔట్.. సెమీఫైనల్స్‌కు న్యూజిలాండ్
Israel Strike On Iran: ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ రక్షణ మంత్రితో పాటు ఆర్మీ చీఫ్ మృతి.. రిపోర్ట్స్!
ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ రక్షణ మంత్రితో పాటు ఆర్మీ చీఫ్ మృతి.. రిపోర్ట్స్!
PM Modi On Kakinada Incident: సామర్లకోట ప్రమాదంపై రాష్ట్రపతి, ప్రధాని దిగ్భ్రాంతి.. కేంద్రం పరిహారం ప్రకటన
సామర్లకోట బాణసంచా ప్రమాదంపై రాష్ట్రపతి, ప్రధాని దిగ్భ్రాంతి.. కేంద్రం పరిహారం ప్రకటన
Kokapet Swarupananda Lands: కోకాపేటలో విశాఖ శారదా పీఠానికి కేటాయించిన రెండెకరాలు రద్దు - తెలంగాణ సర్కార్ నిర్ణయం - బీజేపీ విమర్శలు
కోకాపేటలో విశాఖ శారదా పీఠానికి కేటాయించిన రెండెకరాలు రద్దు - తెలంగాణ సర్కార్ నిర్ణయం - బీజేపీ విమర్శలు
Nara Lokesh : సంజయ్ దత్‌తో నారా లోకేశ్ మీటింగ్ - మంత్రి విజన్‌కు బాలీవుడ్ లెజెండ్ ఫిదా
సంజయ్ దత్‌తో నారా లోకేశ్ మీటింగ్ - మంత్రి విజన్‌కు బాలీవుడ్ లెజెండ్ ఫిదా
Embed widget