అన్వేషించండి

Drugs in Hyderabad Pub: పబ్‌లో డ్రగ్స్ - ఇప్పుడే సినిమాల్లో ఎదుగుతున్నాం, బద్నాం చేయవద్దు: జూనియర్ ఆర్టిస్ట్ ఆవేదన

Drugs in Pub in Hyderabad: అక్కడ డ్రగ్స్ వినియోగిస్తున్నారని తమకు తెలియదని, తెలిస్తే మేం ఎందుకు వెళ్తామని జూనియర్ ఆర్టిస్ట్ కల్లపు కుషితా ప్రశ్నించారు. బ్లడ్ శాంపిల్స్ ఇవ్వడానికి రెడీ అన్నారు.

Drugs Raid in Hyderabad: హైదరాబాద్ నడిబొడ్డున్న ఉన్న పబ్‌లో డ్రగ్స్ దందాను టాస్క్ ఫోర్స్ పోలీసులు గుర్తించారు. ఆదివారం వేకువజామున ఆకస్మిక దాడులు చేసి బంజారాహిల్స్‌లోని రాడిసన్‌ బ్లూప్లాజా హోటల్లోని పుడింగ్‌ అండ్‌ మింక్‌ పబ్‌లో పార్టీలో పాల్గొన్న దాదాపు 150 మందిని అదుపులోకి తీసుకుని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. విచారణ చేపట్టిన అనంతరం వివరాలు సేకరించి 100 మందిని వారి ఇళ్లకు పంపించివేయగా.. కొందరు పీఎస్‌లో ఉండిపోయారు. పార్టీలో పాల్గొన్న వారి వివరాలతో ఓ జాబితా వైరల్ అవుతోంది. అయితే అక్కడ డ్రగ్స్ వినియోగిస్తున్నారని తమకు తెలియదని, తెలిస్తే మేం ఎందుకు వెళ్తామని కొందరు బాధితులు ప్రశ్నిస్తున్నారు. తన ఫొటో, పేరును ప్రచారం చేశారంటూ నటి హేమ సైతం ఆగ్రహం వ్యక్తం చేశారు.

దుష్ప్రచారం చేయవద్దు, మీకు కుటుంబాలున్నాయి.. 
పబ్‌లో ఉన్నవారు అందరూ డ్రగ్స్ తీసుకుంటున్నారని ప్రచారం కావడంతో జూనియర్ ఆర్టిస్ట్ (షార్ట్ ఫిలిం నటి) కల్లపు కుషితా (Junior Artist Kallapu Kushita) ఆవేదన వ్యక్తం చేశారు. తమలాగే ఈ వివరాలపై దుష్ప్రచారం చేస్తున్న వారికి సైతం కుటుంబాలు ఉన్నాయని, గుర్తుంచుకోవాలని ఇది నిజమని కుటుంబసభ్యులు భావిస్తే పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. ఈ మేరకు ఆమె వీడియోలో మాట్లాడుతూ.. లేట్ నైట్ పబ్‌లో ఉండటం తమ తప్పు కాదన్నారు. అక్కడ డ్రగ్స్ వినియోగిస్తున్నారు అని మాకు తెలియదు.. తెలిస్తే మేము ఎందుకు వెళ్తామని ప్రశ్నించారు. అయితే పబ్‌లో మాత్రం రష్ చాలా ఎక్కువగా ఉందని చెప్పారు

అంతలోనే పోలీసుల ఎంట్రీ..
ఫ్రెండ్స్‌తో కలిసి పార్టీకి వెళ్లాను. మరికాసేపట్లో పార్టీ ముగుస్తుంది. ఇంటికి వెళ్దామనుకున్నాం. కానీ అంతలోనే పోలీసులు ఎంట్రీ ఇచ్చి పబ్‌లో ఉన్న అందర్నీ పోలీస్ స్టేషన్ తీసుకెళ్లడం సరికాదన్నారు. పబ్‌ నుంచి తీసుకెళ్లాక పోలీసులు తమ వివరాలు సేకరించారని, తాము పోలీసులకు సహకరించామని జూనియర్ ఆర్టిస్ట్ కల్లపు కుషితా ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు సినిమా రంగంలో ఎదుగుతున్నామని, మమల్ని ఇలా బద్నా చేయడం సరికాదని షార్ట్ ఫిలిం నటి కల్లపు కుషితా (Junior Artist Kallapu Kushita In Drugs Raid in Hyderabad) ఆవేదన వ్యక్తం చేశారు. 

బ్లడ్ శాంపుల్స్ తీసుకోండి, దేనికైనా రెడీ..
150 మంది వరకు పబ్ లో ఉన్నారు. కానీ అందులో కొందరు మాత్రమే డ్రగ్స్ తీసుకుంటే ఇలా అందరిపై ద్రుష్పచారం చేయడం సరి కాదు. కావాల్సి వస్తే మా రక్త నమూనాలు (Blood Samples) తీసుకోండి. మేం డ్రగ్స్ తీసుకోలేదు. కనుక మేము బ్లడ్ శాంపిల్స్ ఇవ్వడానికి ఎప్పుడైనా సిద్ధమే అని నటి కల్లపు కుషితా స్పష్టం చేశారు. మీడియా వాళ్లు కొంచం సమన్వయం పాటించాలి. అందరి రక్త నమూనాలు తీసుకొని ఏవరైతే డ్రగ్స్ తీసుకున్నారు వారి పై చట్టరీత్య చర్యలు తీసుకోవాలని కోరారు. కానీ పబ్ కి వచ్చిన వాళ్ళని అందరిని బద్నామ్ చేయడం సరికాదు. 

అక్కడ పబ్ అర్ధరాత్రి వరకు నడిపించే వారిపై పోలీసులు చర్యలు తీసుకోవాలని నటి అన్నారు. మేం జస్ట్ after పార్టీ కి వెళ్ళాం. తిరిగి వెళ్లిపోదాం అనుకుంటున్న సమయంలో పోలీసులు వచ్చి అందర్నీ పీఎస్‌కు తరలించారని ఆమె తెలిపారు. కానీ పబ్‌లో ఉన్న వాళ్లంతా డ్రగ్స్ తీసుకున్నట్లుగా ఫొటోలతో ప్రచారం చేయకూడదని రిక్వెస్ట్ చేశారు. బ్లడ్ శాంపిల్స్ సేకరించి డ్రగ్స్ తీసుకున్న వారిని గుర్తించి చర్యలు తీసుకోవాలని కోరారు. తనలాంటి అమాయకులపై ఇలాంటి దృష్ప్రచారం వల్ల మా కుటుంబసభ్యులు మానసికంగా ఇబ్బంది పడుతున్నారని వీడియోలో తెలిపారు.
Also Read: Banjarahills Drugs Case : ఓటీపీ ఉంటేనే పబ్ లోకి ఎంట్రీ, ఆ జాబితా చెప్పడం కరెక్ట్ కాదు : డీసీపీ జోయల్ డేవిస్ 

Also Read: Banjara Hills Drugs Case : బంజారాహిల్స్ డ్రగ్స్ కేసులో నలుగురి అరెస్టు, వెలుగులోకి సంచలన విషయాలు!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Jagan On Balakrishna: షర్మిలపై బాలకృష్ణ తప్పుడు ప్రచారం చేయించారు - జగన్ సంచలన ఆరోపణలు
షర్మిలపై బాలకృష్ణ తప్పుడు ప్రచారం చేయించారు - జగన్ సంచలన ఆరోపణలు
Telangana News: రాజన్న సిరిసిల్లలో పలు అభివృద్ధి పనులకు రేవంత్ రెడ్డి శ్రీకారం, వేటికి ఎంత ఖర్చు చేస్తున్నారంటే!
రాజన్న సిరిసిల్లలో పలు అభివృద్ధి పనులకు రేవంత్ రెడ్డి శ్రీకారం, వేటికి ఎంత ఖర్చు చేస్తున్నారంటే!
Pawan Kalyan In Assembly: ఐదేళ్లే కాదు మరో పదేళ్లు చంద్రబాబు సీఎం - అసెంబ్లీలో పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు
ఐదేళ్లే కాదు మరో పదేళ్లు చంద్రబాబు సీఎం - అసెంబ్లీలో పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు
Tirumala News: సీనియర్ సిటిజన్లకు టీటీడీ గుడ్ న్యూస్ - ఇలా చేస్తే సకల సౌకర్యాలతో శ్రీవారి దర్శనం
సీనియర్ సిటిజన్లకు టీటీడీ గుడ్ న్యూస్ - ఇలా చేస్తే సకల సౌకర్యాలతో శ్రీవారి దర్శనం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

అరటిపండు రాకెట్ కూలిపోయింది, ట్రంప్ ముందు పరువు పోయిందిగామెగాస్టార్ కోసం..  కలిసిన మమ్ముట్టి-మోహన్ లాల్ టీమ్స్ఏఆర్ రెహమాన్ విడాకులు, 29 ఏళ్ల బంధానికి ముగింపుMarquee players list IPL 2025 Auction | ఐపీఎల్ వేలంలో ఫ్రాంచైజీల చూపు వీరి మీదే | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Jagan On Balakrishna: షర్మిలపై బాలకృష్ణ తప్పుడు ప్రచారం చేయించారు - జగన్ సంచలన ఆరోపణలు
షర్మిలపై బాలకృష్ణ తప్పుడు ప్రచారం చేయించారు - జగన్ సంచలన ఆరోపణలు
Telangana News: రాజన్న సిరిసిల్లలో పలు అభివృద్ధి పనులకు రేవంత్ రెడ్డి శ్రీకారం, వేటికి ఎంత ఖర్చు చేస్తున్నారంటే!
రాజన్న సిరిసిల్లలో పలు అభివృద్ధి పనులకు రేవంత్ రెడ్డి శ్రీకారం, వేటికి ఎంత ఖర్చు చేస్తున్నారంటే!
Pawan Kalyan In Assembly: ఐదేళ్లే కాదు మరో పదేళ్లు చంద్రబాబు సీఎం - అసెంబ్లీలో పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు
ఐదేళ్లే కాదు మరో పదేళ్లు చంద్రబాబు సీఎం - అసెంబ్లీలో పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు
Tirumala News: సీనియర్ సిటిజన్లకు టీటీడీ గుడ్ న్యూస్ - ఇలా చేస్తే సకల సౌకర్యాలతో శ్రీవారి దర్శనం
సీనియర్ సిటిజన్లకు టీటీడీ గుడ్ న్యూస్ - ఇలా చేస్తే సకల సౌకర్యాలతో శ్రీవారి దర్శనం
Ram Gopal Varma: దర్శకుడు ఆర్జీవీకి మరోసారి పోలీసుల నోటీసులు - ఈ నెల 25న విచారణకు రావాలని ఆదేశం
దర్శకుడు ఆర్జీవీకి మరోసారి పోలీసుల నోటీసులు - ఈ నెల 25న విచారణకు రావాలని ఆదేశం
Game Changer Pre Release Event: కాకినాడలో 'గేమ్‌ ఛేంజర్‌' ప్రీ రిలీజ్ ఈవెంట్‌ - ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్న రామ్‌ చరణ్‌
కాకినాడలో 'గేమ్‌ ఛేంజర్‌' ప్రీ రిలీజ్ ఈవెంట్‌ - ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్న రామ్‌ చరణ్‌
AR Rahman Saira Divorce: రెహమాన్ విడాకులపై స్పందించిన పిల్లలు... పేరెంట్స్ సపరేషన్ గురించి ఏమన్నారో తెలుసా?
రెహమాన్ విడాకులపై స్పందించిన పిల్లలు... పేరెంట్స్ సపరేషన్ గురించి ఏమన్నారో తెలుసా?
Overstay in Lavatory: టాయిలెట్‌లో ఫోన్ చూస్తూ కూర్చుంటే అక్కడ క్యాన్సర్ రావొచ్చు - సంచలన విషయాలు బయటపెట్టిన డాక్టర్లు
టాయిలెట్‌లో ఫోన్ చూస్తూ కూర్చుంటే అక్కడ క్యాన్సర్ రావొచ్చు - సంచలన విషయాలు బయటపెట్టిన డాక్టర్లు
Embed widget