అన్వేషించండి

Tirumala News: సీనియర్ సిటిజన్లకు టీటీడీ గుడ్ న్యూస్ - ఇలా చేస్తే సకల సౌకర్యాలతో శ్రీవారి దర్శనం

Andhra News: తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలనుకునే వృద్ధులకు టీటీడీ గుడ్ న్యూస్ చెప్పింది. స్వామి ఉచిత దర్శనం కోసం వారికి 2 స్లాట్లు కేటాయించారు.

TTD Special Services For Senior Citizens: 65 ఏళ్లు దాటిన వృద్ధులకు టీటీడీ (TTD) గుడ్ న్యూస్ చెప్పింది. వయసు రీత్యా శ్రీవారి దర్శనానికి వచ్చే వారికి ప్రత్యేక వెసులుబాట్లు కల్పించనుంది. సీనియర్ సిటిజన్లకు స్వామి వారి ఉచిత దర్శనం కోసం రెండు స్లాట్లు కేటాయించారు. ఉదయం 10 గంటలకు మధ్యాహ్నం 3 గంటలకు రెండు స్లాట్లు కేటాయించారు. వీరు ఫోటో ఐడీతో పాటు వయస్సును నిర్ధారించే రుజువును సమర్పించాల్సి ఉంటుంది. దీన్ని S1 కౌంటర్‌కు నివేదించాల్సి ఉంటుంది. వీరు వంతెన దిగువన ఉన్న గ్యాలరీ నుంచి ఆలయం కుడి గోడ వద్ద రహదారిని దాటాలి. ఏ మెట్లు సైతం ఎక్కాల్సిన పని లేదు. అక్కడ దర్శనం కోసం వేచి చూసే సౌకర్యాలు కల్పిస్తారు.

వృద్ధులకు అనుగుణంగా ఉత్తమ సీట్లు, వేడిగా సాంబార్ అన్నం, పెరుగన్న, వేడి పాలు ఇవన్నీ వారి సీట్ల దగ్గరికే తెచ్చి సిబ్బంది అందిస్తారు. దర్శనం అనంతరం ఆలయం నిష్క్రమణ ద్వారం వద్ద కార్ పార్కింగ్ ప్రాంతం నుంచి, కౌంటర్ వద్ద వీరిని డ్రాప్ చేయడానికి బ్యాటరీ కారు అందుబాటులో ఉంది. ఎలాంటి ఒత్తిడి, బలవంతం లేకుండా ప్రశాంతంగా స్వామి దర్శనం చేసేలా వృద్ధుల కోసం టీటీడీ చర్యలు చేపట్టింది. దర్శన క్యూ తర్వాత వీరు 30 నిమిషాల్లోపే దర్శనం నుంచి నిష్క్రమించవచ్చు. పూర్తి వివరాలకు హెల్ప్ లైన్ నెం. 08772277777ను సంప్రదించాలని అధికారులు సూచించారు.

గురువారం టికెట్లు విడుదల

మరోవైపు, తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల ఫిబ్రవరి నెల కోటాను టీటీడీ గురువారం విడుదల చేయనుంది. కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవా టికెట్లను గురువారం ఉదయం 10 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నారు. ఇక, శ్రీవారి ఆలయంలో అంగ ప్రదక్షిణ టికెట్ల కోటాను ఈ నెల 23న ఉదయం 10 గంటలకు విడుదల చేస్తారు. అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు వయో వృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులున్న వారి కోసం ప్రత్యేక దర్శన టోకెన్లు విడుదల చేయనున్నారు. అలాగే, ఈ నెల 24న ఉదయం 10 గంటలకు రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను విడుదల చేయనున్నారు.

ఇకపై వారికి నో ఎంట్రీ

అటు, తిరుమలలో అన్యమత ప్రచారంపై టీటీడీ ఫోకస్ చేసింది. ప్రసిద్ధ హిందూ ధార్మిక క్షేత్రంలో తరచూ అన్యమత ప్రచారం వివాదంగా మారుతోంది. నిబంధనల ఉల్లంఘనపై తితిదే ఆగ్రహం వ్యక్తం చేసింది. 3 రోజుల క్రితం అటవీ శాఖ పరిధిలోని పాపనాశనం వద్ద కొందరు మహిళలు క్రైస్తవ గీతాలు పాడుతూ రీల్స్ చేయడం వెలుగులోకి వచ్చింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో టీటీడీ విజిలెన్స్ విభాగం స్పందించింది. తిరుమల టూ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేయగా.. వారు రీల్స్ చేసిన మహిళల ఆచూకీ తెలుసుకునేందుకు యత్నిస్తున్నారు. విజిలెన్స్, పోలీసులు, అటవీ యంత్రాంగం సంయుక్తంగా నిర్వహించిన దాడుల్లో సమీప దుకాణాల్లో దాదాపు 25 మందికిపైనే అన్యమతస్తులు పని చేస్తున్నట్లు తేలింది. ఈ క్రమంలో ప్రతీ దుకాణాన్ని పరిశీలించి ఇతర మతాలకు చెందిన వారి ఆధారాలు కనిపెట్టేందుకు చర్యలు చేపట్టారు.

Also Read: Andhra Pradesh Volunteer System: వలంటీర్‌ వ్యవస్థ కథ ముగిసినట్టే- ఆపేసింది జగనే- సభలో మంత్రి కీలక ప్రకటన

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ప్రముఖ నేషనల్ మీడియా సంస్థ ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. పొలిటికల్, లైఫ్ స్టైల్, హెల్త్, డివోషనల్, ఎంటర్టైన్మెంట్, అగ్రికల్చర్, ఆస్ట్రాలజీ, స్పోర్ట్స్ వార్తలతో పాటు స్పెషల్ స్టోరీలు కూడా రాశారు. ప్రస్తుతం గత రెండున్నరేళ్ల నుంచి సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా వర్క్ చేస్తున్నారు.

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

YS Jagan: 'తిరుపతి లడ్డూ కల్తీ నెయ్యి కేసులో సీబీఐ క్లీన్ చిట్ ఇచ్చేసింది' జగన్ సంచలన వ్యాఖ్యలు
'తిరుపతి లడ్డూ కల్తీ నెయ్యి కేసులో సీబీఐ క్లీన్ చిట్ ఇచ్చేసింది' జగన్ సంచలన వ్యాఖ్యలు
Telangana Janasena: తెలంగాణలో పవన్ ప్రచారంపై కాంగ్రెస్ నిప్పులు- జాతీయ సమగ్రత కోసం బరిలోకి దిగుతామన్న జనసేన
తెలంగాణలో పవన్ ప్రచారంపై కాంగ్రెస్ నిప్పులు- జాతీయ సమగ్రత కోసం బరిలోకి దిగుతామన్న జనసేన
Andhra Manamitra: ఏపీలో మనమిత్ర విప్లవం - ఏడాదిలోనే అరకోటి మందికి చేరువైన డిజిటల్ పాలన!
ఏపీలో మనమిత్ర విప్లవం - ఏడాదిలోనే అరకోటి మందికి చేరువైన డిజిటల్ పాలన!
Ghaziabad Suicide Case:
"కొరియన్ లవర్‌" గేమ్‌కు బానిసలై ముగ్గురు బాలికల ఆత్మహత్య! మరో బ్లూవేల్‌లా మారుతుందని ఆందోళన!

వీడియోలు

CM Mamata Banerjee SIR Supreme Court | SIR పై పోరాడేందుకు సుప్రీంలో గళం విప్పిన మమత | ABP Desam
RCB vs Delhi Capitals WPL 2026 Final | ఫైనల్ కు చేరిన ఢిల్లీ
Anil Kumble about Gambhir Coaching | గంభీర్ టీమ్ పై కుంబ్లే వ్యాఖ్యలు
Chennai Super Kings in WPL | WPLలో సీఎస్కే ఎంట్రీ
T20 World Cup 2026 Ind vs Pak | ఐసీసీలో ఒంటరిగా మిగిలిన పాక్‌

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YS Jagan: 'తిరుపతి లడ్డూ కల్తీ నెయ్యి కేసులో సీబీఐ క్లీన్ చిట్ ఇచ్చేసింది' జగన్ సంచలన వ్యాఖ్యలు
'తిరుపతి లడ్డూ కల్తీ నెయ్యి కేసులో సీబీఐ క్లీన్ చిట్ ఇచ్చేసింది' జగన్ సంచలన వ్యాఖ్యలు
Telangana Janasena: తెలంగాణలో పవన్ ప్రచారంపై కాంగ్రెస్ నిప్పులు- జాతీయ సమగ్రత కోసం బరిలోకి దిగుతామన్న జనసేన
తెలంగాణలో పవన్ ప్రచారంపై కాంగ్రెస్ నిప్పులు- జాతీయ సమగ్రత కోసం బరిలోకి దిగుతామన్న జనసేన
Andhra Manamitra: ఏపీలో మనమిత్ర విప్లవం - ఏడాదిలోనే అరకోటి మందికి చేరువైన డిజిటల్ పాలన!
ఏపీలో మనమిత్ర విప్లవం - ఏడాదిలోనే అరకోటి మందికి చేరువైన డిజిటల్ పాలన!
Ghaziabad Suicide Case:
"కొరియన్ లవర్‌" గేమ్‌కు బానిసలై ముగ్గురు బాలికల ఆత్మహత్య! మరో బ్లూవేల్‌లా మారుతుందని ఆందోళన!
AP High Court: తెనాలిలో నిందితులను రోడ్లపై నడిపించటంపై హైకోర్టు ఆగ్రహం.. విచారణ 4 వారాలకు వాయిదా
తెనాలిలో నిందితులను రోడ్లపై నడిపించటంపై హైకోర్టు ఆగ్రహం.. విచారణ 4 వారాలకు వాయిదా
Maremma Teaser : హీరోగా రవితేజ సోదరుడి తనయుడు - ఆ ఊరికి అమ్మోరి శాపమా!... 'మారెమ్మ' టీజర్ చూశారా?
హీరోగా రవితేజ సోదరుడి తనయుడు - ఆ ఊరికి అమ్మోరి శాపమా!... 'మారెమ్మ' టీజర్ చూశారా?
Telangana Municipal Elections: మున్సిపల్ ప్రచారానికి కాంగ్రెస్, బీజేపీ తరపున అగ్రనేతలు - బీఆర్ఎస్ లైట్-ఎందుకలా?
మున్సిపల్ ప్రచారానికి కాంగ్రెస్, బీజేపీ తరపున అగ్రనేతలు - బీఆర్ఎస్ లైట్-ఎందుకలా?
Gaddafi Murder: లిబియాలో గడాఫీ కొడుకు దారుణ హత్య - అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తున్నాడని కాల్చి చంపిన దుండగులు
లిబియాలో గడాఫీ కొడుకు దారుణ హత్య - అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తున్నాడని కాల్చి చంపిన దుండగులు
Embed widget