అన్వేషించండి

Sanjay Leela Bhansali: పాకిస్తాన్ నుంచి ఎంతో ప్రేమను పొందుతున్నా- మనమంతా ఒక్కటేనని భావిస్తున్నా, బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సంచలన వ్యాఖ్యలు

పాకిస్తానీలు, భారతీయులు ఒక్కటేనని ఇప్పటికీ భావిస్తున్నానని స్టార్ ఫిల్మ్ మేకర్ సంజయ్ లీలా భన్సాలీ అభిప్రాయపడ్డారు. ‘హీరామండి’ రిలీజ్ తర్వాత పాక్ నుంచి ఎంతో ప్రేమను పొందుతున్నానని వెల్లడించారు.

Sanjay Leela Bhansali About Pak Audience Support: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న టాప్ ఫిల్మ్ మేకర్ సంజయ్ లీలా భన్సాలీ. ఊహకు అందని సరికొత్త కథాంశాలతో సినిమాలు తెరకెక్కించడంలో తనకు తానే సాటి. ఆయన దర్శకత్వం వహించి సినిమాలన్నీ బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురిపించాయి. ఈ దిగ్గజ దర్శకుడు తెరకెక్కించిన తాజా వెబ్ సిరీస్ ‘హీరామండి: ది డైమండ్ బజార్’. ఈ వెబ్ సిరీస్ తో ఆయన ఓటీటీలోకి అడుగు పెట్టారు. ఆరుగురు స్టార్ హీరోయిన్లతో ఈ వెబ్ సిరీస్ ను రూపొందించారు. మనీషా కొయిరాలా, సోనాక్షి సిన్హా, అదితి రావ్ హైదరీ, సంజీదా షేక్, రిచా చద్దా, షర్మిన్ సెగల్, ఫర్దీన్ ఖాన్, శేఖర్ సుమన్, అధ్యాయన్ సుమన్ సహా పలువురు కీలక పాత్రలు పోషించారు. స్వాతంత్ర్య పోరాట సమయంలో పాక్తిస్తాన్ లో జరిగిన వాస్తవ ఘటనలను బేస్ చేసుకుని ఆయన ఈ వెబ్ సిరీస్ ను రూపొందించారు. పాక్ రెడ్ లైట్ ఏరియాలోని మహిళలు స్వాతంత్ర్య సంగ్రామంలో ఎలా భాగం అయ్యారనేది ఇందులో చూపించారు. ఇప్పటికే నెట్ ఫ్లిక్స్ లో ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ అవుతోంది.   

పాకిస్తాన్ పై భన్సాలీ సంచలన వ్యాఖ్యలు

 తాజాగా ఈ వెబ్ సిరీస్ ప్రమోషన్ లో భాగంగా భన్సాలీ ఇచ్చిన ఇంటర్వ్యూలో పాకిస్తాన్ గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. తాను తెరకెక్కించిన ‘హీరామండి: ది డైమండ్ బజార్’ కథ పాక్ లోని పంజాబ్ బేస్ గా కొనసాగుతుందన్నారు. ఈ సిరీస్ చూసిన తర్వాత పాకిస్తాన్ నుంచి తనకు ఎంతో ప్రేమ లభిస్తుందని వెల్లడించారు. అక్కడి ప్రజలు ఈ వెబ్ సిరీస్ చూసేందుకు ఎంతో ఇష్టపడుతున్నారని చెప్పారు. "పాకిస్తాన్ నుంచి చాలా అభినందనలు వస్తున్నాయి. అక్కడి వాళ్లు ఎంతో ప్రేమను కనబరుస్తున్నారు. ఈ వెబ్ సిరీస్ చూసి సంతోషం వ్యక్తం చేస్తున్నారు. నిజానికి ఈ వెబ్ సిరీస్ పాక్ లోని పంజాబ్ కేంద్రంగా కొనసాగుతుంది. పాకిస్తానీయులు, భారతీయులు అంతా ఒక్కటేనని నేను ఇప్పటికీ భావిస్తున్నాను. నా వెబ్ సిరీస్ పై రెండు దేశాల ప్రేక్షకులు మంచి ఆదరణ కనబరుస్తున్నారు. మనందరం చాలా విషయాల్లో కనెక్ట్ అయ్యాం. కొంత మందిని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఇరు దేశాల ప్రజల మధ్య ప్రేమ ఉన్నది అనేది వాస్తవం” అని చెప్పుకొచ్చారు.

అలాంటి విమర్శలను అస్సలు పట్టించుకోను!

కొంత మంది ‘హీరామండి: ది డైమండ్ బజార్’ సిరీస్ మీద విమర్శలు చేయడంపైన ఆయన స్పందించారు. ‘‘నా చిత్రాల్లో  వ్యక్తులకు కనెక్ట్ అయ్యే పాత్రల్లో పాత్రలు ఉంటాయి. కొంత మందికి నచ్చుతాయి. మరికొంత మందికి నచ్చవు. అది వారి వ్యక్తిగత విషయం. నా పనితనం నచ్చిన వాళ్లు మెచ్చుకుంటారు. నచ్చని వాళ్లు విమర్శిస్తారు. ఆ విమర్శలను నేను పెద్దగా పట్టించుకోను” అని భన్సాలీ అభిప్రాయపడ్డారు.

Read Also: ‘పుష్ప.. పుష్ప’ సాంగ్ - బన్నీచేతిలోని గ్లాస్ నుంచి టీ ఎందుకు ఒలకలేదో తెలుసా? కారణం ఇదే!

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Kiran Abbavaram : మెగా ఫోన్ పట్టనున్న కిరణ్ అబ్బవరం? - డైరెక్టర్ డెబ్యూ మూవీలో హీరో ఎవరో తెలుసా!
మెగా ఫోన్ పట్టనున్న కిరణ్ అబ్బవరం? - డైరెక్టర్ డెబ్యూ మూవీలో హీరో ఎవరో తెలుసా!
Yogi Babu : ఒకే సినిమాలో 16 రోల్స్ - కమల్ హాసన్ దశావతారాలను మించి...
ఒకే సినిమాలో 16 రోల్స్ - కమల్ హాసన్ దశావతారాలను మించి...
Oscars 2026 : ఆస్కార్ అవార్డ్స్‌లో ఆ మూవీకి సిక్సర్ - బెస్ట్ విన్నింగ్ మూవీస్ ఏ ఓటీటీలో చూడొచ్చంటే?
ఆస్కార్ అవార్డ్స్‌లో ఆ మూవీకి సిక్సర్ - బెస్ట్ విన్నింగ్ మూవీస్ ఏ ఓటీటీలో చూడొచ్చంటే?
Oscar 2026 : ఆస్కార్ వేడుకల్లో అరుదైన ఇన్సిడెంట్ - 14 ఏళ్ల తర్వాత టై... ఆ కేటగిరీలో ఇద్దరికి అవార్డ్
ఆస్కార్ వేడుకల్లో అరుదైన ఇన్సిడెంట్ - 14 ఏళ్ల తర్వాత టై... ఆ కేటగిరీలో ఇద్దరికి అవార్డ్

వీడియోలు

Salman Ali Agha Controversial Run-Out | బంగ్లాదేశ్ ప్లేయర్ తీరుపై సల్మాన్ అఘా ఫైర్
Irfan Pathan Statement about MS Dhoni | ధోనీకి ఇదే చివరి ఐపీఎల్?
ICC Punishes Salman Ali Agha | సల్మాన్ అలీ అఘాపై ఐసీసీ వేటు
BCCI Cricketer of the Year 2026 | శుభ్‌మన్ గిల్‌కు 'పాలీ ఉమ్రిగర్' అవార్డు
Moinabad Farm House Drug Party | పైలెట్ రోహిత్ రెడ్డి ఫామ్‌హౌస్‌లో డ్రగ్స్ పార్టీ భగ్నం

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Dubai Airport Drone Attack: ఇరాన్ డ్రోన్ దాడితో దుబాయ్ ఎయిర్‌పోర్టు మూసివేత.. విమానాల రాకపోకలు నిలిపివేసిన అధికారులు
ఇరాన్ డ్రోన్ దాడితో దుబాయ్ ఎయిర్‌పోర్టు మూసివేత.. విమానాల రాకపోకలు నిలిపివేసిన అధికారులు
Hyderabad Crime News: చాక్లెట్ ఆశ చూపి ఆరేళ్ల బాలికపై హత్యాచారం, నార్సింగిలో దారుణం.. నిందితుడు అరెస్ట్
చాక్లెట్ ఆశ చూపి ఆరేళ్ల బాలికపై హత్యాచారం, నార్సింగిలో దారుణం.. నిందితుడు అరెస్ట్
AP Cabinet Reshuffle: ఏపీ కేబినెట్ విస్తరణ - వాస్తవమా? కూటమి పార్టీల్లో ఆశావహుల రాజకీయమా?
ఏపీ కేబినెట్ విస్తరణ - వాస్తవమా? కూటమి పార్టీల్లో ఆశావహుల రాజకీయమా?
Oscar 2026 : ఆస్కార్ వేడుకల్లో అరుదైన ఇన్సిడెంట్ - 14 ఏళ్ల తర్వాత టై... ఆ కేటగిరీలో ఇద్దరికి అవార్డ్
ఆస్కార్ వేడుకల్లో అరుదైన ఇన్సిడెంట్ - 14 ఏళ్ల తర్వాత టై... ఆ కేటగిరీలో ఇద్దరికి అవార్డ్
Rythu Bharosa Funds: తెలంగాణ రైతులకు శుభ‌వార్త.. రైతుభ‌రోసా నిధులు జమ అయ్యేది ఎప్పుడంటే..
తెలంగాణ రైతులకు శుభ‌వార్త.. రైతుభ‌రోసా నిధులు జమ అయ్యేది ఎప్పుడంటే..
Potti Sriramulu Statue: నేడే 58 అడుగుల పొట్టి శ్రీరాముల విగ్రహం ఆవిష్కరణ.. అమరావతిలో అమరజీవి స్మారకం
నేడే 58 అడుగుల పొట్టి శ్రీరాముల విగ్రహం ఆవిష్కరణ.. అమరావతిలో అమరజీవి స్మారకం
CM Chandrababu: డ్రగ్స్ కేసులో టీడీపీ ఎంపీ పుట్టా మహేష్‌.. తప్పు చేస్తే ఉపేక్షించేది లేదన్న సీఎం చంద్రబాబు
డ్రగ్స్ కేసులో టీడీపీ ఎంపీ పుట్టా మహేష్‌.. తప్పు చేస్తే ఉపేక్షించేది లేదన్న సీఎం చంద్రబాబు
Loose Motions : వాతావరణం మారగానే విరేచనాలు అవుతున్నాయా? అయితే ఈ జాగ్రత్తలతో పాటు ఈ ఫుడ్స్ తీసుకోండి
వాతావరణం మారగానే విరేచనాలు అవుతున్నాయా? అయితే ఈ జాగ్రత్తలతో పాటు ఈ ఫుడ్స్ తీసుకోండి
Embed widget