By: ABP Desam | Updated at : 19 Jul 2023 01:14 PM (IST)
Photo Credit: Sai Dharam Tej/Instagram
హైదరాబాద్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి కోమాలోకి వెళ్లిన సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్, కొద్ది నెలల చికిత్స తర్వాత కోలుకున్నారు. యాక్సిడెంట్ అనంతరం ‘విరూపాక్ష’ సినిమాలో నటించారు. సంయుక్త మీనన్ హీరోయిన్ గా కార్తీక్ దండు దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ మిస్టికల్ థ్రిల్లర్, బాక్సాపీస్ దగ్గర సంచలన విజయాన్ని అందుకుంది. ప్రస్తుతం సాయి ధరమ్ తేజ్ మేనమామ పవన్ కల్యాణ్ తో కలిసి ‘బ్రో’ అనే సినిమా చేస్తున్నారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ చిత్రానికి స్క్రీన్ ప్లే, మాటలు రాశారు. సముద్రఖని కథ అందించడంతో పాటు దర్శకత్వం వహించారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, జీ స్టూడియోస్ సంస్థలు సంయుక్తంగా ఈ సినిమా నిర్మించాయి. ఈ సినిమా జూలై 28న ప్రేక్షకుల ముందుకు వస్తోంది.
యాక్సిడెంట్ తర్వాత సాయి ధరమ్ తేజ్ సినిమాలు చేస్తున్నా, ఆయనకు పూర్తి స్థాయిలో ఆరోగ్యం సహకరించడం లేదు. సరిగా డ్యాన్స్ వేయలేకపోతున్నారు. మాటలు కూడా సరిగా మాట్లాడలేకపోతున్నారు. యాక్సిడెంట్ తర్వాత ఆయనకు పలు రకాల ఆరోగ్య సమస్యలు తలెత్తాయి. యాక్సిడెంట్ తర్వాత కోమాలోకి వెళ్లడంతో దాని నుంచి బయటపడేందుకు డాక్టర్లు పవర్ ఫుల్ స్టెరాయిడ్స్ ఇచ్చినట్లు సాయి ధరమ్ తేజ్ తెలిపారు. ఆ తర్వాత స్టెరాయిడ్స్ ఇవ్వడం మానేయడంతో బరువు పెరిగినట్లు చెప్పారు. పూర్తి స్థాయిలో ఫిట్ నెస్ కోల్పోయినట్లు తెలిపారు. ఈ నేపథ్యంలోనే యాక్సిడెంట్ కు సంబంధించి సర్జరీ చేయించుకోబోతున్నట్లు తెలిసింది. ఈ సర్జరీ నుంచి కోలుకునేందుకు 6 నెలల సమయం పట్టే అవకాశం ఉందని తెలిసింది.
6 నెలల విరామం అనంతరం సంపత్ నందితో సినిమా చేయనున్నట్లు సాయి ధరమ్ తేజ్ తెలిపారు. ఈ సినిమా వరకు నూటికి నూరు శాతం ఫిట్ నెస్ సాధిస్తానని ఆయన వెల్లడించారు. ఆ సినిమాలో కొత్త సాయి ధరమ్ తేజ్ ను చూసే అవకాశం ఉన్నట్లు తెలిపారు.
సెప్టెంబర్ 2021లో జూబ్లీ హిల్స్ రోడ్డు నెంబరు 45 కేబుల్ బ్రిడ్జ్ మార్గంలో స్పోర్ట్స్ బైక్పై వెళ్తుండగా సాయి ధరమ్ తేజ్ బైక్ ప్రమాదానికి గురైంది. రోడ్డు మీద ఇసుక ఉండటంతో జారి పడిపోయి తీవ్ర గాయాలపాలయ్యారు. ఏకంగా కోమాలోకి వెళ్లిపోయారు. అపోలో హాస్పిటల్ లో కొంత కాలం చికిత్స తీసుకున్నాడు. హాస్పిటల్ నుంచి ఇంటికి వెళ్లిన తర్వాత కూడా ఆయనకు మాటలు సరిగా రాలేదు. కొద్ది రోజుల తర్వాత నెమ్మదిగా కోలుకున్నారు. ఆ రోజు హెల్మెట్ లేకపోతే తాను చనిపోయే వాడినని సాయి ధరమ్ తేజ్ చెప్పారు. అందుకే, బైక్ మీద వెళ్లే వాళ్లు కచ్చితంగా హెల్మెట్ వాడాలని చెప్పారు.
Read Also: సమంత, రష్మిక అవుట్ - టాలీవుడ్ టాప్ ప్లేస్ కోసం ఆ యంగ్ బ్యూటీస్ పోటీ!
Join Us on Telegram: https://t.me/abpdesamofficial
చివరి నిమిషంలో క్యాన్సిల్ అయిన 'గేమ్ ఛేంజర్' షూటింగ్ - ఎందుకో తెలుసా..?
‘సలార్’ రిలీజ్ డేట్ రూమర్స్, షారుక్, సల్మాన్లపై రామ్ కామెంట్స్ - నేటి టాప్ సినీ విశేషాలివే!
మళ్ళీ ప్రభాస్ తో కలిసి నటిస్తారా? - డార్లింగ్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన కంగనా రనౌత్!
మరో బాలీవుడ్ ఆఫర్ అందుకున్న పూజా హెగ్డే - మొదటిసారి ఆ స్టార్ హీరోతో రొమాన్స్?
షారుక్, సల్మాన్ లపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన రామ్ పోతినేని!
YCP Counter To Purandeswari: ఈ తెలివితోనే మీరు కేంద్రమంత్రిగా పనిచేశారా? - పురందేశ్వరిపై వైసీపీ సెటైర్లు
TTDP Protest in Hyderabad: చంద్రబాబుకు మద్దతుగా హైదరాబాద్లో టీడీపీ ఆందోళనలు- నేతల అరెస్ట్
IND vs AUS, 2nd ODI: సాహో శ్రేయస్.. జయహో శుభ్మన్! ఆసీస్పై కుర్రాళ్ల సెంచరీ కేక
Motkupalli Narasimhulu: జగన్ ప్రభుత్వంతో ఏపీలో దుర్మార్గాలు, జనం నవ్వుకుంటున్నారు - దీక్షలో మోత్కుపల్లి కీలక వ్యాఖ్యలు
/body>