Ramayana Story Plot : రావణుడు వర్సెస్ కుబేరుడు - 'రామాయణ' ఫస్ట్ పార్ట్ స్టోరీ ప్లాట్ రివీల్... రావణుడి పాత్రే ఎందుకంటే?
Ramayana Story : నితీశ్ తివారీ రామాయణ ఫస్ట్ పార్ట్ స్టోరీ ప్లాట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రాముడు, రావణుడు కలిసి కనిపించరని ఇది వరకే క్లారిటీ వచ్చేసింది.

Yash About Ravana Role In Ramayana : బాలీవుడ్ స్టార్ రణబీర్ కపూర్, సాయి పల్లవి సీతారాములుగా నటిస్తోన్న విజువల్ వండర్ రామాయణ. బాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకూ యావత్ సినీ ప్రపంచం ఈ మూవీ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఈ మూవీలో రావణుడి పాత్రలో రాకింగ్ స్టార్ యశ్ నటిస్తుండగా... ఫస్ట్ పార్ట్లో రాముడు, రావణుడు కనిపించరంటూ ఇదివరకే క్లారిటీ ఇచ్చేశారు యశ్. ఈ క్రమంలో ఫస్ట్ పార్ట్ స్టోరీ ప్లాట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఫస్ట్ పార్ట్... ఫస్ట్ సీన్ అదే...
రామాయణ అంటే రాముని వనవాసం, సీతాపహరణం, లంకా దహనం మనకు గుర్తొస్తాయి. కానీ నితీశ్ తివారీ దర్శకత్వం వహించిన ఈ మైథలాజికల్ ఎపిక్లో... ఎవరూ ఊహించని విధంగా కైలాస పర్వతం సమీపంలో రావణుడు, కుబేరుడు మధ్య జరిగే సన్నివేశంతో ప్రారంభం అవుతుందని తెలుస్తోంది. దీంతో భారీ హైప్ క్రియేట్ అవుతోంది.
లేటెస్ట్ బజ్ ప్రకారం... రాముడు, రావణుడి రాజ్యాల పరిచయం, రాముని బాల్యం, విశ్వామిత్రుని వెంట రామ లక్ష్మణులు వెళ్లడం, శివధనుర్భంగం, సీతారాముల కల్యాణం వంటి ఘట్టాల ఆధారంగా ఫస్ట్ పార్ట్ చూపించనున్నట్లు టాక్ వినిపిస్తోంది.
Also Read : కొత్త డైరెక్టర్స్తో యంగ్ హీరో నితిన్ - హీరోయిన్గా మిరాయ్ బ్యూటీ!... గోల్డెన్ లెగ్తో ఫేట్ మారేనా...
రావణుడి పాత్రే ఎందుకు?
ఈ మూవీలో రావణుడి పాత్రలో నటించడమే కాకుండా యశ్ సహ నిర్మాతగానూ వ్యవహరిస్తున్నారు. తాజా ఇంటర్వ్యూలో అసలు రావణుడి పాత్రే ఎందుకు అనే దానిపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఇలాంటి భారీ ప్రాజెక్టులో ప్రతీ నటుడు నటించాల్సిన ఆవశ్యకత ఉందని... అలాగే తన వంతుగా మూవీలో భాగమైనట్లు చెప్పారు. 'ఈ తరహా నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలు డార్క్ రోల్స్, ఎక్కువ సంక్లిష్టతతో కూడిన పాత్రలు పర్సనల్గా ఇష్టం. అందుకే రావణ పాత్రలో చేస్తున్నా.' అని చెప్పారు.
ఇక, VFXపై వస్తున్న ట్రోలింగ్స్, విమర్శలపై రీసెంట్గా లాస్ ఏంజెల్స్లో జరిగిన సినిమా కాన్ ఈవెంట్లో యశ్ రియాక్ట్ అయ్యారు. ఈ మూవీ గ్రాఫిక్స్ పనులు ఇంకా ప్రొగ్రెస్లోనే ఉన్నాయని... DNEG కంపెనీ విజువల్స్, VFXపై వర్క్ చేస్తుందని చెప్పారు. అత్యున్నత ప్రమాణాలతో అంతర్జాతీయ టెక్నాలజీతో దీన్ని రూపొందిస్తున్నామని... ఫైనల్ అవుట్ పుట్ అద్భుతంగా ఉంటుందన్నారు.
ఈ మూవీలో లక్ష్మణుడిగా రవి దూబే, హనుమంతుడిగా సన్నీ డియోల్, మండోదరిగా కాజల్ అగర్వాల్, కౌశల్యగా ఇందిరా కృష్ణన్, శూర్ఫణఖగా రకుల్ ప్రీత్ సింగ్, మండోదరిగా షీబా చద్దా రాణి తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. దాదాపు రూ.4 వేల కోట్ల బడ్జెట్తో రెండు పార్టుల నమిత్ మల్హోత్రా నిర్మిస్తున్నారు. ఫస్ట్ పార్ట్ ఈ దీపావళికి రిలీజ్ కానుండగా... వచ్చే ఏడాది దీపావళికి రెండో పార్ట్ రిలీజ్ కానుంది. ఇప్పటికే రిలీజ్ చేసిన శ్రీరాముని లుక్ వేరే లెవల్లో ఉంది. రెండో పార్టులో కీలకమైన రామ రావణ యుద్ధ సన్నివేశాలు ఉండనున్నట్లు తెలుస్తోంది.
ట్రెండింగ్ వార్తలు






















