అన్వేషించండి

Ram Charan: ఢిల్లీలో రామ్ చరణ్‌కు ఘన స్వాగతం, నేడు ప్రధాని మోడీతో భేటీ

ఆస్కార్ వేడుకల తర్వాత రామ్ చరణ్ ఢిల్లీ చేరుకున్నారు. ఢిల్లీ విమానాశ్రయం వద్ద రామ్ చరణ్ రాక కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు అభిమానులు. రామ్ చరణ్ రాకతో ఢిల్లీ ఎయిర్ పోర్ట్ వద్ద సందడి వాతావరణం నెలకొంది.

‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో గ్లోబల్ స్టార్ గా గుర్తింపు తెచ్చకున్నారు రామ్ చరణ్. ‘ఆస్కార్’ వేడుకల్లో తన స్టైల్ అండ్ స్వాగ్ తో ఇంటర్నేషనల్ మీడియాను సైతం ఆకట్టుకున్నారు. ఆస్కార్ వేడుకలకు ముందే అమెరికా వెళ్లిన చరణ్ అక్కడ వరుసగా కార్యక్రమాల్లో పాల్గొనడమే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో అవార్డులను కూడా అందుకున్నారు. ఇక ఆస్కార్ వేడుకల్లో సతీమణి ఉపాసనతో కలసి పాల్గొని ప్రత్యేక ఆకర్షణ గా నిలిచారు. 95వ ఆస్కార్ అవార్డుల కార్యక్రమంలో ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలోని ‘నాటు నాటు’ పాటకు అవార్డు వచ్చిన విషయం తెలిసిందే. ఈ వేడుక తర్వాత మూవీ టీమ్ అంతా హైదరాబాద్ కు తిరిగి వచ్చేశారు. అయితే రామ్ చరణ్ మాత్రం ఢిల్లీలో లాండ్ అయ్యారు. ఢిల్లీ విమానాశ్రయం వద్ద రామ్ చరణ్ రాక కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు అభిమానులు. వేలాదిగా మెగా అభిమానులు అక్కడికి తరలి వచ్చారు. ఆర్ఆర్ఆర్ బ్యానర్లు, చరణ్ ఫ్లెక్సీలు పట్టుకొని రామ్ చరణ్ కు ఘన స్వాగతం పలికారు. చరణ్ అభిమానులతో కలసి సెల్ఫీలు కూడా దిగారు. ఆ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. 

ఇక ఢిల్లీ విమానాశ్రయం వద్ద రామ్ చరణ్ మాట్లాడారు. ఆస్కార్ అవార్డు రావడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ఇక నుంచి ‘నాటు నాటు’ పాట మాస్ సాంగ్ కాదని, ఇది ప్రజల అందరి పాటని వ్యాఖ్యానించారు. ఈ సినిమాకు ఆస్కార్ రావడం చాలా సంతోషంగా ఉందని, మూవీ దర్శకుడు రాజమౌళి, సంగీత దర్శకుడు కీరవాణితో పాటు టీం అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు తెలపుతున్నానన్నారు రామ్ చరణ్. ఢిల్లీ లో అడుగుపెట్టిన రామ్ చరణ్ ఈ రోజంతా బిజీబిజీగా గడపనున్నారు. ఆయన సాయంత్రం ప్రధాని మోడీను కూడా కలవనున్నారు. అలాగే ఈరోజు ‘ఇండియా టుడే కాంక్లేవ్’ ఈవెంట్ లో పాల్గొననున్నారు. ఢిల్లీలో జరగనున్నఈ ఈవెంట్ లో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, క్రికెటర్ సచిన్ లతో పాటు రామ్ చరణ్ కూడా అతిథిగా పాల్గొన్నున్నారు. అలాగే జాన్వీ కపూర్, మలైకా అరోరా ఇలా ఒక్కోరంగం నుంచి ప్రముఖ వ్యక్తులను ఈ కార్యక్రమానికి ఆహ్వానించినట్టు తెలుస్తోంది. 

ఇక రామ్ చరణ్ ప్రధాని మోడీతో భేటీ పై కూడా రామ్ చరణ్ అభిమానులు ఆరా తీస్తున్నారు. చరణ్ ప్రత్యేకంగా మోడీను కలవడం వెనుక ఏమైనా రాజకీయ కోణాలు ఉన్నాయా అనే వార్తలు కూడా వస్తున్నాయి. ఏదేమైనా రామ్ చరణ్, ప్రధాని మోడీ భేటీ ఇటు ఇండస్ట్రీలోనూ అటు రాజకీయంగానూ చర్చనీయాంశమవుతోంది. ఇక రామ్ చరణ్ ఈ కార్యక్రమాలు పూర్తయిన తర్వాత తన రెగ్యులర్ షూటింగ్ లలో పాల్గొననున్నారు. ఆయన ప్రస్తుతం దర్శకుడు శంకర్ డైరెక్షన్ లో ‘ఆర్ సి 15’ సినిమాలో నటిస్తున్నారు. ఈ మూవీలో కియార అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది. ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ మూవీను ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. 

Read Also: యూట్యూబ్ నుంచి ‘భీడ్‘ ట్రైలర్ తొలగింపు, ప్రజాస్వామ్య హత్య అంటూ నెటిజన్ల ఆగ్రహం

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP Weather: ఏపీలో మాడు పగిలేలా ఎండలు, ఈ ప్రాంతాల్లో తీవ్ర వడగాల్పులు - విపత్తుల సంస్థ వార్నింగ్
ఏపీలో మాడు పగిలేలా ఎండలు, ఈ ప్రాంతాల్లో తీవ్ర వడగాల్పులు - విపత్తుల సంస్థ వార్నింగ్
IPL 2024: బెంగళూరుదే తొలి బాటింగ్, ప్లే ఆఫ్ ఆశ నెరవేరేనా
బెంగళూరుదే తొలి బాటింగ్, ప్లే ఆఫ్ ఆశ నెరవేరేనా
Telangana Graduate MLC :  తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఉపఎన్నిక - కాంగ్రెస్ అభ్యర్థిగా తీన్మార్ మల్లన్నకు చాన్స్
తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఉపఎన్నిక - కాంగ్రెస్ అభ్యర్థిగా తీన్మార్ మల్లన్నకు చాన్స్
Sajjala Ramakrishna: ఆ ట్వీట్ చూస్తే పశువులు కూడా అసహ్యించుకుంటాయి - సజ్జల ఘాటు స్పందన
ఆ ట్వీట్ చూస్తే పశువులు కూడా అసహ్యించుకుంటాయి - సజ్జల ఘాటు స్పందన
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

Paritala Sunitha Files Nomination | వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ప్రకాష్ రెడ్డిపై పరిటాల సునీత ఫైర్Singanamala YCP MLA Candidate Veeranjaneyulu | శింగనమల ఎమ్మెల్యే అభ్యర్థి వీరాంజనేయులు ఇంటర్వ్యూCongress Leader Feroz Khan |ఒవైసీ ఓడిపోతే నేను రాజకీయాలు వదిలేస్తా: ABP Straight Talkలో ఫిరోజ్‌ఖాన్SRH vs RCB AT Uppal | Fans Reactions | ఉప్పల్ వద్ద ఫ్యాన్స్ రచ్చ.. కోహ్లీ ఫ్యాన్సే పాపం..! | ABP

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Weather: ఏపీలో మాడు పగిలేలా ఎండలు, ఈ ప్రాంతాల్లో తీవ్ర వడగాల్పులు - విపత్తుల సంస్థ వార్నింగ్
ఏపీలో మాడు పగిలేలా ఎండలు, ఈ ప్రాంతాల్లో తీవ్ర వడగాల్పులు - విపత్తుల సంస్థ వార్నింగ్
IPL 2024: బెంగళూరుదే తొలి బాటింగ్, ప్లే ఆఫ్ ఆశ నెరవేరేనా
బెంగళూరుదే తొలి బాటింగ్, ప్లే ఆఫ్ ఆశ నెరవేరేనా
Telangana Graduate MLC :  తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఉపఎన్నిక - కాంగ్రెస్ అభ్యర్థిగా తీన్మార్ మల్లన్నకు చాన్స్
తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఉపఎన్నిక - కాంగ్రెస్ అభ్యర్థిగా తీన్మార్ మల్లన్నకు చాన్స్
Sajjala Ramakrishna: ఆ ట్వీట్ చూస్తే పశువులు కూడా అసహ్యించుకుంటాయి - సజ్జల ఘాటు స్పందన
ఆ ట్వీట్ చూస్తే పశువులు కూడా అసహ్యించుకుంటాయి - సజ్జల ఘాటు స్పందన
Nominations Over :  తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం-  ఏపీలో అసెంబ్లీ ఎన్నికల ఫీవర్ !
తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం- ఏపీలో అసెంబ్లీ ఎన్నికల ఫీవర్ !
DGP  Ravi Gupta : ఎయిర్ లైన్స్ సేవాలోపం - తెలంగాణ డీజీపీ ఏం  చేశారో తెలుసా ?
ఎయిర్ లైన్స్ సేవాలోపం - తెలంగాణ డీజీపీ ఏం చేశారో తెలుసా ?
మీ పిల్లలు హార్లిక్స్‌ని ఇష్టంగా తాగేస్తున్నారా? అది హెల్తీ డ్రింక్ కాదట - ఆ సంస్థే ఒప్పుకుంది
మీ పిల్లలు హార్లిక్స్‌ని ఇష్టంగా తాగేస్తున్నారా? అది హెల్తీ డ్రింక్ కాదట - ఆ సంస్థే ఒప్పుకుంది
Fact Check: ముస్లింలకు ఆస్తులు పంచి పెడతామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందా? బీజేపీ చేసిన ఆ ఆరోపణల్లో నిజమెంత?
Fact Check: ముస్లింలకు ఆస్తులు పంచి పెడతామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందా? బీజేపీ చేసిన ఆ ఆరోపణల్లో నిజమెంత?
Embed widget