అన్వేషించండి

Ram Charan: ‘గేమ్ ఛేంజర్‘ విడుదలకు ముందు కడప దర్గాకు రామ్‌ చరణ్‌... కారణం ఏంటంటే?

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ త్వరలో కడప దర్గాకు వెళ్లనున్నారు. ఈ నెల 18న జరగనున్న జాతీయ ముషాయిరా గజల్ ఈవెంట్ లో ఆయన పాల్గొననున్నారు. ఇప్పటికే ఈ వేడుక కోసం ఏర్పాట్లు మొదలు పెట్టారు.

Ram Charan to visit Kadapa Dargah: టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్ ప్రస్తుతం ‘గేమ్ ఛేంజర్‘ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో ఫుల్ బిజీగా ఉన్నారు. దిగ్గజ దర్శకుడు శంకర్ తెరకెక్కించిన ఈ సినిమా వచ్చే ఏడాది (2025) జనవరి 10న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం ప్రమోషన్ కార్యక్రమాలను ముమ్మరం చేసింది. రామ్ చరణ్ ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా గడుపుతున్నారు. ఈ టైమ్ లో ఆయన కడపకు వెళ్లబోతున్నారు. ఇంతకీ ఆయన అక్కడికి ఎందుకు వెళ్తున్నారంటే...

ముషాయిరా గజల్ వేడుకల్లో పాల్గొననున్న చెర్రీ

దేశ వ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న కడప దర్గాలో ఈ నెల 18న 80వ జాతీయ ముషాయిరా గజల్ ఈవెంట్ నిర్వహిస్తున్నారు. ఈ వేడుకలో దేశ వ్యాప్తంగా ఉన్న పలువురు గజల్ గాయకులు పాల్గొననున్నారు. ఈ వేడుకకు రామ్ చరణ్ ను ముఖ్య అతిథిగా ఆహ్వానించారు. ఈ వేడుకలో పాల్గొనేందుకు వెళ్తున్న ఆయన.. పనిలో పనిగా  కడప దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు చేసే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. రామ్ చరణ్ దర్గాకు వస్తున్న నేపథ్యంలో అభిమానులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చే అవకాశం ఉంది. అందుకు తగినట్లుగా ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. భక్తలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా తగు చర్యలు తీసుకుంటున్నారు. ప్రస్తుతం రామ్ చరణ్ అయ్యప్ప మాలలో ఉన్నారు. దీక్షలో ఉండగానే ఈ వేడుకలో పాల్గొంటారా? లేదంటే, అప్పటిలోగా దీక్ష పూర్తి అవుతుందా? అనేది తెలియాల్సి ఉంటుంది. కడపలోని అమీన్ పీర్ దర్గాకు మంచి గుర్తింపు ఉంది. ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్, నందమూరి కల్యాణ్ రామ్, పవన్ కల్యాణ్ లాంటి సినీ నటులు తరచుగా ఇక్కడికి వచ్చి ప్రార్థనలు చేస్తుంటారు. తాజాగా ఈ లిస్టులో చెర్రీ కూడా చేరబోతున్నారు.

Read Also:మట్కా రివ్యూ: వరుణ్ తేజ్ బాగా చేశారు - మరి సినిమా? గ్యాంగ్‌స్టర్ డ్రామా బావుందా? లేదా?

‘గేమ్ ఛేంజర్’పై దేశ వ్యాప్తంగా భారీగా అంచనాలు

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ జంటగా నటించిన ఈ చిత్రానికి శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. సంక్రాంతి కానుకగా వచ్చే ఏడాది జనవరి 10న ఈ సినిమా విడుదల కానుంది. ఇటీవల రిలీజైన టీజర్‌ సినీ అభిమానులలో భారీగా అంచనాలు పెంచింది. ఈ చిత్రంలో తెలుగమ్మాయి అంజలి, నవీన్‌ చంద్ర, సునీల్, శ్రీకాంత్‌, బాలీవుడ్ యాక్టర్ హ్యారీ జోష్‌, కోలీవుడ్ యాక్టర్లు ఎస్‌జే సూర్య, స‌ముద్రఖని, కన్నడ నటుడు జ‌య‌రామ్‌ ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్నారు. కార్తీక్ సుబ్బరాజు ఈ సినిమాకు కథను అందిచగా, సాయిమాధ‌వ్ బుర్రా డైలాగ్స్ రాశారు.  ఈ చిత్రానికి ఎస్‌ థమన్ సంగీతం అందించారు. దిల్ రాజు ఈ సినిమాను ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.   

త్వరలో RC16 షూటింగ్ ప్రారంభం

ఓవైపు ‘గేమ్ ఛేంజర్’ సినిమా విడుదల అవుతున్న నేపథ్యంలో మరోవైపు ‘RC16’ మూవీ షూటింగ్ కు రెడీ అవుతోంది. ఈ సినిమాకు ‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబు సాన దర్శకత్వం వహిస్తున్నారు. బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన తొలి షెడ్యూల్ అప్ డేట్ ను మేకర్స్ అధికారికంగా ప్రకటించనున్నారు.  

Read Also: కంగువ రివ్యూ: సూర్య రెండేళ్ల కష్టం - ఆడియన్స్‌కు కనెక్ట్ అయ్యేలా ఉందా? - కోలీవుడ్ స్టార్ హిట్ కొట్టారా?

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Revanth Reddy: పీజేఆర్ చనిపోతే ఎన్నికలు తెచ్చిన దుర్మార్గుడు కేసీఆర్: సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
పీజేఆర్ చనిపోతే ఎన్నికలు తెచ్చిన దుర్మార్గుడు కేసీఆర్: సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
Hyderabad Metro Timings: హైదరాబాద్‌ వాసులకు అలర్ట్.. ఈ 3 నుంచి మెట్రో రైలు టైమింగ్స్‌లో మార్పులు
హైదరాబాద్‌ వాసులకు అలర్ట్.. ఈ 3 నుంచి మెట్రో రైలు టైమింగ్స్‌లో మార్పులు
Rajamouli - Rana Daggubati: ఒక అబద్దంతో టాలీవుడ్ చరిత్రను మార్చేశాడు... తెలుగు సినిమా పొగరు బాహుబలి కాదు, భళ్లాల దేవుడు
ఒక అబద్దంతో టాలీవుడ్ చరిత్రను మార్చేశాడు... తెలుగు సినిమా పొగరు బాహుబలి కాదు, భళ్లాల దేవుడు
Jubilee Hills By Elections: జూబ్లీహిల్స్‌ ఉపఎన్నికపై కేకే సర్వే ఫలితాలు వెల్లడి.. వారికి బిగ్ రిలీఫ్
జూబ్లీహిల్స్‌ ఉపఎన్నికపై కేకే సర్వే ఫలితాలు వెల్లడి.. వారికి బిగ్ రిలీఫ్
Advertisement

వీడియోలు

Stampedes in India 2025 | తొక్కిసలాటలతో నిండిపోయిన 2025 సంవత్సరం | ABP Desam
భారత్, సౌతాఫ్రికా మ్యాచ్‌కు వర్షం ముప్పు.. మ్యాచ్ రద్దయితే విన్నర్ ఎవరు?
చరిత్ర సృష్టించడానికి అడుగు దూరంలో భారత్, సౌత్‌ఆఫ్రికా
అయ్యో పాపం.. దూబే రికార్డ్ పోయిందిగా..!
భారత మహిళల టీమ్ తలరాత  మార్చిన ద్రోణాచార్యుడు
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Reddy: పీజేఆర్ చనిపోతే ఎన్నికలు తెచ్చిన దుర్మార్గుడు కేసీఆర్: సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
పీజేఆర్ చనిపోతే ఎన్నికలు తెచ్చిన దుర్మార్గుడు కేసీఆర్: సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
Hyderabad Metro Timings: హైదరాబాద్‌ వాసులకు అలర్ట్.. ఈ 3 నుంచి మెట్రో రైలు టైమింగ్స్‌లో మార్పులు
హైదరాబాద్‌ వాసులకు అలర్ట్.. ఈ 3 నుంచి మెట్రో రైలు టైమింగ్స్‌లో మార్పులు
Rajamouli - Rana Daggubati: ఒక అబద్దంతో టాలీవుడ్ చరిత్రను మార్చేశాడు... తెలుగు సినిమా పొగరు బాహుబలి కాదు, భళ్లాల దేవుడు
ఒక అబద్దంతో టాలీవుడ్ చరిత్రను మార్చేశాడు... తెలుగు సినిమా పొగరు బాహుబలి కాదు, భళ్లాల దేవుడు
Jubilee Hills By Elections: జూబ్లీహిల్స్‌ ఉపఎన్నికపై కేకే సర్వే ఫలితాలు వెల్లడి.. వారికి బిగ్ రిలీఫ్
జూబ్లీహిల్స్‌ ఉపఎన్నికపై కేకే సర్వే ఫలితాలు వెల్లడి.. వారికి బిగ్ రిలీఫ్
Srikakulam Stampede News: కాశీబుగ్గ ఆలయ దుర్ఘటనపై మోదీ దిగ్భ్రాంతి- మృతులకు పరిహారం ప్రకటన
కాశీబుగ్గ ఆలయ దుర్ఘటనపై మోదీ దిగ్భ్రాంతి- మృతులకు పరిహారం ప్రకటన
Maruti e Vitara Car: మారుతి సుజుకీ తొలి ఎలక్ట్రిక్ కారు విడుదలకు అంతా సిద్ధం- ఫీచర్లు, మైలేజ్ రేంజ్ పూర్తి వివరాలు
మారుతి సుజుకీ తొలి ఎలక్ట్రిక్ కారు విడుదలకు అంతా సిద్ధం- ఫీచర్లు, మైలేజ్ రేంజ్ పూర్తి వివరాలు
Kavitha Politics: తెలంగాణలో రాజకీయ శూన్యత.. జనం బాట పూర్తయ్యాక కవిత యాక్షన్ ప్లాన్
తెలంగాణలో రాజకీయ శూన్యత.. జనం బాట పూర్తయ్యాక కవిత యాక్షన్ ప్లాన్
Srikakulam Stampede News: శ్రీకాకుళం కాశీబుగ్గ తొక్కిసలాట దుర్ఘటనపై చంద్రబాబు సీరియస్,  నిర్వాహకుల అరెస్టుకు ఆదేశం!
శ్రీకాకుళం కాశీబుగ్గ తొక్కిసలాట దుర్ఘటనపై చంద్రబాబు సీరియస్, నిర్వాహకుల అరెస్టుకు ఆదేశం!
Embed widget