Srikakulam Stampede News: కాశీబుగ్గ ఆలయ దుర్ఘటనపై మోదీ దిగ్భ్రాంతి- మృతులకు పరిహారం ప్రకటన
Srikakulam Stampede News: శ్రీకాకుళం జిల్లాలో ఆలయం తొక్కిసలాట ఘటనపై ప్రధానమంత్రి మోదీతోపాటు కేంద్రమంత్రులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధితులకు పరిహారం ప్రకటించారు.

Srikakulam Stampede News: శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ వెంకటేశ్వర ఆలయ తొక్కిసలాట దుర్ఘటనపై ప్రధానమంత్రి మోదీ స్పందించారు. దేవును దర్శనానికి వెళ్లి జరిగిన తొక్కిసలాటలో మృతి చెందడం బాధాకరమని అన్నారు. ఈ దుర్ఘటనలో మృతి చెందిన వారికి రెండు లక్షల రూపాయలు పరిహారం ప్రకటించారు. క్షతగాత్రులకు యాభై వేలు పరిహారం ఇస్తున్నట్టు వెల్లడించారు.
వెంకటేశ్వర స్వామి ఆలయం దుర్ఘటనపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి విచారం వ్యక్తం చేశారు. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన 9 మంది ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానని అన్నారు. హాస్పిటల్లో చికిత్స పొందుతున్న భక్తులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
Pained by the stampede in Venkateswara Swamy Temple in Srikakulam, Andhra Pradesh. My thoughts are with those who have lost their near and dear ones. I pray that the injured recover soon.
— PMO India (@PMOIndia) November 1, 2025
An ex-gratia of Rs. 2 lakh each from PMNRF would be given to the next of kin of those who…
శ్రీకాకుళం జిల్లాలో జరిగిన దుర్ఘటన కలిసి వేసిందన్నారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగిన విషాద ఘటనలో ప్రాణనష్టం సంభవించిందని తెలిసి దిగ్భ్రాంతి చెందాను. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను."
Shocked to learn about the loss of lives in a tragic incident at Sri Venkateswara Swamy Temple in Srikakulam, Andhra Pradesh. I extend my deepest condolences to the bereaved families and pray for quick recovery of those injured.
— President of India (@rashtrapatibhvn) November 1, 2025
కాశీబుగ్గ తొక్కిసలాట దుర్ఘటన దురదృష్టకరమన్నారు మరో మంత్రి బండి సంజయ్ కుమార్. తక్షణమే క్షతగాత్రులకు మెరుగైన వైద్యం సాయం అందించాలని సూచించారు. మృతుల కుటుంబాలను ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని భరోసా ఇచ్చారు.
ఆలయంలో జరిగిన దురదృష్టకరమైన తొక్కిసలాట ఘటనలో అమాయకులు ప్రాణాలు కోల్పోవడం ఎంతో బాధాకరమన్నారు కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు. "మరణించిన వారి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. ఈ ఘటనలో గాయపడిన వారికి తక్షణ వైద్య సహాయం అందించాలని అధికారులను ఆదేశించాను. వారు త్వరగా కోలుకోవాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను." అని పేర్కొన్నారు.
శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో ఏకాదశి సందర్భంగా స్వామివారి దర్శనానికి వేలాదిగా భక్తులు పోటెత్తడంతో జరిగిన తొక్కిసలాటలో 9 మంది భక్తులు మరణించడం అత్యంత దురదృష్టకరం అన్నారు డిప్యూటీసీఎం పవన్ కల్యామ్. వారిలో చిన్నారి కూడా ఉండటం తీవ్రంగా కలచివేసిందని తెలిపారు. ఈ ఘటనలో గాయపడిన క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందేలా ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుందని వివరించారు. వారు త్వరగా కోలుకుంటారని ఆశిస్తున్నానని ఓ ప్రకటన విడుదల చేశారు. "మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, వారికి ప్రభుత్వం అన్ని రకాలుగా ఆదుకుంటుందని తెలియజేస్తున్నాను. ఆధ్యాత్మికంగా విశిష్టమైన రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఆలయాల వద్ద భక్తుల రద్దీని క్రమబద్ధీకరించేలా, ఎటువంటి దుర్ఘటనలు జరగకుండా చూడాలని అధికార యంత్రాంగానికి విజ్ఞప్తి చేస్తున్నాను"





















