అన్వేషించండి

Rakesh Varre: 'బాహుబలి' to 'జితేందర్ రెడ్డి'.... పాన్ ఇండియా సక్సెస్ to రాకేష్ వర్రే కంటెంట్ రిచ్ జర్నీ

Jithender Reddy Movie: టాలీవుడ్ యంగ్ స్టార్ రాకేష్ వర్రే హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ 'జితేందర్ రెడ్డి' నవంబర్ 8న రిలీజ్ కానుంది. నవంబర్ 7న పెయిడ్ ప్రీమియర్లు వేస్తున్నారు. ఆయన జర్నీ చూస్తే...

'జితేందర్ రెడ్డి' సినిమాలో రాకేష్ వర్రే హీరోగా నటించగా... విరించి వర్మ డైరెక్షన్ చేశారు. ఇంతకు ముందు 'ఉయ్యాల జంపాల' అనే ఫీల్ గుడ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ తో పాటు నాని హీరోగా నటించిన 'మజ్ను' మూవీకి కూడా విరించి వర్మ దర్శకత్వం వహించారు. ఇప్పుడు వీరిద్దరి కాంబినేషన్లో రాబోతున్న 'జితేందర్ రెడ్డి' సినిమాపై టాలీవుడ్ లో మంచి బజ్ క్రియేట్ అయింది. 1980లో కాలంలో జగిత్యాల చుట్టు పక్కల జరిగిన యదార్థ సంఘటనల ఆధారంగా, అప్పట్లో ప్రజా సమస్యలపై జితేందర్ రెడ్డి ఎలా పోరాటం చేశారు? అనే విషయాలను బేస్ చేసుకుని 'జితేందర్ రెడ్డి'ని తెరకెక్కించారు. ఈ మూవీ నవంబర్ 8న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన ట్రైలర్ లో "అమ్మా బలవంతుడు కదా ఆయన మీద శివాజీ ఎలా గెలిచాడు... శత్రువు బలవంతులైనప్పుడు శత్రు సైన్యం మీద కాదు వాడి ధైర్యం మీద గెలవాలి, ఒక్కడి మీద తిరగబడితే పగ ఒక వ్యవస్థ మీద తిరగబడితే ఉద్యమం" అంటూ వచ్చిన డైలాగులు బాగున్నాయి.

'జితేందర్ రెడ్డి' ట్రైలర్ సినిమాపై ఆసక్తి పెంచింది. అయితే... ఈ సినిమాకు ముందు రాకేష్ వర్రే ఏం చేశారో తెలుసా? ప్రభాస్ 'మిర్చి' సినిమాలో వచ్చే ఇంట్రడక్షన్ ఫైట్ సీన్‌లో ఆయన నటించారు. అలాగే 'బాహుబలి' మూవీలో ప్రభాస్ నిండు సభలో ఒక వ్యక్తి తలను నరికేస్తాడు కదా... ఆ పాత్రను పోషించింది రాకేష్ వర్రేనే. అలా పాన్ ఇండియా సినిమాతో నటుడిగా మంచి గుర్తింపు దక్కించుకున్న రాకేష్ వర్రే... ఆ తర్వాత వెంట వెంటనే సినిమాలు చేయాలని అనుకోలేదు. కంటెంట్ రిచ్ కథల కోసం, కొత్త సినిమాలను ప్రేక్షకులను అందించడం కోసం ఎదురు చూశారు.

'బాహుబలి' తర్వాత 'ఎవరికీ చెప్పొద్దు' అని ఓ సినిమాను కూడా చేశారు రాకేష్ వర్రే. ఆ సినిమాలో హీరోగా నటించడంతో పాటు ప్రొడ్యూసర్ గా కూడా వ్యవహరించాడు. కులాలు, పట్టింపులు కథతో ఆ మూవీ రూపొందింది. కాస్ట్ ఫీలింగ్‌ను సున్నితంగా డిస్కస్ చేసిన సినిమా అది. ఆ తర్వాత 'పేక మేడలు' అని మరో సినిమాను నిర్మించారు. అందులో గాల్లో మేడలు కట్టే యువత తీరును కళ్లకు కట్టినట్లు చూపించడంతో పాటు మహిళలు ఎంత ధైర్యంగా ఉండాలో చెప్పారు. ఇలా కమర్షియల్ సినిమాల జోలికి వెళ్లకుండా కేవలం కంటెంట్ బేస్డ్ సినిమాలకే ప్రాధాన్యం ఇస్తూ మంచి సినిమాలు చేస్తున్న రాకేష్ వర్రే... ఈ శుక్రవారం 'జితేందర్ రెడ్డి' సినిమాతో థియేటర్లలోకి రావడానికి సిద్ధంగా ఉన్నాడు. 

Read Also : Allu Arjun: అల్లు అర్జున్‌కు భారీ ఊరట- నంద్యాల కేసు కొట్టేసిన హైకోర్టు 


టాలీవుడ్ లో ప్రస్తుతం కంటెంట్ బేస్డ్ సినిమాలకి ఆదరణ బాగా పెరిగింది. ప్రస్తుతం ఇండస్ట్రీలో పాన్ ఇండియా ట్రెండ్ తో పాటు చాలా మార్పులు కనిపిస్తున్నాయి. భాషతో సంబంధం లేకుండా కంటెంట్ ఉంటే చాలు అనుకుంటున్నారు ఇప్పటి తరం మూవీ లవర్స్.  అంతేకాకుండా చిన్న, పెద్ద హీరో అని తేడా లేకుండా 'కటౌట్ కాదు కంటెంట్ ముఖ్యం బిగిలూ' అంటున్నారు. ఇక ప్రేక్షకులు చూపిస్తున్న ఈ ఆదరాభిమానాలతో మేకర్స్ కూడా కొత్త కంటెంట్ తో ఆకట్టుకోవడానికి ఉత్సాహాన్ని చూపిస్తున్నారు. 

అయితే చిన్న హీరోలకు ఇదొక మంచి అవకాశం అని చెప్పాలి. సాధారణంగా స్టార్ హీరోలకు మూవీ అనౌన్స్మెంట్ నుంచే అంచనాలు పెరిగి, ప్రెజర్ ఉంటుంది. కానీ చిన్న హీరోలకు అలాంటి టెన్షన్స్ ఏమీ ఉండవు. కాబట్టి కంటెంట్ బాగుంటే హిట్ కొట్టి తమ టాలెంట్ నిరూపించుకోవచ్చు. ప్రస్తుతం టాలీవుడ్ లో ఉన్న చిన్న హీరోలలో సుహాస్ కూడా ఇదేవిధంగా దూసుకెళ్తున్నాడు. తాజాగా ఆ లిస్ట్ లో రాకేష్ వర్రే కూడా చేరిపోయారు.

Also Read: నాని, శ్రీకాంత్ ఓదెల రెండో సినిమాకు ఆసక్తికర టైటిల్... షూటింగ్ స్టార్ట్ అయ్యేది ఎప్పుడంటే?

టాప్ హెడ్ లైన్స్

Nara Rohith Kapaali : సైకలాజికల్ హారర్ థ్రిల్లర్‌లో నారా రోహిత్ - తెలియని ప్రపంచంలో న్యూ జర్నీ 'కపాలి'
సైకలాజికల్ హారర్ థ్రిల్లర్‌లో నారా రోహిత్ - తెలియని ప్రపంచంలో న్యూ జర్నీ 'కపాలి'
The Odyssey Collections : ఇండియాలో ది ఒడిస్సీ రికార్డు కలెక్షన్స్ - వారం రోజుల్లోనే ఆ మార్క్ దాటేసిందిగా...
ఇండియాలో ది ఒడిస్సీ రికార్డు కలెక్షన్స్ - వారం రోజుల్లోనే ఆ మార్క్ దాటేసిందిగా...
Sumo Didi OTT : ఓటీటీలోకి ఇండియాస్ ఫస్ట్ మహిళా సుమో రెజ్లర్ స్టోరీ - ఇంట్రెస్టింగ్ టీజర్... ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే?
ఓటీటీలోకి ఇండియాస్ ఫస్ట్ మహిళా సుమో రెజ్లర్ స్టోరీ - ఇంట్రెస్టింగ్ టీజర్... ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే?
Vanda Devullu OTT : ఓటీటీలోకి వంద దేవుళ్లు - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ కావొచ్చంటే?
ఓటీటీలోకి వంద దేవుళ్లు - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ కావొచ్చంటే?

వీడియోలు

PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన
Shreyas Iyer about IND vs ZIM T20 | జింబాబ్వేపై గెలుపుపై శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
Gundenininda Gudigantalu Serial July 24 | మనోజ్ నోట్లో బలవంతంగా పెసరట్టు కుక్కిన బాలు
India vs Zimbabwe 1st T20 Highlights | జింబాబ్వేపై భారత్ ఘన విజయం
Karthika Deepam Tejaswini Prakash as Malini | తెలుగు బిజినెస్‌మ్యాన్‌ని పెళ్లి చేసుకున్న మాలిని

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR Warning to PM Modi : జెన్-జీ పవర్‌ను తక్కువ అంచనా వేయకండి - నేపాల్,శ్రీలంకల్లా జరగొచ్చు - ప్రధాని మోదీకి కేటీఆర్ ఘాటు హెచ్చరిక!
జెన్-జీ పవర్‌ను తక్కువ అంచనా వేయకండి - నేపాల్,శ్రీలంకల్లా జరగొచ్చు - ప్రధాని మోదీకి కేటీఆర్ ఘాటు హెచ్చరిక!
Andhra Pradesh Rainfall: ఏపీలో 51 శాతం, కృష్ణా డెల్టాలో 49 శాతం లోటు వర్షపాతం.. రైతులకు ఈఎన్సీ కీలక సూచనలు
ఏపీలో 51 శాతం, కృష్ణా డెల్టాలో 49 శాతం లోటు వర్షపాతం.. రైతులకు ఈఎన్సీ కీలక సూచనలు
Raja Singh : తెలంగాణ బీజేపీలోకి రాజాసింగ్‌కు ఇక నో ఎంట్రీ - మహారాష్ట్ర, యూపీలకు వెళ్లిపోతారా?
తెలంగాణ బీజేపీలోకి రాజాసింగ్‌కు ఇక నో ఎంట్రీ - మహారాష్ట్ర, యూపీలకు వెళ్లిపోతారా?
Kumki Elephants: పలమనేరు క్యాంపు నుంచి పార్వతీపురానికి కుంకీ ఏనుగులు తరలింపు.. పవన్ కళ్యాణ్ కృషి ఫలించేనా !
పలమనేరు క్యాంపు నుంచి పార్వతీపురానికి కుంకీ ఏనుగులు తరలింపు.. పవన్ కళ్యాణ్ కృషి ఫలించేనా !
Viral Video: యువతిని ఒళ్లో కూర్చోబెట్టుకుని ఆటో డ్రైవింగ్.. మైనర్‌కు శిక్ష విధించిన జువైనల్ బోర్డ్
యువతిని ఒళ్లో కూర్చోబెట్టుకుని ఆటో డ్రైవింగ్.. మైనర్‌కు శిక్ష విధించిన జువైనల్ బోర్డ్
Honda ZR-V Review: మైలేజ్‌లో అద్భుతం, డ్రైవింగ్‌లో బెస్ట్.. అధిక ధర Honda ZR-Vకు మైనస్ అవుతుందా..
మైలేజ్‌లో అద్భుతం, డ్రైవింగ్‌లో బెస్ట్.. అధిక ధర Honda ZR-Vకు మైనస్ అవుతుందా..
తొలి ఏకాదశి నుంచి కార్తీకమాసం వరకూ 4 నెలలు ఏం తినాలి , ఏం తినకూడదు?
తొలి ఏకాదశి నుంచి కార్తీకమాసం వరకూ 4 నెలలు ఏం తినాలి , ఏం తినకూడదు?
CJP Protests: రంగంలోకి ప్రధాని మోదీ.. పేపర్ లీక్ ఆందోళనల్లో కీలక పరిణామం.. నేడు సీజేపీతో కేంద్రం చర్చలు
రంగంలోకి ప్రధాని మోదీ.. పేపర్ లీక్ ఆందోళనల్లో కీలక పరిణాలు.. నేడు సీజేపీతో కేంద్రం చర్చలు
Embed widget