Akshay Kumar : న్యూడ్ ఫోటోస్ పంపు - ఆన్ లైన్లో అక్షయ్ కుమార్తెకు మెసేజ్ - ఆకతాయి అరెస్ట్
Akshay Kumar Daughter : బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ కుమార్తెపై సైబర్ వేధింపుల కేసుకు సంబంధించి నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. త్వరలోనే కోర్టులో హాజరు పర్చనున్నట్లు తెలిపారు.

Akshay Kumar Daughter Cyber Harassment Case : బాలీవుడ్ లెజెండ్ అక్షయ్ కుమార్ కుమార్తెపై సైబర్ వేధింపుల కేసులో నిందితున్ని మహారాష్ట్ర పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ విషయాన్ని మహారాష్ట్ర సైబర్ అడిషనల్ డీజీ యశస్వి వెల్లడించారు. నిందితుడిని కోర్టులో హాజరు పరుస్తామని చెప్పారు. కుమార్తె వేధింపులకు గురవుతున్నట్లు స్వయంగా అక్షయ్ కుమారే వెల్లడించారు. ఆమె ధైర్యంగా పేరెంట్స్కు చెప్పడం వల్లే నిందితుడిని పట్టుకోవడం సాధ్యమైందని అధికారులు తెలిపారు.
అసలేం జరిగిందంటే?
గతేడాది అక్టోబరులో ముంబయిలో జరిగిన సైబర్ అవేర్నెస్ మంత్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు అక్షయ్ కుమార్. సైబర్ క్రైమ్ గురించి మాట్లాడిన ఆయన తన కుమార్తెకు ఎదురైన ఇబ్బందికర పరిస్థితి గురించి వెల్లడించారు. పిల్లల చేతిలో మొబైల్ ఉంటే ఒక్కోసారి వారు కూడా సైబర్ నేరాల ఉచ్చులో చిక్కుకోవాల్సి ఉంటుందని తెలిపారు. 'నా కుమార్తె ఆన్ లైన్లో వీడియో గేమ్ ఆడుతున్న టైంలో ఓ అపరిచిత వ్యక్తి నుంచి మెసేజ్ వచ్చింది.
మొదట మంచిగా పరిచయం చేసుకున్న సదరు వ్యక్తి పేరు చెప్పగానే... న్యూడ్ ఫోటోలు పంపాలని సందేశం పంపాడు. బెదిరించే ధోరణిలో మెసేజ్ పెట్టడంతో వెంటనే నా కూతురు స్విచ్చాఫ్ చేసి ధైర్యంగా తన తల్లితో చెప్పింది.' అని చెప్పారు. దీనిపై సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించినట్లు తెలిపారు. ఆయన ఫిర్యాదు మేరకు పోలీసులు చర్యలు చేపట్టి నిందితున్ని అరెస్ట్ చేశారు. పాఠశాల విద్యార్థులకు సైబర్ క్రైమ్పై అవగాహన కల్పించేలా సైబర్ ఎడ్యుకేషన్ను వీక్లీ సబ్జెక్ట్గా పెట్టాలని మహారాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.
Also Read : లావణ్య త్రిపాఠి సతీ లీలావతి రిలీజ్ డేట్ ఫిక్స్ - ట్రెండీ సెన్సిటివ్ ఇష్యూ చూడాల్సిందే...
మరోవైపు, అక్షయ్ కుమార్తెపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. తాను ఎదుర్కొన్న సైబర్ వేధింపుల గురించి తల్లిదండ్రులకు ధైర్యంగా చెప్పారని... పిల్లలకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలని అంటున్నారు. అక్షయ్ చెప్పినట్లుగా సైబర్ ఎడ్యుకేషన్ను వీక్లీ సబ్జెక్ట్గా పెట్టాలని చెబుతున్నారు.
ట్రెండింగ్ వార్తలు






















