Peddi Nizam Bookings: 'పెద్ది'కి టెన్షన్ లేదు... తెలంగాణలోనూ టికెట్ రేట్స్ పెరిగాయ్... కాసేపటిలో బుకింగ్స్ మొదలు
Peddi Telangana Ticket Rates: 'పెద్ది'కి పది రోజుల పాటు టికెట్ రేట్ హైక్ ఇస్తూ తెలంగాణ ప్రభుత్వం జీవో జారీ చేసింది. బుధవారం ఉదయం బుకింగ్స్ ఓపెన్ కానున్నాయి.

- రామ్ చరణ్ 'పెద్ది' సినిమా ప్రీమియర్ షోలు ఇవాళ, రేపు విడుదల.
- తెలంగాణలో సినిమా టికెట్ ధరలు 10 రోజుల పాటు పెంచుకోవచ్చు.
- సింగిల్ స్క్రీన్లలో రూ. 100, మల్టీప్లెక్స్లలో రూ. 125 పెరిగింది.
- ప్రీమియర్ షోల టికెట్ ధర జీఎస్టీతో రూ. 600గా నిర్ణయించారు.
రామ్ చరణ్ కథానాయకుడిగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా 'పెద్ది'. ఇవాళ (జూన్ 3) రాత్రి 8 గంటలకు ప్రీమియర్ షోలు, రేపు (జూన్ 4) ప్రపంచ వ్యాప్తంగా అన్ని థియేటర్లలో విడుదల కానుంది. ఈ సినిమాకు పది రోజుల పాటు టికెట్ రేట్ హైక్ ఇస్తూ తెలంగాణ ప్రభుత్వం జీవో జారీ చేసింది. టికెట్ రేట్లు పెంచుకోవడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సినిమా విడుదలైన మొదటి పది రోజులు పెంచిన రేట్లు అమలులో ఉంటాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. టికెట్ రేటు ఎంత పెరిగింది? అనేది చూస్తే...
సింగిల్ స్క్రీన్లలో 100... మల్టీప్లెక్స్లో 125
ప్రీమియర్ షోలకు ఏ థియేటర్ అయినా 600
సింగిల్ స్క్రీన్ థియేటర్లలో టికెట్ రేటుపై 100 రూపాయలు పెంచుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం నుంచి అనుమతి లభించింది. దాంతో బాల్కనీ టికెట్ రేటు 275 అయ్యింది. ఇక మల్టీప్లెక్స్లలో టికెట్ రేటు విషయానికి వస్తే... 125 రూపాయలు పెంచుకోవచ్చని ప్రభుత్వం పేర్కొంది. దాంతో టికెట్ రేటు 420కి చేరుకుంది. జీవో జారీ కావడానికి ముందు మల్టీప్లెక్స్లలో 150 రూపాయల వరకు హైక్ ఉండవచ్చని వార్తలు వచ్చినప్పటికీ... 125 రూపాయలకే రేవంత్ రెడ్డి సర్కార్ అనుమతించింది. థియేటర్లలో రోజుకు ఐదు షోలు ప్రదర్శించుకోవడానికి కూడా ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. ఏపీలోనూ టికెట్ రేట్స్ పెరిగిన సంగతి తెలిసిందే.
జూన్ 4న సినిమా విడుదల. అయితే... ఇవాళ (జూన్ 3వ తేదీ) రాత్రి 8 గంటల నుండి స్పెషల్ ప్రీమియర్ షోల ప్రదర్శనకు అనుమతి లభించింది. ప్రీమియర్ షో టికెట్ రేటును జీఎస్టీతో 600 రూపాయలుగా నిర్ణయించారు. మరికొన్ని గంటల్లో ఈ సినిమా నైజాం బుకింగ్స్ ప్రారంభం కానున్నాయి.
టికెట్ రేట్స్ హైక్ ద్వారా వచ్చే కలెక్షన్లలో 20 శాతాన్ని తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్కు విరాళంగా ఇవ్వాలని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కొన్ని రోజుల క్రితం చెప్పిన సంగతి తెలిసిందే. ఆ డబ్బులను సినిమా ఇండస్ట్రీలోని కార్మికుల సంక్షేమం, అభివృద్ధి కోసం వినియోగించాలని నిర్ణయించారు. తెలంగాణ (నైజాం)లో ఎగ్జిబిటర్లు పర్సంటేజీ సిస్టమ్ కావాలని డిమాండ్ ఒక వైపు... టికెట్ రేట్ హైక్ వస్తుందా? లేదా? అనే సందిగ్ధత మరోవైపు... మంగళవారం రాత్రి తెలంగాణ ప్రభుత్వం నుంచి జీవో జారీ రావడం గనుక ఆలస్యం అయితే నార్మల్ టికెట్ రేట్లకు సినిమాను విడుదల చేయాలని నిర్మాతలు భావించినట్టు టాలీవుడ్ ఇన్సైడ్ ఇన్ఫర్మేషన్. ఇప్పుడు ఆ టెన్షన్ లేదు. బుచ్చిబాబు సానా దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సంస్థల సమర్పణలో వృద్ధి సినిమాస్ పతాకంపై వెంకట సతీష్ కిలారు ఈ సినిమా ప్రొడ్యూస్ చేశారు.
Also Read: Peddi Vs Game Changer - పెద్ది వర్సెస్ గేమ్ ఛేంజర్... ఫ్లాప్ తర్వాత రామ్ చరణ్ మార్కెట్ పడిందా?
Before You Go
Dharmendra Receives Padma Vibhushan Award | ధర్మేంద్రకు పద్మవిభూషణ్ అవార్డు
ట్రెండింగ్ వార్తలు






















