అన్వేషించండి

IT Raids: టాలీవుడ్ తాట తీస్తున్న ఐటీ రైడ్స్... అసలు టార్గెట్ దిల్ రాజు కాదా?

తెలుగు సినిమా ఇండస్ట్రీలోని అగ్ర నిర్మాతల ఆఫీసులు, ఇళ్లు, ఇంకా బ్యాంకు లాకర్లు... ఒక్కటి కూడా వదలకుండా ఐటీ శాఖ సోదాలు చేస్తోంది. అన్నిటికంటే ముఖ్యంగా దీని వెనుక ఫేక్ ప్రచారం ఉందనేది ఇండస్ట్రీ గుసగుస.

టాలీవుడ్ ఇండస్ట్రీకి మంగళవారం ఉదయం ఝలక్ తగిలింది.‌ అగ్ర నిర్మాత 'దిల్' రాజు సంస్థ కార్యాలయాలతో పాటు ఆయన ఇళ్లలో ఆదాయపు పన్ను ఐటీ శాఖ రైడ్ చేస్తుందనే వార్త అందరికీ షాక్ ఇచ్చింది. ఆ తర్వాత మ్యాంగో మీడియాతో పాటు ఫైనాన్షియర్ సత్య రంగయ్య సంస్థ కార్యాలయంలో కూడా ఐటీ రైడ్ జరిగింది. ఆ తర్వాత మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ కార్యాలయాలతో పాటు దర్శకుడు సుకుమార్ ఇంటి మీద రైడ్ జరిగింది. సినిమా ఇండస్ట్రీ మీద ఉన్నట్టుండి ఆదాయపు పన్ను శాఖ పడడానికి అసలు కారణం ఏమిటి? రెండు రోజులైనా ఎండ్ కార్డ్ ఎందుకు పడలేదు?

వేల కోట్ల వసూళ్లు, వందల కోట్ల రెమ్యూనరేషన్... అసలు లెక్క తీయండి!
'దిల్' రాజును టార్గెట్ చేస్తూ ఆదాయపు పన్ను శాఖ రైడ్ జరిగినట్లు తొలుత ప్రచారం జరిగింది. 'గేమ్ చేంజర్' నిర్మాణం కోసం వందల కోట్ల రూపాయలు ఖర్చు చేసిన ఆయనకు... సినిమా విడుదల తర్వాత భారీ వసూళ్లు ఏమీ రాలేదని, ఆయన మీద రైడ్ చేయడం వల్ల ఐటీ శాఖకు ఏం వస్తుందని సోషల్ మీడియాలో సెటైర్లు కూడా పడ్డాయి.‌‌ ఆ సంగతి పక్కన పెడితే... అసలు టార్గెట్ 'దిల్' రాజు కాదని ఫిలిం నగర్ వర్గాల నుంచి అందుతున్న గుసగుస. పైగా, ఆయనకు తెలంగాణ ప్రభుత్వం ఇటీవల ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇచ్చింది.

పాన్ ఇండియా స్థాయిలో భారీ సక్సెస్ సాధించామని, తమ సినిమా వేల కోట్ల రూపాయల వసూళ్లు సాధించిందని సగర్వంగా ప్రకటించిన మైత్రీ మూవీ మేకర్స్ సంస్థను, ఆ చిత్ర దర్శక నిర్మాతలను టార్గెట్ చేస్తూ ఐటీ శాఖ రైడ్ చేసినట్లు టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీలో ఆఫ్ ది రికార్డుగా కొన్ని కామెంట్లు చాలా బలంగా వినబడుతున్నాయి. 

కలెక్షన్స్ లెక్కల పరంగా 'బాహుబలి 2' రికార్డులను తమ సినిమా బీట్ చేసిందని మైత్రి మూవీ మేకర్స్ ప్రకటించిన 'పుష్ప 2' కలెక్షన్స్ పోస్టర్లు చెబుతున్నాయి. ప్రభాస్, రాజమౌళి సినిమా ఊసు తీయనప్పటికీ... వీళ్లు అనౌన్స్ చేసిన నెంబర్లు ఆ సినిమా ఓవరాల్ కలెక్షన్స్ కంటే ఎక్కువ.‌ అది ఒక్కటే కాదు... ఆ సినిమాకు గాను హీరో అల్లు అర్జున్ మూడు వందల కోట్ల రూపాయలను పారితోషికం కింద అందుకున్నట్లు విస్తృతంగా ప్రచారం జరిగింది. 

'పుష్ప 2' సినిమాకు వచ్చిన వసూళ్ల లెక్కల వివరాలను ఐటీ శాఖ అడిగినట్లు తెలుస్తోంది.‌ అలాగే, ఎవరికి ఎన్ని కోట్ల రూపాయల పారితోషికం ఇచ్చారనే విషయంలోనూ కూపీలు లాగుతూ ఉందని వినబడుతోంది. 'పుష్ప 2: ది రూల్' చిత్ర నిర్మాణంలో దర్శకుడు సుకుమార్ స్థాపించిన నిర్మాణ సంస్థ సుకుమార్ రైటింగ్స్ కూడా భాగస్వామి. అందుకని ఆయన్ను డైరెక్టుగా ఎయిర్ పోర్ట్ నుంచి ఐటీ శాఖ తమ అదుపులోకి తీసుకొని తీసుకువెళ్లారు.

Also Read: కుంటుకుంటూ... వీల్ ఛైర్‌లో హైదరాబాద్ నుంచి ముంబైకు రష్మిక - అంత అర్జెంటుగా ఎందుకు వెళ్లిందో తెలుసా?

ఇప్పుడు అసలు వసూళ్లు ఎన్ని? కొసరు ఎంత? ఎంత కలిపారు? ఎవరికి ఎన్ని కోట్ల రూపాయల పారితోషకం ఇచ్చారు? అనే విషయాలు బయటకు చెప్పకపోయినా సరే ఐటీ శాఖ దగ్గరకు వెళ్తాయి. మైత్రీతో పాటు పనిలో పనిగా సంక్రాంతి సినిమాలు డిస్ట్రిబ్యూట్ చేసిన 'దిల్' రాజు సంస్థ మీద కూడా రైడ్ చేసింది ఐటీ శాఖ

సంక్రాంతికి విడుదలైన 'గేమ్ చేంజర్', 'డాకు మహారాజ్', 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమాలను నైజాం, విశాఖ వంటి ప్రాంతాల్లో‌ 'దిల్' రాజు డిస్ట్రిబ్యూట్ చేశారు. 'గేమ్ చేంజర్' నిర్మాత కూడా ఆయనే. ఆయా సినిమాలకు సంబంధించిన వసూళ్ల ప్రకటనల నేపథ్యంలో 'దిల్' రాజు సంస్థ మీద రైడ్ జరిగినట్టు ఖబర్. ఆయనతో సన్నిహిత సంబంధాలు ఉన్న మ్యాంగో మీడియా ఫైనాన్షియర్ సత్య రంగయ్య తదితరుల మీద రైడ్స్ చేశారు. ఇకపై టాలీవుడ్ ఫేక్ పబ్లిసిటీ ఆపకపోతే తిప్పలు తప్పవేమో!?

Also Readవిలన్ ఎవరో పట్టుకుంటే పది వేలు... ‘ఒక పథకం ప్రకారం’ ఆడియన్స్‌కు బంపర్ ఆఫర్ ఇచ్చిన హీరో సాయిరామ్ శంకర్

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana MLC Election Results 2025: కమలం అంటే ఫ్లవర్ అనుకుంటివా, వైల్డ్‌ ఫైర్‌! రేవంత్ రెడ్డికి టీచర్స్, పట్టభద్రుల పవర్‌ఫుల్ మెసేజ్‌!
కమలం అంటే ఫ్లవర్ అనుకుంటివా, వైల్డ్‌ ఫైర్‌! రేవంత్ రెడ్డికి టీచర్స్, పట్టభద్రుల పవర్‌ఫుల్ మెసేజ్‌!
ICC Champions Trophy Final Ind Vs NZ: న్యూజిలాండ్ వ‌ర్సెస్ ఇండియా.. టోర్నీ ఫైన‌ల్ ఖ‌రారు.. సెమీస్ లో కివీస్ ఘ‌న విజ‌యం.. మ‌ళ్లీ చోక్ చేసిన సౌతాఫ్రికా
న్యూజిలాండ్ వ‌ర్సెస్ ఇండియా.. టోర్నీ ఫైన‌ల్ ఖ‌రారు.. సెమీస్ లో కివీస్ ఘ‌న విజ‌యం.. మ‌ళ్లీ చోక్ చేసిన సౌతాఫ్రికా
MLC BJP Won: పట్టభద్రుల ఎమ్మెల్సీని గెల్చుకున్న బీజేపీ - హోరాహోరీ పోరులో ఓడిపోయిన కాంగ్రెస్
పట్టభద్రుల ఎమ్మెల్సీని గెల్చుకున్న బీజేపీ - హోరాహోరీ పోరులో ఓడిపోయిన కాంగ్రెస్
YS Vivka Case: వివేకా హత్య కేసులో కీలక పరిణామం -  భద్రత కల్పించిన సాక్షి మృతి !
వివేకా హత్య కేసులో కీలక పరిణామం - భద్రత కల్పించిన సాక్షి మృతి !
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

SA vs NZ Semi Final 2 | Champions Trophy ఫైనల్లో భారత్ ను ఢీకొట్టేది కివీస్ | ABP DesamChampions Trophy | 97 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టిన ఇండియా | ABP DesamSrisailam Elevated Corridor Project Details | నల్లమల్ల అడవిలో ఎలివేటెడ్ కారిడార్‌ | ABP DesamAP Speaker Ayyannapathrudu on YS Jagan Letter | స్పీకర్ ను కించపరిచేలా జగన్ లేఖలున్నాయన్న అయ్యన్న | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana MLC Election Results 2025: కమలం అంటే ఫ్లవర్ అనుకుంటివా, వైల్డ్‌ ఫైర్‌! రేవంత్ రెడ్డికి టీచర్స్, పట్టభద్రుల పవర్‌ఫుల్ మెసేజ్‌!
కమలం అంటే ఫ్లవర్ అనుకుంటివా, వైల్డ్‌ ఫైర్‌! రేవంత్ రెడ్డికి టీచర్స్, పట్టభద్రుల పవర్‌ఫుల్ మెసేజ్‌!
ICC Champions Trophy Final Ind Vs NZ: న్యూజిలాండ్ వ‌ర్సెస్ ఇండియా.. టోర్నీ ఫైన‌ల్ ఖ‌రారు.. సెమీస్ లో కివీస్ ఘ‌న విజ‌యం.. మ‌ళ్లీ చోక్ చేసిన సౌతాఫ్రికా
న్యూజిలాండ్ వ‌ర్సెస్ ఇండియా.. టోర్నీ ఫైన‌ల్ ఖ‌రారు.. సెమీస్ లో కివీస్ ఘ‌న విజ‌యం.. మ‌ళ్లీ చోక్ చేసిన సౌతాఫ్రికా
MLC BJP Won: పట్టభద్రుల ఎమ్మెల్సీని గెల్చుకున్న బీజేపీ - హోరాహోరీ పోరులో ఓడిపోయిన కాంగ్రెస్
పట్టభద్రుల ఎమ్మెల్సీని గెల్చుకున్న బీజేపీ - హోరాహోరీ పోరులో ఓడిపోయిన కాంగ్రెస్
YS Vivka Case: వివేకా హత్య కేసులో కీలక పరిణామం -  భద్రత కల్పించిన సాక్షి మృతి !
వివేకా హత్య కేసులో కీలక పరిణామం - భద్రత కల్పించిన సాక్షి మృతి !
Congress Mallanna: కాంగ్రెస్ పార్టీలో చిచ్చు పెట్టిన మల్లన్న - వివరణ ఇవ్వాలని మధుయాష్కీ డిమాండ్
కాంగ్రెస్ పార్టీలో చిచ్చు పెట్టిన మల్లన్న - వివరణ ఇవ్వాలని మధుయాష్కీ డిమాండ్
Nara Lokesh: అహంకారానికి ప్యాంట్, షర్ట్ వేస్తే జగన్ రెడ్డి - నారా లోకేష్ తీవ్ర విమర్శలు
అహంకారానికి ప్యాంట్, షర్ట్ వేస్తే జగన్ రెడ్డి - నారా లోకేష్ తీవ్ర విమర్శలు
Singer Kalpana Daughter: మా అమ్మ సూసైడ్ అటెంప్ట్ చేయలేదు... సింగర్ కల్పన కేసులో క్లారిటీ ఇచ్చిన కుమార్తె
మా అమ్మ సూసైడ్ అటెంప్ట్ చేయలేదు... సింగర్ కల్పన కేసులో క్లారిటీ ఇచ్చిన కుమార్తె
Anantapur News: బీజేపీ నేత కబ్జాలపై కదిలిన ప్రభుత్వం - ఆదినారాయణ కబ్జాలపై సిట్ వేయాలని బాధితుల డిమాండ్
బీజేపీ నేత కబ్జాలపై కదిలిన ప్రభుత్వం - ఆదినారాయణ కబ్జాలపై సిట్ వేయాలని బాధితుల డిమాండ్
Embed widget