అన్వేషించండి

Telangana Panchayat Elections 2025: తెలంగాణలో పంచాయతీ ఎన్నికలకు సర్వం సిద్దం- ఉదయం 7 గంటల నుంచి పోలింగ్‌

Telangana Panchayat Elections 2025: తెలంగాణలో పంచాయతీ ఎన్నికల తొలిదశ పోలింగ్‌ గురువారం ఉదయం ఏడు గంటలకు ప్రారంభంకానుంది. సాయంత్రానికి ఓట్ల లెక్కింపు ఉంటుంది.

Telangana Panchayat Elections 2025: తెలంగాణలో తొలి దశ పంచాయతీ ఎన్నికలకు అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ ప్రారంభంకానుంది. తొలి దశలో 3836 పంచాయతీల్లో ఎన్నికలు జరగనున్నాయి. వాస్తవంగా 4236 పంచాయతీల్లో ఎన్నికలకు తొలి దశలో నోటిఫికేషన్ వచ్చింది. అయితే ఇందులో దాదాపు నాలుగు వందల గ్రామాల్లో ఎన్నిక ఏకగ్రీవమైంది. దీంతో అక్కడ ఎన్నికలు జరగడం లేదు. మరికొన్ని ప్రాంతాల్లో ప్రజలు ఎన్నికలను బహిష్కరించడంతోపాటు వివిధ కారణాలతో నామినేషన్‌లు దాఖలు కాలేదు. అక్కడ ఎన్నికలు జరగడం లేదు. ఇప్పుడు ఎన్నికలు జరుగుతున్న గ్రామాల్లో పదమూడు వేల మందికిపైగా అభ్యర్థులు పోటీలో ఉన్నారు. వారి కోసం ఎన్నికలు జరుగుతున్నాయి. వారి భవిష్యత్‌ను 56 లక్షల మందికిపైగా ఓటర్లు తేల్చనున్నారు.  

తొలి దశ పంచాయతీ పోలింగ్ వివరాలు

తొలి దశలో నోటిఫికేషన్ వచ్చిన గ్రామపంచాయతీలు- 4236
తొలి దశలో నోటిఫికేషన్ వచ్చిన వార్డులు-37,440
తొలి దశలో ఏకగ్రీవమైన పంచాయతీలు- 400
పోలింగ్‌ జరుగుతున్న పంచాయతీలు- 3836
పోలింగ్ కోసం ఏర్పాటు చేసిన పోలింగ్ స్టేషన్లు-37,562
పోలింగ్‌లో పాల్గొనే ఓటర్లు - 56,19,430
పోలింగ్ జరిగే పంచాయతీల్లో పోటీలో ఉన్న అభ్యర్థులు- 12,960

పక్కా ఏర్పాట్లు

ఓటు హక్కు కలిగి ఉన్న వారంతా పోలింగ్‌లో పాల్గొని ఓటు వేయాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ రాణి కుముదిని పిలుపునిచ్చారు. అందరూ స్వేచ్ఛగా ఓట్లు వేసేందుకు ఏర్పాట్లు చేసినట్టు ప్రకటించారు. సెన్సిటివిటీ ఉన్న గ్రామాల్లో భద్రతను కట్టుదిట్టం చేశామని అవసరమైన ప్రాంతాల్లో అదనపు బలగాలు మోహరించినట్టు వెల్లడించారు. లక్షల మంది సిబ్బంది విధుల్లో ఉంటున్నారని ప్రతి పోలింగ్ కేంద్రంలో కూడా సీసీ టీవీలు ఏర్పాటు చేసినట్టు తెలిపారు. అన్ని ప్రాంతాలపై నిరంతర పర్యవేక్షణ ఉంటుందని అన్నారు. 

18 పత్రాల్లో ఏదైనా చూపించవచ్చు

తొలి దశ ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో ఇన్ని రోజులు ప్రతి గడప తిరిగిన అభ్యర్థులు ప్రచారం మంగళవారంతో ముగిసింది. మంగళవారం నుంచి ఆయా గ్రామాల్లో ఉండే వైన్‌షాపులు బంద్ అయ్యాయి. ఎలాంటి భయం లేకుండా ఓటు హక్కు కలిగి ఉన్న ప్రతి ఒక్కరు ఓటు వేయాలని, ఎదైనా సమస్య ఉండే స్థానికంగా ఉండే అధికారులకు తెలియజేయాలని సూచించారు. ఓటు హక్కు వినియోగించుకునేందుకు ప్రభుత్వం సూచిన 18 కార్డుల్లో ఏదైనా కార్డు చూపించి ఓటు వేయవచ్చని చెప్పారు. 

భారీగా నగదు పట్టివేత

షెడ్యూల్ వచ్చినప్పటి నుంచి భారీ సంఖ్యలో నగదు పట్టుకున్నట్టు రాణి కుముదిని ప్రకటించారు. మొత్తంగా 3,214 కోడ్ ఉల్లంఘన కేసులు నమోదు అయినట్టు తెలిపారు. 902 ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. 1,70,58,340 రూపాయల నగదు సీజ్ చేశారు. 2,22,91,714 విలువైన మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. 12,15,500 విలువైన ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటి వరకు అధికారులు సీజ్ చేసిన సొత్తు విలువ 7,54,78,535 రూపాయులుగా తేల్చారు. 

మొత్తం మూడు దశల్లో పంచాయతీ ఎన్నికలు జరుపుతోంది ఎన్నికల కమిషన్. మొదటి దశ గురువారం జరగనుంది. రెండో ద డిసెంబర్‌ 14న జరగనుంది. మూడో దశ అక్కడికి మూడు రోజుల తర్వాత డిసెంబ్‌ 17న జరుపుతారు. సర్పంచ్‌ వార్డు మెంబర్స్‌కు ఎన్నికలు జరిగిన రోజునే లెక్కింపు కూడా చేపడతారు. అదే రోజు సర్పంచ్, ఉపసర్పంచ్ ఎన్నిక కూడా పూర్తి చేస్తారు.       

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Ind vs Nz 3rd ODI: ఒక మార్పుతో బరిలోకి దిగిన గిల్ సేన.. ఇండోర్‌లో తమ రికార్డు కాపాడుకుంటుందా?
ఒక మార్పుతో బరిలోకి దిగిన గిల్ సేన.. ఇండోర్‌లో తమ రికార్డు కాపాడుకుంటుందా?
AR Rahman Vs Kangana Ranaut: ఏఆర్ రెహమాన్‌పై విమర్శలు గుప్పించిన కంగనా రనౌత్... నన్ను కలవలేదు, అంత ద్వేషమా?
ఏఆర్ రెహమాన్‌పై విమర్శలు గుప్పించిన కంగనా రనౌత్... నన్ను కలవలేదు, అంత ద్వేషమా?
NTR Vardhanti: ఎన్టీఆర్ 30వ వర్థంతి.. ఎన్టీఆర్ ఘాట్ వద్ద మంత్రి లోకేష్, కల్యాణ్ రామ్ నివాళులు
ఎన్టీఆర్ 30వ వర్థంతి.. ఎన్టీఆర్ ఘాట్ వద్ద మంత్రి లోకేష్, కల్యాణ్ రామ్ నివాళులు
Hyderabad Crime News: హైదరాబాద్‌లో సైబర్ మోసం.. 5 వేలు లాభం చూపించి, ఐటీ ఉద్యోగికి రూ. 2.9 కోట్లు ఎగనామం
హైదరాబాద్‌లో సైబర్ మోసం.. 5 వేలు లాభం చూపించి, ఐటీ ఉద్యోగికి రూ. 2.9 కోట్లు ఎగనామం
Advertisement

వీడియోలు

Nara Lokesh Tribute to NTR on Death Anniversary | ఎన్టీఆర్ కు నివాళి అర్పించిన లోకేష్
Vande Bharat Sleeper Train Started | పచ్చ జెండా ఊపి వందేభారత్ స్లీపర్ ను ప్రారంభించిన ప్రధాని మోదీ | ABP Desam
WPL 2026 RCB vs GG Highlights | హ్యాట్రిక్ కొట్టిన బెంగళూరు!
Ashwin about India vs New Zealand | టీమ్ సెలక్షన్ పై అశ్విన్ ఘాటు వ్యాఖ్యలు
Manoj Tiwari about Rohit Sharma Captaincy | రోహిత్ కెప్టెన్సీపై మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Ind vs Nz 3rd ODI: ఒక మార్పుతో బరిలోకి దిగిన గిల్ సేన.. ఇండోర్‌లో తమ రికార్డు కాపాడుకుంటుందా?
ఒక మార్పుతో బరిలోకి దిగిన గిల్ సేన.. ఇండోర్‌లో తమ రికార్డు కాపాడుకుంటుందా?
AR Rahman Vs Kangana Ranaut: ఏఆర్ రెహమాన్‌పై విమర్శలు గుప్పించిన కంగనా రనౌత్... నన్ను కలవలేదు, అంత ద్వేషమా?
ఏఆర్ రెహమాన్‌పై విమర్శలు గుప్పించిన కంగనా రనౌత్... నన్ను కలవలేదు, అంత ద్వేషమా?
NTR Vardhanti: ఎన్టీఆర్ 30వ వర్థంతి.. ఎన్టీఆర్ ఘాట్ వద్ద మంత్రి లోకేష్, కల్యాణ్ రామ్ నివాళులు
ఎన్టీఆర్ 30వ వర్థంతి.. ఎన్టీఆర్ ఘాట్ వద్ద మంత్రి లోకేష్, కల్యాణ్ రామ్ నివాళులు
Hyderabad Crime News: హైదరాబాద్‌లో సైబర్ మోసం.. 5 వేలు లాభం చూపించి, ఐటీ ఉద్యోగికి రూ. 2.9 కోట్లు ఎగనామం
హైదరాబాద్‌లో సైబర్ మోసం.. 5 వేలు లాభం చూపించి, ఐటీ ఉద్యోగికి రూ. 2.9 కోట్లు ఎగనామం
Rafale Fighter Jets: భారత్‌లో తయారుకానున్న రాఫెల్ ఫైటర్ జెట్స్.. విదేశాలకు ఎగుమతితో ఎలైట్ క్లబ్‌లోకి
భారత్‌లో తయారుకానున్న రాఫెల్ ఫైటర్ జెట్స్.. విదేశాలకు ఎగుమతితో ఎలైట్ క్లబ్‌లోకి
Shefali Jariwala Death Reason: చేతబడి వల్లే నా భార్య మరణించింది... అజ్ఞాతవాసి, సర్కారు వారి పాట విలన్
చేతబడి వల్లే నా భార్య మరణించింది... అజ్ఞాతవాసి, సర్కారు వారి పాట విలన్
IND vs NZ 3rd ODI: కీలకమైన మూడో వన్డేలో పరుగుల వర్షమే.. పిచ్ రిపోర్ట్, IND vs NZ ప్లేయింగ్ XI అంచనా
కీలకమైన మూడో వన్డేలో పరుగుల వర్షమే.. పిచ్ రిపోర్ట్, IND vs NZ ప్లేయింగ్ XI అంచనా
CM Revanth Reddy: ఖమ్మంలో కీలక అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి
ఖమ్మంలో కీలక అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి
Embed widget