Aavesham 2 Update : 'ఆవేశం 2'పై ఫహద్ క్లారిటీ - రంగా ఈజ్ బ్యాక్... బ్లాక్ బస్టర్ సీక్వెల్ రిలీజ్ ఎప్పుడంటే?
Fahadh Faasil Aavesham 2 : మలయాళ స్టార్ పహద్ ఫాజిల్ 'ఆవేశం 2'పై క్లారిటీ ఇచ్చారు. బ్లాక్ బస్టర్కు సీక్వెల్ కచ్చితంగా ఉంటుందని... పనులు జరుగుతున్నాయని అన్నారు.

Fahadh Faasil Confirms Aavesham 2 : మలయాళ స్టార్ ఫహద్ ఫాజిల్ కెరీర్లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్గా నిలిచింది 'ఆవేశం' మూవీ. 2024లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మలయాళ సినిమా దాదాపు రూ.150 కోట్ల వసూళ్లు సాధించింది. రౌడీ షీటర్ రంగాగా ఫహాద్ నటన ఆడియన్స్ను కట్టి పడేసింది. తాజాగా 'ఆవేశం' సీక్వెల్పై ఫహాద్ బిగ్ అప్డేట్ ఇచ్చారు.
'ఆవేశం 2' ఎప్పుడంటే?
'ఆవేశం 2'పై అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుండగా తాజాగా ఓ ఈవెంట్లో పాల్గొన్న ఫహద్ దీనిపై క్లారిటీ ఇచ్చారు. 'ఆవేశం 2' సీక్వెల్ కచ్చితంగా ఉంటుందని... ప్రస్తుతం పనులు జరుగుతున్నట్లు తెలిపారు. 2027 లేదా 2028లో ఈ మూవీ రిలీజ్ చేస్తామని చెప్పారు. ఇక, మమ్ముట్టి, మోహన్ లాల్ ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న 'పేట్రియాట్'లో తాను నెగిటివ్ రోల్ చేస్తున్నట్లు తెలిపారు.
'ఆవేశం' మూవీకి జీతూ మాధవన్ దర్శకత్వం వహించగా... ఆయన ప్రస్తుతం తమిళ హీరో సూర్యతో మూవీ చేస్తున్నారు. హై ఎనర్జీ కాప్ యాక్షన్ కామెడీగా ఈ మూవీ తెరకెక్కుతుండగా... ఈ ప్రాజెక్ట్ పూర్తైన తర్వాతే జీతూ మాధవన్ 'ఆవేశం 2' పనులు ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది.ఆ
Also Read : సన్నీ లియోన్ క్రైమ్ థ్రిల్లర్ - మూడేళ్ల తర్వాత డైరెక్ట్గా ఓటీటీలోకి మూవీ... ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలో 'ఆవేశం' స్ట్రీమింగ్
'ఆవేశం' మూవీలో ఫహద్ ఫాజిల్తో పాటు హిప్ స్టర్, మిథున్ జై శంకర్, రోషన్ షానవాస్, షాజిన్ గోపు, మన్సూర్ అలీఖాన్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. ప్రస్తుతం ప్రముఖ ఓటీటీ 'అమెజాన్ ప్రైమ్ వీడియో'లో స్ట్రీమింగ్ అవుతోంది.
స్టోరీ ఏంటంటే?
ఏరోనాటికల్ ఇంజినీరింగ్ చదువుదామని కేరళ నుంచి బెంగుళూరు వచ్చిన ముగ్గురు యువకులు ప్రైవేట్ హాస్టల్లో దిగుతారు. వీరిని సీనియర్లతో పాటు వారి స్నేహితులు దారుణంగా ర్యాగింగ్ చేస్తారు. దీంతో ఆవేశంతో రగిలిపోయిన ముగ్గురూ వారికి బుద్ధి చెప్పాలని గ్యాంగ్ స్టర్ రంగా (ఫహద్) సాయం కోరతారు. ర్యాగింగ్ విషయం తెలిసి వారికి బుద్ధి చెప్తాడు. అయితే, రంగా ఎవరినైనా తన వారు అనుకుంటే ప్రాణం ఇస్తాడు. కోపమైనా అంతే.
రంగా మనుషులంటూ ఆ ముగ్గురి యువకులపై ముద్ర పడగా చదువు మూలన పడి అన్నీ సబ్జెక్టుల్లోనూ ఫెయిల్ అవుతారు. దీంతో ఎలాగైనా రంగా నుంచి దూరంగా వెళ్లి చదువుకుందామని అనుకుంటారు. కానీ రంగా వీరిని వదిలిపెట్టడు. ఆ తర్వాత జరిగిన పరిణామాలేంటి? రంగా నుంచి ఆ ముగ్గురు యువకులు ఎలా తప్పించుకున్నారు? దీనికి రంగా ఎలా రియాక్ట్ అయ్యాడు? అనేది తెలియాలంటే మూవీ చూడాల్సిందే.
ట్రెండింగ్ వార్తలు






















