అన్వేషించండి

Tollywood: టాలీవుడ్ పెద్దలకు సీఎం జగన్ నుంచి పిలుపు... ఈ నెల 20న చిరంజీవి బృందం భేటీ... చిత్ర పరిశ్రమ సమస్యలపై చర్చ

టాలీవుడ్ పెద్దలకు ముఖ్యమంత్రి జగన్ నుంచి పిలుపువచ్చింది. ఈ సమావేశంలో చిరంజీవి నేతృత్వంలో బృందం తెలుగు సినీ పరిశ్రమ సమస్యలను సీఎంకు తెలపనున్నారు.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నుంచి మెగాస్టార్ చిరంజీవికి పిలుపువచ్చింది. తెలుగు చిత్రసీమ సమస్యలను సీఎం జగన్ కు వివరించేందుకు అపాయింట్‌మెంట్‌ కోసం సినీప్రముఖులు వేచిచూస్తున్నారు. ఈ తరుణంలో సీఎం నుంచి పిలుపువచ్చిందని సమాచారం. ఈ నెల 20న మెగాస్టార్‌ చిరంజీవి నేతృత్వంలో నాగార్జున, దిల్‌ రాజు, సురేశ్‌బాబు ఇతరులు సీఎం జగన్ ను కలవనున్నారు. కరోనా కారణంగా తెలుగు చిత్రపరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లేందుకు చిరంజీవి బృందం మంత్రి పేర్ని నాని ద్వారా కబురుపంపింది. మంత్రి పేర్ని నాని ఈ విషయాన్ని సీఎం జగన్‌కు తెలిపినట్లు సమచారం. త్వరలోనే వారితో సమావేశం అవుతానని మంత్రి పేర్ని నానితో సీఎం జగన్‌ అన్నట్లు తెలుస్తోంది. ఈ నెల 20న చిరంజీవి బృందాన్ని ఆహ్వానించమని మంత్రి పేర్ని నానికి సీఎం జగన్ చెప్పారు. ఈ సమాచారాన్ని మంత్రి, చిరంజీవికి చేరవేశారు.

Also Read: AP Degree Colleges Reopen: వచ్చే నెల 1 నుంచి డిగ్రీ తరగతులు.. అకడమిక్ క్యాలెండర్ విడుదల

ఈ విషయాలు చర్చించే అవకాశం

ఈ భేటీలో కొత్త సినిమాలకు బెనిఫిట్‌ షోలు వేసుకునేందుకు అవకాశం ఇవ్వాలని చిత్ర పరిశ్రమ పెద్దలు కోరనున్నారు. నగరాలు, పట్టణాల్లో రోజుకు నాలుగు షోలు ప్రదర్శించే అవకాశం కల్పించాలని, గ్రేడ్‌-2 కేంద్రాల్లో నేల టిక్కెట్టుకు పది రూపాయలు, కుర్చీకి 20 రూపాయలు వసూలు చేసే విధానాన్ని రాష్ట్రమంతా వర్తింపజేయవద్దని సీఎంను కోరనున్నట్లు సమాచారం. ఇటీవల ప్రభుత్వమే నేరుగా సినీ టిక్కెట్ల ఆన్ లైన్ లో విక్రయించేందుకు వెబ్ సైట్ తీసుకువస్తామని ప్రకటించింది. ఈ విషయంపై చిరంజీవి బృందం తమ అభిప్రాయాన్ని ముఖ్యమంత్రికి తెలిపే అవకాశం ఉంది. 

Also Read: Betel Leaf: రోజుకో రెండు తమలపాకులు నమలండి... ఈ రోగాలు దరిచేరవు

విశాఖలో సినీ పరిశ్రమ

ఏ,బీ,సీ సెంటర్లలో థియేటర్లు సినిమాల విడుదల వేళ ఇండస్ట్రీ కోరుకుంటున్న అంశాలు, విద్యుత్ ఛార్జీల్లో రాయితీలు వంటివి ప్రభుత్వం నుంచి మినహాయింపు కోరాలని సినీపెద్దలు నిర్ణయించారు. ఈ విషయాన్ని సీఎం వద్ద ప్రస్తావించనున్నారు. విశాఖలో సినీ పరిశ్రమ గురించి చర్చకు వచ్చే అవకాశం ఉంది. గతంలో చిరంజీవి రెండు సార్లు సీఎం జగన్ తో సమావేశమై చర్చలు చేశారు. రెండోసారి సమావేశమైన సమయంలో నాగార్జున, రాజమౌళి, దిల్ రాజు, సీ కళ్యాణ్, దగ్గుబాటి సురేష్ కూడా ఉన్నారు. మోహన్ బాబు, బాలకృష్ణకు ఆహ్వానించకపోవటంపై టాలీవుడ్ లో చర్చ జరిగింది.

Also Read: Allu Arjun: ఇది, బన్నీ అంటే.. ఒక్క దోశకు రూ.1000 చెల్లించిన అల్లు అర్జున్, ఉద్యోగం ఇస్తానని హామీ!

 

 

 

 

 

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Balineni On Jagan: నాది, నా వియ్యంకుడి ఆస్తి జగన్ కాజేశారు - జనసేన ప్లీనరీలో బాలినేని సంచలన ఆరోపణలు
నాది, నా వియ్యంకుడి ఆస్తి జగన్ కాజేశారు - జనసేన ప్లీనరీలో బాలినేని సంచలన ఆరోపణలు
Group-3 Results: గ్రూప్‌-3 ఫలితాలు విడుదల, అభ్యర్థుల మార్కుల వివరాలు అందుబాటులో - డైరెక్ట్ లింక్ ఇదే
గ్రూప్‌-3 ఫలితాలు విడుదల, అభ్యర్థుల మార్కుల వివరాలు అందుబాటులో - డైరెక్ట్ లింక్ ఇదే
Amaravati Latest News:ఏప్రిల్‌లో ఏపీ రానున్న ప్రధానమంత్రి మోదీ - నవ నగరాల నిర్మాణ శంకుస్థాపనకు హాజరు
ఏప్రిల్‌లో ఏపీ రానున్న ప్రధానమంత్రి మోదీ - నవ నగరాల నిర్మాణ శంకుస్థాపనకు హాజరు
Janasena Formation Day: పిఠాపురంలో పెరిగిన జోష్, జయకేతనం సభకు భారీగా తరలివస్తున్న జనసైనికులు
పిఠాపురంలో పెరిగిన జోష్, జయకేతనం సభకు భారీగా తరలివస్తున్న జనసైనికులు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Pawan Kalyan on Tamilnadu Language Fight | హిందీ, తమిళ్, కన్నడ, మరాఠీలో మాట్లాడి మేటర్ చెప్పిన పవన్Deputy CM Pawan Kalyan on Janasena Win | జనసేనగా నిలబడ్డాం..40ఏళ్ల టీడీపీని నిలబెట్టాం | ABP DesamNaga babu Indirect Counters on Varma | టీడీపీ ఇన్ ఛార్జి వర్మపై నాగబాబు పరోక్ష కౌంటర్లు | ABP DesamJanaSainiks on Pithapuram Sabha | నాలుగు కాదు పవన్ కళ్యాణ్ కోసం 40కిలోమీటర్లైనా నడుస్తాం | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Balineni On Jagan: నాది, నా వియ్యంకుడి ఆస్తి జగన్ కాజేశారు - జనసేన ప్లీనరీలో బాలినేని సంచలన ఆరోపణలు
నాది, నా వియ్యంకుడి ఆస్తి జగన్ కాజేశారు - జనసేన ప్లీనరీలో బాలినేని సంచలన ఆరోపణలు
Group-3 Results: గ్రూప్‌-3 ఫలితాలు విడుదల, అభ్యర్థుల మార్కుల వివరాలు అందుబాటులో - డైరెక్ట్ లింక్ ఇదే
గ్రూప్‌-3 ఫలితాలు విడుదల, అభ్యర్థుల మార్కుల వివరాలు అందుబాటులో - డైరెక్ట్ లింక్ ఇదే
Amaravati Latest News:ఏప్రిల్‌లో ఏపీ రానున్న ప్రధానమంత్రి మోదీ - నవ నగరాల నిర్మాణ శంకుస్థాపనకు హాజరు
ఏప్రిల్‌లో ఏపీ రానున్న ప్రధానమంత్రి మోదీ - నవ నగరాల నిర్మాణ శంకుస్థాపనకు హాజరు
Janasena Formation Day: పిఠాపురంలో పెరిగిన జోష్, జయకేతనం సభకు భారీగా తరలివస్తున్న జనసైనికులు
పిఠాపురంలో పెరిగిన జోష్, జయకేతనం సభకు భారీగా తరలివస్తున్న జనసైనికులు
Chandra Babu Latest News: గ్రూప్ పాలిటిక్స్ వద్దు- వైసీపీ నేతలకు దూరంగా ఉండండి, టీడీపీ ప్రజాప్రతినిధులకు చంద్రబాబు స్వీట్ వార్నింగ్
గ్రూప్ పాలిటిక్స్ వద్దు- వైసీపీ నేతలకు దూరంగా ఉండండి, టీడీపీ ప్రజాప్రతినిధులకు చంద్రబాబు స్వీట్ వార్నింగ్
Yuvi 7 Sixers Vs Australia: పాత యూవీని గుర్తుకు తెచ్చిన మాజీ స్టార్.. ఆసీస్ పై శివ‌తాండ‌వం.. ఫైన‌ల్లో భార‌త జ‌ట్టు
పాత యూవీని గుర్తుకు తెచ్చిన మాజీ స్టార్.. ఆసీస్ పై శివ‌తాండ‌వం.. ఫైన‌ల్లో భార‌త జ‌ట్టు
Tamannaah - Vijay Varma: ఇద్దరి మధ్య బ్రేకప్ అంటూ ప్రచారం - హోలీ సంబరాల్లో తమన్నా, విజయ్ వర్మ.. వీడియో వైరల్
ఇద్దరి మధ్య బ్రేకప్ అంటూ ప్రచారం - హోలీ సంబరాల్లో తమన్నా, విజయ్ వర్మ.. వీడియో వైరల్
Dilruba Movie Review - 'దిల్‌రూబా' రివ్యూ: ఇది కిరణ్ అబ్బవరం 'జల్సా'యే కానీ... 50 కోట్ల కలెక్షన్లు తెచ్చిన 'క' తర్వాత చేసిన సినిమా హిట్టేనా?
'దిల్‌రూబా' రివ్యూ: ఇది కిరణ్ అబ్బవరం 'జల్సా'యే కానీ... 50 కోట్ల కలెక్షన్లు తెచ్చిన 'క' తర్వాత చేసిన సినిమా హిట్టేనా?
Embed widget